Political News

రాజకీయ మోక్షం పొందిన రఘువీరా

Raghuveera Reddy

నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 2009లో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే  వైఎస్ చనిపోయినా రఘువీరా మాత్రం ఐదేళ్ళు మంత్రిగానే ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గరా పనిచేశారు. అంటే ఏకధాటిగా పదేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఇపుడిదంతా ఎందుకంటే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం …

Read More »

బాబు స్పీడ్: నెలకు రెండు జిల్లాల్లో పర్యటన

మహానాడు సక్సెస్ స్పూర్తిని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే నెలకు రెండుజిల్లాల్లో పర్యటించబోతున్నట్లు పార్టీనేతలతో చెప్పారు. తొందరలోనే తన పర్యటనకు సంబంధించిన ప్లాన్ డిసైడ్ చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిపోయిన వ్యతిరేకతే మహానాడు విజయానికి కారణమైందని అభిప్రాయపడ్డారు. అప్పుడెప్పుడో ఎన్టీయార్ హయాంలో విజయవంతమైన మహానాడును తాజా మహానాడు విజయవంతం గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిపోయిన వ్యతిరేకతను పార్టీ అడ్వాంటేజ్ …

Read More »

ఈ రాజ్యసభ సీటు వెనుక కథ ఇదేనా?

తెలంగాణాకు చెందిన ఎంతో మంది బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకున్నా రాజ్యసభ ఎంపీగా పనిచేసే అవకాశం డాక్టర్ లక్ష్మణ్ నే వరించింది. లక్ష్మణ్ దశాబ్దాలుగా పార్టీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణా అధ్యక్షుడిగా, రెండుసార్లు ముషీరాబాద్ ఎంఎల్ఏగా కూడా ఈయన పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఎంఎల్ఏగా ఓడిపోయిన తర్వాతే ఈయనకు పార్టీ అగ్రనాయకత్వం …

Read More »

ప్ర‌తి జిల్లాలోనూ టీడీపీ అన్న‌క్యాంటీన్లు

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌ల‌ను ముందుకు తెచ్చింది. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చేరువైన‌.. అన్న క్యాంటీన్ల‌ను వైసీపీ స‌ర్కారు మూసివేసిన నేప‌థ్యంలో ఇప్పుడు పార్టీ ఆధ్వ‌ర్యంలోనే ఈ క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని.. జిల్లాకు ఒక‌టి చొప్పున ఏర్పాటు చేయాల‌ని.. చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లును వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూసి …

Read More »

గాయకుడి మర్డర్.. ఉత్తరాదిన ప్రకంపనలు

పంజాబ్ రాష్ట్రం నిన్నట్నుంచి అట్టుడికిపోతోంది. దీని తాలూకు ప్రకంపనలు ఉత్తర భారత దేశం అంతటా విస్తరిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఒక సెలబ్రెటీ ప్రాణాలు కోల్పోవడమే ఈ ఉద్రిక్తతకు కారణం. సిద్ధు మూసెవాలా.. 28 ఏళ్ల ఈ యువ సింగర్ పంజాబ్‌లో సూపర్ పాపులర్. అంతర్జాతీయ స్థాయిలో అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సినిమాలతో పాటు పాప్ …

Read More »

నారా లోకేష్ పాద‌యాత్ర‌.. ఎప్ప‌టి నుంచి అంటే!

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ త్వరలో పాదయాత్ర చేయ‌నున్నారు. దీనిపై  త్వ‌ర‌లోనే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. మ‌హాత్మా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అక్టోబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్‌.. సగానికిపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర(వ‌స్తున్నా మీకోసం) ప్రారంభించారు. అదే తేదీ …

Read More »

సీటు దక్కలే.. నగ్మా ఫైర్

న‌గ్మా.. తెలుగు ప్రేక్ష‌కులు అంత సులువుగా మారిచిపోయే పేరు కాదిది. ఘ‌రానా మొగుడు స‌హా 90వ ద‌శ‌కంలో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించి నిన్న‌టిత‌రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో బ‌ల‌మైన ముద్ర వేసిన ఉత్త‌రాది భామ ఆమె. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌, మోహ‌న్ బాబు.. ఇలా అప్ప‌టి టాప్ స్టార్లు అందరితోనూ సినిమాలు చేసిన న‌గ్మా.. ఫిలిం కెరీర్ ముగిశాక మ‌ళ్లీ ముంబ‌యికి వెళ్లి సెటిలైపోయింది. అక్క‌డి నుంచే ఆమె …

Read More »

జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గాల్సిందే.. లేక‌పోతే డేంజ‌రే!

భారీ అధికార బ‌లం ఉంది.. ఏమైనా చేస్తాం.. అంటే.. రాజ‌కీయాల్లో కుద‌ర‌దు. పైగా సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఏపీలో ఇది అస‌లే కుద‌ర‌దు. ఇంకా.. కులాల ప్రాతిప‌దిక‌న విడిపోయిన ఏపీ స‌మాజంలో అస‌లే న‌డ‌వ‌దు. ఇవ‌న్నీ ఎందుకుచెప్పాల్సి వ‌స్తోందంటే.. అనేక రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను దృష్టిలో పెట్టుకుని.. ప‌క్క‌న పెట్టిన అనేక కార్య‌క్ర‌మాల‌ను.. అదే ప్ర‌జా బ‌లం త‌న‌కు ఉంద‌ని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ అమ‌లు …

Read More »

బాబుకు ఊపొచ్చింది

ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ ఊపులోనే తొందరలోనే మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని మహానాడు వేదిక మీదే చంద్రబాబునాయుడు ప్రకటించారు. మినీ మహానాడుల నిర్వహణకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయమైంది. ప్రతి మినీమహానాడు మూడు రోజులు జరపబోతున్నారు. బూత్ స్ధాయి నుండి లోక్ సభ నియోజకవర్గ కేంద్రం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్నది నాయకత్వం ఆలోచన. పార్టీ అంచనా ప్రకారం …

Read More »

సోనియా మంచి పనేచేశారా?

కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన వారిలో సీనియర్లు, జూనియర్ల మేలు కలయికగా అధినేత్రి సోనియాగాంధీ ఎంపిక చేశారు. సీనియర్లు చిదంబరం, జై రామ్ రమేష్ ఉన్నారు. అలాగే రణదీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్, మాజీ ఎంపీ పప్పూయాదవ్ భార్య రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, ప్రమోద్ తివారి లాంటి వాళ్ళను సోనియా ఎంపికచేశారు. ఇదే సమయంలో ఎంతగా ప్రయత్నించినా సీనియర్లలో అత్యంత ప్రముఖుడైన గులాంనబీ ఆజాద్ …

Read More »

ఒక్క మ‌హానాడు – అన్నింటికీ సమాధానం చెప్పేసిందా?

ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఒకే ఒక్క మ‌హానాడునిర్వ‌హ‌ణ‌తో తెలుగు దేశం పార్టీ ఆత్మ‌గౌర‌వం .. నిల‌బ‌డింద‌ని.. పార్టీ అభిమానులే కాకుండా.. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ అంటున్నారు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీపై అనేక అనుమానాలు.. సందేహాలు.. ప్ర‌శ్న‌లు ముస‌రుకోవ‌డ‌మే. 2019లో కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైన టీడీపీ నుంచి మ‌రో న‌లుగురు జారిపోయారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ బ‌లం కేవ‌లం 19 మందిదీంతో ఇక‌, …

Read More »

రెడ్ల సింహ‌గ‌ర్జ‌న‌: మ‌ల్లారెడ్డిపై చెప్పులు.. రాళ్లు!

తెలంగాణ‌లోని మేడ్చ‌ల్‌.. ర‌ణ‌రంగంగా మారింది. మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొన్న‌స భ‌లో ప్ర‌జ‌లు ఆయ‌న‌పైనే రాళ్లు .. చెప్పులు విసిరేసి మ‌రీ.. నిర‌స‌న తెలిపారు. కొంద‌రు కుర్చీలు కూడా విసిరేశారు. మంత్రి ప్రసంగిస్తుండగానే ఈ విధంగా నిరసన తెలప‌డంతో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. మరి, ఎందుకిలా జరిగింది? మంత్రి ఏం మాట్లాడారు..? వాళ్లకు ఎందుకు కోపం వచ్చింది? అసలేం జరిగింది అంటే..? తెలంగాణ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల ఐక్య కార్యాచ‌ర‌ణ …

Read More »