రాష్ట్రంలోని చేనేతలకు చంద్రబాబు అదిరిపోయే హామీ ఇచ్చారు. నేతన్నలపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని హామీని వారికి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలిచి అధికారంలోకి రాగానే పవర్ లూమ్స్ పెట్టుకున్న వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఈ తరహా హామీ ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు. కేవలం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా అమలవుతోంది. ఈ …
Read More »ఔను.. ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. “ఔను.. ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చు“ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. దానికే ఇంత రాద్ధాంతం ఎందుకు అని ఎదురు ప్రశ్నించారు. “పది లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని యూట్యూబుల్లో వీడియోలు పెడుతున్నారు. ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు. దానికే ఎందుకు ఇంత రాద్దాంతం …
Read More »నా చెల్లెళ్లతో నన్ను ఓడించగలడా?: జగన్ ఫైర్
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తన చెల్లెళ్లను ( వైఎస్ షర్మిల- వివేకా కుమార్తె సునీత) ప్రయోగించి తనను ఓడించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. అన్నారు. అంతే కాదు.. “నా చెల్లెళ్లతో నన్ను ఓడించగలడా?“ అని చంద్రబాబును ప్రశ్నించారు. శవరాజకీయాలు, కుట్రలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలని వ్యాఖ్యానించారు. “అలవాటు కుట్రలు చాలవన్నట్లు.. నా చెల్లెళ్లు ఇద్దరిని తీసుకొచ్చుకున్నారు. …
Read More »వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
తన సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విమర్శలు వచ్చినా.. కోర్టుల్లో కేసు సుదీర్ఘ కాలం సాగినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కమాట కూడా మాట్లాడని సీఎం జగన్ .. తాజాగా వివేకానందరెడ్డి హత్యపై సంచలన విమర్శలు చేశారు. “బాబాయ్ను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ఆ దేవుడికి కడప జిల్లా …
Read More »రఘురామ ఒంటరయ్యారు.. ఇప్పుడు ఏం చేస్తారు?
వైసీపీ రెబల్ ఎంపీ.. ఆ పార్టీకి ఇటీవల రిజైన్ కూడా చేసిన నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారారు. ఆయనకు టికెట్ వస్తుందని.. పోటీ చేయడం ఖాయమని చెప్పుకొన్నా.. తీరా టికెట్ల కేటాయింపు అయిపోయిన తర్వాత.. ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. జాబితాల్లో కనిపించలేదు. ఆయనకు పీకల్లోతు అన్యాయం జరిగిందనే వాదన నరసాపురంలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయన ఇండిపెండెంట్గా పోటీ …
Read More »హరీష్రావు పీఏ అరెస్టు.. బీఆర్ ఎస్కు మరో ఉచ్చు!
కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వివాదం విచారణ ముమ్మరం కావడం, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు జంప్ అయిపోతుండడం.. వంటి ఘటనలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ ఎస్కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ను జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఆర్ ఎఫ్(ముఖ్యమంత్రి …
Read More »ఆ కంటైనర్ లో ఏముంది జగన్?
ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళగిరి పోలీసులు పలుమార్లు ఆపి తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం క్యాంప్ ఆఫీసులోకి భారీ కంటైనర్ వెళ్ళినా తనిఖీలు చేయకపోవడంపై లోకేష్ స్పందించారు. అంతేకాకుండా, ఆ కంటైనర్ రాంగ్ రూట్లో వెళ్లినా భద్రతా సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ …
Read More »తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు ఎన్ని వసతులంటే?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెకు కోర్టు తిహార్ జైల్ కు రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద జైలుగా చెప్పే తిహార్ జైల్లో కవిత ఉన్నన్ని రోజులు ఎలాంటి వసతులు కల్పించాలన్న అంశంపై కోర్టు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. ఉండేది తీహార్ జైల్లో అయినప్పటికీ ఆమె ఇంటి భోజనం చేయొచ్చని.. జైల్లో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించేందుకు వీలుగా …
Read More »జనసేనకు మరో టికెట్ కట్? రీజన్ ఇదే!
ఏపీలో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి మరో టికెట్ కట్ అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జనసేన.. తర్వాత బీజేపీ కోరిక మేరకు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి పడిపోయింది. వీటిలో ఇప్పటికి 18 స్థానాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకుఅ …
Read More »సీఎంగా నా ఫస్ట్ సంతకం ఆ ఫైల్ పైనే..
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం దేనిపై పెడతానో అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను సీఎంగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానన్నారు. “మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా. ఎన్డీయే కూటమి అధికారం లోకి వచ్చాక తొలి రోజే తొలి సంతకం డీఎస్సీపై చేస్తా. అధికారం చేపట్టిన …
Read More »షాకింగ్: వైసీపీలోకి జనసేన నాయకులు!
ఒకవైపు అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. వైసీపీలో ఖాళీ సీట్లు కూడా లేవు. ఉన్నా.. సొంత పార్టీ నాయకులే ఖాళీగా ఉన్నారు. వీరిని కాదని వేరే వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా.. అదేం చిత్రమో కానీ.. జనసేన పార్టీ నుంచి తాజాగా వైసీపీలోకి నాయకులు క్యూ కట్టారు. రెండు జిల్లాలకు చెందిన పవన్ అనుకూల నాయకులు, జనసేనలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇలా వైసీపీ వైపు మళ్లడం రాజకీయంగా …
Read More »ఒకే రోజు ఒకే ముహూర్తంలో చంద్రబాబు-జగన్
ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అధినేతలు ప్రచారానికి సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. సీఎం జగన్ `మేమంతా సిద్ధం` పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవు తుండగా, చంద్రబాబు `ప్రజాగళం` పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఇద్దరు నేతలు ఒకేరోజు(బుధవారం), ఒకే ముహూర్తంలో ప్రజల్లోకి వెళుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates