అమెరికా విదేశాంగశాఖ తాజాగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు సంబంధించిన కఠిన నిబంధన అమలు చేసింది. ఇప్పుడు దరఖాస్తుదారులు తమ స్వదేశంలో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న ప్రదేశంలోనే వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్నట్లుగా విదేశీ దేశాల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం ఇక లేదు. ఈ మార్పు భారతీయులకు అనేక ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్లో వీసా ఇంటర్వ్యూలు పొందడానికి ఎక్కువ సమయం పడుతోంది. …
Read More »GST స్లాబ్స్… ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే
జీఎస్టీ స్లాబుల్లో తగ్గింపుల వలన వాహనాల మార్కెట్లో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న కొత్త రేట్లతో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. దీని కారణంగా ప్రస్తుతం షోరూంల వద్ద ఖాళీ కుర్చీలు, బోసిన షోరూం హాల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. వినియోగదారులు కొత్త రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకోవడంతో వాహన వ్యాపారులకు తాత్కాలికంగా భారీ దెబ్బ తగిలింది. …
Read More »మరణం తర్వాత జీవం.. ప్రకృతి ఒప్పుకుంటుందా?
మనిషి శ్వాస ఆగిపోతే కథ ముగిసినట్టేనా? శరీరం చల్లబడిపోతే అంతేనా? వైద్యశాస్త్రం మాత్రం ఈ ప్రశ్నలకు కొత్త సమాధానాలు వెతుకుతోంది. అందుకే మృత్యువుకి తలొగ్గకుండా మళ్లీ జీవితం ఇవ్వగలమనే ఆశతో పుట్టిన విధానమే ‘క్రయోనిక్స్’. గ్రీకు భాషలో “క్రయో” అంటే చలిని సూచిస్తుంది. అంటే శరీరాన్ని గాఢ శీతల వాతావరణంలో భద్రపరచి, భవిష్యత్తులో తిరిగి ప్రాణం పోయించాలనే ప్రయత్నం. అమెరికన్ ఫిజిసిస్ట్ రాబర్ట్ ఎటింగర్ యాభై ఏళ్ల క్రితం ఈ …
Read More »మూడో భార్య కుతంత్రం.. బావిలో శవమై తేలిన భర్త
ఈమధ్య కాలంలో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవస్రం లేదు. ఇక రీసెంట్ గా మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామంలో చోటుచేసుకున్న ఒక దారుణం అందరినీ కుదిపేసింది. భార్యతోపాటు ఆమె ప్రేమికుడు, మరో సహాయకుడు కలిసి ఓ వ్యక్తిని క్రూరంగా హత్య చేసి శవాన్ని బావిలో పడేశారు. ఆ మృతదేహాన్ని గుర్తించింది అతని రెండో భార్య కావడం విషాదాన్ని మరింత పెంచింది. 60 ఏళ్ల …
Read More »గిల్కి వన్డే కెప్టెన్సీ.. మరి రోహిత్ సంగతేంటీ?
భారత క్రికెట్లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ను త్వరలోనే భారత వన్డే జట్టు కెప్టెన్గా ప్రకటించే అవకాశం బలంగా ఉంది. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ముగిసే దశకు చేరుకుంటుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్కి చివరి సిరీస్ కావచ్చని అనేక వర్గాలు భావిస్తున్నాయి. గిల్ ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20లోనూ వైస్ కెప్టెన్గా …
Read More »భారత ఐటీ రంగానికి ట్రంప్ ముప్పు.. కేంద్రం ఏమంటోందంటే..
భారత్ ఐటీ రంగం విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు. 5.6 మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికాలో ట్రంప్ సర్కారు ఔట్సోర్సింగ్ సేవలపై టారిఫ్లు విధించవచ్చనే ప్రచారం వ్యాపిస్తోన్న వేళ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంగా స్పందించారు. ఐటీ రంగాన్ని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. భారత ఐటీ సేవల రంగం దేశానికి పెద్ద ఎత్తున ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. …
Read More »బీసీసీఐ ఖజానా: ఎన్ని వేలకోట్లో తెలుసా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతోంది. 2019లో బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.6,000 కోట్ల నిధి.. ఐదు సంవత్సరాల్లో మూడింతలు పెరిగి రూ.20,686 కోట్లకు చేరింది. క్రికెట్ ఆడకపోయినా, క్రికెట్ చుట్టూ తిరిగే వ్యాపారాలు బీసీసీఐని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బోర్డు 1,623 కోట్ల లాభం ఆర్జించింది. ఇది ముందు లాభం అయిన 1,167 కోట్లతో పోలిస్తే గణనీయమైన …
Read More »గణపతి ‘లడ్డూ’ పాటలకు.. ‘ఈడీ’ బ్యాండు!
దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆదివారం.. చంద్రగ్రహణం ఉండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గణపతి పందిళ్ల నుంచి విఘ్ననాయకులు.. నిమజ్జనానికి కదిలారు. శనివారం సాయంత్రం నాటికి దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ.. నిమజ్జన ఘట్టాలు ముగియనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు ఖరతాబాద్ గణపతి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం ముగిసింది. ఇలా.. దేశవ్యాప్తంగా గణపతి భక్తులు భక్తిలో ఓలలాడుతున్నారు. ఇదేసమయంలో గణపతి ఉత్సవాల …
Read More »ఎర్రకోటలో భారీ చోరీ?
దేశంలోనే ప్రతిష్టాత్మక వారసత్వ కట్టడం.. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే.. ఎర్ర కోటలో భారీ దొంగతనం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే.. ఎర్రకోటలో ఇలా చోరీ జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. దొంగను గుర్తించామని.. ఉత్తరాది రాష్ట్రాల్లోని ఆలయాల్లో తరచుగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తే ఎర్రకోటలోనూ చోరీ చేసినట్టు తెలిపారు. దొంగ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిశితంగా …
Read More »GST కొత్త రూల్స్.. మధ్యతరగతికి ఊరట, ప్రభుత్వానికి టెన్షన్?
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈసారి ప్రధాన ఎజెండా.. జీఎస్టీ స్లాబ్లను సరళీకరించడం. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్ల బదులుగా కేవలం రెండు రేట్లే ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అంటే, 5% – 18% మాత్రమే ఉండి, ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు కేటగిరీల్లోకి వస్తాయి. ఇకపోతే, …
Read More »అశ్విన్ @క్రికెట్ ఆస్ట్రేలియా.. ఏంటీ మ్యాటర్?
భారత క్రికెట్లో స్పిన్ మాస్టర్గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు మరో ప్రయాణం వైపు చూడబోతున్నాడన్న చర్చ మొదలైంది. ఐపీఎల్కి గుడ్బై చెప్పిన కొద్ది రోజుల్లోనే అతను విదేశీ లీగ్ వైపు అడుగులు వేస్తాడన్న వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి టార్గెట్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్ (BBL) అని టాక్ వస్తోంది. 38 ఏళ్ల వయసులో కూడా క్రికెట్పై ఉన్న ప్యాషన్ …
Read More »ఆఫ్ఘాన్ భూకంపం.. ఇండియా నుంచి 21 టన్నుల సహాయం
ఆఫ్ఘాన్ భూకంపం మళ్లీ ప్రపంచాన్ని కదిలించింది. ఆదివారం రాత్రి 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,400 మందికి పైగా ప్రాణాలు బలిగొనగా 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఇళ్లన్నీ కూలిపోవడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ పరిస్థితిలో భారత్ సహాయ హస్తం చాపింది. మంగళవారం ప్రత్యేకంగా సేకరించిన 21 టన్నుల సహాయ సామగ్రిని విమానాల ద్వారా కాబూల్కు పంపింది. ఈ సహాయ సరుకుల్లో దుప్పట్లు, టెంట్లు, హైజీన్ కిట్లు, నీటి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates