మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ.. ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రెండోసారి అధికారంలోకి రావాలని పరితపిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐప్యాక్ సర్వే సహా.. వలంటీర్లు, ఇతర మాధ్యమాల్లో అభ్యర్థుల పనితీరు, ప్రజల నాడిని పసిగడుతున్న విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదికల …
Read More »క్రిస్టియన్ సెంట్రిక్ పాలిటిక్స్.. పవన్ ఎంట్రీ!
రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా క్రిస్టియన్ల కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. క్రైస్తవులను కార్నర్ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని.. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై దమన కాండ జరిగి, హత్యలు.. అత్యాచారాలు జరిగినా.. సీఎం జగన్ కనీసం పెదవి విప్పలేదని.. ఇదేనా వారిపై ప్రేమ అంటూ ఆమె నిలదీశారు. ఈ వ్యాఖ్యలు …
Read More »టార్గెట్ షర్మిల.. ఒక్కొక్కరు ఒక్కో లైన్లో !
ఏపీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్న షర్మిలకు అదే రేంజ్లో రివర్స్ టార్గెట్ ఎదురవుతోంది. నిజానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల తొలిరోజే వైసీపీని టార్గెట్ చేసింది. ఆ తర్వాత వరుసగా సీఎం జగన్ను కూడా ఏకేయడం ప్రారంభించారు. ప్రధానంగా హోదా సహా బీజేపీతో అంటకాగుతున్నారన్న విమర్శలతో జోరు పెంచారు. ఇవి ఓ వర్గం మీడియాలో పతాక స్థాయి వార్తలుగా వచ్చాయి. దీంతో వైసీపీ కూడా ఆత్మరక్షణలో …
Read More »కేసీఆర్ మెడకు కోకా పేట పంచాయతీ
సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. సర్వే …
Read More »షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉంది: ఉండవల్లి
ఏపీలో సీనియర్ పొలిటిషియన్, కాంగ్రెస్ హార్డ్ కోర్ అభిమాని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రిలో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి వెళ్లిన షర్మిల..ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే, ఉండవల్లిని కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలతో భేటీపై మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. షర్మిలతో రాజకీయాల గురించి …
Read More »అవును నేను గుంపు మేస్త్రీ యే : రేవంత్ రెడ్డి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. 3650 రోజులు తెలంగాణ ఏలిన మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి …
Read More »వీళ్ళతో పెట్టుకుంటే కాంగ్రెస్ కి ఇబ్బందేనా ?
ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీల వైఖరి బాగా చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తమకు ఎవరితోను పొత్తుండదని ప్రకటించారు. వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ కీలకనేత భగవంత్ మాన్ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ ఒంటరిగానే పోటీచేస్తుందన్నారు. ఏ పార్టీతో కూడా ఆప్ సీట్ల షేరింగ్ కు …
Read More »నీ వల్లే కుటుంబం చీలింది: జగన్పై షర్మిల
“నీ వల్లే మన కుటుంబం చీలిపోయింది. ముందు ఈ విషయాన్ని గమనించు జగనన్నా!” అని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బుధవారం.. తిరుపతిలో నిర్వహించిన ఇండియా టుడే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “కాంగ్రెస్ పార్టీ విభజించి పాలన చేస్తోంది. గతంలో నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. మా చిన్నాన్నను మా నుంచిదూరం …
Read More »ఈసారైనా టీడీపీ గెలుస్తుందా ?
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి అందని ద్రాక్షపళ్ళు లాగ తయారయ్యాయి. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు కూడా ఒకటి. చివరిసారిగా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది 1999 ఎన్నికల్లోనే. అప్పటినుండి ఇప్పటివరకు అంటే నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతునే ఉంది. 1994-99 మధ్య అప్పటి సీనియర్ నేత లాల్ జాన్ భాష తమ్ముడు జియావుద్దీన్ గెలిచారు. మళ్ళీ ఎంతమంది ప్రయత్నించినా గెలుపు దక్కటంలేదు. మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన …
Read More »జగన్ వ్యాఖ్యల ఆంతర్యమేమి?
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 60-70 రోజుల్లోనే ఎన్నికలు ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపోటముల గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్గా మారింది. ఇండియా టుడే సమ్మింట్లో ఆయన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో బిట్స్ కొన్ని ఇప్పటికే వైరల్ కాగా.. అందులో ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. …
Read More »విమర్శలు సరే.. ప్రజలకు సమాధానం చెప్పగలరా షర్మిలమ్మా?
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. ఆ పార్టీ కోసం, ఎక్కడో సుప్తచేతనావస్థలో ఉన్న పార్టీకి జవజీవాలు అందించడం కోసం.. ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీకి చేరిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి పట్టాలెక్కించేందుకు ఆమె తన శక్తియుక్తులు జోడిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీని టార్గెట్ చేసుకుని.. పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ క్రమంలో ప్రజలకు ఆమె చెప్పేది ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల నుంచి …
Read More »అందుకే వారిని పక్కన పెట్టాం: జగన్
ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 59 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వక పోవడం.. లేదా.. కొందరిని సెగ్మెంట్లు మార్చడం చేసింది. టికెట్ ఇవ్వని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చింది. అదేసమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు స్థాన చలనం కల్పించింది. ఇక, ఎంపీల్లోనూ దాదాపు 10 మంది వరకు మార్పులు చేర్పులు చేసింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates