రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంధులే ముంచేస్తాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కేసీయార్ ఈమధ్యనే ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదేశాలిచ్చారు కానీ ఆచరణ ఎలాగో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే దళితబంధు పథకం అమలుకు కనీసం రు. 20 వేల కోట్లు కావాలి. అంతడబ్బు ప్రభుత్వం దగ్గర లేదన్నది వాస్తవం. ఈ పథకాన్ని పక్కన పెట్టేస్తే బీసీ బంధు పథకం అమలుకు కూడా కేసీయార్ రెడీ అవుతున్నారు. …
Read More »ఒడిశా రైలు ప్రమాదం: 101 మృతదేహాలను దాచేందుకు భారీ ప్లానింగ్
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన సవాళ్లు ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 175 మంది మరణిస్తే.. దుర్ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటికి ఆచూకీ తెలియని మృతుల సంఖ్య 101గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 101 మృతదేహాలను ప్రస్తుతం స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో ఉంచారు. అయితే.. ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచే సౌకర్యం లేకపోవటంతో 101 మృతదేహాలను భద్రపర్చటం …
Read More »కేసీఆర్ స్పీడ్ : 70 మందితో లిస్టు రెడీ అవుతోందా ?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపికపై కేసీయార్ కసరత్తులో స్పీడుపెంచినట్లు తెలుస్తోంది. దశాబ్ది ఉత్సవాలు అయిపోగానే మొదటిజాబితాగా 70 మందికి టికెట్లు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట. ఆరునెలలకు ముందే టికెట్లను ప్రకటించేస్తానని గతంలోనే కేసీయార్ ప్రకటించిన విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు ఇపుడు గుర్తుచేస్తున్నాయి. గతంలో ఛెప్పినట్లుగానే తమ అధినేత మొదటి జాబితాలో 70 మందికి టికెట్లను ప్రకటించబోతున్నట్లు చెప్పాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించన తర్వాత లేకపోతే నామినేషన్లకు …
Read More »మేనిఫెస్టో పబ్లిసిటీ… పక్కా ప్లానింగ్ తో!
జనాల ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశంపార్టీ తొందరలోనే వినూత్న కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతోంది. 150 రోజుల పాటు జనాల్లోనే ఉండి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి మహానాడులో మొదటి విడత మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టోకు భవిష్యత్తుకు గ్యారెంటీ అని పేరుపెట్టారు. అందులో ఆరు పథకాలను …
Read More »రామోజీ కేసులన్నీ ఏపీకివ్వండి… సుప్రీంకోర్టును అడిగిన సీఐడీ..
మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏపీ, తెలంగాణా, కర్నాటకతో పాటు కొందరు తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణా, కర్నాటకలోనే లక్షల్లో ఉన్నారు. మార్గదర్శిలో మోసాలు జరిగాయని సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రామోజీరావును ఏ1 …
Read More »వైసీపీ మహిళా ఎంపీ భూకబ్జా.. సొంత వదినే రోడ్డెక్కారుగా!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై భూకబ్జా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులపై ఈ తరహా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్, అనంతపురానికి చెందిన మంత్రి ఉష శ్రీ చరణ్లపై భూముల కబ్జాకు సంబంధిం చిన ఆరోపణలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం లెక్కచేయకపోవడం గమనార్హం. తాజాగా …
Read More »పదే పది నెలలు… వైసీపీ, టీడీపీ టార్గెట్లు మామూలుగా లేవే…!
వైసీపీ వ్యూహాలు మారుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యూహం కూడా పూర్తిస్థాయిలో మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో 10 మాసాల్లో ఎన్నికలు జరగనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారం 2024 మార్చిలోనే ఎన్నికలు జరిగినా కూడా ఈ ఉండేటటువంటి మధ్యకాలం అంతా కూడా ఇరు నాయకులు అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి …
Read More »వాళ్లంతా డమ్మీలే.. సర్వస్వం.. తాడేపల్లే: ఆనం సంచలన వ్యాఖ్యలు
జనాలూ.. నా మాట వినండి.. అంటూ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చేఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పాలన అంతానికి అందరూ నడుం బిగించాలని అన్నారు. చట్టసభల్లో జరగాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంప్ కార్యాలయం వేదికగా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంపు కార్యాలయంలో సాగుతున్నాయని, …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు.. చొక్కా చింపేసి మరీ..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అత్యంత అమానుష రీతిలో అరెస్టు చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి ఆయనను అరెస్టు చేయడం.. తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి ఘటన మరువకముందే.. ఇలా టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు కలకలం రేపడం గమనార్హం. ఏం జరిగిందంటే.. …
Read More »రాహుల్ ఈ రేంజ్లో మోడీని ఏకేస్తారని అనుకోలేదట!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు.. బీజేపీ నుంచి కూడా అదే రేంజ్లో కౌంటర్లు పడుతున్నాయి. కానీ… తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్గాంధీ మోడీపై ఓ రేంజ్లో ఎక్కేశారు. ఓ స్థాయిలో ఏకేశారు. దీంతో బీజేపీ నాయకులు కిమ్మనకుండా.. మౌనంగా ఉండిపోయారు. మరి మోడీని రాహుల్ ఏమన్నారంటే.. గత ప్రభుత్వంలో వైఫల్యాలపై ఒకరిని నిందించడమే …
Read More »తెలంగాణ దూకుడుకు ఏపీ పోటీ పడలేకపోతోందిగా!
ఆదాయంలో తెలంగాణ ముందుందంటే.. ఔను.. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాదనకు దిగుతారు. ఇతర పరిశ్రమలు, ఐటీ వంటి వాటిలో తెలంగాణ దూకుడుగా ఉందని చెబితే.. ఔను.. మేం కూడా దూసుకుపోతున్నాం.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు వస్తున్నాయని బల్లగుద్ది మరీ చెబుతారు. కట్ చేస్తే.. మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమలకు సంబంధించి మీరు ఏం చేశారు? ఏమైనా …
Read More »విషయం తెలిసి.. బీజేపీ అలా చేయదేమో..
బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత.. అనేక విశ్లేషణలువ స్తున్నాయి. ఏపీలోనూ.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబుతో చేతులు కలిపేందుకు బీజేపీ పెద్దలు మంతనాలు జరిపారన్నది ప్రధాన చర్చ. అయితే.. ఏపీ విషయాన్ని పక్కన పెడితే.. తెలంగాణలో ఉన్న రాజకీయ సెన్సిటివిటీని, ఇక్కడి సెంటిమెంటును ఇప్పటికే కాచి వడబోసిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates