ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి 72 ఏళ్ల వయసున్న వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు ఉదయం 7గంటల సమయంలో భాస్కర్రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అరెస్ట్ మెమో అందజేసి 120బి రెడ్విత్ 302, 201 సెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. భాస్కర్రెడ్డి …
Read More »పవనే సీఎం కావాలి – నాగబాబు
జనసేనకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే నాగబాబు యాక్షన్ లోకి దిగారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఏముందంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితీరాలట. పవన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. పవన్ను సీఎం చేయటమే ధ్యేయంగా కార్యకర్తనుండి రాష్ట్ర నేతలవరకు అందరినీ సమన్వయం చేస్తానని ప్రతిజ్ఞచేశారు. పవన్ లాంటి రాజకీయ …
Read More »అవినాష్ సరే సీబీఐ అసలు టార్గెట్ ఎవరూ.. ?
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం జరిగినా పోగ పోగా అది గొడ్డలిపోటు అని తేలిపోయింది. అరెస్టు మెమోను భాస్కర్ రెడ్డి భార్యకు అందించిన సీబీఐ అధికారులు, ఆయన్ను హైదరాబాద్ తరలించారు. సాక్ష్యాలు చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగం మోపింది. వివేకా …
Read More »ఉత్తరాంధ్రలో టీడీపీ రిలాక్స్
విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. పార్టీ కేడర్ నూతనోత్సాహంతో పనిచేయాలి. మాతృసంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. ఉత్తరాంధ్ర టీడీపీలో మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి గెలిచిన తర్వాత విశాఖ టిడిపి నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పనిచేయాల్సిందేముంది.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమా వారిలో కనిపిస్తోంది. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఊపుమీదున్న వైసీపీ రాష్ట్రంలోనూ, జీవీఎంసీ పీఠం మీద …
Read More »టీడీపీ వర్సెస్ వైసీపీ.. దుమ్మురేపుతున్న స్టిక్కర్ల రాజకీయం
రాష్ట్రంలో స్టిక్కర్ల రాజకీయం దుమ్ము రేపుతోంది. అధికార పార్టీ వైసీపీ ‘జగనన్నే మా భవిష్యత్’ ‘మా నమ్మ కం నువ్వే జగన్’ పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తోంది. ఎమ్మెల్యేలు మంత్రులు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో సగం పూర్తయినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఈ స్టిక్కర్ల కార్యక్రమానికి కౌంటర్గా ప్రధాన ప్రతిపక్షం …
Read More »తండ్రి అరెస్టు.. కొడుకు పరిస్థితి ఏంటి?
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఆది నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. సీఎం జగన్ తనకు తమ్ముడు అని చెప్పుకొనే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పులివెందులలోని ఆయన ఇంటికి అత్యంత రహస్యంగా వెళ్లిన అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అయితే.. తండ్రి అరెస్టుతో కొడుకు పరిస్థితి …
Read More »గ్యాంగ్ స్టర్ హత్య..పండగ చేసుకుంటున్న జనాలు
ఉత్తరప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. ఎన్ కౌంటర్లో కొడుకు చనిపోయిన మూడురోజులకే తండ్రి, తండ్రితో పాటు బాబాయ్ కూడా హత్యకు గురవ్వటం యూపీలో సంచలనంగా మారింది. అతీక్ సుమారు 100కు పైగా కేసుల్లో నిందితుడు. పదులసంఖ్యలో కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. మామూలుగా అయితే ఈ కేసుల విచారణ ఎప్పటికీ పూర్తికావని అందరికీ తెలిసిందే. ఒక్కో కేసు విచారణకే …
Read More »వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ తండ్రి అరెస్టు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో వేగం పెంచింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి, వైసీపీ నాయకుడు వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు ఈ రోజు ఉదయం 6.40 గంటల సమయంలో పులివెందులలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి గత రాత్రి సీబీఐ బృందాలు కడప చేరుకున్నట్టు సమాచారం.అయితే.. ఎవరి కంటా పడకుండా.. అత్యంత రహస్యంగా ఉన్న అధికారులు ఉదయమే రంగంలోకి …
Read More »కోడికత్తికి-అలిపిరి ఘటనకు సంబంధమేల నాయకా?!
రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు.. దేనినైనా ఎలాగైనా.. మలుపు తిప్పచ్చు.. అనే మాటను వైసీపీ నాయకులు నిజం చేస్తున్నా రని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ఏపీలో కోడికత్తి కేసు వ్యవహారం తెరమీదికి వచ్చింది. అప్పుడెప్పుడో 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్పై ఆ పార్టీ అభిమానని, జగన్కు మరింత అభిమానని చెప్పుకొన్న శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిని అప్పట్లో వైసీపీ …
Read More »నాకు టికెట్ ఇవ్వకపోతే.. పార్టీని ఓడిస్తా
మరోసారి అధికారం దక్కించుకుని.. కర్ణాటకలో ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రోజు రోజుకు సెగలు పెరుగు తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడిపోయారు. దీనికి కారణం.. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఇప్పటి వరకు 212 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. వీరిలో సిట్టింగులకు చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు. కొందరికి పార్టీ అధిష్టానం నచ్చజెప్పగా మరికొందరికి మాత్రం ఊరడింపు లభించలేదు. దీంతో …
Read More »వివేకా హత్య : సీబీఐ సంచలన విషయాలు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాలూకు ఆనవాళ్లను, సాక్ష్యాలను.. ఎవరు చెరిపేశారో.. ఎవరెవరు చేతులు కలిపారో.. పూస గుచ్చినట్టు సీఐబీ వివరించింది. వివేకా హత్య ఆనవాళ్లను.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రితో కలిసి ఉదయ్ చెరిపేశాడని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. రెండు రోజుల కిందట గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను …
Read More »దిగజారుతోన్న వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్…!
జారుడు బల్లలపై వైసీపీ నేతల విన్యాసాలు ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటనేది తెలుసు కోకుండానే నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. పార్టీకి..వ్యక్తిగతంగా నేతలకు కూడా ఇబ్బందిగానే మారు తోందని అంటున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం, విజయవాడ సెంట్రల్, పాణ్యం, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, కొవ్వూరు ఇలా.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తుల పరంగా మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి పార్టీపరంగా వ్యతిరేకత ఉంటే.. అది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates