Political News

మ‌చిలీప‌ట్నం పాలిటిక్స్ మారుతున్నాయ్‌.. పేర్నికి క‌ష్టాలేనా?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పేర్ని నాని గెలుపు గుర్రం ఎక్కారు. త‌ర్వాత ఆయ‌న సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే.. గ‌త ఏడాది రెండో సారి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించిన‌ప్పుడు.. పేర్నిని త‌ప్పించారు. ఇక‌, ఇప్పుడు పేర్ని కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి(కిట్టు)కి టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షాలు పుంజుకుంటున్నాయి. …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడు.. త్వ‌ర‌లో ముహూర్తం!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి కంచుకోటగా పేర్కొనే జిల్లా క‌డ‌ప‌. అయితే.. ఈ జిల్లాలో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎప్ప‌టి నుంచో వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను కూడా క‌దిలిస్తోంది. దీంతో టీడీపీని బ‌ల‌ప‌రి చేందుకు క‌డ‌ప నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు వైసీపీలో నెల‌కొన్న వివాదాలు, విభేదాల కార‌ణంగా కొంద‌రు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.ఈ ప‌రంప‌ర‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీకి జైకొట్టిన …

Read More »

ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు ప‌వ‌న్ వెల్ల‌డి

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా బుధ‌వారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అమిత్ షా కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని తెలిసింది. ముఖ్యంగా ఇటీవ‌ల తాను …

Read More »

బీజేపీ-జ‌న‌సేన పొత్తు.. జోగయ్య హాట్ కామెంట్స్‌

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన‌ ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల భేటీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం, బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని ఆయ‌న చెప్ప‌డం ప‌ట్ల మాజీ పార్ల‌మెంటు స‌భ్యుడు, కాపు సంక్షేమ సంస్థ అధ్య‌క్షుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయ‌న మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో బీజేపీ.. కేవ‌లం జ‌న‌సేనను వాడుకునేందుకు చూస్తోంద‌ని అన్నారు. ప‌వ‌న్ కు ఉన్న చ‌రిష్మాను వాడుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధి …

Read More »

నాకివ్వండి స‌ర్‌.. కాదు.. నాకే ఇవ్వాలి స‌ర్‌..

ఎన్నిక‌ల ముందు టికెట్ల వ్య‌వ‌హారం టీడీపీలో వివాదాల‌కు దారితీస్తోంది. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇలాంటి నియోజ‌క‌వ ర్గాల విష‌యంలో ఆయ‌న నొప్పింప‌క.. తానొవ్వ‌క అనే ఫార్ములాను అనుస‌రిస్తున్నారు. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తాము బ‌ల‌ప‌డాల‌ని .. గెలుపు గుర్రం ఎక్కాల‌ని చంద్ర‌బాబు కృత నిశ్చ‌యంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా నాయ‌కుల‌ను పిలిచి.. చ‌ర్చించి టికెట్లు …

Read More »

కేసీఆర్‌… నేను నోరు విప్పితే..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “కేసీఆర్‌.. నేను నోరు విప్పితే నువ్వు ఈ రోజే ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి పారిపోతావ్ బిడ్డా!” అని అన్నారు. అంతేకాదు.. తాము ఎంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని..కానీ, బీఆర్ ఎస్ నాయ‌కులు, మంత్రులు కొంద‌రు రెచ్చ‌గొడుతున్నార‌ని కోమ‌టిరెడ్డి చెప్పారు. తాజాగా కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం …

Read More »

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేసిన వైనం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది. ఇక, జగన్ సర్కార్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో పవన్ ఎండగట్టిన తీరు కూడా వైసీపీ నేతలకు షాకిచ్చింది. మరోవైపు, ఎన్డీఏ కూటమిలోకి దారులు మూసుకుపోయాయనుకుంటున్న టీడీపీకి పవన్ రూపంలో ఆశలు చిగురించాయి. ఈ …

Read More »

రాజాం ర‌చ్చ‌పై చంద్ర‌బాబు క్లారిటీ.. ప్ర‌తిభ వార‌సురాలికి షాక్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఆదిశ‌గా క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశారు. బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను, కంచుకోట‌ల‌ను ఎట్టి ప‌రిస్తితిలోనూ వ‌దులుకోకూడ‌దే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చారు. ఈ విష‌యంలో ఆయ‌న ఒకింత క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. తాజాగా ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి దాదాపు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసేశారు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి ఇంచార్జిగా …

Read More »

ప‌వ‌న్‌లో సెకండ్ యాంగిల్ చూస్తున్న బీజేపీ..!

రాజ‌కీయాల్లో చూసే కోణాలు.. వేసే అడుగులు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెండు ప‌ట్టాల‌పైనే ఏ రాజ‌కీయ పార్టీ అయినా..అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కాక‌లు తీరిన రాజ‌కీయ నాయ‌కులుగా పేరున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వంటివారు.. ఊర‌క‌రారు మ‌హాను భావులు అన్న‌ట్టుగా.. ఊరికేనే వారు ఏమీ చేయ‌రు.. ఎవ‌రినీ పిల‌వ‌రు. ఆమూలాగ్రం అన్ని కోణాల్లోనూ ఆలోచించుకునే …

Read More »

వ‌ర్ల వార‌సుడికే వీర‌తాడు.. !

విధేయ‌త‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ట్టం క‌ట్టారు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా పార్టీని అంటిపెట్టుకుని ప‌నిచేస్తున్న మాజీ పోలీసు వ‌ర్ల రామ‌య్య కుటుంబానికి మ‌రో అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌టికే ఒక‌సారి ఎమ్మెల్యే టికెట్‌, అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో మెంబ‌ర్‌లో వ‌ర్ల‌కు చంద్ర‌బాబు ఛాన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అదేవిదంగా గ‌త ఏడాది జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పామ‌ర్రు …

Read More »

మ్యానిఫెస్టో లేకుండానే ఎన్నికలకా ?

ఇపుడిదే విషయం బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టో అంటు ప్రత్యేకంగా ఏమీ ప్రకటించకుండానే ఎన్నికలకు వెళితే ఎలాగుంటందనే విషయాన్ని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. చేయబోయే అభివృద్ధి, అమలుచేయబోయే సంక్షేమ పథకాలపై జనాలకు ఇచ్చే హామీయే మ్యానిఫెస్టో. రెండు వరుస ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా గ్రౌండ్ అయిన తర్వాత మళ్ళీ …

Read More »

ఈసారి బాప‌ట్ల అంత ఈజీ కాదు?

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో ఏం జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ ఆరా తీస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతు న్నాయి. అంటే.. ఒక‌ ర‌కంగా.. చీమ‌ చిటుక్కుమ‌న్నా కూడా ఆయ‌న అలెర్ట్ అవుతున్నారు. మ‌రీ ముఖ్యంగా సొంత పార్టీ నాయ‌కుల విష‌యంలో ఈ అలెర్ట్ ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు. కీల‌క‌మైన నాయ‌కుల విష‌యంలో సీఎం జ‌గ‌న్ చూసే దృష్టి కోణం కూడా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని అంటున్నారు. ఇలా.. సీఎం జ‌గ‌న్ ఒక …

Read More »