సాయిరెడ్డికి సెగ: న‌డిరోడ్డు పై వైసీపీ నేత‌ల నిర‌స‌న‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డికి వైసీపీ నేత‌ల నుంచి భారీ సెగ త‌గిలింది. ప్ర‌స్తుతం పార్టీలో టికెట్ల ర‌గ‌డ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో టికెట్ ద‌క్క‌ద‌ని భావిస్తున్న‌వారు త‌మ అనుచ‌రుల‌తో నిర‌స‌న‌ల‌కు దిగుతున్నా రు. అయితే.. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయింది. దీంతో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న‌వారి విష‌యాన్ని స‌ర్దుబాటు చేసేందుకు పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య అనుచ‌రులు మినీ బైపాస్‌మీదే సాయిరెడ్డిని అడ్డ‌గించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి గూడూరు మీదుగా నెల్లూరు వెళ్తున్న వైసీపీ రీజినల్(నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలు) కో-ఆర్డీనేటర్ విజయ్ సాయి రెడ్డిని గూడూరు మినీ బైపాస్‌లో ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య స‌హా ఆయ‌న అనుచ‌రులు కలిశారు. కలివేటి సంజీవయ్యకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆయ‌న పేద‌ల ప‌క్ష‌పాతి అని.. ఆయ‌న‌ను త‌ప్పిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా య‌ని.. ఏది నిజ‌మో చెప్పాల‌ని నిల‌దీశారు. ఈ హ‌ఠాత్ప‌రిణామంతో సాయిరెడ్డి ఖిన్నుడై.. ప‌రిశీల‌న చేస్తున్న‌ట్టు చెప్పారు. అంతా సీఎం జ‌గ‌న్ అభీష్టం మేరకే జ‌రుగుతుంద‌ని తేల్చి చెప్పారు.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో కలివేటి సంజీవయ్య వ్య‌తిరేక వ‌ర్గం కూడా సాయిరెడ్డిని చుట్టుముట్టింది. సంజీవ‌య్య‌కు టికెట్ ఇవ్వొద్దని నినాదాలు చేసింది. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. పార్టీ నుంచి వెళ్లిపోతామ‌ని వ్యాఖ్యానించ‌డంతో కాసేపు గందరగోళం నెలకొంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో విభేదాలు వాస్తవమే, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం మంచిది కాదని, అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిదే నిర్ణయమని వారికి విజయ్ సాయిరెడ్డి స్పష్టం చేశారు. అయినా.. నిర‌స‌న‌లు కొన‌సాగుతుండ‌డంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వ‌ర్గాల‌ను శాంతింప జేశారు.