Political News

విశాఖ‌ప‌ట్నం-న‌ర‌సాపురం-క‌డ‌ప‌..వెరీ ఇంట్ర‌స్టింగ్‌ స్టోరీ

అదేంటి? ఏపీలో ఎన్నో న‌గ‌రాలు, నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఈ మూడు ప్రాంతాల‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అంత స్పెషాలిటీ? ఏంటా ఇంట్ర‌స్టింగ్ అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జ‌మే. మ‌రో ఆరేడు మాసాల్లో జ‌ర‌గ‌బోయే ఏపీ ఎన్నికల నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల‌కు కీల‌కంగా మారాయి. ఈ మూడు చోట్ల విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ్యూహాల‌పై వ్యూహాలు ప‌న్నింది. ప్ర‌స్తుతం ఈ …

Read More »

మ‌ళ్లీ సైలెంట్‌: జ‌న‌సేన‌లో ఊపేది బ్రో?!

అన్న అడుగేస్తే మాస్‌… అన్న స్టెప్పేస్తే మాస్‌.. అన్న మాట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాగానే న‌ప్పుతుంది. త‌ర‌చుగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించిన స‌భ‌లు, స‌మావేశాల్లో ఏం మాట్లాడినా… నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈల‌లతో గోల పుట్టించి.. మాట్లాడే నాయ‌కుడికి కూడా గగ్గోలు పుట్టించేసి ఇంక ఆపండి చాలు! అనే రేంజ్‌లో హ‌డావుడి చేశారు. ఊపు తెచ్చారు. ప‌వ‌న్ సీఎం-ప‌వ‌నే సీఎం.. అంటూ ఊర‌మాసు …

Read More »

బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నారా ?

తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏ నిముషంలో అయినా పార్టీలో కీలక బాధ్యతలు పోషించటానికి వీలుగా బ్రాహ్మణి అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపై బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. యువగళం పాదయాత్రను ఈరోజు నుండి పునఃప్రారంభించాలని లోకేష్ అనుకున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. పాదయాత్ర …

Read More »

షెడ్యూల్ ముందు కేసీఆర్ కొత్త పథకం ?

రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించడం ఎలాగ అన్నది మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముందున్న సవాల్. అధికారం అందుకోవడం కోసం వీలైనన్ని పథకాలు, హామీలు, డిక్లరేషన్లను పార్టీల అధినేతలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పోల్చితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేమిటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమల్లోకి తెచ్చేసే సౌలభ్యం ఉంది. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే …

Read More »

కాంగ్రెస్ లో ‘మైనంపల్లి’ లొల్లి

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అలా చేరారో లేదో ఇలా లొల్లి మొదలైపోయింది. మైనంపల్లి కేంద్రంగా సీనియర్లు అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. దేనికంటే తమకు కూడా డబుల్ టికెట్లు ఇవ్వాల్సిందే అని. రాబోయే ఎన్నికల్లో తెలంగాణా మొత్తం మీద ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ …

Read More »

లోకేష్ తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పోలీసుల సాయంతో ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. కానీ, వాటన్నిటిని అధిగమించి కదం తొక్కుతూ ముందుకు సాగిన లోకేష్ 200 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు తర్వాత పాదయాత్రకు లోకేష్ హఠాత్తుగా విరామం ప్రకటించాల్సి వచ్చింది. …

Read More »

కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోట్లు ప‌లుకుతోందా? అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ‌

కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల స‌మ‌యంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీల‌క‌మైన కూక‌ట్‌ప‌ల్లి టికెట్ కోట్ల రూపాయ‌లు ప‌లుకుతున్న‌ట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చ‌ర్చ సాగుతోంది. కూక‌ట్‌ప‌ల్లి టికెట్‌ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయ‌లు పార్టీల‌కు ఫండ్‌గా ఇచ్చేందుకు కూడా కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌త 2018 …

Read More »

ఆ గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ రిక్వెస్ట్

తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ భయపడుతోంది. బీఆర్ఎస్ కు భయమేంటీ? అనుకుంటున్నారా? అవును.. వరుసగా మూడో సారి గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీని కొన్ని గుర్తులు భయపెడుతున్నాయి. ఆ గుర్తులు బీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండటమే ఇందుకు కారణం. అలాంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు ఇతరులకు వెళ్తున్నాయని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. అందుకే కారును పోలిన గుర్తులను తొలగించాలని …

Read More »

సెటిల‌ర్ల ఓట్లు ఈ సారి అక్క‌ర్లేదా? : బీఆర్ఎస్‌లో గుస‌గుస‌

పైకి ఎంత గంభీర వ‌చ‌నాలు చెప్పినా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి సెటిల‌ర్ల ఓట్లు.. తెలంగాణ పాల‌క ప‌క్షానికి కానీ, ప్ర‌తిప‌క్షాల‌కు కానీ అత్యంత కీల‌కం. ఎల్బీన‌గ‌ర్ నుంచి ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి స‌హా సుమారు 12 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో సెటిల‌ర్ల ఓట్లు నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను సెటిల్ చేస్తున్నాయి. ఈ విష‌యం తెలిసే.. అధికార బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ స‌హా వామ‌ప‌క్షాల వ‌ర‌కు సెటిల‌ర్ల‌పై ప‌న్నెత్తు మాట అనేందుకు సాహ‌సం చేసే …

Read More »

కేసీయార్ లో టెన్షన్ పెరుగుతోందా ?

రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేలు నియోజకవర్గాల్లో కేసీయార్ పోటీచేయబోతున్నారు. అయితే ఇంతకాలం గజ్వేలులో గెలిచినంత తేలికకాదు రేపటి ఎన్నికల్లో కామారెడ్డిలో గెలవటం. దానికి కారణాలు ఏమిటంటే రెండున్నాయి. ఇప్పటికే కేసీయార్ ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకతకు రెండు కారణాలు అదనంగా యాడ్ అవబోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కామారెడ్డి నియోజకవర్గంలో గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం అనేది ఒకటుంది. గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ఒకపుడు కేసీయార్ చాలా మాటలు …

Read More »

బీజేపీ ఫెయిలైందా ?

తెలంగాణాలో పరిస్ధితులను అడ్వాంటేజ్ తీసుకుని బలపడటంలో బీజేపీ ఫెయిలైందని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టారు. మీడియాతో కొండా మాట్లాడుతు పార్టీని బలోపేతం చేయటం కోసమే సీనియర్లంతా తరచూ సమావేశమై మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. కొంతకాలంగా పార్టీలోని ఓ పదిమంది సీనియర్లు తరచు కలుస్తున్నారు. ఇందులో మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలున్నారు. వీళ్ళంతా వ్యక్తిగతంగా తీసుకుంటే బాగా బలవంతులనే చెప్పాలి. తమ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలే. …

Read More »

రేవంత్‌రెడ్డి చుట్టూ సీనియ‌ర్ల చిక్కుముళ్లు.. !

నిజ‌మే. ఇప్ప‌డు తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌రోసారి పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి వ్య‌వ‌హారంపై సీనియ‌ర్ల నుంచి ఆగ్ర‌హ జ్వాల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఆయ‌న‌ను ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న వీ. హ‌నుమంత‌రావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య, దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు వంటి చాలా మంది పేరున్న నాయ‌కులు రేవంత్‌పై అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న ఆదిప‌త్యం పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. సాధార‌ణంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది అధిష్టానం …

Read More »