Political News

కేఏ పాల్‌పై కేసు.. ఏం జ‌రిగింది?

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కిలారి ఆనంద‌పాల్‌(కేఏ పాల్‌)పై హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌ను పాల్ లైంగికంగా వేధించారంటూ.. ఓ యువ‌తి ఫిర్యా దు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేసి, మాన‌సికంగా వేధించార‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే ఫిర్యా దు చేసిన యువ‌తి విదేశాల‌కు చెందిన వ్య‌క్తిగా చెప్పారు. …

Read More »

అన్నకు షాకిచ్చి సేప్ జోన్ కు కవిత

kavitha

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత వివాదాలతో సతమతం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే ఈ గొడవలు మొదలు కావడం గమనార్హం. కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే అన్ని పదవులు కట్టబెడితే… కుమార్తెనైన తనకు ఏం మిగులుతుందని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. అయితే కవితను ఏకాకిని చేద్దామని కేటీఆర్ రచించిన వ్యూహాన్ని కవిత …

Read More »

మోదీ ఈ సారీ బాంబు పేల్చుతారా..?

2016, నవంబర్ 8… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ ప్రత్యక్షమయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత జనం ఏ మేర ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అప్పటికి ప్రధానిగా మోదీ పదవి చేపట్టి కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. అది గతం అయితే 11 ఏళ్లకు పైగా ప్రధానిగా అనుభవం సాధించిన మోదీ… …

Read More »

పిక్ ఆఫ్ ద డే!… మోదీతో ప్రకాశ్ రాజ్?

సెలవు దినం ఆదివారం సోషల్ మీడియాలోకి ఓ అత్యంత ఆసక్తికరమైన ఫొటో ఒకటి వచ్చి చేరింది. క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతోంది. అయినా ఆ ఫొటోలో ఏముందంటే… పెద్దగా ఏమీ లేదు గానీ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ మోదీపై అవాకులు, చెవాకులు పేల్చే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, మోదీతో కలిసి ఫొటో దిగారట. ఆ ఫొటోను ఆయనే తన సోషల్ మీడియా …

Read More »

రైతుకు కష్టమొస్తే పవన్ తట్టుకోలేరబ్బా!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా అత్యంత సున్నిత మనస్కుడు. సమాజంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా ఆయన దానిని పరిష్కరించేందుకు తరించిపోతారు. ఇక యావత్తు ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలకు కష్టం వచ్చిందంటే మాత్రం ఆయన మరింతగా చలించిపోతారు. ఇప్పుడదే జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా …

Read More »

మరో 10 రోజులే గడువు, రేవంత్ వ్యూహం ఏమిటి?

ఒక‌వైపు త‌రుముకొస్తున్న హైకోర్టు తీర్పు గ‌డువు. మ‌రోవైపు అప‌రిష్కృతంగా ఉన్న బీసీ రిజ‌ర్వేష‌న్‌. వెర‌సి స్థానిక సంస్థ‌ల ఎన్నికల‌పై తెలంగాణ‌లోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. పూట‌కోమాట‌.. త‌డ‌వ‌కో నిర్ణ‌యంతో ఈ ఎన్నిక‌ల వ్యవ‌హారంపై పిల్లిమొగ్గ‌లు వేస్తోంది. అంతేకాదు.. సొంత పార్టీ నాయ‌కుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు.. విప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఫ‌లితంగా ఈ ఎన్నిక‌ల విష‌యంపై స‌ర్కారు తుది నిర్ణ‌యం ఎలా …

Read More »

బాబు చెప్పాలి: సీనియర్ల బాధకు రీజన్ ఇదే..!

టిడిపి బలంగా ఉన్నచోట, గత ఎన్నికల్లో జూనియర్లకు అవకాశం కల్పించారు. కొత్త తరం నాయకులకు అవకాశం ఇచ్చారని చెబుతున్న సీఎం చంద్రబాబు, యువ రక్తానికి అవకాశం ఇచ్చారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో కొత్త తరం నాయకులు, వారసులు తెరమీదకు వచ్చి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఈ స్థానాల్లో ఉన్న సీనియర్లకు, జూనియర్ల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఆధిపత్య ధోరణితోపాటు అధికారం విషయంలో కూడా ఇరుపాక్షాల మధ్య …

Read More »

జ‌నంలోకి జ‌న‌సేన‌.. ముహూర్తం పెట్టేశారు!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీసీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నంలోకి వ‌చ్చేందుకు ముహూర్తం పెట్టారు. వాస్త‌వానికి ఈ ఏడాది జూలైలోనే ఆయ‌న జ‌నంలోకి వ‌స్తాన‌ని గ‌తంలోనే చెప్పారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని.. పార్టీ త‌ర‌ఫున‌, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడాకార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని అన్నారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో ఇది వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే.. తాజాగా పార్టీ వైపు నుంచి ప్ర‌జ‌ల నుంచి కూడా ప్ర‌జ‌ర్ పెరుగుతున్న‌నేప‌థ్యంలో జ‌న‌సేన ముహూర్తం …

Read More »

మోడీ హ‌యాంలో దేశం అప్పుల పాలు: కాగ్

కేంద్రంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న ప్రారంభించి 11 ఏళ్లు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీ నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) శ‌నివారం సంచ‌ల‌న నివేదిక‌ను విడుద‌ల చేసింది. ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన 10 సంవ‌త్స‌రాల్లో దేశంలో అప్పులు ఏ విధంగా పెరిగిపోయాయో పూస గుచ్చిన‌ట్టు వివ‌రించింది. అంతేకాదు.. 2014 …

Read More »

వైసీపీ నేత పిన్నెల్లికి చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌!

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బ్యాలెట్ బాక్సుల‌ను నేల‌కు విసిరికొట్టి.. పోలింగ్ బూత్‌లో అరాచ‌కం సృష్టించిన కేసులో ఆయ‌న ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న పిన్నెల్లి.. ఒక ద‌శ‌లో చెలరేగిపోయారు. అయితే.. తాజాగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు.. పిన్నెల్లి కేంద్రంగా గ‌ట్టి వార్నింగ్ …

Read More »

శ్రీవారి పరకామణి: మరో రాజకీయ వివాదం!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తులు తమ శక్తి కొలది స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. దీనిలో కీలకమైంది ఆర్థిక మొక్కు. ఎంత కటికపేద వాడైనా శ్రీవారిని దర్శించుకున్నాక పరకామణి (శ్రీవారికి నగదు కానుకలు ఇచ్చే చోటు)ని చూడకుండా, దానిలో కనీసం రూపాయి అయినా వేయకుండా కొండ దిగడు. ఇక శ్రీమంతుల సంగతే చెప్పనక్కర్లేదు. కోట్లకు కోట్ల కానుకలు శ్రీవారికి సమర్పించుకుంటారు. …

Read More »

‘నిన్నే తెలియదని చెప్పా.. మళ్లీ అడుగుతారెందుకు’

వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని వరుసగా రెండో రోజూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలో విచారించారు. రాజమండ్రి జైలులో ఉన్న మిథున్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నిజానికి శుక్రవారం కూడా మిథున్ రెడ్డిని విచారించారు. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన పలు అంశాలపై ఆరాతీశారు. ప్రధానంగా డిస్టిలరీలకు నిధుల టార్గెట్ పెట్టడం, కమిషన్లను …

Read More »