Political News

పంక్చ‌ర్లు ప‌డుతున్నా.. ప‌ట్టించుకోరా? టీడీపీలో గుస‌గుస‌

ఔను! టీడీపీ సైకిల్‌కు పంక్చ‌ర్లు ప‌డుతున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో చాలా మంది నాయ‌కులు జంప్ చేశారు. ఆ త‌ర్వాత‌.. మ‌రికొంద‌రు వెళ్లాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు ఏదో చేస్తారు.. వేచి చూద్దాం.. అనే ధోర‌ణిని అవలంబించారు. కానీ, రెండేళ్లు గ‌డిచినా.. అసంతృప్త నేత‌ల‌ను చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో ప‌లువ‌రు నేత‌లు.. ఆయ‌న‌కు విన్న‌పాలు చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో మ‌ళ్లీ …

Read More »

బొత్స‌కు వ్య‌తిరేకంగా ‘కూట‌మి’ వైసీపీలో ఏం జ‌రుగుతోంది ?

రాజ‌కీయ సీనియ‌ర్ నేత‌, సుదీర్ఘ పాల‌నానుభ‌వం ఉన్న నాయ‌కుడు, రాష్ట్రం మొత్తానికి ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ప్ర‌స్తుత మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డ్డార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ చేయాల‌ని.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని కూడా ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కుస్ప‌ష్టం …

Read More »

అశోక్ గ‌జ‌ప‌తిపై సాయిరెడ్డి మ‌రో ఎత్తుగ‌డ‌.. ఏకంగా ప్ర‌ధానికి లేఖ‌

మాన్సాస్ స‌హా.. సింహాచ‌లం ట్ర‌స్టు బోర్డుల విష‌యంలో టార్గెట్ చేసిన విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి మ‌రో బండ ప‌డేశారు. అదికూడా 2017లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధానికి లేఖ‌రాయడం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో జ‌రిగిన‌ హిరాఖుడ్ రైలు ప్రమాదం.. విచారణ విషయమై ప్రధాని మోడీకీ ..ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. “విచారణను తప్పుదారి పట్టించిన కేంద్ర మాజీ …

Read More »

‘హుజురాబాద్ లో వెయ్యిమంది పోటీ’..!

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఎన్నికలను ఉద్దేశించి..బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ డిమాండ్స్ పూర్తి చేయకుంటే.. హుజురాబాద్ లో వెయ్యి మంది అభ్యర్థులను పోటీకి దింపుతానని హెచ్చరించారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్ల …

Read More »

కేసీఆర్‌పై అన్ని వైపులా

2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయి స్వ‌రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి ఇక్క‌డ తిరుగులేకుండా పోయింది. రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన పార్టీగా తెలంగాణను తెచ్చిన పార్టీగా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన టీఆర్ఎస్‌ను జ‌నాలు ఆద‌రిస్తూనే వ‌స్తున్నారు. అందుకే వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో కేసీఆర్‌కు ఎదురు లేకుండా పోయింది. కానీ రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న …

Read More »

కరోనాతో ఆస్పత్రిలో భర్త.. వీర్యం కావాలంటూ భార్య..!

కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన …

Read More »

ఈటలకు థ్యాంక్స్ చెప్పాల్సిందేనా ?

తెలంగాణా ప్రభుత్వం హఠాత్తుగా దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కేసీయార్ ముఖ్యమంత్రయిన దగ్గర నుండి అమల్లోకి రాకుండా ఊరిస్తున్న ఈ పథకాన్ని ఒక్కసారిగా ప్రభుత్వం ఎందుకని అమల్లోకి తెచ్చేస్తోంది ? ఇక్కడ చాలామంది ఈటల రాజేందర్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమల్లవాల్సిన దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీయార్ అమల్లోకి తేవాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఏడు సంవత్సరాల క్రిందటి పథకం కనీసం …

Read More »

పీకే ఇక్కడ సక్సెస్ అవుతాడా ?

ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ (పీకే) తొందరలోనే కాంగ్రెస్ నేతగా పరిచయం కాబోతున్నారా ? కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పీకే తొందరలోనే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలను చేపట్టబోతున్నట్లు జాతీయస్ధాయిలో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిదే. సరే అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ నేతగా పీకే సక్సెస్ అవుతారా ? అనే చర్చ ఇపుడు పెరిగిపోతోంది. విషయం …

Read More »

పార్టీలకు సుప్రింకోర్టు షాక్ ?

రాజకీయ పార్టీలకు సుప్రింకోర్టు షాక్ తప్పేట్లు లేదు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధుల నేరచరిత్రను వెల్లడించని పార్టీలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో సుప్రింకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దీనిపై తీర్పును రిజర్వులో ఉంచింది. రిజర్వులో ఉంచిన తీర్పులో ఏముందో తెలీక పార్టీల్లో టెన్షన్ మొదలైపోయింది. ఎన్నికల కమీషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన లాయర్ తో పాటు రాజకీయపార్టీల తరుపున మరికొందరు సీనియర్ లాయర్లు కూడా తమ వాదనలు …

Read More »

పార్ల‌మెంటులో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఆధిప‌త్య పోరేనా?

పార్ల‌మెంటు వేదిక‌గా.. ఏపీ అధికార, విప‌క్ష పార్టీలు చేస్తున్న రాజ‌కీయం.. విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. వంటి అనేక అంశాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సిందే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి రెండో మాట లేదు. రాష్ట్రం విడిపోయి.. 8 ఏళ్లు అవుతున్నా.. కేంద్రం ఇప్ప‌టికీ విభ‌జ‌న చ‌ట్టంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు దృష్టి పెట్ట‌లేదు. పైగా.. అస‌లు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో ఆయా …

Read More »

‘పెగాస‌స్‌’ వెనుక మోడీ చ‌తురంగ వ్యూహమేనా?

పెగాస‌స్‌.. ప్ర‌స్తుతం పార్ల‌మెంటును కుదిపేస్తున్న స్పైవేర్‌. కేంద్రంలోని మంత్రులు, ప‌లువురు జ‌ర్న‌లిస్టులు, సామాజిక ఉద్య‌మ కారులు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల ఫోన్ల‌ను హ్యాక్ చేసి.. స‌మాచారం.. రాబ‌ట్టార‌నేది పెగాస‌స్ పై వ‌స్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ. ఇజ్రాయెల్ కు చెందిన సాంకేతిక సంస్థ పెగాస‌స్‌పై వివాదం ఇప్ప‌టిది కాదు. 2019లోనే వెలుగు చూసింది. అప్ప‌ట్లోనే ఇది వివాదంగా మారి.. పార్ల‌మెంటును కుదిపేసింది. వారాల త‌ర‌బ‌డి.. పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాలు దీనిపై పెద్ద ఎత్తున …

Read More »

సింగరేణి కార్మికులపై వరాల జల్లు.. కారణం ఇదేనా?

సింగరేణి కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్.. వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇంత సడెన్ గా.. సీఎం వాళ్లపై వరాల జల్లు కురిపించడానికి కారణం త్వరలో రానున్న ఎన్నికలేనా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణ‌తో పాటు ద‌క్షిణ భార‌త దేశానికి వెలుగులు నింపుతున్న సింగ‌రేణిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఎంతో కాలంగా వాయిదా ప‌డ్డ సింగ‌రేణి ఎన్నిక‌లు త్వరలో జరగనుండటంతో.. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. గ‌తంలో కేసీఆర్ …

Read More »