Political News

అమాత్యులయ్యే అదృష్టవంతులు ఎవరో ?

ఉత్తరాదిన ఎదురుగాలి వీచినా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ లో గొడెం నగేష్, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్, మెదక్ లో రఘునందన్ రావు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో …

Read More »

అభిమన్యుడు కాదు అర్జునుడు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎవరినోట విన్నా, ఎక్కడ నలుగురు కలుసుకున్నా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. అవమనానాలు, అవహేళనలను ఎదుర్కొని వెంటబడి మరీ జగన్ ను ఓడించడం వెనక పవన్ కళ్యాణ్ కృషి, పట్టుదల ఉంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ శపథం చేశాడు. అదే లక్ష్యంగా పట్టు వదలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరే వరకు విడిచి పెట్టలేదు. మోడీ, బాబుకు …

Read More »

కంగనాకు చెంప దెబ్బ .. కానిస్టేబుల్ సస్పెండ్ !

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి బీజేపీ లోక్ సభ సభ్యురాలు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేధు అనుభవం ఎదురయింది. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని …

Read More »

బాబు వల్ల అప్పుడు కాలేదు.. మరిప్పుడు?

2014లో ఎన్డీయేతో కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మోడీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కూడా. టీడీపీ వాళ్లకు మంత్రి పదవులు కూడా వచ్చాయి. కానీ ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ సానుకూల ఫలితాలు రాబట్టలేకపోయింది బాబు ప్రభుత్వం. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. అందుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. హోదా …

Read More »

ప్రజలు వైసీపీని ఏమార్చారట

151 కాదు అంతకుమించి.. వైనాట్ 175.. ఎన్నికల ముంగిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ధీమా ఇది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఓటమి ఖాయం అని చెప్పినా సరే.. వైసీసీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కౌంటింగ్ రోజు చూస్తారు కదా అని ధీమాగా మాట్లాడారు. ఈ నెల 9న విశాఖపట్నంలో జగన్ రెండోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం …

Read More »

గురితప్పిన గులకరాయి !

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ బస్సుయాత్రపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయి విసిరిన విషయం ఎంత సంచలనం అయిందో తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అభ్యర్థి బొండా ఉమను అరెస్టు చేస్తారన్న వార్తలు వచ్చాయి. చివరకు సతీష్‌ అనే యువకున్ని అరెస్టుచేసి నెల్లూరు జైలుకు పంపారు. నెల్లూరు జైలులో సుమారు నెల రోజులకుపైగా రిమాండ్‌లో ఉన్న సతీష్‌ బెయిల్‌పై ఈ నెల 3న విడుదలయ్యాడు. అయితే ఈ రాళ్ల …

Read More »

పవన్ తిక్కకూ ఓ లెక్కుంది !

‘ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయ శ్రేణుల నోళ్లలో నానుతుంది. ఏపీ ఎన్నికలలో ఈ సారి పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుకు ఈ డైలాగ్ చక్కగా అద్దంపడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ పదేళ్లు నిరీక్షించి చివరకు విజయం సాధించాడు. నాలుగు పెళ్లిళ్లు, రెండుచోట్లా ఓడిపోయాడు అంటూ అవహేళనలు. కానీ ఇవేవీ పవన్ …

Read More »

తెర మీదకు నితిన్ గడ్కరీ !

400 స్థానాలలో గెలుపు లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో తలపడ్డ బీజేపీ పార్టీ 240 స్థానాలకు పరిమితం అయింది. ఈ నేపథ్యంలో మూడోసారి నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రమైన నాగ్‌పూర్‌లో బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. నితిన్‌ గడ్కరీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ఇవి ఏర్పాటు చేశారు. మోదీ సారథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో …

Read More »

బోరుమంటున్న బెట్టింగ్ బంగార్రాజులు !

ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్‌ (30) అనే వ్యక్తి వైసీపీ …

Read More »

వయనాడ్ కు వణక్కం !

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌లో మరోసారి విజయం సాధించిన రాహుల్‌ ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ స్థానానికి ఎంపీగా కొనసాగుతారు, ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీలోనే ఆయన కొనసాగే …

Read More »

ముగ్గురు నాయకుల స్ఫూర్తి గీతం

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. కానీ ప్రజల మనసులను ఎప్పటికప్పుడు గెలుచుకున్న నాయకులకు బంగారు భవిష్యత్తు స్వాగతం చెబుతూనే ఉంటుంది. ఎంత కిందపడినా సరే లేచే అవకాశాన్ని బంగారు పళ్లెంలో ఇస్తుంది. దానికి మూడు అత్యుత్తమ ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో కేవలం పాతిక లోపే సీట్లకు పరిమితం కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అధికారం ఉందన్న గర్వంతో పాలక …

Read More »

థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీకి బొకే !

వైసీపీ పాలనలో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీ స్థాయి అధికారికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘నన్ను అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లాను. 2023 ఫిబ్రవరి 20 వ తేదీన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ …

Read More »