రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పథకం అమలుకు అప్పర్ లిమిట్ సీలింగ్ విధించాలని అనుకుంటున్నదట. రైతుబంధు పథకం అమలుపై సమీక్షించిన తర్వాతనే రైతుభరోసా నిధులు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 2018లో కేసీయార్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకంలో చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పథకంలో అనర్హులకు కూడా చాలా లబ్ది జరిగిందని వచ్చిన ఆరోపణలను కేసీయార్ ప్రభుత్వం …
Read More »దుమ్ము రేపేలా.. పార్టీల ‘స్లోగన్లు’.. ఎంత ఖర్చయినా ఓకే!
మరో మూడు మాసాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నినాదాల ప్రిపరేషన్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హల్చల్ చేస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా నమ్మకం.. రావాలి జగన్, కావాలి జగన్.. వంటివి ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇక, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నాయకులు అంటున్నారు. …
Read More »రాధాకు పెరుగుతున్న పొలిటికల్ స్పేస్.. !
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న దరిమిలా.. వంగవీటి రంగా వారసుడు రాధాకు కూడా.. రాజకీయ స్పేస్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఆయన కూడా పార్టీపై ఒత్తిడి తేవడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓకే అన్న వైసీపీ.. రాధా కోరుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇవ్వలేదు. దీంతో ఆయన అలిగి బయటకు …
Read More »అన్నావారి అలక.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారట!
గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు.. అలక బూనారు. ఒక్క రోజులో ఆయన మాట మార్చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి పోటీ చేసిన అన్నా.. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న రెండో నాయకుడిగా పేరు తెచ్చుకన్నారు. అయితే.. ఆయన దూకుడు స్వభావమే.. ఆయనను నాయకులకు దూరం చేసింది. మితి మీరిన అహంకారం కూడా ఉందని ఆయన అనుచరులే చెప్పుకొనే పరిస్థితికి …
Read More »ఇక, షర్మిలదే నిర్ణయం!
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకునే అంశంపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఢిల్లీ లో తాజాగా జరిగిన ఏపీసీసీ(ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ) సమావేశంలో షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలపై చర్చ జరిగింది. షర్మిల పేరును ఏపీసీసీ చీఫ్ గా ప్రతిపాదించిన పీఏసీ మెంబర్, ఏపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు.. ఆమె ప్రాతినిధ్యంలో …
Read More »“పవన్ ఆ ఒక్క మాట చెబితే.. వైసీపీ ఖాళీ అవుతుంది”
“జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తానే సీఎంనని ప్రకటిస్తే.. విశాఖపట్నం వైసీపీ నాయకులు మొత్తం వచ్చి జనసేనలో చేరేందుకు రెడీగా ఉన్నారు” అని వైసీపీ నుంచి తాజాగా బయటకు వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. “వైసీపీలో చేరకముందే నేను పవన్ కల్యాణ్కు …
Read More »కిక్కిరిసిన తాడేపల్లి.. క్యూ కట్టిన ఎమ్మెల్యేలు!
ఏపీ సీఎం జగన్ నివాసం ఉన్న తాడేపల్లికి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో తాడేపల్లి ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. ఒకరు కాదుఇద్దరు కాదు.. ఏకంగా.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు సీఎం ఇంటికి క్యూ కట్టారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో తమకు మరో ఛాన్స్ ఇవ్వాలనే అభ్యర్థనను నేరుగా అధినేతకే విన్నవించేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపుకార్యాలయానికి చేరుకున్నారు. వీరిలో కొందరికే …
Read More »కుదిరితే ఓడించడం.. లేకపోతే మెజారిటీని తగ్గించడం
వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనను ఓడించాలనేది టీడీపీ వ్యూహం. ఎందుకంటే.. కత్తికి కత్తి! అన్న సామెత మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై వైసీపీ కన్నేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంపై టీడీపీ కూడా కన్నే సింది. ఈ నేపథ్యంలో కుదిరితే జగన్ను ఓడించడం.. లేకపోతే మెజారిటీని భారీగా తగ్గించడం అనే టార్గెట్ను నిర్దేశించుకుంది. ఈనేపథ్యంలో పులివెందుల నియోజకవర్గం …
Read More »రంగా ఎవరి వాడు.. కాంగ్రెస్ వర్సెస్ జనసేన.. !
వంగవీటి రంగా ఎవరి వాడు.. ఆయనను ఓన్ చేసుకునేందుకు కాంగ్రెస్, జనసేనలు ప్రయత్నిస్తున్న దరిమిలా.. ఇదే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా జరిగిన రంగా వర్ధంతిని విజయ వాడ సహా గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిర్వహించా రు. దాదాపు రంగా చనిపోయిన తర్వాత.. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ రంగాను మరిచిపోయిందనే చెప్పాలి. రాధా 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడంతో …
Read More »సిగ్నల్ రెడీ.. ఇక, ఆ మంత్రులకు కొత్తదారే.. !
వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులను మారుస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొంత వ్యతిరేకత కూడా వస్తోంది. అభ్యర్థులు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు. వేరే పార్టీలకు వలస కూడా పోతున్నారు. అయినప్పటికీ.. వైసీపీని గెలిపించుకోవాలంటే మార్పులు తప్పదనేది ఆ పార్టీ వ్యూహం ఈ క్రమంలో మంత్రులకు కూడా ఇప్పుడు సంకేతాలు పంపేసిందని సమాచారం. విషయం బయటకు రాకముందే.. మంత్రులకు పక్కా సంకేతాలు పంపి.. వేరే నియోజకవర్గాలను …
Read More »రేవంత్ డిమాండ్.. ఏపీకీ మేలేగా
విభజన హామీల విషయంలో ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న వాతావరణాన్ని ఛేదిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసి వచ్చారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాల్సిందేనని, ఈ హామీలకు ఇప్పటికే పదేళ్లు గడిచిపోయాయని ఇప్పటికైనా హామీలను అమలు చేయాల ని సీఎం రేవంత్ నేరుగా ప్రదానిని కలిసి డిమాండ్ చేశారు. దీనిపై ఒక కదలిక అయితే వచ్చింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »కోట్లు పలుకుతున్న ఎంపీ సీట్లు.. కాయ్ రాజా కాయ్.. !
ఏపీలో ఎంపీ సీట్లు హాట్ కేకుల్లా మారాయి. ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితిగా ఉంది. అధికార పార్టీలో అయితే.. ఏకంగా 70 నుంచి 120 కోట్ల వరకు కూడా ఎంపీ సీటుకు ధర పలుకుతున్నట్టు ప్రచారంలో ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో చేసిన ప్రయోగాలకు కూడా.. ఈ దఫా పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates