Political News

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయంటూ.. ఆయ‌న `ఇండిగో` విమాన స‌ర్వీసుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సంప‌ద కూడా ఒక‌రిద్ద‌రి చేతుల్లోనే ఉంటే ఇలానే జ‌రుగుతుంద‌న్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ట్రేడ్ యూనియ‌న్ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇండిగో అంశాన్ని ప్ర‌స్తావించిన కేటీఆర్‌.. పైల‌ట్ల‌కు రెస్టు ఇవ్వాల‌ని.. పేర్కొంటూ.. డీజీసీఏ …

Read More »

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. తాజాగా శ‌నివారం ఆయ‌న పార్టీకోసం స‌మ‌యం కేటాయించారు. గ‌త రెండు రోజుల కింద‌టే ఈవిష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం పూర్తిగా పార్టీకోస‌మే స‌మ‌యం కేటాయించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఆయ‌న మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లిన సీఎం …

Read More »

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి అధినేత‌గా ఉన్నా.. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉన్నా.. కొన్ని హ‌ద్దులు పాటించాల్సిందే. కొన్ని ప‌ద్ధ‌తులు కూడా అనుస‌రించాల్సింది. దీనికి ఎవ‌రూ మిన‌హాయింపుకాదు. కానీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌కు ఈ హ‌ద్దులు తెలియ‌ని అనుకోవాలో.. తెలిసి కూడా.. త‌న మైలేజీ కోసం తాయ‌ప‌త్రం ప‌డుతున్నార‌ని భావించాలో తెలియ‌దు కానీ.. …

Read More »

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ పొత్తు నిర్విఘ్నంగా కొన‌సాగుతోంది. వాస్త‌వానికి ఏపీ వ‌ర‌కే ఈ పొత్తు కుదుర్చుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలోనూ ఏపీలో ఏర్ప‌డిన కూట‌మి కీల‌క పాత్ర పోషిస్తోంది. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌లాన్ని పుంజుకుని కేంద్రంలో పాగావేసిన బీజేపీ.. ఈ సారి మాత్రం బ‌ల‌హీన …

Read More »

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ మార‌కం విలువ‌ను పోల్చుకుంటాయి. దీని ఆధారంగానే ఎగుమతులు-దిగుమ‌తులు కూడా జ‌రుగుతాయి. దాదాపు వీటి ఆధారంగానే ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ఆధార ప‌డి ఉంటుంది. ఈ క్ర‌మంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్త కూడా… దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమీ కాదు. ప్ర‌పంచ దేశాల ప‌రిణామాల‌పైనే మ‌న దేశ ఆర్థిక …

Read More »

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జగన్ను తప్పు పడుతున్నారని సీఎం చంద్రబాబు కూడా అంటున్నారు. దేవుడి హుండీ చోరీపై సెటిల్మెంట్ జరిగింది. దీనిపై న్యాయస్థానం కూడా విచారణకు ఆదేశించింది. వివాదం ముదురుతున్న వేళ జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో చిన్న వ్యవహారం అన్నట్లుగా …

Read More »

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని చెబుతూ.. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా …

Read More »

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు తెలుగు వాళ్లకు ఉండే సంబంధం మాటల్లో చెప్పలేనిది. గోంగూరతో చేసే వంటకాలు చాలానే ఉన్నాయి. వాటిలో గోంగూర పచ్చడి ఒకటి. అది ఇప్పుడు రష్యా అధ్యక్షుడికి రుచి చూపించారు. భారత దేశ పర్యటనలో భాగంగా రెండు రోజుల కిందట ఇక్కడకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన …

Read More »

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ముందడుగు వేస్తోంద‌న్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌.. మాట్లాడుతూ.. ఏపీలో గూగుల్ డేటా కేంద్రం, అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ సిటీ వంటివి ఏపీకి ఏఐ మ‌ణిహారాలుగా మార‌నున్న‌ట్టు చెప్పారు. వృద్ధి రేటు కూడా పుంజుకుంటోంద‌ని తెలిపారు. 2026లో ఏఐ ప్ర‌పంచ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్టు …

Read More »

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ఇటీవల చేశారు. ఆయన టీడీపీలో కీలక నాయకుడు. మాజీ ఎమ్మెల్యే కూడా. కానీ ఆయన పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు పార్టీకి దూరంగా ఉన్న కొందరి పనులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటన్నది చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి దూరంగా …

Read More »

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు. వారు వేసే అడుగులు చేసే పనులే వారిని వెనక్కి నెడతాయి లేదా ముందుకు తీసుకువెళ్తాయి. రాజకీలాల్లో స్వయంకృత తప్పులు నాయకులకు ఇబ్బందిగా మారుతాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత తనను తానే డైల్యూట్ చేసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ఏ పార్టీ అయినా పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. …

Read More »

మోడీ అవినీతి ప్ర‌ధాని అంటున్న మాజీ ఐపీఎస్.. నిజం ఎంత?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యంత అవినీతి ప్రధాని అని మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్ర‌పంచంలోని అవినీతి నాయకుల జాబితాలో మోడీ పేరు కూడా ఉందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. పెద్ద నోట్ల రద్దు నుంచి పన్నుల వసూలు వరకు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజలపై పన్నులు బాదుతూ వారిని గాలికి వదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు. వేతనాల్లో 30 …

Read More »