ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలు, నాయకుల దృష్టి మెగా స్టార్.. చిరంజీవి పై పడింది. ఆయనను మచ్చిక చేసుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఆయన ఎవరు వచ్చి ఏం అడిగినా ఓకే.. నేనున్నా అని చెబుతున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి, అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. హైదరాబాద్లోని నివాసంలో చిరంజీవిని కలుసుకున్నారు. ఇది మర్యాద పూర్వకం కాదని.. తర్వాత ఆయనే …
Read More »లైవ్లో దొరికిపోయిన అంబటి రాంబాబు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన అంబటి రాంబాబుకు సంబంధించి మీడియాలో ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. మహిళలతో సరస సంభాషణలకు సంబంధించిన ఆడియోలతో ఒకటికి రెండుసార్లు ఆయన పేరు మీడియాలో బాగా నానింది. ఇక రాజకీయంగా కూడా తరచుగా ఆయన వ్యాఖ్యలు, వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదం అవుతుంటాయి. మీడియా మీద కూడా ఎదురు దాడి చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఒక ప్రెస్ మీట్లో విలేకరి …
Read More »సునీత ప్రజెంటేషన్ పై స్పందించిన అవినాష్ రెడ్డి
తన తండ్రి వైఎస్ వివేకాను ఎంత దారుణంగా హత్య చేశారో వివరిస్తూ మీడియా ప్రతినిధుల ముందు వివేకా తనయురాలు సునీతా రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత వివేకా హత్య ఎంత పాశవికంగా జరిగింది అన్న విషయం బట్టబయలైంది. వివేకా హత్య గురించి సునీత మరికొన్ని ఆధారాలు బయటపెట్టడంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలోనే తాజాగా వివేకా హత్య కేసులో ఆరోపణలు …
Read More »కేసీఆర్ : క్షుద్రపూజల కలకలం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపుతున్నది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన కేసీఆర్ దురదృష్టవశాత్తు బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముకకు ఆపరేషన్ చేశారు. అనంతరం కొన్నాళ్లు హైదరాబాద్ లోని నంది నగర్ లో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ తిరిగి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పోయారు. ఎన్నికల్లో …
Read More »జగన్పై రాయి కేసులో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం మూడు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూనే కోడి కత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి సీఎంపై రాయి దాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. మరోవైపు వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తోంది. పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ మీద పెత్తందారుల దాడి …
Read More »స్ట్రైక్ రేట్ మీద ఫోకస్ పెట్టిన టీడీపీ.!
జనసేన, బీజేపీలకు ఎక్కువ సీట్లు అనవసరంగా కేటాయించేశారంటూ తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఇంకా కొంత ‘అలక’ అధినాయకత్వంపై కనిపిస్తోంది. పొత్తులన్నాక, ఆయా రాజకీయ పార్టీలు కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు. టీడీపీ, జనసేన చేసిన త్యాగాల్ని బీజేపీ జస్ట్ ఎంజాయ్ చేస్తోదంతే, గట్టిగా నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేంత సీన్ బీజేపీకి లేదు. లోక్ సభ పరిస్థితి మరీ దారుణం. ఇది రాజకీయ విశ్లేషకుల్లో నిన్న మొన్నటిదాకా …
Read More »విశాఖ : జీవీఎల్ మళ్లీ గెలుకుతున్నాడా ?
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్ సభ స్థానం తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా శ్రీ భరత్ ను ప్రకటించడం, అతను ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది. అయితే బీజేపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవీఎల్ నరసింహారావు అక్కడి నుండి పోటీ చేసే ప్రయత్నాలను ఇప్పటికీ వదులుకోలేదని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రాలో కీలక బీజేపీ నేతగా ఉన్న …
Read More »జనసేనదే ‘విజయం!’
సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు భారీ ఉరట లభించింది. అది కూడా ఏపీలో నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల పర్వానికి రెండు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో జనసేనకు భారీ విజయం దక్కింది. ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గాజు గ్లాసు గుర్తును తాజాగా ఏపీ హైకోర్టు కన్ఫర్మ్ చేసింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తునే నిర్ధారిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు డోలాయమానంలో పడిన జనసేనకు …
Read More »శిరోముండనం కేసులో వైసీపీ నేత తోటకు ఏడాదిన్నర జైలు!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1996లోజరిగిన దళిత యువకులపై దాడి. .. ఇద్దరి శిరోముండనం కేసులో విశాఖ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 9 మంది నిందుతులను దోషులుగా తేల్చిన కోర్టు.. వీరికి ఏడాదిన్నర(18 నెలలు) కఠిన కారాగారంతోపాటు.. రెండు లక్షల రూపాయల భారీ జరిమానా కూడా విధించింది. వీరిలో వైసీపీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా …
Read More »ఏపీలో బీజేపీ సేఫ్ గేమ్
దక్షిణాదిన కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపలేని భారతీయ జనతా పార్టీ ఈ లోక్ సభ ఎన్నికలలో ప్రధానంగా తెలంగాణ మీద దృష్టిపెట్టింది. 2019 ఎన్నికల తర్వాత గత ఐదేళ్లుగా తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు ఉప ఎన్నికలతో పాటు, ఇటీవల శాసనసభ ఎన్నికల వరకు మోడీ, అమిత్ షా తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులను శాసనసభ స్థానాలకు …
Read More »న్యూస్ ఎక్స్ సర్వే: ఏపీ కూటమిదే!
సార్వత్రిక ఎన్నికల వేళ పలు మీడియా సంస్థలతో పాటు స్వతంత్ర సంస్థలు సైతం పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా న్యూస్ ఎక్స్ ఆంగ్ల వార్తా చానల్ డిజిటల్ ఎడిషన్ కు సంబందించిన సర్వేను తాజాగా ప్రకటించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్న 400 స్థానాలకు పైబడిన సీట్ల సాధన ఏ మేరకు సాధ్యమన్న విషయాన్ని తేల్చేయటంతో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో …
Read More »రేవంత్ బీజేపీ ట్రాప్ లో ఉన్నాడా ?
తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్నది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రేవంత్ ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ ఢిల్లీకి వెళ్లి మోడీని కలవడం, హైదరాబాద్ పర్యటనకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates