ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా మరో పిలుపునిచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ఇంటిని ముట్టడిస్తామని ఆమె తెలిపారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నిరంకుశ ధోరణిని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. మెగా డీఎస్సీ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను పట్టించుకోకుండా.. వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో …
Read More »టీడీపీలో జీఎస్.. వైసీపీకి భారీ దెబ్బేనా…!
ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో జంపింగులు కామన్గా మారిపోయాయి. టికెట్లు దక్కని వారు.. తమకు నచ్చని సీటును ఇవ్వలేదని భావిస్తున్నవారు.. పార్టీలు మారుతున్నారు. ఈ జంపింగులకు ఎవరూ అతీతులు కాకుండా పోయారు. ఇదిలావుంటే.. వైసీపీకి ఇప్పటి వరకు అన్ని విధాలా అండగా ఉన్న గెదెల శ్రీను.. ఉరఫ్ జీఎస్గా పిలుచుకునే యువ పారిశ్రామిక వేత్త.. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. ఉత్తరాంధ్రకు చెందిన జీఎస్.. ఇటీవల శంఖారావం సభకు వచ్చిన …
Read More »ఈ ఈక్వేషన్లను నాగబాబు దాటుతారా?
మిగిలిన పార్లమెంట్ సీట్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభకు నాగబాబు పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం నాగబాబు ప్రకటనల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన నేతల్లో మొదలైన ప్రశ్న ఏమిటంటే నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా ? అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా అనకాపల్లిలో తూర్పుకాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజికవర్గాలు. ఈ రెండు …
Read More »‘మీ కన్నా చంద్రబాబే నయం’ – షర్మిల
“మీ కన్నా చంద్రబాబే నయం జగనన్నగారూ” అంటూ.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తాజాగా డీఎస్సీ ఉద్యోగాల విషయంలో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చలో సెక్రటేరియెట్కు ఆమె పిలుపునిచ్చారు. అయితే.. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అనుమతులు లేకపోయినా నిరసన కొనసాగిస్తామంటూ.. రోడ్ల మీదకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు …
Read More »విడదల రజనీపై టీడీపీ షాకింగ్ ఈక్వేషన్
వైసీపీ మంత్రి విడదల రజనీపై చంద్రబాబు సేమ్ టు సేమ్ అస్త్రం వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న రజనీపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆమెను ఎలాగైనా అసెంబ్లీలో ఉండేలా చూడాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను గుంటూరు వెస్ట్ సీటుకు మార్చారు. గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్గా నియమితులైన ఆమె ప్రచారాన్ని స్పీడప్ చేసేశారు. వెస్ట్లో రజనీని ఓడించాలంటే ఎవరిని రంగంలోకి …
Read More »చింతలపూడి తెరపైకి ఫ్రెష్ క్యాండెట్ను దింపిన చంద్రబాబు
నియోజకవర్గ సమన్వయకర్తల ఎంపికలో స్పీడ్ పెంచిన చంద్రబాబు రెండు రోజుల వ్యవధిలో రెండు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జ్లను నియమించారు. ఈ రెండూ ఏలూరు జిల్లాలోనివే కావడం విశేషం. ముందు నూజివీడుకు మాజీ మంత్రి, ప్రస్తుత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నియమించగా… అదే జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ సీటుకు ఎన్నారై సొంగా రోషన్కుమార్ను నియమించారు. గత మూడున్నర సంవత్సరాలుగా పార్టీకి ఇన్చార్జ్ అంటూ ఎవ్వరూ లేకుండా దిక్కూమొక్కూ లేకుండా …
Read More »ఖాన్ కలకలం.. విజయవాడ టీడీపీలో అర్ధరాత్రి హడావుడి!
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఆ దిశగా జనసేనతో ఇప్పటికే పొత్తు పెట్టుకుంది. రాబోయే రోజుల్లో బీజేపీతోనూ చేతులు కలపాలని నిర్ణయానికి వచ్చింది. అయితే.. ఈ పొత్తులే.. పార్టీకి విచ్చుకత్తులుగా మారుతున్నాయి. చాలా చోట్ల నాయకులు.. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు టికెట్ లేకుండా చేస్తారా? అంటూ.. వారి వారి మార్గాల్లో అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని నూజివీడులో అబ్యర్థిని …
Read More »నారా భువనేశ్వరి సైలెంట్ వేవ్!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురించి పైకి పెద్దగా ఏమీ విని పించడం లేదు. కనిపించడం కూడా లేదు. కానీ.. ఆమె సైలెంట్ వేవ్ సృష్టించే పనిలో ఉన్నారు. చాలా నిరాడంబరంగా ఉండే భువనేశ్వరి.. అంతే నిరాడంబరంగా పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో సాధ్యమైనంత మేరకు.. నారా భువనేశ్వరి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో …
Read More »రేవంత్రెడ్డి సిద్ధం.. తొలి అభ్యర్థి ప్రకటన
రానున్న పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారీగా స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్న రేవంత్రెడ్డి తాజాగా అభ్యర్థిని ప్రకటించేశారు. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ఆయన ప్రకటించారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ …
Read More »నూజివీడు – మైలవరం – పెనమలూరు సీట్లు వీళ్లకే!
టీడీపీ, వైసీపీల్లో రాజకీయ దుమారం పెరుగుతోంది. నాయకుల జంపింగులు కూడా సాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు నుంచి ఎటు మారుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక, వేరే పార్టీల నాయకులను చేర్చుకునేది లేదు.. అని లక్ష్మణ రేఖలు గీసుకున్న వైసీపీ కానీ, టీడీపీ కానీ.. స్వీయ నిబంధనలు తోసిపుచ్చి.. పార్టీల్లోకి నాయకులను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో …
Read More »తెలంగాణలో కొత్త సర్వే – కాంగ్రెస్ వైపే మొగ్గా ?
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటి సీట్లు ఖాయమని ఒక సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అనే సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి ఓట్లేస్తారనే విషయంలో అభిప్రాయాలను సేకరించింది. దీని ప్రకారం ఏమి తేలిందంటే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో గెలుస్తుందని. బీఆర్ఎస్ 3-5 సీట్ల మధ్య గెలుస్తుందని, …
Read More »షర్మిల అరెస్టుకు పోలీసుల యత్నం.. అర్ధరాత్రి హైడ్రామా!
ఏపీలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం ఉదయం చలో సెక్రటేరియెట్కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్పై అభ్యర్తులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల ఈ ఉద్యమా నికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన కుమారుడి వివాహం అనంతరం.. నేరుగా బుధవారం రాత్రి 10 గంటల సమయం లో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి ఆమె పార్టీ ముఖ్యనాయకుడు …
Read More »