ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన లేఖ రాసింది. ఒక్కసారిగా ప్రభుత్వానికి ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అని ప్రశ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోగా సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. లబ్ధి దారులకు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివరించాలని కోరింది. …
Read More »పాలిటిక్స్కు అతీతంగా ఉంటా: చిరు
మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలపై తన మనసులో మాట వెల్లడించారు. పాలిటిక్స్కు తాను అతీతంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే తోడబుట్టిన వాడు కనుక పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, అందరూ.. ఎదురు చూసినట్టు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారానికి చిరు వెళ్తారా? లేదా? అన్న ఉత్కంఠకు కూడా.. చిరంజీవి చెక్ పెట్టారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ కు …
Read More »లగడపాటి రాజగోపాల్ ఎక్కడ ? సర్వే ఎప్పుడు ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేక స్థానం. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి 2014 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నాడు. ప్రతి సారి ఎన్నికలప్పుడు, ఎన్నికలకు ముందు లగడపాటి తిరిగి రాజకీయాల్లో వస్తారని …
Read More »కుమారీ ఆంటీ మద్దతు ఎవరికో తెలుసా ?
కుమారి ఆంటీ. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనే కాదు బయట కూడా దాదాపు ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ‘మీ బిల్లు థౌజండ్. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అన్న డైలాగ్ తో ఆమె పాపులర్ అయిపోయారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ మూలంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఏకంగా పోలీసులు ఆమెను …
Read More »అదే .. మా నాన్నకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్
‘కొండ’ను పిండి చేస్తాం. చేవెళ్లలో గెలవనివ్వం అని రేవంత్ రెడ్డి అనడం డ్రామా. కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని సపోర్ట్ చేసింది మా నాన్నగారు. బీఅర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడమే మా నాన్న, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనం. మల్కాజ్ గిరిలో నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్లలో పోటీకి దించి ఉంటే టఫ్ ఫైట్ …
Read More »కాంగ్రెస్ లో కల్లోలం రేపిన రాహుల్ సభ !
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా ముందుకుసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు నియోజకవర్గాలలో గెలుపు లక్ష్యంగా బహిరంగ సభకు విచ్చేశాడు. కానీ అక్కడ పట్టుమని ఐదు వేల మంది జనాలు లేరు. సాయంత్రం 6 గంటలకు వచ్చి స్టేజి ఎక్కకుండా రాహుల్ గాంధీ …
Read More »జగన్ వన్ సైడ్ లవ్
కేసులు కావొచ్చు ఇతర స్వార్థ ప్రయోజనాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారుకు, ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ ప్రశ్నించని ఆయన సొంత పనులే చూసుకున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం నిధులు తదితర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భయమే అందుకు కారణమనే …
Read More »తిరుపతిలో షాక్ తగలబోతోందా?
ఆంధ్రప్రదేశ్లో ఇంకో మూడు రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గెలుపు కోసం ఆయా పార్టీల వాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. సర్వేల్లో చాలా వరకు ఎన్డీయే కూటమి వైపే మొగ్గు కనిపిస్తుండగా.. వైసీపీని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని… పోటీ గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల …
Read More »జగన్ పిలిచి పదవులిస్తే.. పట్టించుకోకుండా ఉంటున్నారే!
తమ రాష్ట్రం కాదు తమ పార్టీ కూడా కాదు.. కానీ తన అవసరాల కోసం జగన్ పిలిచి మరీ వాళ్లకు పదవులు కట్టబెట్టారు. తీరా ఇప్పుడు ఏపీ ఎన్నికల సమయంలో వాళ్లు కనీసం జగన్ ముఖం కూడా చూడటం లేదు. ప్రచారం సంగతి పక్కన పెడితే కనీసం జగన్ను కూడా వాళ్లు పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. జగన్ ఏరికోరి పదవులు ఇచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు పత్తాలేకుండా …
Read More »వాలంటీర్లకు ఫోన్లు, బైక్లు.. ఓట్ల కోసం వైసీపీ వ్యూహం!
ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే అధికార దాహంతో ఉన్న వైసీపీ దేనికైనా తెగించేందుకు వెనుకాడటం లేదనే విమర్శలున్నాయి. ఓట్లు పొందేందుకు ప్రత్యర్థి పార్టీలపై తీవ్రమైన ఆరోపణలు, నాయకులపై దాడులతో పాటు జనాలను మభ్య పెడుతూ వైసీపీ సాగుతోందనే టాక్ ఉంది. ఇక వాలంటీర్లనే ప్రధానంగా నమ్ముకున్న వైసీపీ వాళ్లతో ఓట్లు పొందేందుకు వ్యూహాలు అమలు చేస్తుందని తెలిసింది. వాలంటీర్లతో ప్రచారం చేయించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా …
Read More »గంటాకు సినీ గ్లామర్.. ప్రచారాన్ని హోరెత్తించిన నమిత
ఎన్నికల వేళ నాయకులకు సినీ గ్లామర్ కూడా కలిసి వస్తోంది. అయితే.. గతంలో మాదిరిగా పెద్దగా సినీ తారలు ఇప్పుడు ప్రచారంలో కనిపించడం లేదు. ఒక్క పవన్ కల్యాణ్కు మాత్రం పిఠాపురంలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్కు నందమూరి కుటుంబ సభ్యులు.. ఈ కుటుంబంలోని ఒకరిద్దరు నటులు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు మించి పెద్దగా సినీ గ్లామర్ ఇప్పుడు రాజకీయ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ, టీడీపీ నాయకుడు, …
Read More »ఖమ్మం టీడీపీ ఆఫీసుకు పెరిగిన డిమాండ్ !
తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని నేరుగా కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీ కార్యాలయానికి అందరూ క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయం చుట్టూ ఖమ్మం లోక్ సభ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates