ఏపీ అధికార పార్టీ వైసీపీలో నిన్న మొన్నటి వరకు అప్రకటిత.. క్రమశిక్షణ ఖచ్చితంగా అమలయ్యేది. సీఎం జగన్ అన్నా.. నాయకులు అన్నా.. ఎంతో గౌరవం ఉండేది. ఎవరూ కూడా పార్టీ విషయంలో కట్టు తప్పేవారు కాదు. ఈ పరిణామమే గత ఎన్నికల్లో విజయాన్ని అందించింది. సీఎంగా జగన్ను ముఖ్యమం త్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ నాయకులు కట్టు తప్పుతున్నారు.. పార్టీపైనా విమర్శలు చేస్తున్నారు. ఒక్క …
Read More »బనగానపల్లెలో సంప్రదాయం రిపీట్ అవుతుందా..?
ఉమ్మడి కర్నూలు ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ దూకుడు పెరిగిందా ? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏంటి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇక్కడ నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న వైసీపీ నాయకుడు కాటసాని రామిరెడ్డిపై వైసీపీ అధినేత సీఎం జగన్ సర్వే చేయించారు. ఇలా ఒకసారి కాదు.. ఏకంగా రెండు సార్లు చేయించిన సర్వేల్లో కాటసాని వెనుకబడి నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాటసానిపై అవినీతి …
Read More »విఫలమవుతున్న జగన్ మానస పుత్రికలు
ఏపీ సీఎం జగన్..ఎంతో ఇష్టంగా తీసుకువచ్చినకొన్ని కొన్ని పథకాలు విఫలమవుతున్నాయనే వాదన ఉం ది. వీటిలో సచివాలయ వ్యవస్థ ఇబ్బందుల్లోపడిందని తెలుస్తోంది. అధికారుల నుంచి ఒత్తిడి, పని వేళలు, వంటివి ఒకవైపు ఇబ్బందిపెడుతుంటే.. మరోవైపు సచివాలయ వ్యవస్థలో పనిచేసే వారికి జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవస్థలో పనిచేస్తున్నవారు వేరే ఉద్యోగాలు చూసుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక …
Read More »బీఆర్ఎస్.. అంటే ఏంటో తెలియదు.. 70 శాతం మంది మాట ఇదే!
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ అధికార పార్టీ బీ(టీ)ఆర్ ఎస్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. కేంద్రంలో వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఆ పార్టీ ప్రముఖులు తరచు గా చెబుతుంటారు. అయితే.. అసలు బీఆర్ ఎస్ పార్టీ దేశంలో ఎంతమందికి పరిచయం అయింది? అనే ది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దేశంలో తాజాగా ఎన్డీటీవీ–లోక్నీతి–సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్డీఎస్) సంయుక్తంగా ‘ప్రజాభిప్రాయం’ …
Read More »రాహుల్ జర్నీ వర్కవుటవుతుందా ?
జనాలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధి రూటు మార్చినట్లున్నారు. ఇందులో భాగంగానే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. అయితే అది తృప్తినిచ్చినట్లు లేదు. కర్నాటకలో ఘనవిజయం సాధించటంలో పాదయాత్ర కూడా కీలకపాత్ర పోషించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ పాదయాత్ర చేసిన ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. దాంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడిని కంటిన్యు చేయాలని అనుకున్నట్లున్నారు. అందుకనే పూర్తిగా రూటు మార్చేశారు. ఇంతకీ …
Read More »మోడీ మాటే వేదం.. ప్రధానిగా ఆయనకే మార్కులు.. !
దేశంలో ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేందుకు లెక్కకు మిక్కిలిగా నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరికిమించి ఎక్కువగానే ఈ జాబితా ఉంది. ఈ కారణంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం గా కూటమి కట్టే ఆలోచనలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి. గతంలోనూ ఇలానే తృతీయ పక్షం ఏర్పాటుకు ప్రధాని పీఠమే అడ్డంకిగా మారిందనే చర్చ నడిచింది. ప్రాంతీయ స్థాయిలో బలంగా ఉన్న నాయకులు కేంద్రంలో చక్రం తిప్పాలని భావించడమే దీనికి కారణం. …
Read More »తెలంగాణ కాంగ్రెస్ – గట్టి ప్లానింగే !
ఈనెల 26వ తేదీన తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ అధిష్టానం పిలిపించింది. అందరినీ ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి తదితరులు తెలంగాణా నేతలతో భేటీ అవటానికే రమ్మని ఆదేశించారు. తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకే కీలకమైన భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన …
Read More »భారత్ జోడో యాత్ర సక్సెస్.. రాహుల్ ఫెయిల్!
దేశంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని ఉవ్వి ళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పార్టీని గాడిలో పెట్టేందుకు.. మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ అగ్రనేతరాహుల్గాంధీ భారత్ జోడో వంటి యాత్రలు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి.. పార్టీ పుంజుకుంటుందని ఆయన వేసిన అంచనాలు నిజమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు రెండు దశల్లో చేసిన భారత్ …
Read More »ఏపీకి మళ్లీ అప్పు.. నెలన్నరలో 13,500 కోట్లకు చేరిన రుణం!!
అప్పు చేసి పప్పు కూడు తినరా.. ఓ నరుడా! అన్న సూత్రం ఏపీకి బాగానే వర్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రారంభమై.. కేవలం నెలన్నరే అయింది(ఏప్రిల్-మే15). అయితే.. ఈనెలన్నర కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 13,500 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది. తాజాగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా …
Read More »పొత్తులు లేకుంటే అంతే.. బీజేపీ నేతల గుసగుస…!
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒకటో రెండో పార్లమెంటు స్థానాల్లోనూ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు తలపోస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం కమల నాథులతో కలిసి నడుస్తున్న జనసేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బతకండి.. మమ్మల్ని బతికించండి.. అందరం కలిసి అధికారంలోకి వద్దాం.. అని చెబుతోంది. అయితే.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎటూ …
Read More »చంద్రబాబు పై పీక్స్కు చేరుకున్న మౌత్ పబ్లిసిటీ..
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకపోయినా.. తెలుగు దేశం పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయం చేరువ అవడంతో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏంటి? అనేవి చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ప్రతిపక్షం టీడీపీ పుంజుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా …
Read More »మారని తీరు.. కేశినేనిని టీడీపీ వదిలేస్తుందా…!
ఒక రోజు ఒక విధంగా ఉన్నా.. మరుసటి రోజైనా మార్పు అనేది రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విజయం దక్కించుకునేందుకు నాయకులు ముఖ్యంగా ఈ సూత్రాన్ని అవలంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే.. విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని విషయంలో పార్టీ ఆశలు ఆవిరి అవుతున్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒకవైపు వైసీపీ పై కత్తికట్టినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు అంటూ ప్రజల మద్య …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates