గడచిన వారం రోజులుగా బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. దీనికి అదనంగా నరేంద్రమోడి నిజామాబాద్ పర్యటనలో కేసీయార్ టార్గెట్ చేసిన వ్యాఖ్యలతో మైండ్ గేమ్ పరాకాష్టకు చేరుకుంది. తాజాగా కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ ఏమంటారంటే తొందరలోనే బీఆర్ఎస్ లో చీలికవస్తుందట. కేసీయార్ గడచిన 15 రోజులుగా ఎక్కడా కనిపించటంలేదని, అధికారం విషయంలో కేటీయార్-హరీష్ రావు మధ్య విభేదాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయని పదేపదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి …
Read More »ఐ డోంట్ కేర్..జూ.ఎన్టీఆర్ పై బాలకృష్ణ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తారక్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్యను మీడియా ప్రతినిధులు అడిగారు. దీంతో, …
Read More »టీడీపీతో ఎందుకు కలిశామో చెప్పిన పవన్
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, హైడ్రామా మధ్య పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా తనకు పోలీసులు నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై పవన్ తీవ్రంగా స్పందించారు. తాను జనసేన కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టలేదని, తాను కేవలం ఆవేశంగా మాట్లాడానని చెప్పారు. తాను ఎప్పటికీ అలా చేసేవాడిని కాదని, కొట్టండి, తగలబెట్టండి అని చెప్పనని పవన్ అన్నారు. ఈ …
Read More »బాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదు: సుజనా చౌదరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంది…లేదంటే జగన్ అంత ధైర్యంగా చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం లేదు…ఇటువంటి వ్యాఖ్యలు గ్రామాలలోని రచ్చబండలు మొదలు తలపండిన రాజకీయ నాయకులు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు, చంద్రబాబు అరెస్టు విధానాన్ని మాత్రమే ఖండించిన ఏపీ బీజేపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై …
Read More »ఏఏజీ పొన్నవోలుపై జడ్జి అసహనం
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ రోజు వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 11 గంటలకు వాదనలు వింటామని చెప్పింది. మరోవైపు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ …
Read More »బాబు అరెస్టు బాధాకరం.. వ్యక్తిగతంగా నన్ను కలచివేస్తోంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మరో తెలంగాణ మంత్రి గొంతు ఎత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడనే ముద్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ఈ విషయంలో రియాక్టయ్యారు. చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ …
Read More »ప్రతిపక్షాల దిమ్మతిరిగే కేసీఆర్ మేనిఫెస్ట్ డిసైడయింది
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో…కీలక నిర్ణయాలతో కదనరంగంలోకి దిగేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రభుత్వపరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ గులాబీ దళపతి హోదాలో రాబోయే ఎన్నికలకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఉత్కంఠను బ్రేక్ చేసేందుకు డేట్ ఫిక్సయింది. ఈ నెల 16న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని …
Read More »పవన్ కు పోలీసుల నోటీసులు
కృష్ణాజిల్లా పెడనలో బుధవారం జరగనున్న జనసేన బహిరంగ సభలో రాళ్ల దాడి జరిగే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రెండు మూడు వేల మంది వైసీపీ గూండాలు, క్రిమినల్స్ పెడన సభలోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేసే ఛాన్స్ ఉందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. రేపు ఏం జరిగినా సీఎం జగన్, రాష్ట్ర డిజిపి, …
Read More »లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే అప్రూవర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు మాగుంట రాఘవరెడ్డికి అనుమతిచ్చింది. లిక్కర్ స్కాం లో తాను అప్రూవర్ గా మారాలని అనుకుంటున్నానని అందుకు అనుమతించాలని రాఘవ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు అందుకు అనుమతించింది. మాగుంట రాఘవ అంటే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా …
Read More »రాహుల్ లో సమూలమైన మార్పు
తిరుగులేని నేతగా ఎదగాలంటే జనాల మద్దతు ఉండాల్సిందే అని రాహుల్ గాంధీకి ఇంతకాలానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇన్ని సంవత్సరాల అంతఃపురం రాజకీయాలను వదిలేసి రోడ్లమీదకు వచ్చారు. తాజాగా రెండురోజులుగా పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో ఉంటున్నారు. స్వర్ణదేవాలయంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదానం అంటే అన్నం పెడతారని కాదు రొట్టెలే ముఖ్యం. ప్రతిరోజు దేవాలయానికి రకరకాల జనాలు వస్తుంటారు. స్వర్ణదేవాలయం అంటే పంజాబ్ ప్రజలకు అపారమైన భక్తి, విశ్వాశాలు. …
Read More »మోడీ మాటలు ఎవరైనా నమ్ముతారా ?
నిజామాబాద్ పర్యటనలో నరేంద్రమోడీ చాలా మాటలే చెప్పారు. ముఖ్యంగా కేసీయార్ ను కార్నర్ చేయటానికి కొన్ని విషయాలు ప్రస్తావించారు. అందులో తనకు కేసీయార్ కు మధ్య ఎప్పుడో జరిగిన సంభాషణలను ఇపుడు బయటపెట్టారు. ఈ సందర్భంగా కేసీయార్ గురించి మోడీ చెప్పిన మాటలు అంత నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి. మొదటిదేమో ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ అడిగితే మోడీ కుదరదు పొమ్మన్నారట. అలాగే గ్రేటర్ …
Read More »ఓటుకు నోటు కేసు..రేవంత్ రెడ్డికి సుప్రీం షాక్
తెలంగాణ రాజకీయాలలో ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా బలంగా వినిపించడం సంచలనం రేపింది. అయితే, ఆ కేసు చాలా కాలంగా కోల్డ్ స్టోరేజిలో ఉండిపోయింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తాజాగా ఆ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates