ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న సామెత మాదిరిగా మారింది.. సీఎం జగన్ విషయంలో కర్ణాటక ఎన్నికల పరిస్థితి.! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమే. ఎందుకంటే.. ఇది ఏపీకి పొరుగున ఉన్నరాష్ట్రం. పైగా 2018లో బీజేపీకి అనుకూలంగా ఇక్కడ జగన్ బృందం ప్రచారం కూడా చేసింది. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్నందున.. ఎంతో కొంత రుణం తీర్చుకునేందుకు జగన్.. తాము సహకరిస్తున్నందున.. తమకు సాయం చేయాలని బీజేపీ.. రెండు పార్టీలు ఇద్దరు …
Read More »పెగాసస్ లాంటి మరికొన్ని సాఫ్ట్వేర్లు?
మోదీ ప్రభుత్వం చాలాకాలంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోపణ.. ప్రతిపక్షాలు, మీడియాపై నిఘా పెడుతుండమనేది. ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ సాఫ్ట్వేర్ను రహస్యంగా ప్రయోగిస్తుందన్న ఆరోపణను బీజేపీ ఎదుర్కొంటోంది. అయితే, వచ్చే ఎన్నికల కోసం కూడా ప్రతిపక్షాలపై నిఘా తప్పనసరి అవసరమని బీజేపీ భావిస్తోందట.. అయితే, వివాదాస్పద పెగాసస్ కాకుండా అదేస్థాయి సాఫ్ట్వేర్ వాడేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం రూ. 100 కోట్లు వరకు ఖర్చు చేయడానికి …
Read More »దేనికైనా..ఎప్పుడైనా రెడీ అంటున్న చంద్రబాబు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు అమితానందంలో మునిగిపోయారు. ఆయన నిత్యం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అందరినీ నవ్వుతూ పలుకరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా విరుచుకుపడుతున్నారు. జనంలో మార్పు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేస్తారని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. టీడీపీ అధినేత దృష్టి అంతా ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ముందస్తుకు భయపడబోమని చంద్రబాబు ప్రకటించారు. ఎవరికీ భయపడబోమని, …
Read More »చెప్పింది వినడం కాదు..మీరూ చెప్పండి.. రేపేం జరుగుతుంది.
వైసీపీకి ఏప్రిల్ 3 కీలమంటున్నారు. వైసీపీకే కాదు రాష్ట్రానికి కూడా కీలకం కావచ్చని చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ, పునర్ వ్యవస్థీకరణకు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు నలుగురిని పంపేసి, వారి స్థానంలో మరికొందరిని తీసుకునే వీలుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కీలక నేతలు కూడా ఈ …
Read More »కవిత కోసం రంగంలోకి దిగిన జగన్?
ఈ ప్రశ్నకు సమాధానంగా కొత్త పేరు వినిపిస్తోంది. సాధారణ ప్రజలు ఊహించడానికి కూడా చాన్స్ లేని పేరు. అవును… తెలంగాణ సీఎం కుమార్తె కవితను దిల్లీ లిక్కర్ స్కాం నుంచి రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఏపీ సీఎం జగన్ డీల్ చేస్తున్నారట. మొన్నటి ఆయన ఢిల్లీ పర్యటనలో తమ్ముడు అవినాశ్ రెడ్డి కేసుతో పాటు కవిత కేసు కూడా ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ …
Read More »వారాహి.. ఏది జానీ..!
ఔను.. మంచి సమయం మించిన దొరకదు. అంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి సమయం కొనసాగుతోంది. ప్రబుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. బహుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు జిల్లాల …
Read More »పవన్ భవిష్యత్తుపై ఉండవల్లి ఏమంటున్నారు?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తుల విషయంలో ఆయన క్లారిటీకి రాలేకపోతున్నారు. అయినా జన సైనికులు మాత్రం నిరాశ పడటం లేదు. ఎన్నికల నాటికి పొత్తులు ఖరారవుతాయన్న విశ్వాసంలో వాళ్లు పనిచేసుకుపోతున్నారు.. పవన్ కల్యాణ్ పై ఏపీలో మాత్రం నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ బలం రెట్టింపయిందని ఆయన విశ్లేషించారు. రెండు …
Read More »అమరావతి ‘ముసుగు’.. బీజేపీని నమ్మేదెవరు!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతలు స్పందిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమరావతిలో రైతుల ఉద్యమానికి 1200 రోజులు పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ నుంచి కీలక నేత.. సత్యకుమార్ హాజరయ్యారు. మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని పూర్తి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వైసీపీ అమరావతిని నాశనం చేసిందన్నారు. అయితే.. ఇన్ని అంటున్న సత్య …
Read More »షర్మిల ట్విస్టు.. రేవంత్, బండిలకు ఫోన్
మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎవరికి వారు తమదైన రాజకీయ ఎత్తుల్లో మునిగిపోయారు. ఇప్పటికే వేడుక్కిన రాజకీయాలకు కొనసాగింపుగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వైసీపీ అధినేత్రి షర్మిల కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె స్వయంగా ఫోన్ చేశారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేద్దామని సూచన చేశారు. నిరుద్యోగ …
Read More »ఆ నలుగురికీ సింపతీ పెంచేసిన జగన్
వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కొన్ని కొన్ని సార్లు సక్సెస్ కన్నావిఫలమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణయంతో వైసీపీ సాధించింది ఏమీ కనిపించడం లేదు. అదేసమయంలో సదరు ఎమ్మెల్యేలకు సింపతీ పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని తీసుకుంటే.. గత ఏడాదికి ఇప్పటికీ ఆయన గ్రాఫ్ …
Read More »సుప్రీంకోర్టు దెబ్బ బాగా తగిలినట్లే ఉంది
సుప్రీంకోర్టు దెబ్బ సీబీఐకి బాగా గట్టిగానే తగిలినట్లుంది. అందుకనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో తొందరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ స్పెషల్ పీపీ చెప్పారు. వివేకా మర్డర్ కేసు దర్యాప్తును ఏప్రిల్ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి గడువు పెట్టిన విషయం తెలిసిందే. 2018లో వివేకా మర్డర్ జరిగితే ఇంతవరకు సీబీఐ దర్యాప్తులో పెద్దగా పురోగతి కనబడలేదని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ …
Read More »మేకపాటి వర్సెస్ మేకపాటి.. వైసీపీ మాస్టర్ ప్లాన్
నెల్లూరు జిల్లా రాజకీయాలు మరింతగా కాగుతున్నాయి. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్రస్థాయిలో రగిలిపోయిన మేకపాటి చంద్రశేఖర్రెడ్డి.. వైసీపీపై గత వారం రోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా జగన్ వైఖరిపైనా.. ప్రభుత్వం తీరుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరిలో తాను నాలుగుసార్లుగా విజయం దక్కించుకుంటున్నానని..ఇ ప్పుడు జగన్ తనను అవమానించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఉదయగిరిలో అడుగు పెట్టలేరంటూ.. వైసీపీ నేతలు చేసిన సవాళ్లపైనా ఆయన రియాక్ట్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates