ఏపీ సీఎం జగన్.. కొన్నాళ్ల కిందట వరకు ఎక్కడ పర్యటించినా.. మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజధానులపై కోర్టుల్లో కేసులు పడడం.. వాటిపై కొన్ని వ్యతిరేక తీర్పులు రావడం.. దీంతో సుప్రీం కోర్టులో సర్కారు సవాలు చేయడం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమవుతుం దోననే ఉద్దేశంతో జగన్ ఆ తర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో …
Read More »వరుసగా 10వ సారి.. మోడీ సాధించిన అరుదైన రికార్డు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోట వేదికగా జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వరసుగా ఆయన పదో సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ తరఫున ఇద్దరుప్రధానులు చేయగా.. వీరిలో మోడీ ఒక్కరే ఇలా.. పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం రికార్డుగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇక, ఎర్రకోటపై జరిగిన వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలకు …
Read More »మధ్య తరగతి `ఇంటి` కలలు సాకారం: మోడీ
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. అయితే.. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మధ్యతరగతిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం విశేషం. నిజానికి ఎర్రకోటపై నుంచి ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ప్రసంగించినా.. ఎప్పుడూ పథకాలు ప్రకటించలేదు. పైగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రసంగాలు లేనేలేవు. కానీ, అన్నింటికీ.. …
Read More »కేసీఆర్ జగన్ మధ్యలో పవన్..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే. పైకి పెద్దగా మాట్లాడుకున్నట్టు కనిపించకపోయినా.. రాకపోకలు లేకపోయినా.. ఇరువురి మధ్య స్థానిక రాజకీయాల్లో మాత్రం ఒక అవగాహన అయితే ఉందనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంది. నిజానికి కేంద్రంలోని బీజేపీసర్కారు విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి.. కేసీఆర్ కు మండేలా చేస్తోంది. అయితే. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం సహా.. …
Read More »చంద్రబాబు హిమాచల్ టూర్.. రీజనేంటి?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనూహ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యక్షమయ్యారు. నిన్న మొ న్నటి వరకు ఏపీలో పర్యటించిన ఆయన అకస్మాత్తుగా హిమాచల్ ప్రదేశ్లో కనిపించడం.. సతీసమేతంగా ఆయన అక్కడ ఉండడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవానికి ఆదివారం కూడా చంద్రబాబు ఏపీలోనే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలపైనా.. నాయకులపైనా జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధాని, రాష్ట్రపతులకు ఆయన లేఖ సంధించారు. సోమవారం నాటికి వచ్చేసరికి చంద్రబాబు హిమాచల్ లో …
Read More »రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తున్నారు: కిషన్ రెడ్డి
పేదల భూములను బీఆర్ఎస్ వ్యాపారులకు కట్టబెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కోకాపేటలోని ఏకంగా 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ తీసుకున్నది నిజమా కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయ పనుల్లో అవసరమయ్యే డబ్బులు కోసం ఇప్పటి …
Read More »ప్రగతి భవన్కు పిలిపించి మరీ వార్నింగ్?
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీఆర్ఎస్.. అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో సారి సీఎం పీఠంపై కూర్చునేందుకు కేసీఆర్ ప్రణాళికల్లో నిమగ్నమయ్యారని తెలిసింది. ఈ ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్కు.. కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయని టాక్. అందులో ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ …
Read More »పూనకం తగ్గించుకో పవన్: సజ్జల
విశాఖలో వారాహి విజయ యాత్ర సందర్భంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. జగన్ ను గద్దె దించే వరకు నిద్రపోనని, ఇకపై జగన్ పులివెందులకు పారిపోవాల్సిందేనని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు వైసిపి నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ రాష్ట్ర …
Read More »మంత్రి కాదు.. జగనే సమాధానమివ్వాలి: పవన్
ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలోని రుషికొండపై కూడా వైసీపీ నేతల కన్ను పడిందని పవన్ మండిపడ్డారు. ఇక విస్సన్నపేటలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరిట 600 ఎకరాల భూమి ఉందని పవన్ ఆరోపించారు. దీంతో, మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో విలేకరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ భూమి తనదని నిరూపిస్తే ఒక్కో విలేఖరికి …
Read More »రుషికొండ పై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ. అలాగే పర్యాటకం …
Read More »పవన్ కు ఆరోగ్య శ్రీ పథకం
విశాఖ గాజువాక లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే జగన్ పై ఎంత కడుపు మంటో అర్థం అవుతుందంటూ పేర్కొన్నారు. తన కంటే చిన్నవాడు రాజకీయాల పరంగా, ప్రజల్లో అభిమానం పెరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారంటూ చురకలు అంటించారు. ప్రజల్లో ఉన్న ఒక నాయకుడు భూమి పేలిపోవాలి.. అందులోకి …
Read More »గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ!
ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. గన్నవరంలో నిర్వహించిన అనుచరులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎంని గన్నవరం సీటు ఇవ్వాలని కోరతానని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల నుంచి జగన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates