Political News

మోడీ సర్కార్ పై ఏషియా గేమ్స్ పిడుగు

చిలిచి చిలికి గాలవానలాగ అయ్యిందన్న సామెతలాగ అయిపోతోంది మహిళా రెజ్లర్ల వివాదం. మహిళా రెజ్లర్ల సహాఖ్యకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడు. చాలాకాలంగా బ్రిజ్ తమను లైగింకంగా వేధిస్తున్నట్లు మహిళా రెజ్లర్లు గడచిన 55 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళెంత గోలచేసినా, ఆందోళనలు చేసినా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఏదో మొక్కుబడిగా క్రీడల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఈమధ్యనే మాట్లాడారు. ఎవరెంత మాట్లాడినా ఎన్ని ప్రతిపాదనలు …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేగానే టీడీపీలోకి చేరిక‌..

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఈ నెల‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన ఆయ‌న దాదాపు గంట పాటు చ‌ర్చించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి …

Read More »

వైసీపీ ప్ర‌భుత్వం నడ్డి మీద కొట్టిన న‌డ్డా

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై బీజేపీ జాతీయ సార‌థి జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా చెల‌రేగిపోయారు. సీఎం జ‌గ‌న్ పేరును మ‌చ్చుకైనా పేర్కొన‌కుండానే ఆయ‌న వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్‌ స్కామ్‌, లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని న‌డ్డా అన్నారు. తిరుప‌తి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర నాయ‌కత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. …

Read More »

టీడీపీ టికెట్ ఇస్తే ఓకే.. లేక‌పోతే..: వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే

వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే, పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తాన‌ని.. పార్టీ టికెట్ ఆశిస్తున్నాన‌ని తెలిపారు. ఒక‌వేళ పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే.. తాను పార్టీ అభివృద్ధి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం …

Read More »

ఎన్నిక‌ల ముంగిట‌.. కేసీఆర్ సుడిగాలి అభివృద్ధి!!

అదేంటి అనుకుంటున్నారా? ఔను నిజ‌మేన‌ని అంటున్నారు తెలంగాణ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు. ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు మాసాలే గ‌డువున్న నేప‌థ్యంలో ఇప్పుడు హుటాహుటిన సీఎం కేసీఆర్ ప‌దుల సంఖ్య‌లో ప‌నుల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తున్నారు. జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. దీంతో ఇది సుడిగాలి అభివృద్ధి! అంటూ.. విప‌క్ష‌నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక ప్రాజెక్టుల‌కు(నిధులు ఉన్నాయో లేవో తెలియ‌దు) …

Read More »

పెద్దారెడ్లు రెడీ అయిపోయారా ?

నెల్లూరు పెద్దారెడ్లు రెడీ అయిపోయినట్లున్నారు. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి సైకిల్ ఎక్కటమే ఆలస్యం. ఎందుకంటే సడెన్ గా శనివారం నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. శనివారం ఉదయం ఆనం నెల్లూరులోని టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. తమ్ముళ్ళతో సమావేశమయ్యారు. అలాగే కోటంరెడ్డి ఇంటికి సీనియర్ తమ్ముళ్ళిద్దరు అమర్నాధరెడ్డి, బీద రవిచంద్రయాదవ్ వెళ్ళారు. కోటంరెడ్డితో దాదాపు గంటసేపు భేటీ వేశారు. శనివారం ఉదయం ఆనం …

Read More »

కేసీఆర్ సరికొత్త ఆలోచన

ఈమధ్యనే సరికొత్త సెక్రటేరియట్ నిర్మించిన కేసీయార్ తొందరలోనే అసెంబ్లీ, శాసనమండలికి కూడా కొత్త భవనాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ, మండలి భవనాలు ఒకే కాంపౌండ్ లో నిర్మిస్తే వెహికల్ పార్కింగ్, సెక్యూరిటి లాంటి అనేక అంశాలు కలిసొస్తాయని అనుకుంటున్నారట. రాజభవన్ తో పాటు పక్కనే ఉన్న సర్సింగ్ కాలేజీ, దిల్ కుశా గెస్ట్ హౌస్ ప్రాంతంలో కొత్త భవనాలను నిర్మించేందుకు కేసీయార్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు …

Read More »

బీజేపీ ప్రచారం పై కేసీఆర్ ‘ఫ్యాక్ట్ చెక్‌’

తెలంగాణ‌లో ఏర్పాటు చేస్తున్న మెడిక‌ల్ కాలేజీల‌పై బీజేపీ నాయ‌కులు.. జిల్లాల్లో ఒక ప్ర‌చారం చేస్తున్నా రు. వీటిని కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే మంజూరు చేసింద‌ని వారు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కు ఇచ్చిన‌ట్టుగానే రాష్ట్రానికి కూడా మెడిక‌ల్ కాలేజీల‌ను ఇచ్చింద‌ని బీజేపీ నేత లు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అస‌లు వాస్త‌వం ఏంట‌నేది కేసీఆర్ ప్ర‌భుత్వం తాజా గా `ఫ్యాక్ట్ చెక్‌` పేరుతో పెద్ద ఎత్తున …

Read More »

జీయ‌ర్ ఆశ్ర‌మంలో ఏం జ‌రుగుతోంది?  చ‌రిత్ర‌పై మ‌ర‌క‌లు!

జీయ‌ర్ ఆశ్ర‌మం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో కొత్త‌కాదు. ప‌ల్లెల అభివృద్ధి నుంచి నిర‌క్ష్య‌రాస్య‌త‌ను త‌గ్గించే వ‌ర‌కు కూడా అనేక రూపాల్లో జీయ‌ర్ ఆశ్ర‌మం చేసిన చేస్తున్న సేవ‌లు దేశాంతర ఖ్యాతిని స‌ముపార్జించు కున్నాయి. సుమారు 8 ద‌శాబ్దాలుగా ఈ సేవ‌లు దేశానికి, రాష్ట్రానికి కూడా అందుతున్నాయంటే అతిశ‌యో క్తి కాదు. అయితే.. ఇన్ని సేవ‌లు చేసినా.. ఎన్ని ర‌కాలుగా స‌మాజానికి ఉప‌యోగప‌డినా.. ఎప్పుడు ఒక్క మాట కూడా ప‌డ‌కుండా.. …

Read More »

రాజ‌ధానిలో ఇళ్లు క‌ట్టేస్తున్నారు.. జ‌గ‌న్ వ్యూహం ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జ‌గ‌న‌న్న ఇళ్లు ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ఇళ్ల‌ను నిర్మిస్తున్నారు. పేద‌ల‌కు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్న‌ర‌, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో సెంటు చొప్పున స్థ‌లం కేటాయించారు. ఇదే స‌మ యంలో రాజ‌ధాని ప్రాంతంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున స్థ‌లాల‌ను ఈ నెల‌లోనే కేటాయించింది. ఇప్పుడు ఇక్క‌డ ఇళ్ల‌ను …

Read More »

పొలిటికల్ గేమ్ ఛేంజర్ డేట్ … జూన్ 23

ఈనెల 23వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం చాలా కీలకమంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ అనే విషయంలో దేశవ్యాప్త సర్వే జరిపించారట. దాని ఫలితాలపై చర్చించేందుకు, విశ్లేషించేందుకే ఈ భేటీ జరగబోతోందని సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం మొత్తం 543 పార్లమెంటు సీట్లలో 450 నియోజకవర్గాల్లో బీజేపీతో కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పరిస్ధితులు ఉన్నట్లు …

Read More »

‘అమరావతిని 9 నెలల తర్వాత పరుగెత్తిస్తాం’

ఏపీలో గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా తీవ్ర వివాదంగా.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. రాజ‌ధాని అమ‌రావ‌తి. చంద్ర‌బాబు హ‌యాంలో దీనికి 2015లో శంకుస్థాప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌.. రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన ఏపీకి అత్య‌ద్భుత‌మైన న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని త‌ల‌పోసిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, …

Read More »