జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రాధమిక సూత్రాన్ని ఎప్పుడో మరచిపోయినట్లున్నారు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టినట్లు అప్పుడెప్పుడో చెప్పుకున్న పవన్ ఆ విషయాన్ని ఎప్పుడో పక్కన పడేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళకు రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు. రాజకీయపార్టీల నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొంటుంటే బీజేపీ+జనసేన పార్టీల …
Read More »సంచలనం: ఈటెల కొత్త పార్టీ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు.. పార్టీ సీనియర్.. ఉద్యమంలో కీలకభూమిక పోషించిన మంత్రి ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? కొత్త పార్టీ పెట్టాలన్న యోచనలో ఆయన ఉన్నారా? ఆ దిశగా వేస్తున్న అడుగుల్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీ పెట్టటం అంత సులువు కాదని.. రాంగ్ ట్రాక్ లోకి వెళ్లొద్దంటూ పార్టీ నేతలకు క్లాస్ పీకింది ఈటెలను ఉద్దేశించేనా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. …
Read More »షర్మిల సమావేశంపై పెరిగిపోతున్న ఆసక్తి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురిగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా షర్మిలకు కొత్తగా పరిచయం అవసరం లేదు. యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆమె దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ను జైలులో పెట్టినపుడు అన్న కోసమని రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర అప్పటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణాలో జిల్లాల్లో కూడా జరిగింది. ఇప్పుడిదంతా చెప్పుకోవటం ఎందుకంటే కొద్దిరోజులుగా షర్మిల కొత్త …
Read More »కేసీఆర్కు పట్టాభిషేకం.. ఓ కోయిల ముందే కూసింది
తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడానికి ఎంతో సమయం లేదన్నది కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ప్రచారం. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, కేటీఆర్ సీఎం కాబోతున్నాడన్న ప్రచారం నిజం కాదని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించినా సరే.. ఆయన మాటల్ని జనాలు నమ్మడం లేదు. కేసీఆర్ ఇలా కొట్టి పారేసిన చాలా విషయాల్లో అందుకు భిన్నంగా జరగడం తెలిసిందే. కొంత కాలంగా టీఆర్ఎస్ ముఖ్య …
Read More »షర్మిలకు కేసీఆర్ బిగ్ వార్నింగ్.. రీజన్ ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. వైఎస్ జగన్ సోదరి.. వైఎస్ షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారా? పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు షర్మిల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారా? లేక.. రేపు షర్మిల కొత్త పార్టీ కనుక పెడితే.. తన పార్టీకి గట్టి పోటీ ఇస్తుందనే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. …
Read More »ఇంకోసారి ఇలాంటి ప్రచారం చేస్తే ఖబడ్దార్..
తెలంగాణా రాష్ట్ర సమితి అంతర్గత వ్యవహారం చాలా విచిత్రంగా తయారైంది. ముఖ్యమంత్రిగా మంత్రి కేటీయార్ కు తొందరలోనే పట్టాభిషేకం అన్నారు. కేసీయార్ పదవిలో నుండి దిగిపోయి రాష్ట్ర సారధ్య బాధ్యతలు కేటీయార్ కు అప్పగించటానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అంటూ గడచిన రెండు నెలలుగా మీడియా ఒకటే ఊదరగొట్టింది. మీడియా అంతలా ఊదరగొట్టడానికి కారణం ఏమిటంటే అధికారపార్టీ నేతలే. అయితే ఎవరు ఊహించని విధంగా ఆదివారం నేతలతో సమీక్ష …
Read More »తొందరలోనే రోడ్లపై బాలయ్య విశ్వరూపం
ఇపుడు చేస్తున్న బోయపాటి శ్రీనివాస్ తో సినిమా అయిపోగానే తాను రోడ్డెక్కబోతున్నట్లు టీడీపీ నేత, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ చెప్పారు. నెల్లూరు జిల్లా అభిమానులతో బాలయ్య ఫోన్లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. తాను రోడ్డెక్కగానే తన అసలు రూపం చూపిస్తానని చెప్పారు. మామూలుగా బాలయ్య మాట్లాడితేనే అర్ధమయ్యేది అంతంత మాత్రం. అలాంటిది రోడ్లపైకి వస్తా, అసలు అవతారం ఏమిటో చూపిస్తానని వార్నింగులు ఇస్తున్నారంటే ఏ అజెండా …
Read More »పెద్దిరెడ్డికి స్వీట్ న్యూస్.. కానీ.. ఎస్ ఈసీదే పైచేయి!!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎపిసోడ్.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అన్నట్టుగా ముగిసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ఆయన చేస్తున్న వివాదాస్పద కామెంట్లను అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21 వరకు అంటే.. పంచాయతీ పోరు ముగిసే వరకు కూడా పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిని అమలు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ …
Read More »జనాలను కేంద్రంపైకి రెచ్చగొడుతున్న సుజనా
విశాఖ స్టీల్స్ ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాంధ్రలో ప్రధానంగా వైజాగ్ లో ఎంతగా నిరసన వ్యక్తమవుతోందో అందరికీ తెలిసిందే. ఫ్యాక్టరీలోని ఉద్యోగ, కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు అంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేసేశారు. చివరకు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా ఢిల్లీలో అగ్రనేతలతో సమస్యను చర్చిస్తామని చెప్పారు. ఒకవైపు క్షేత్రస్ధాయిలో ఇంత గందరగోళం జరుగుతుంటే మరోవైపు …
Read More »జగన్ నాయకత్వానికి పరీక్ష ఇపుడే మొదలైందా ?
మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ మెజారిటి సాధించిన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు బాహుబలి రేంజిలో ప్రొజెక్టు చేస్తున్నారు. ఇందులో కాస్త నిజముంది మరికాస్త అతిశయోక్తి ఉంది. సరే పార్టీ వాళ్ళిష్టం కాబట్టి ఏమి చేసినా చెల్లుబాటైపోతోంది. మరి పార్టీ నేతలు చెబుతున్నట్లు నిజంగానే జగన్ కి బాహుబలి స్ధాయి ఉందా ? అంటే ఇపుడు జగన్ నాయకత్వానికి మొదలైన అసలైన పరీక్షలో పాస్ అయితేనే తెలుస్తుంది. ఇంతకీ …
Read More »స్టీల్ ప్లాంట్ కోసం మరో ఉద్యమం తప్పదా ?
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటును రక్షించుకునేందుకు మరో ఉద్యమం తప్పేట్లు లేదు. విచిత్రమేమంటే అప్పట్లో స్టీల్ ప్లాంట్ సాధనకూ ఉద్యమం చేయాల్సొచ్చింది. ఇపుడు కాపాడుకోవటానికీ ఉద్యమాలు మొదలవుతున్నాయి. విశాఖ స్టీలుకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. స్టీలు ఫ్యాక్టరీలో వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రైడ్ ఆఫ్ ఏపిగా నిలిచిన విశాఖ స్టీల ఫ్యాక్టరికి అన్యాయం చేసింది కేంద్రప్రభుత్వమనే చెప్పాలి. బహుశా లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తు కూడా సొంతంగా ఇనుపగనులు …
Read More »పవన్ను ఇరికించబోయి క్యామిడి అయిపోయిన వీర్రాజు
మిత్రపక్షమన్న కనీస మర్యాద కూడా ఇస్తున్నట్లు లేదు జనసేనకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. వీర్రాజు ఏమి మాట్లాడుతున్నా దానికి ముందు జనసేన నేతలతో చర్చిస్తున్నట్లు కనబడటం లేదు. తాజాగా వీర్రాజు చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. సీఎం అభ్యర్ధిపై గురువారం ఒకమాట మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమో శుక్రవారం ఉదయానికి మాట మార్చేశారు. గురువారం ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీసీ నేతే ఉంటారని ప్రకటించారు. అయితే రాత్రికి బాగా అక్షింతలు …
Read More »