Political News

వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్…అసలేం జరిగింది?

వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సత్యనారాయణ భార్య జ్యోతితో పాటు ఆయన కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ జీవీల కిడ్నాప్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఆ కిడ్నాప్ వెనుక రాజకీయ కోణం ఉందన్న రీతిలో పుకార్లు వచ్చాయి. కానీ, ఈ కిడ్నాప్ జరిగిన …

Read More »

పవన్ ను తిట్టిన పేర్ని నానికి రఘురామ పంచ్

అన్నవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలలో గెలిచి తప్పకుండా అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ కు పవన్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ ను ఉద్దేశించి మాజీ …

Read More »

పవన్ కు 2 చెప్పులతో పేర్నినాని షాకింగ్ రియాక్షన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైకు పట్టుకొని మాట్లాడినంతనే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ నేతల్లో మొదటి రియాక్షన్ వచ్చేసింది. వైసీపీ మాజీ మంత్రి.. సీనియర్ నేత పేర్ని నాని షాకింగ్ రియాక్షన్ ఇచ్చేశారు. కత్తిపూడిలో దాదాపు గంటన్నర పాటు సాగిన ప్రసంగం నేపథ్యంలో.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారన్న ఆయన.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పవన్ …

Read More »

తెలంగాణలో కూడా ఉద్యోగులతో కటీఫేనా

తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ కు ఉద్యోగులకు గ్యాప్ బాగా పెరిగిపోతున్నట్లుంది. దీనికి కారణం ఏమిటంటే పరస్పరం వ్యతిరేక భావన పెరిగిపోవటమే. ఉద్యోగులకు ఎంతచేసినా సంతృప్తి ఉండదని, ఉద్యోగులేమీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో మద్దతుగా ఉండరనేది అధికారపార్టీ నేతల మనోభావన. ఇదే సమయంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కమిటి నియామకం, డీఏ బకాయిల విడుదల, హెల్త్ స్కీమ్ అమలు, …

Read More »

కేటీయార్ సీరియస్ వార్నింగ్

రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఆశిస్తున్న కార్పొరేటర్లకు మంత్రి కేటీయార్ సీరియస్ వార్నిగ్ ఇచ్చారు. కార్పొరేటర్లు ఎవరు కూడా ఎంఎల్ఏ టికెట్లకోసం ప్రయత్నాలు చేయద్దని, ఉన్నవాళ్ళని ఇబ్బందులు పెట్టవద్దని గట్టిగా హెచ్చరించారు. ఈనెల 16వ తేదీనుండి వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలో వచ్చేఎన్నికల్లో టికెట్ల విషయమై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ …

Read More »

ప్రైవేటు సంస్థల చేతిలో తెలంగాణ భూ యజమానుల వివరాలు?

ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ధరణి గురించి గొప్పలు చెబుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ధరణిని బరాబర్ రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. ధరణితో తీసుకొచ్చిన మార్పులు.. చేసిన ప్రక్షాళన గురించి కేసీఆర్ గొప్పలు చెబుతుంటే… దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బందో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలారోజుల నుంచి నడుస్తున్నదే. అయితే… తాజాగా …

Read More »

వైసీపీ కార్యకర్తలు చితికిపోయారన్న ధర్మాన

dharmana

సీఎం జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కేవలం రబ్బర్ స్టాంపులని, నేరుగా జగన్ తో మాట్లాడే అవకాశం వారికి చాలా అరుదుగా లభిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు జగన్ తో భేటీ అయిన ఎమ్మెల్యేల సంఖ్య వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నారని, …

Read More »

పవన్ వారాహి యాత్రలో అనుకోని ప్రమాదం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి వారాహి పాదయాత్రను ఈరోజు నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్ ఆ తర్వాత కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను చూసేందుకు, వారాహి యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తిపూడికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ వచ్చే …

Read More »

ఆ రోజు జగన్ కు ఫోన్ లో పవన్ ఏం చెప్పారు?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి వారాహి యాత్ర మొదలుబెట్టారు. కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారాహి వాహనం పై నుంచే నిలుచొని పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును సీఎం చేసేందుకే తాను వారాహి యాత్ర చేస్తున్నాన్న విమర్శలను పవన్ తిప్పికొట్టారు. తాను సీఎం పదవి కావాలనుకోవడం లేదన్న ప్రచారాన్ని పవన్ ఖండించారు. తాను …

Read More »

అన్నయ్యను అవమానించడంపై పవన్ ఫైర్

కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా జగన్ దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లడం, చేతులు కట్టుకొని వినమ్రంగా మాట్లాడిన ఘటనపై పవన్ తాజాగా స్పందించారు. చాలామంది అభిమానించే వ్యక్తిని చేతులు కట్టుకుని తన ముందు నిలబడేలా చేసి పైశాచిక ఆనందం పొందిన …

Read More »

‘కొత్తకోట’ లాంటోళ్లు అరుదుగా వస్తారంతే

ఇప్పుడున్న రాజకీయాల్లో నిన్నటి లెక్క నిన్నటిదే. ఇవాల్టి లెక్క ఇవాల్టిదే. ఫక్తు వ్యాపారంగా మారిపోయిన రాజకీయాల్లో.. కొత్తకోట దయాకర్ రెడ్డిలాంటి వారి ఉదంతాలు విన్నప్పుడు.. అలాంటి వారు వెళ్లిపోతున్న వైనానికి వేదన కలిగించక మానదు. తమకు స్థాయిని కల్పించే పార్టీని నమ్ముకొని ఉండిపోవటమే తప్పించి.. పదవుల కోసం పార్టీలు మారేందుకు సుతారం ఇష్టపడని పాతతరం నాయకులకు కొత్తకోట లాంటోళ్లు నిలువెత్తు చిహ్నాలు. తాను నమ్మిన తెలుగుదేశంలో ఉండిపోయి.. చివరకు ఆ …

Read More »

మీడియా ప్రముఖుడి అరెస్టు !

ప్రముఖు మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆయన్ను.. పీకే అయ్యర్.. డీసీ అడిటర్ మణి ఊమెన్ లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. బ్యాంక్ ను మోసం చేయటం.. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. పలు బ్యాంకుల నుంచి రూ.8800 కోట్లను రుణం తీసుకున్న వెంకట్రామిరెడ్డి ఆ భారీ మొత్తాన్ని తిరిగి …

Read More »