క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణాలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముద్ర చాలా ఎక్కువే ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన లాంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలో వచ్చినవే. ఇక ఉచిత విద్య, ఉచిత విద్యుతో, ఆరోగ్యశ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాల గురించి చెబితే ముందుగా వైఎస్సారే గుర్తుకొస్తారు. …
Read More »షర్మిల వెనుక పీకే.. నిజమెంత?
ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం రాజకీయాల్లో అలవాటే. దానికి నిదర్శనంగా తాజాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయటం. మీడియాలో వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ.. నల్గొండతో పాటు పలు జిల్లాలకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్ని.. ఆయన్ను బలంగా నమ్మే నేతల్ని ఆహ్వానించిన షర్మిల.. తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీ మీద స్పష్టమైన …
Read More »గెలుపు సరే… ఈ లాజిక్ మిస్సయ్యావ్ అచ్చెన్నా ?
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైఖరి విచిత్రంగా ఉంది. సొంతూరు నిమ్మాడ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా అయిన గొడవలో పోలీసులు అచ్చెన్నను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం జరిగిన పోలింగ్ సందర్భంగా జైలు నుండి విడుదలైన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత అచ్చెన్న మాటలే చాలా విచిత్రంగా ఉంది. తమ పంచాయితి నిమ్మాడలో గడచిన 40 ఏళ్ళుగా ఎప్పుడు ఎన్నికలు జరగలేదని, అంతా …
Read More »అప్పుడే వ్యతిరేకత మొదలైపోయిందా ?
ఇంకా కొత్తపార్టీని వైఎస్ షర్మిల ఏర్పాటే చేయలేదు. తాను పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టంగా ప్రకటన కూడా చేయలేదు. రాజన్న రాజ్యంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకే వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో సమావేశం నిర్వహించినట్లు షర్మిల స్పష్టంగా చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లో జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అయితే షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీపై అప్పుడే వ్యతిరేకత మొదలైపోయింది. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆంధ్రా పార్టీకి …
Read More »ఓవర్ స్పీడుతో బోల్తాపడిన వైసీపీ ఎంపి
వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి స్పీడు గురించి అందరికీ తెలిసిందే. 2014 నుండి విజయసాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అప్పటి అధికార ఇఫ్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును అయినా ఇతర ప్రతిపక్ష నేతలను అయినా విమర్శించటంలో చాలా అత్యుత్సాహం చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్, యనమల+జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళను ఉద్దేశించి దాదాపు ప్రతిరోజు ట్విట్ట్ వేదికగా …
Read More »షర్మిల పార్టీ టార్గెట్ ఏమిటి? తెలంగాణలో రసవత్తర చర్చ
తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త రాజకీయ పార్టీతో ఎంట్రీ ఇస్తున్న వైఎస్ రాజన్న కుమార్తె.. షర్మిల టార్గెట్ ఏంటి? ఇప్పటికే రాజకీయ పార్టీకి సంబంధించి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాజన్న రాజ్యం.. పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఒక పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. అసలు షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ …
Read More »తమిళనాడును ఆదర్శంగా తీసుకోలేరా ?
రాష్ట్రప్రయోజనాలు మనకు సంపూర్ణంగా సిద్ధించకపోవటానికి రాజకీయ పార్టీలే ప్రధాన కారణమా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనా అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయానికి పెద్దగా రాద్దాంతం చేయటం, ఒకరిపై మరొకరు బురద చల్లేసుకోవటం చూస్తుంటే ఈ పార్టీలకు అసలు రాష్ట్రప్రయోజనాలు పట్టవా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణగా తాజాగా మొదలైన వివాదాన్నే తీసుకుందాం. వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం బయటకు వచ్చిందో …
Read More »అన్నా-చెల్లెళ్ల వ్యూహంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి.. ప్లాన్ మారింది!!
తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు బీజేపీ-కాంగ్రెస్ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న తెలంగాణ సారథి..కేసీఆర్కు వైఎస్ షర్మిల రాజకీయ ఎంట్రీ ఒక పెద్ద కుదుపుగానే భావించాలి. షర్మిల ఎంట్రీని ఏదో ఆషామాషీగానో.. గతంలో నరేంద్ర, విజయశాంతి వంటివారు తీసుకువచ్చిన పార్టీల మాదిరిగానో తీసిపారేసే పరిస్థితి కేసీఆర్కు లేనేలేదు. రాజకీయంగా.. ప్రజా క్షేత్రంలో బలమైన బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »కొడుకు కోసం జానారెడ్డి సైలెంట్ స్కెచ్ ?
తొందరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా తన కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎందుకైనా మంచిదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందాన్ని రంగంలోకి దింపారట. రానున్న ఎన్నికల్లో తాను కానీ లేకపోతే తన కొడుకు కానీ రంగంలోకి దిగితే ప్రజాస్పందన ఎలాగుంటుందనే విషయంలో జననాడిని పట్టుకునేందుకు ప్రశాంత్ తో జానారెడ్డి సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణాలో …
Read More »షర్మిలకు కలిసి వచ్చే ఛాన్స్ ఏంటి? తెలంగాణలో ప్రస్తుత పరిస్తితేంటి?
తెలంగాణ రాజకీయ అవనికపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. సన్నాహక సమావేశం కూడా భారీ ఎత్తున ప్రారంభం కావడంతో అందరి దృష్టీ ఇప్పుడు షర్మిల పార్టీపైనే పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు షర్మిలకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితి ఎలా ఉంది? …
Read More »జయలలితను తలపిస్తున్న షర్మిల.. అదే ఆహార్యం.. అంతేకాదు..ఇంకా ఎన్నో!!
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే! దీనికి సంబంధించిన సన్నాహక సమావేశానికి తొలి అడుగు పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్లోని వైసీపీ ఒకప్పటి కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్కు చేరుకున్న షర్మిల.. ఆదిత్యం.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపించారని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో జయ కూడా అచ్చు ఇలానే వ్యవహరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత.. పార్టీని …
Read More »జయ వారసత్వంపై మొదలైన వివాదం
దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వంపై వివాదం రాజుకుంది. జయలలితకు తానే అసలైన వారసురాలినంటూ జైలు నుండి విడుదలైన వీకే శశికళ ప్రకటించారు. ఆమె చేసిన ప్రకటనతో తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో కలకలం మొదలైంది. జయకు తానే అసలైన వారుసురాలినని, పార్టీకి తాను శాశ్వాత ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ చేసిన ప్రకటన పార్టీలో గందరగోళానికి దారితీసింది. పార్టీ తనదేనని మొత్తం పార్టీని తన ఆధీనంలోకి తీసుకుంటానని శశికళ చేసిన ప్రకటనతో …
Read More »