Political News

జ‌గ‌న్ స‌భ‌కు మీరు రావొద్దు: మీడియాకు నోటీసులు

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు సంబంధించిన స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. సిద్ధం పేరుతో ఇప్ప‌టికే విశాఖ‌, ఏలూరు, అనంత‌పురంలో మూడు స‌భ‌లు నిర్వ‌హించారు. తాజాగా బాప‌ట్ల జిల్లాలో ఆయ‌న స‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈ ‘సిద్ధం’ సభ కవరేజీకి రావొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఎవ‌రైనా మీడియాను ర‌మ్మ‌ని కోరుకుంటారు. అంతేకాదు.. మీడియా ప్ర‌తినిధులు …

Read More »

ముద్ర‌గ‌డ‌కు ముహూర్తం కుదిరింది!

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 14న ఆయ‌న వైసీపీలోకి చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వైసీపీ బ‌లోపేతానికి తాను కృషి చేస్తాన‌ని ముద్ర‌గడ చెప్పారు. “వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లోపేతాన‌ని, జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు నేను కృషిచేస్తా. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నా” అని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లంతా జ‌గ‌న్‌వైపు ఉన్న‌ట్టే తాను భావిస్తున్నాన‌ని.. ఆయ‌న‌ను ఓడించేందుకు ఇంత …

Read More »

‘మా ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉంది’

అందరిలా మాట్లాడితే ఆయన ధర్మాన ఎందుకు అవుతారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో నిలిచే ఆయన తాజాగా అదే తరహాను మరోసారి ప్రదర్శించారు. తమ ప్రభుత్వంపై మగాళ్లు కోపంగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓవైపు తమ ప్రభుత్వంపై ఎవరికి ఎలాంటి గుర్రు లేదని.. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారని.. 175 స్థానాలకు 175 స్థానాలు ఖాయమన్న ధీమాను అధినేతతో సహా పలువురు నేతలు …

Read More »

అంతా ఆస్థాన విద్వాంసులే.. బీజేపీలో కొత్త ముఖాలేవీ?

యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని, కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తున్నామ‌ని చెప్పుకొనే బీజేపీ .. మ‌రోసారి కూడా ఆస్థాన విద్యాంసుల‌కే ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఏపీ వంటి భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహ‌త్మ‌కంగా ముందుకు సాగుతుంద‌ని ఆది నుంచి క‌మ‌ల నాథులు చెబుతు వ‌చ్చారు. కానీ, ఆ వ్యూహం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. పాత నాయ‌కులు, నిల‌య విద్యాంసుల‌కే ప‌ట్టం క‌డుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా బీజేపీ …

Read More »

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక రాజీనామా

భారత ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024కు కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి …

Read More »

సడన్ గా చిల‌క‌లూరిపేట‌కు మోడీ

బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన పొత్తులు ఖ‌రారైన నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌పై వెంట‌నే దృష్టి పెట్టారు. ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీని ఏపీకి తీసుకురావ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను పొత్తుల పార్టీవైపున‌డిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే అంచ‌నాలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోందని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీనే …

Read More »

పొత్తుల‌పై చంద్ర‌బాబు ఫ‌స్ట్ రియాక్ష‌న్‌.. ఏమ‌న్నారంటే!

బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం పొత్తులు ఖ‌రారైన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఫ‌స్ట్ టైం రియాక్ట్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని చంద్రబాబు అన్నారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ రావడం, సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరడం సంతోషంగా ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కూటమిగా ఏపీ ఎన్నికలకు వెళ్తున్నాయని చంద్రబాబు అన్నారు. వచ్చే …

Read More »

పొత్తు కుదిరితే ఫ‌స్ట్ జ‌రిగేది ఇదేనా? త‌మ్ముళ్ల మాట‌

బీజేపీతో పొత్తు దాదాపు ఒక కొలిక్కి వ‌చ్చేసింది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే త‌రువాయి. సీట్ల పంప‌కాల వ్య‌వ‌హారంపైనే చిక్కు ముడి ఏర్ప‌డ‌డంతో గ‌త మూడు రోజులుగాటీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు ఢిల్లీలో ఉండి.. పొత్తుల‌పై ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇది ఎలా ఉన్నా.. బీజేపీతో క‌నుక పొత్తు క‌న్ఫ‌ర్మ్ అయితే.. చంద్ర‌బాబు కానీ, ప‌వ‌న్ కానీ.. ఫ‌స్ట్ చేసే డిమాండ్లు ఏమిటి? అనేది ఆస‌క్తిగా మారింది. …

Read More »

పొత్తుకు సై.. బీజేపీ అధికారిక ప్ర‌క‌ట‌న‌..

ఏపీలో టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంతో క‌లిసి ముందుకు సాగేందుకు సిద్ధ‌మ‌య్యామ‌ని బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాయింట్ ప్రెస్ స్టేట్ మెంట్ రూపంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్న ప్రధాని మోడీ నేతృత్వంలో కలిసి పని చేందుకు టీడీపీ, జన‌సేన ముందుకు …

Read More »

  పవన్ రెండు చోట్ల పోటీ.. ట్విస్టేంటంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక్కడ మొత్తంలో అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయబోతున్నాడన్న విషయమే. ఐతే గత ఎన్నికల్లో కూడా జనసేనాని రెండు చోట్ల పోటీ చేశాడు. ఓడిపోయాడు. ఈసారి కూడా రెండు సీట్లలో పోటీ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. పొత్తులో సీట్ల సర్దుబాటు …

Read More »

ఆమంచి బ్రదర్స్.. ఒక్కొక్క‌రిది ఒక్కో బాధ‌!

ఉమ్మ‌డి ప్ర‌కాశంలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న ఆమంచి సోద‌రుల రాజ‌కీయం టికెట్ల చుట్టూ తిరుగుతోంది. చీరాల నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమంచి తెలిపారు. చీరాల ఇంచార్జ్ గా మాత్రమే రాజీనామా చేశానని జనసేన రాష్ట్ర కార్యదర్శిగా మాత్రం కొనసాగుతానని ప్రకటన చేశారు. ఆమంచి రాజీనామాకు కారణం అసంతృప్తి కాదని.. …

Read More »

ప్రతిక్షణం జాగ్రత పడుతున్న చంద్రబాబు

ఔను.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఏమాత్రం ఖాళీ దొరికినా వెంట‌నే అలెర్ట్ అయిపోతున్నారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ఫోన్లు చేస్తున్నారు. క‌లివిడిగా ఉండండి.. క‌లిసి ప‌నిచేయండి.. అని చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబు బీజేపీతో మిత్ర‌ప‌క్షం, టీడీపీ-జ‌న‌సేన పొత్తుల‌పై చ‌ర్చిస్తున్నారు. ఇవి ఒక‌ర‌కంగా ఇబ్బందిగా ఉన్నాయి. ఇంత బిజీలోనూ ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంట‌నే క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు పోన్లు చేస్తున్నారు. క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌ని చెబుతున్నారు. తాజాగా ఆయ‌న …

Read More »