మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత సొంత పార్టీ పెట్టిన జగన్కు మొదటి నుంచి ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అండగా నిలిచారు. అన్ని విధాలుగా జగన్కు మద్దతుగా నిలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఆయన విజయం సాధించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయన.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. దీంతో …
Read More »షర్మిలది ముందుచూపా? భయమా?
రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిలకు ఆరంభం నుంచి ఆటుపోట్లు తప్పట్లేదు. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ పెడితే వైఎస్కు విధేయులుగా కొనసాగిన నేతలు అభిమానులుగా ఉన్న కార్యకర్తలు తన పార్టీలోకి పెద్ద సంఖ్యలో వస్తారని ఆశించిన ఆమె ఆశలు తీరలేదు. పార్టీలోకి ఎలాంటి వలసలు చేరికలు లేవు. కీలక నేతలు …
Read More »అమ్మకానికి రైలు బోగీలు…అద్దెకైనా పర్వాలేదట
నరేంద్ర మోడీ సర్కార్ ప్రైవేటీకరణలో చాలా స్పీడు పెంచుతోంది. ఇందులో భాగంగానే రైళ్లతో పాటు రైళ్ళ బోగీలను అమ్మకానికి, లీజుకు, అద్దెకు కూడా ఇచ్చేయాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పర్యాటక శాఖ, సినిమా రంగాల్లో బాగా అభివృద్ధి జరగటానికి అవకాశాలున్నట్లు కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. రైళ్ళను, బోగీలను అద్దెకు ఇవ్వటం వల్ల సాంస్కృతిక, పర్యాటక, సినిమాతో పాటు మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో స్పీడ్ పెరుగుతుందని కేంద్ర రైల్వే …
Read More »బొత్స కుర్చీకి ఢోకా లేదా?
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీలో జోరుగా సాగుతోన్న చర్చ ఒకటే.. అదే కొత్తగా ఏర్పాటు చేసే మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎవరిపై వేటు పడుతుంది? కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది? అని. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని 2019 లో అధికారం చేపట్టినపుడే సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడా సమయం దగ్గర పడుతుండడంతో ఆ పార్టీ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మంత్రులుగా ఉన్న వాళ్లు తమ పదవి ఉంటుందో లేదా …
Read More »పలమనేరు వైసీపీలో గడబిడ.. ఎందుకు?
చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం పలమనేరు. కాంగ్రెస్కు కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం.. వైసీపీ వైపు మళ్లింది. దీంతో ఇక్కడ వైసీపీ వరుస విజయాలు సాధించింది. 2014లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్ అమర్నాథ్రెడ్డి.. వైసీపీలో వచ్చి.. ఇక్కడ నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. ఇక్కడ అమర్నాథ్రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. తర్వాత జరిగిన పరిణామాల …
Read More »నిజమేనా? కేసీఆర్ అలా చేశారా? బండి కామెంట్ల సంచలనం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. వాస్తవానికి అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంజయ్.. ప్రస్తుతం ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. సాధారణ పొలిటికల్ విమర్శలకు భిన్నంగా తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు.. నిజంగానే కేసీఆర్ అలా చేశారా? …
Read More »ప్రజా వ్యతిరేకత అర్ధమవుతోందా ?
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు జనాల్లో వ్యతిరేకత అర్ధమవుతోందా? అన్న అనుమానం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే గుజరాత్ సీఎంగా ఉన్న విజయ్ రుపానీ రాజీనామా చేసేయడమే. రూపానితో పాటు యావత్ మంత్రివర్గం తో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించేసింది. ఇక్కడ అధిష్టానం అంటే కేవలం నరేంద్ర మోదీ మాత్రమే అని అందరు అర్థం చేసుకోవాలి. గడచిన ఐదేళ్ళుగా సీఎంగా ఉన్న రూపానీతో ఇంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా …
Read More »జన సమీకరణపై దృష్టి.. బలం చాటాలిగా!
సభలు.. సమావేశాలు.. ర్యాలీలు.. పాదయాత్ర.. ఇలా తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయం రసవత్తరంగా మారింది. అధికారంలో ఉన్న కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలను గెలిపించుకోవడమే వ్యూహంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సాగుతున్నాయి. అందుకే కేసీఆర్ను అన్ని వైపులా నుంచి టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతుండగా.. తెలంగాణ ప్రదేశ్ …
Read More »ఇంత చేస్తున్నా.. కేంద్రంపై సాయిరెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారే!
ఏపీకి సంబంధించిన అనేక సమస్యలపై కేంద్రంతో పోరాడాల్సిన అధికార పార్టీ వైసీపీ నాయకులు.. ఇంకా బతిమాలుతూనే ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కేంద్రం ఇప్పటి వరకు ఏపీకి సంబంధించిన ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా.. కొత్త సమస్యలు సృష్టిస్తోంది. వీటిపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. మరోవైపు.. ఇంకా బతిమలాడడంతోనే సరిపెడుతోంది. తాజాగా వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కేంద్రాన్ని బతిమలాడే ధోరణిని ప్రదర్శించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్ …
Read More »ఏపికి ప్రత్యేక హోదా ఆశలపై బండ పడిందా ?
ఇప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు దాదాపు లేవని అర్ధమైపోతోంది. భవిష్యత్తులో రాజకీయ పరిణామాల కారణంగా ఏపీ కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే అప్పుడు కానీ మనకు ప్రత్యేకహోదా రాదని జనాలు కూడా ఫిక్సయిపోయారు. అంటే విభజన చట్టం ద్వారా కచ్చితంగా అమలవ్వాల్సిన ప్రత్యేక హోదా కాస్త రాజకీయ డిమాండ్ గా మారిపోయింది. పైగా నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక …
Read More »6 నెలలు మాత్రమే రక్షణట
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతోంది, మళ్ళీ మళ్ళీ పెరుగుతోంది. ఈ దశలో కరోనా వైరస్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి రెండు డోసుల కోవిడ్ టీకాలు వేసుకోవటం ఒకటే మార్గమని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. రెండు టీకాలు తీసుకున్నవారు కూడా హమ్మయ్య మనకేం ప్రమాదం లేదని ప్రశాంతంగా ఉన్నారు. అయితే తాజాగా వెల్లడైన అధ్యయనం ప్రకారం రెండు డోసులు తీసుకున్నంత మాత్రాన వైరస్ …
Read More »టీడీపీ ఓటమి ఖాయం..జేసీ సంచలనం
తెలుగుదేశంపార్టీలో జేసీ బ్రదర్స్ ఏమి మాట్లాడినా సంచలనమే. అసలు ఏమీ మాట్లాడకపోయినా సంచలనమే అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. రాయలసీమలోని నీటి ప్రాజెక్టుల స్ధితిగతులపై చర్చించేందుకు అనంతపురంలోకి కమ్మభవన్ లో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమన్నారు. పార్టీలోని …
Read More »