ఏపీ బీజేపీ నాయకుడు.. విష్ణు వర్ధన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరి పల్లకీనీ మోయబోమని.. తాము ఎందుకు మోయాలని.. ఆయన ప్రశ్నించారు. అంతే కాదు.. తాము బలంగా ఉన్నామని భావిస్తున్నందునే తమ వెంట పొత్తు పెట్టుకునేందుకు తిరుగుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు తమకే కావాలని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పైకి ఆయన సొంతమని.. వాటితో …
Read More »జగన్కు నాగబాబు ‘గ్లాసు’ కౌంటర్..
వైసీపీ అధినేత, సీఎం జగన్కు జనసేన ప్రధాన కార్యదర్శి ఫైర్ బ్రాండ్ నాగబాబు భారీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం అనంతపురంజిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే నాగబాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరోసారి ప్రారంభమైంది. ఏం జరిగింది..? రాప్తాడు సిద్ధం జభలో …
Read More »లోక్సభ ఎన్నికల్లో కమల్ పోటీ?
తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నది సినిమా వాళ్లే. ఐతే జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు కాలం చేశాక తమిళనాట ఒక రాజకీయ శూన్యత నెలకొనగా దాన్ని భర్తీ చేయడానికి లోకనాయకుడు కమల్ హాసన్ భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. ఎన్నో ఆదర్శాలతో ఆయన మొదలుపెట్టిన మక్కల్ నీది మయం పార్టీ తొలిసారి గత పార్లమెంట్ …
Read More »అడ్డగోలు సంతకాలు పెట్టేది లేదు.. తేల్చేసిన సీఎం రేవంత్
రేవంత్ సర్కారు ఏర్పడి రోజులు గడుస్తున్నా.. కొన్ని అంశాల్లో దూకుడు ప్రదర్శించటం లేదన్న మాట తరచూ వినిపిస్తోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉందన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా మరో ప్రచారం మొదలైంది. రియల్ ఎస్టేట్ కు ఊపు తెప్పించేలా హెచ్ఎండీఏ నిర్ణయాల్ని ప్రకటించటం లేదని.. చివరకు ప్రాజెక్టుల అనుమతుల విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పించి హడావుడి …
Read More »ఈసారి మాచర్ల టీడీపీదేనా?
తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు గెలవని నియోజకవర్గాలు 42 ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. పొత్తుల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించటేయటం, ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని పోటీకి దింపటం లాంటి అనేక కారణాల వల్ల టీడీపీ జెండా ఎగరలేదనే చెప్పాలి. ఇలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల కూడా ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డే గెలుస్తున్నారు. ఇందులో రెండుసార్లు కాంగ్రెస్ …
Read More »నో చేరికలు..పెరిగిపోతున్న టెన్షన్
ఫిబ్రవరి నెలను తెలంగాణా బీజేపీ నేతలు జాయినింగ్ మంత్ అని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలు వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ మొన్నటి జనవరిలో ఊదరగొట్టేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి చాలామంది బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి చాలామంది చెప్పుకున్నారు. తీరా చూస్తే జాయినింగ్ మంత్ మొదలై 18 రోజులు …
Read More »ఆ ఒక్క మాటతో రేవంత్ అందరికీ నచ్చేశారు
ఎదుటి వారిని తొక్కేసి ఎదగడం ఒకటైపు రాజకీయం. ఎదుటి వారి మనుసు కూడా దోచుకుని ప్రజల్ని గెలుస్తూ ఎదగడం మరోటైపు రాజకీయం. రేవంత్ రెండో టైపులా కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ అందరికీ తెగ నచ్చేసింది. చివరకు టీఆర్ఎస్ వారి మనసును దోచిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు రేవంత్ రాజకీయం ఏంటో. రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కేసీఆర్ ది అందరికీ దూరంగా …
Read More »బీఆర్ఎస్ పై మరో మరక
మొత్తం తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు తేల్చిందేమిటంటే అన్నారం ప్రాజెక్టు పనికిరాదని. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసి సాగు నీటికి అందించే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా తేల్చిచెప్పేశారు. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజిలోని నాణ్యత లోపాలు, నాసిరకం నిర్మాణమనే ఆరోపణలపై ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ విషయం ఎలాగుండగానే అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలై పెరిగిపోతున్నాయి. ఒకవైపు అసెంబ్లీలో సాగునీటి …
Read More »రేవంత్ ప్రభుత్వం టార్గెట్ రీచయ్యిందా ?
తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నదానికన్నా చక్కగానే ఉపయోగించుకున్నది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగతంగా కేసీయార్, హరీష్ రావును ఇరుకునపెట్టడమే టార్గెట్ గా రేవంత్ అండ్ కో పావులు కదిపింది. ఇందుకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని అనుకున్నది. అనుకున్నట్లే సమావేశాల్లో కేసీయార్, హరీష్ పైన పదేపదే ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణం వల్ల ఎందుకు పనికిరాకుండా …
Read More »1 మిలియన్ లక్ష్యం ఛేదించిన వైసీపీ!
ఏపీ అధికార పార్టీ వైసీపీ పెట్టుకున్న కీలక లక్ష్యం నెరవేరింది. వచ్చే ఎన్నికలకు తాము సిద్ధమంటూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నికల సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి విశాఖ, ఏలూరుల్లో సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ అధినేత.. తాజాగా అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలో మూడో సిద్ధం సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ సభకు భారీ లక్ష్యాన్నే నిర్దేశించారు. ఏకంగా మూడో …
Read More »ఫ్యాన్ ఇంట్లో, సైకిల్ బయట పెట్టండి, గ్లాసు సింక్ లో వేయండి – జగన్
సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభ తాజాగా అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఓ రేంజ్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంతో పాటు.. సటైర్లతో కుమ్మేశారు. పంచ్ డైలాగులతో ప్రసంగాన్ని ఇరగదీశారు. వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కాదన్నారు సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ …
Read More »సర్వే: అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు
ఇటీవల ఇండియా టుడే సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చేపట్టగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా తొలి స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ పాపులారిటీ రేటింగ్ 52.7 శాతం. 51.3 శాతం పాపులారిటీ రేటింగ్తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 48.6 శాతం రేటింగ్ను పొందగా, గుజరాత్ ముఖ్యమంత్రి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates