కీలకమైన విశాఖపట్నాన్ని పాలనా రాజధానిని చేస్తామంటూ వైసీపీ ప్రకటించడం.. దరిమిలా అమరావతి ని సమర్థిస్తున్న వారు దీనిపై న్యాయ పోరాటాలకు దిగడం తెలిసిందే. అయినప్పటికీ.. మూడు ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా సీఎం జగన్.. విశాఖనే రాజధానిగా చేస్తానని ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే, దీనికి న్యాయ పరమైన చిక్కులు పొంచి ఉన్న నేపథ్యంలో ముందు తాను వెళ్లి.. తర్వాత మిగిలిన పనులు చక్కబెట్టే యోచనతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీసులను, మంత్రుల …
Read More »జగన్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారా ?
మొదటిజాబితాలో 11 మంది ఎంఎల్ఏలు, మంత్రులకు స్ధానచలనం కలిగించిన జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారట. రెండో జాబితాలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిసి 45 మంది దాకా ఉంటారని పార్టీవర్గాల సమాచారం. రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి కొత్త నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. మరి కొత్త నియోజకవర్గాల నుండే …
Read More »రేవంత్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా ?
కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ? తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలేనా ? ఎంతమాత్రం కాదని చెప్పాలి. పార్లమెంటు ఎన్నికలకన్నా ముందే జరగబోతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపుని రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. వేలాదిమంది పనిచేస్తున్న సింగరేణి సంస్ధ ఎన్నికల్లో గెలవటాన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. మొదటినుండి సింగరేణి ఎన్నికల్లో వామపక్షాలదే పైచేయిగా ఉండేది. అయితే తర్వాత కాంగ్రెస్ …
Read More »బీఆర్ఎస్ తో కటీఫ్ అయిపోయిందా ?
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో ఎంఐఎం పార్టీ కటీఫ్ చెప్పేసినట్లేనా. తాజా పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం విషయంలో ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోటెం స్పీకర్ గా నియమించింది. ఈ నియామకమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉండటమే. పార్టీలోనే సీనియర్ ఎంఎల్ఏని కాదని అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయటం …
Read More »ముగిసిన ‘వసుంధర’ శకం.. రాచరికానికి స్వస్తి!
వసుంధర రాజే. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు రాజస్థాన్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆమె తనదైన ముద్ర వేశారు. అంతేకాదు.. బీజేపీని నడుం కట్టుకుని ముందుకు నడిపించిన చరిత్ర కూడా సృష్టించారు. గతంలో 2013-2018 మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనూ.. ఆమె తనదైన పాలనతో ముద్ర వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక, ఆమె శకం ముగిసింది. ప్రస్తుతం వసుంధరరాజే వయసు 70 సంవత్సరాలు. …
Read More »జనసేన, టీడీపీ నుంచి సిగ్నల్ వస్తే చాలు జంపింగ్కు రెడీ…!
వైసీపీలో పరిణామాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవరిని పార్టీ అధిష్టానం పక్కన పెడుతుందో తెలియని పరిస్థితి. ఎవరిని తోసిపుచ్చి.. కొత్తవారికి పగ్గాలు అప్పగిస్తుందో తెలియని వైనం. దీంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసుకున్న ఇంచార్జుల మార్పు నిర్ణయం.. పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు రాజీనామాలు చేసే వారు చేస్తున్న సమయంలో వారిని బుజ్జగించడమో.. లాలించడమో.. వారి డిమండ్లను పరిష్కరించే …
Read More »ఈ సీట్లో టీడీపీ జెండా ఎగురుతుందా ?
ఇపుడిదే చర్చ పార్టీలో బాగా పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే కడప పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబునాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అది సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే పార్టీ పెట్టినదగ్గర నుండి టీడీపీ 1984లో తప్ప ఇంకే ఎన్నికలోను గెలవలేదు. మొదట్లో కమ్యూనిస్టు అభ్యర్ధి వై ఈశ్వరరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో …
Read More »టార్గెట్ ఏపీ.. కాంగ్రెస్ అగ్రనేతల మాస్టర్ ప్లాన్
తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న కలలను సాకారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సుదీర్ఘ విరామం తర్వాత.. సక్సెస్ అయింది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక, వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రధాన సమస్యలను ఆలంబనగా చేసుకుని ఏపీలో చక్రం తిప్పేందుకు.. కాంగ్రెస్ అగ్రనాయకులు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. …
Read More »పవర్ పాయింటుకు రెడీ అవుతున్నారా ?
పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అప్పులపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి రేవంత్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షలు చేస్తున్నారు. ఇందులో కూడా రెవిన్యు, ఫైనాన్స్ శాఖల ప్రభావం ఎక్కువగా ఉన్న శాఖలపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ, ధరణి పోర్టల్ ను నిర్వహించే ఆర్ధికశాఖ, పరిశ్రమల్లాంటివి కీలకంగా ఉన్నాయి. ఈ …
Read More »షర్మిల విషయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం?
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ తనయ షర్మిల పాదాలతో నడిచే పాదయాత్ర చేసినా.. పార్టీని పుంజుకునేలా చేయడంలో ఒకింత వెనుకబడ్డారనే వాదన ఉంది. ఈ క్రమంలో ఉభయకుశలోపరిగా.. ఆమె తన వ్యూహానికి పదును పెట్టి.. ఎన్నికల వేళ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. తాను కూడా బరిలో నిలిస్తే.. కేసీఆర్ మళ్లీ విజయం దక్కించుకుంటారని.. అందుకే.. తాను పోటీ నుంచి …
Read More »బీసీ బంధుకు బ్రేక్
గత ప్రభుత్వంలో ఎంతో వివాదాస్పదమైన పథకాల్లో ఒకటైన బీసీ బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. పథకం అమలులో వచ్చిన అనేక ఆరోపణలపై సమీక్షలు జరిపేందుకే పథకాన్ని తాత్కాలికంగా నిలిపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పథకం అమలులో వచ్చిన ఆరోపణలను సమీక్షించి, ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. సమీక్షల సందర్భంగా ఆరోపణలను, ఫీడ్ బ్యాక్ ను చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నీ కోణాల్లో …
Read More »బస్సు దెబ్బ మెట్రో మీద పడిందా ?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రభావం మెట్రో ట్రైన్ మీద బాగానే పడినట్లుంది. రోజువారి ప్రయాణించే వారి సంఖ్య బాగానే తగ్గిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నివేల బస్సులున్నా రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఎన్ని బస్సులున్నా ప్రయాణీకులకు సరిపోవటంలేదు. అందుకనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాగా ఆలోచించి మెట్రో రైలు ప్రాజెక్టును ఓకే చేశారు. అయితే ప్రాజెక్టుకు డీపీఆర్ తయారై తొందరలోనే ప్రాజెక్టు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates