Political News

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఫైనల్

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థి ఫైనల్ అయిపోయింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన కారణంగా ఈ స్ధానాన్ని ఇంకోకరితో భర్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ స్థానాన్ని గౌతమ్ సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తో భర్తీ చేయాలని ఇటు కుటుంబం అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చేశారు. తమ కుటుంబం తరపున విక్రమ్ ను అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు తండ్రి, మాజీ …

Read More »

తండ్రిలాగే కేటీఆర్ పిట్ట క‌బుర్లు.. ఏపీ మంత్రి కౌంట‌ర్‌

ఏపీలో పాల‌న స‌రిగాలేద‌ని.. రోడ్లు గుంత‌లు ప‌డ్డాయ‌ని, ప్ర‌మాదాల‌తో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని.. ఇక‌, తాగేందుకు కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నీళ్లులేవ‌ని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. ఏపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ జోగి ర‌మేష్ షాకింగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేటీఆర్‌, కేసీఆర్‌ల‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. ఇద్ద‌రికీ మైండ్ చెడిపోయింద‌ని అన్నారు. వారు ఏం మాట్ల‌డుతున్నారో.. వారికే అర్ధం కావ‌డం లేద‌న్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు …

Read More »

ఏపీలో క‌రెంటు లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు దారుణం: మంత్రి కేటీఆర్

ఏపీ ప్ర‌భుత్వంతో చెలిమిగా ఉండే తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా జూలు విదిల్చిందా? అనే రేంజ్‌లో కీల‌క మంత్రి, సీఎం త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన క్రెడాయ్ ప్రాప‌ర‌ర్టీ షోలో పాల్గొన్న‌కేటీఆర్‌.. మాట్లాడుతూ.. ఏపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏపీలో పాల‌న స‌రిగా లేద‌ని.. నేరుగా వ్యాఖ్యానించారు. “నా మిత్రుడు ఏపీలో ఉంటాడు. మొన్నామ‌ధ్య నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అక్క‌డి ప‌రిస్థితి …

Read More »

బాబు కోరిక తీరాలంటే టీడీపీ ప్లాన్ మార్చాలి

వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలపైనే చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టారు. తనను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి సోదరులు పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులోను, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్ళపల్లెలోను ఎంఎల్ఏలుగా గెలిచారు. 2019లో అధికారంలోకి రాగానే కుప్పంలో చంద్రబాబును దెబ్బకొట్టడమే ధ్యేయంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం …

Read More »

టార్గెట్ 175 వ‌ర్సెస్ 160 ఏం జ‌రుగుతుంది?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య సీట్ల టార్గెట్ కొన‌సాగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ విజ‌యం ద‌క్కించుకునేందుకు నాయ‌కులు మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల‌ని..ఇరు పార్టీల్లో చ‌ర్చ అయితే.. జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టార్గెట్ ఎంత‌? అనేది కూడా రెండు పార్టీలు అంచ‌నాకు వ‌చ్చాయి. వైసీపీ 175 ఎందుకు సాధించ‌కూడ‌దు.. అని సీఎం జ‌గ‌న్ నిర్దేశించారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌తంలోనేపార్టీ …

Read More »

టీడీపీలో అంత‌ర్గ‌త టాక్‌.. వారిని క‌దిలించండి బాబూ!

టీడీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ ఊపందుకుంది. పార్టీలో సంఖ్యా ప‌రంగా చూసుకుంటే. టీడీపీకి బాగానే నాయ‌కులు ఉన్నారు. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వ్యూహాత్మ‌కంగా.. అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం.. యువ‌త ఎక్కువ‌గా ఉన్న పార్టీ టీడీపీనే ఇలాంటి వారంతా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పార్టీని గెలిపించాల‌ని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని.. అధినేత చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. సీనియర్లు.. వ్యాపారులు… పారిశ్రామిక వేత్త‌లు.. ఇలా.. అనేక మంది మాత్రం మౌనంగా ఉంటున్నారు. అలాగ‌ని.. వీరికి …

Read More »

31 పైస‌ల కోసం కోర్టుకు లాగిన SBI

బ్యాంకులు చేస్తున్న నిర్వాకాలు.. అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల‌కు ఓ ప‌దివేలు అప్పు ఇవ్వ‌మంటే.. ల‌క్ష సందేహాలు.. నిశిత ప‌రిశీల‌న‌.. శూల శోధ‌న చేసే బ్యాంకులు.. వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను కార్పొరేట్ల‌కు దోచిపెడుతున్నాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే కిక్కురుమనని బ్యాంకులు సాధారణ వ్యక్తులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. సహజంగా బ్యాంకుల …

Read More »

జ‌గ‌న్‌కు బంధువును కాబ‌ట్టే ప‌క్క‌న పెట్టారు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిని ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న అల‌క వ‌హించ‌డం… తాడేప‌ల్లి నుంచి రాయ‌బారాలు జ‌ర‌గ‌డం.. వంటివి తెలిసిందే. త‌న ప‌ద‌వికి రాజీనామా కూడా చేస్తున్న‌ట్టు ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో చెప్పించారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. ఈ విష‌యంపై.. తాను మ‌ధ‌న ప‌డ‌డం లేద‌ని.. అన్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్‌త బాలినేని భేటీ కావ‌డ‌మే! …

Read More »

క్షేత్ర‌స్థాయిలో.. టీడీపీ వ్యూహాత్మ‌క పోరు

రాష్ట్రంలో మారుతున్న ప‌రిణామాల‌ను టీడీపీ నాయ‌కులు చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏవిధంగా అడుగులు వేయాలి..  వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎలా ఎక్కాలి?  వంటి కీల‌క అంశాల‌పై వారు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌ల‌తో ఒక నివేదిక‌ను చంద్ర‌బాబు తెప్పించుకున్నార‌ని తెలిసింది. గ‌డిచిన ఆరు మాసాలుగా జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంద‌నే విష‌యంపై దీనిలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. …

Read More »

జ‌గ‌న్‌కు ఏ రంగు చీర పంపాలి.. రోజా?

లోకేష్‌ను గెలిపించుకోలేని.. చంద్ర‌బాబుకు చీర పంపాలా.. చుడీదార్ పంపించాలా? అంటూ.. ఏపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్య‌ల‌పై.. టీడీపీ తెలుగు మ‌హిళ విభాగం అధ్య‌క్షురాలు.. వంగ‌ల‌పూడి అనిత‌.. ఫైర‌య్యారు. త‌న త‌ల్లిని గెలిపించుకోలేని జ‌గ‌న్‌కు.. ఏ చీర‌పంపించాలంటూ.. ఆమె నిప్పులు చెరిగారు. అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకు రాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి …

Read More »

నేష‌న‌ల్ పాలిటిక్స్.. కేసీఆర్ దూకుడు

భార‌త రాష్ట్ర స‌మితి.. పార్టీ ఏర్పాటు చేస్తే.. ఎలా ఉంటుందంటూ.. టీఆర్ ఎస్ ప్లీన‌రీలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన‌.. సీఎం కేసీఆర్‌.. 24 గంట‌లు కాక‌ముందే..  జాతీయ రాజ‌కీయ ముచ్చ‌ట్ల జోరును పెంచారు. తాజాగా ఆయ‌న జార్ఖండ్ యువ ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌తో ప్రగతి భవన్ లో బేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయ‌న‌తో  చ‌ర్చ‌లు జ‌రిపారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలు సమావేశంలో చర్చకు వ‌చ్చాయ‌ని.. …

Read More »

జ‌గ‌న్.. జీరో.. నీరో: చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. “జ‌గ‌న్ ఒక జీరో.. అంతకు మించిన నీరో..“ అని వ్యాఖ్యానించారు. త‌న అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యాడని  చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం సాధిం చాడని జగన్ మళ్లీ గెలుస్తారన్నారు. వైసీపీకి ఈసారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. …

Read More »