ఏపీ అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెట్రో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ప్రస్తుతం హైదరాబాద్ ముందు ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే 7000+ స్క్వేర్ కిలోమీటర్ల పరిదిలో హైదరాబాద్ అభివృద్ది చెందుతోందన్నారు. అయితే.. ఈసందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో హైదరాబాద్ …
Read More »ఈసారి మహానాడు… అదిరిపోయే సెంటిమెంటు!!
టీడీపీ ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే పార్టీ ఆవిర్భావ సదస్సు.. మహానాడును ఈ సారి రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం మేరకు.. వచ్చే మేనెలలో నిర్వహించే ఈ మహానాడుకు రాజమండ్రి వేదిక కానుంది. అయితే.. దీనివెనుక పెద్ద సెంటిమెంటు ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజమండ్రిలో గతంలో నిర్వహించిన మహానాడు అనంతరం.. వచ్చిన ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చిందని.. అదే సెంటిమెంటును …
Read More »మహారాష్ట్ర సరే ఆంధ్రప్రదేశ్ మాటేమిటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి చాలా రోజులైంది. పార్టీ విస్తరణపై వరుస ప్రకటనలు చేసి కూడా చాలా రోజులైంది. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర నుంచి జనం వచ్చి చేరి కూడా నెలలు గడిచాయి. ఇప్పుడు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అక్కడి నాందేడ్ లో రెండో సారి బహిరంగ సభను నిర్వహించారు. మహారాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్ల పోటీ చేస్తుందని ప్రకటించడం ద్వారా …
Read More »అమరావతి కేసు.. సర్కారుపై సుప్రీం ఆగ్రహం
అమరావతి రాజధాని విషయంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఎందుకంత తొందర పడుతున్నారు? దానిలో మీ వ్యక్తి గత ప్రయోజనాలు లేవుకదా.. ఉంటే చెప్పండి!” అని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులనుఉద్దేశించి.. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో మంగళవారం అమరావతి కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసుకు …
Read More »కొత్తగూడేనికి కొత్త నాయకుడొస్తారా?
కోవిడ్ టైంలో లైమ్లైట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్కు కాళ్లు మొక్కడం నుంచి హరీశ్ రావుకు అహర్నిశలూ భజన చేయడం వరకు ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. ఈ ప్రయత్నాలలో ఆయన మిగతా టీఆర్ఎస్ నేతలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కొందరు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది. తాజాగా ఆయన కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడిన మాటలపై వనమా నాగేశ్వరరావు వర్గం నుంచి …
Read More »అప్పుడు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు సజ్జల
ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన ఏపీ రాజకీయ వాతావరణానికి తగ్గట్లు వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్షాలపై విరుచుకుపడే వైసీపీ.. ఇప్పుడు తమలో తాము అనుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. నష్ట నివారణ చర్యల విషయంలో సీఎం జగన్ మౌనం ఒకపక్క.. ఆయన కార్యకలాపాల్ని చక్కదిద్దే ఆయన సలహాదారు సజ్జల కొత్త తరహా దాడి ఎక్కువైంది. దీంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ …
Read More »నందిగం సురేశ్ ఫ్యూచర్ ఏంటి?
బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. భారీ మెజారిటీతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు 2024 ఎన్నికల నాటికి డీలా పడుతుండడంతో వ్యూహాలు మారుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ బలం పుంజుకుంటున్న సెంట్రల్ ఆంధ్రలో పెద్దఎత్తున మార్పులకు తెరతీస్తున్నట్లు చెప్తున్నారు. 2019లో పోటీ చేసిన ఎంపీలలో చాలామంది ఈసారి పార్లమెంటుకు పోటీచేయకపోవచ్చని చెప్తున్నారు. ఆ లిస్టులో వినిపిస్తున్న పేర్లలో …
Read More »రాహుల్ కు మరో షాక్..
చట్టంతో వచ్చిన చిక్కేమంటే.. ఒక్కోసారి కోరలు తీసిన పులిలా ఉంటుంది. మరోసారి కోరలు లేని అదే పులి రంకెలు వేస్తూ.. నానా హడావుడి చేస్తుంది. అయితే.. ఇదంతా ఆడించే వాడిని బట్టి ఉంటుందే తప్పించి.. చట్టానికి కోరలు లేవని ఎలా చెబుతారు? అది అపోహ మాత్రమే అంటూ వ్యాఖ్యానించేవారు లేకపోలేదు. చట్ట ప్రకారం చేయాల్సినవి చాలానే ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారి కోసం అవెప్పుడూ చుట్టాల మాదిరే పని …
Read More »ముగ్గురు కాదు అయిదుగురు.. జగన్ ఉద్వాసన పలకున్న మంత్రులు ఎవరు?
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైనట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్భవన్లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో భేటీ కావడంతో వైసీపీ మంత్రులలో టెన్షన్ మొదలైంది. అదేసమయంలో మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఆశలు చిగురిస్తన్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఈలోగా అమాత్యులు అనిపించుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే… ప్రస్తుత కేబినెట్లో ఎంతమందిని జగన్ తప్పిస్తారు.. కొత్తగా …
Read More »స్పీకర్ తమ్మినేని ఫోర్జరీ చేశారా.. !
కూన రవికుమార్ ..టీడీపీ హార్డ్ కోర్ నేత. జగన్ పేరు చెప్పినా, తన ప్రత్యర్థి అయిన స్పీకర్ తమ్మనేని సీతారాం పేరు చెప్పినా ఆయన ఒంటి కాలి మీద లేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం ఆయన మీద కేసులు కూడా పెట్టింది. అయినా కూన ఒక్క అడుగు కూడా వెనుకంజ వేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వీరవిధేయుడు, వీర భక్తుడైన రవికుమార్… వైసీపీ ప్రభుత్వంపై రోజు వారీ ఆరోపణలు చేస్తుంటారు. తాజాగా …
Read More »చూశారా.. వైసీపీ కోసం వాళ్లెవరూ రాలేదు!
ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గం అయితే.. జగన్ను మోసిందో.. ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గం అయితే .. జగన్ సీఎం కావాలని వెయ్యికళ్లతో ఎదురు చూసిందో.. ఆ సామాజిక వర్గం కిక్కురుమనలేదు. నిజానికి 2019 ఎన్నికలకు ముందు .. జగన్ కోసం.. జగన్చేత.. జగన్ కొరకు.. అని నడిచిన రెడ్డి సామాజిక వర్గం.. ఆస్తులు అమ్ముకుని కూడా.. ఆయన ను గెలిపించేందుకు కృషి చేసింది. అనేక రూపాల్లో …
Read More »కమాన్ సీబీఐ అంటున్న లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర హాఫ్ సెంచరీ కొట్టింది. యాభై రోజుల తర్వాత కూడా లోకేష్ అదే ఊపులో నడుస్తుంటే లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు. పీలేరు పాదయాత్ర సందర్భంగా లోకేష్ చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. దీనితో లోకేష్ మరోమారి దీన్ని ప్రస్తావించారు. పీలేరు భూఆక్రమణలపై సీబీఐ లేదా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని నేరుగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates