Political News

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి మ‌రీ వార్నింగ్‌?

ఈ ఏడాది చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కుతోంది. ప‌రిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం బీఆర్ఎస్‌.. అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మూడో సారి సీఎం పీఠంపై కూర్చునేందుకు కేసీఆర్ ప్ర‌ణాళిక‌ల్లో నిమ‌గ్నమ‌య్యార‌ని తెలిసింది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌కు.. కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డ్డాయ‌ని టాక్‌. అందులో ముఖ్యంగా కొంత‌మంది బీఆర్ఎస్ …

Read More »

పూనకం తగ్గించుకో పవన్: సజ్జల

విశాఖలో వారాహి విజయ యాత్ర సందర్భంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. జగన్ ను గద్దె దించే వరకు నిద్రపోనని, ఇకపై జగన్ పులివెందులకు పారిపోవాల్సిందేనని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు వైసిపి నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ రాష్ట్ర …

Read More »

మంత్రి కాదు.. జగనే సమాధానమివ్వాలి: పవన్

ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలోని రుషికొండపై కూడా వైసీపీ నేతల కన్ను పడిందని పవన్ మండిపడ్డారు. ఇక విస్సన్నపేటలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరిట 600 ఎకరాల భూమి ఉందని పవన్ ఆరోపించారు. దీంతో, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖలో విలేకరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ భూమి తనదని నిరూపిస్తే ఒక్కో విలేఖరికి …

Read More »

రుషికొండ పై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ. అలాగే పర్యాటకం …

Read More »

పవన్ కు ఆరోగ్య శ్రీ పథకం

విశాఖ గాజువాక లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే జగన్‌ పై ఎంత కడుపు మంటో అర్థం అవుతుందంటూ పేర్కొన్నారు. తన కంటే చిన్నవాడు రాజకీయాల పరంగా, ప్రజల్లో అభిమానం పెరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారంటూ చురకలు అంటించారు. ప్రజల్లో ఉన్న ఒక నాయకుడు భూమి పేలిపోవాలి.. అందులోకి …

Read More »

గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ!

ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. గన్నవరంలో నిర్వహించిన అనుచరులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎంని గన్నవరం సీటు ఇవ్వాలని కోరతానని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల నుంచి జగన్‌ …

Read More »

అధికారి క‌రుణించినా.. ఎమ్మెల్యే ద‌య ఉంటేనే!

బీసీ బంధు.. తెలంగాణ‌లో ఎంబీసీలతో పాటు 14 బీసీ కుల‌వృత్తుల కుటుంబాల‌కు రూ.ల‌క్ష ఆర్థిక సాయం అందిస్తామ‌ని సీఎం కేసీఆర్ ఘ‌నంగా ప్ర‌క‌టించిన ప‌థ‌కం. రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల వేళ కేసీఆర్ ఈ ప్ర‌క‌టన చేశారు. ప్ర‌క‌టన అయితే ఘ‌నంగానే చేశారు.. కానీ అమలు మాత్రం స‌వ్యంగా లేద‌నేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్‌. అర్హుల‌ను అధికారులు గుర్తించినా.. ఎమ్మెల్యేల ఒత్తిడి కార‌ణంగా నిధులు పంపిణీ చేయ‌లేక‌పోతున్నార‌ని స‌మాచారం. బీసీ బంధు …

Read More »

పెరిగిపోతున్న నంద్యాల పోరు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసేందుకు తెలుగుదేశంపార్టీలో పోటీ పెరిగిపోతోంది. మొత్తం నలుగురు నేతలు టికెట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి ఎవరనే విషయాన్ని అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించటం ఆలస్యమయ్యే కొద్దీ నేతల మధ్య పోరు ఎక్కువైపోతోంది. ప్రస్తుత ఇన్చార్జి భూమా బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో తానే అభ్యర్ధిని అని చెప్పుకుంటు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంఎల్ఏ భూమానాగిరెడ్డి వారుసుడిగా పోటీచేయబోయేది తానే …

Read More »

పవన్ ఎంత మంది మీద పోటీ చేయాలి?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగిపోతోందా ? అంటే అవుననే చెప్పాలి. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పవన్ తనపై పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. మరి పవన్ చాలెంజును స్వీకరిస్తారో లేదో తెలీదు. ఇప్పటికే తమపైన పోటీచేయాలని పవన్ కు భీమవరం సిట్టింగ్ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్, కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి …

Read More »

తన అసలు బలంపై టార్గెట్ చేసిన కాంగ్రెస్

ఒకపుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీలకు వేదిక. ఈ రెండు సామాజిక వర్గాలు ఆరు నూరైనా నూరు ఆరైనా కాంగ్రెస్ పార్టీని వదిలి ఇతరులవైపు వేళ్ళేవి కావు. అలాంటిది ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, బలం పుంజుకోవటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడింది. ఇపుడు కాంగ్రెస్ కు పలానా ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉందని చెప్పుకునేందుకు లేకుండా పోయింది. పార్టీ ఓటు బ్యాంకులను ప్రాంతీయ పార్టీలు కొల్లగొట్టేశాయి. …

Read More »

అయోమయంలో ‘గడ్డం’ భవిష్యత్  

మాజీ ఎంపీ గడ్డం వివేక్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్లుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కంఫర్టబుల్ గానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేనట్లుంది. అందుకనే పార్టీ మారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏ పార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఇదే సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు కూడా వీలైనంత దూరంగా ఉంటున్నట్లు టాక్. ఇపుడు వివేక్ సమస్య …

Read More »

గాజువాకలోనే పోటీచేస్తారా?

వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గాజువాకలో పవన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎగిరేది జనసేన జెండానే అని అన్నారు.  ప్రజాధరణ చూస్తుంటే పోయిన ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లుగా భావించటం లేదన్నారు. గాజువాక తన నియోజకవర్గం అని ప్రకటించారు. సరే తర్వాత చాలా విషయాలే మాట్లాడారు. గాజువాక సభలో పవన్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో …

Read More »