‘గులాబ్’ గుబులు ఏపీలో మొదలైంది. గులాబ్ తుఫాను వల్ల ఉత్తరాంధ్రకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారిందని అధికారులు తెలిపారు. దీనికి పాకిస్థాన్ ‘గులాబ్’ (గుల్-ఆబ్) అనే పేరు పెట్టింది. ఆదివారం సాయంత్రం కళింగపట్నం- గోపాల్పూర్ (ఒడిసా) మధ్య తీరం …
Read More »పవన్ స్పీచ్పై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ సర్కారును మునుపెన్నడూ లేని స్థాయిలో టార్గెట్ చేస్తూ ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ప్రకంపనలు రేపుతోంది. నిన్న రాత్రి నుంచి ఎక్కడ చూసినా ఈ ప్రసంగం గురించే చర్చంతా. ఒకప్పటి ఆవేశాన్ని అణుచుకుని కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాడు పవన్. అవతలి వాళ్లు కవ్వించినా కూడా నోరు జారట్లేదు. విమర్శలు సుతిమెత్తగానే చేస్తున్నాడు. ఇది …
Read More »ఏపీలో కొత్త వివాదం – దసరా నవరాత్రులు
ఏపీలో మరో రగడ తెరమీదికి వచ్చింది. అది కూడా హిందూ ఆలయాలకు సంబంధించే కావడంతో ఇప్పు డు ఈ చర్చ జోరుగా సాగుతోంది. విషయం ఏంటంటే.. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా శరన్నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులు. అదే సమయంలో జాతరలు, ఉత్సవాలు కూడా చేసుకుంటారు. శక్తి స్వరూపిణిగా ప్రతి ఇల్లూ అమ్మ వారికి ఆహ్వానం పలుకుతుంది. అదే …
Read More »మంత్రి మల్లారెడ్డిని మందలించిన కేసీఆర్, కేటీఆర్!
మంత్రి మల్లారెడ్డిది ప్రత్యేకమైన స్టైల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. అది అసెంబ్లీ కావచ్చు.. మీడియా సమావేశం కావచ్చు… మీడియాను తనవైపు తిప్పుకోవడంలో ఆయన నేర్పిరి అని కొనియాడేవారు లేకపోలేదు. ఇలా మాట్లాడితే చిక్కుల్లో పడుతారనే హెచ్చరించేవారు ఉన్నారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తప్ప మరెవరూ మల్లారెడ్డిని …
Read More »మంత్రి వర్గం 100 శాతం మార్చేస్తారు.. మంత్రి బాలినేని కామెంట్లు
రాష్ట్రంలో మొత్తం మంత్రి వర్గం మారిపోతుందా? ముఖ్యమంత్రి జగన్ అందరినీ పక్కన పెట్టేస్తారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రి వర్గ మార్పుపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన చెప్పిన విషయాన్ని ఆషామాషీగా తీసిపారేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. జగన్కు బంధువు, మంత్రివర్గంలో కీలక నాయకుడు కాబట్టి. సో.. విషయంలోకి వెళ్తే.. ఏపీ సీఎం జగన్.. తన మంత్రి వర్గ మార్పుపై …
Read More »భారత్ బంద్కు జగన్ ఓకే.. కేంద్రంపై సమరమేనా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. రైతు సంఘాలు.. కార్మిక సంఘాలు.. ఇతర ప్రజా సంఘాలు.. ఈ నెల 27న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పాటించకపోగా.. బంద్ పాటించే వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు.. యూపీ సర్కారు ప్రకటించింది. ఇక, బీజేపీని సమర్ధించే ప్రాంతీయ పార్టీలు, మోడీ కూటమిలోని పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు …
Read More »షాక్ : ఆయన వ్యూహాలకు బాబు గుడ్బై
రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బ కొట్టి విజయం సాధించాలంటే ఎన్నో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందిస్తూ ముందకు సాగాల్సి ఉంటుంది. ప్రజల ఆదరణ దక్కించుకోవడంతో పాటు ప్రత్యర్థి నాయకులకు చెక్ పెట్టేలా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అందుకే ప్రజల మద్దతు తమకు దక్కేలా.. ప్రత్యర్థి నేతలపై పైచేయి సాధించేందుకు వీలుగా రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా వ్యూహకర్తలను నియమించుకోవడం తెలిసిన సంగతే. దేశంలో ప్రముఖ …
Read More »షాక్ : గుర్తింపు కోల్పోయిన జనసేన !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ వార్త నిజంగా ఇబ్బందికరమైనదే. ఎందుకంటే జాతీయ పార్టీలేవి, ప్రాంతీయ పార్టీలేవి, గుర్తింపు కోల్పోయిన పార్టీలేవి అనే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో జనసేన పార్టీని గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ప్రకటించింది. పైగా ఫ్రీ సింబల్స్ లో జనసేన క్లైం చేసుకుంటున్న గాజు గ్లాసు గుర్తు ఉందని మరో ప్రకటన చేసింది. అంటే …
Read More »పవన్లో కొత్త ఉత్సాహం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆ పార్టీ అధినాయకుడు పవన్ కల్యాణ్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయా? ఆయనలో వచ్చిన మార్పుతో పార్టీ తిరిగి పుంజుకోనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆయనతో కొత్త రాజకీయ ఆశలను చిగురింపచేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను ఆయన సానుకూలంగా మలుచుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి …
Read More »‘జగన్ పాలనలో డ్రగ్గాంధ్రప్రదేశ్’
టీడీపీ శ్రీకాకుళం ఎంపీ.. యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్పైనా నిప్పులు చెరిగారు. ఏపీని డ్రగ్గాంధ్రప్రదేశ్గా మార్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ వైఖరితో .. యువత మత్తు పదార్థాలకు బానిసయ్యే ప్రమాదం పొంచిఉందని.. ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రం.. కేంద్ర బిందువుగా మారడం బాధాకరమమని …
Read More »దుమ్ము రేపుతున్న ‘షర్మిల – ఆర్కే’ టీజర్
ఆంధ్రజ్యోతి ఆర్కేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. దమ్మున్న చానల్ ట్యాగ్ తో.. చానల్.. సంచలన కథనాలతో దినపత్రికను నడిపే ఆయన.. సొంతంగా ప్రతి వారం తన పేపర్లో ‘కొత్త పలుకు’ పేరుతో పొలిటికల్ కాలమ్ ఒకటి రాస్తుంటారు. ఇదే కాకుండా.. చానల్ వరకు వస్తే.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో సెలబ్రిటీలను కాస్త భిన్నమైన కోణంలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు ఆదరణ ఎక్కువే. …
Read More »టీడీపీలో మొదలైన డిమాండ్లు
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్లు మొదలైపోయాయి. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మండలాల్లో టీడీపీ-జనసేన కలుస్తున్న విషయం తెలిసిందే. స్ధానికంగా ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు పార్టీలు అవగాహనతో సర్దుబాట్లు చేసుకుంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఈ రెండు పార్టీలు తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు స్థానిక …
Read More »