వైసీపీ అసహన రాజకీయాలకు ఇదొక నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీద దారుణాతి దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగారు. వైసీపీ కీలక నేత అయితే, ‘సింగిల్ సింహం’ అని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అపారమైన స్వామి భక్తిని చాటుకునే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని జంతువులతో పోల్చుతున్నారు. ఆ జంతువుల్లో హైనా తదితర పేర్లనూ ప్రస్తావించడం అత్యంత శోచనీయం. రాజకీయమన్నాక …
Read More »జనసేనలో కోటీశ్వరురాలు.. మాధవి ఆస్తులు వందల కోట్లు!
సామాన్యులకు టికెట్ లు ఇస్తామని.. వారిని గెలిపించుకుంటామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. సమయా నికి తగిన విధంగానే(అంటే.. ప్రత్యర్థి పార్టీలు ఇస్తున్న టికెట్లు.. వారి అభ్యర్థుల ఆర్థిక బలం, అంగ బలాలను దృష్టిలో ఉంచుకునే) అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కోటీశ్వరుడు అన్న విషయం తెలిసిందే. ఇక, ఆయన టికెట్ ఇచ్చిన వారిలో ఒకే ఒక మహిళ ఉన్నారు. ఆమే లోకం మాధవి. బ్రాహ్మణ …
Read More »రెడ్డి ఉద్యమ నాయకుడిగా కాపు ఉద్యమ నాయకుడు
ఏపీ రాజకీయాల్లో సవాళ్ల పర్వం ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నాయకులు మాటలకు పదును పెంచుతున్నారు. ముఖ్యంగా జనసేన తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నవారు సవాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నికలకు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజకీయం కాకెక్కింది. కేకపుట్టిస్తోంది. తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ, టాలీవుడ్ నటుడు.. పృథ్వీ రాజ్.. జనసేన తరఫున ప్రచారం చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు, సవాళ్లు విసిరారు. …
Read More »అన్న జగన్కు ఉన్న 82 కోట్ల బాకీపై షర్మిల షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా తన అన్న సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా పేరు చెప్పకుండానే.. చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. గిఫ్ఠ్ ఇచ్చినట్టుగా భావిస్తారని షర్మిల అన్నారు. శనివారం కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షర్మిల.. అనంతరం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. దీనిలో తన అన్న సీఎం …
Read More »మొన్న నాలుగో పెళ్లాం.. ఇప్పుడు పరదాల మహరాణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం …
Read More »అరవింద్ మాటల వెనుక అంతరార్థం ఏంటి ?
‘’తెలంగాణలో బీజేపీతో కొట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ ఎన్నడూ కొట్లాడింది లేదు. తన పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కరంట్ సరఫరా చేశానని ఓట్లడిగే హక్కు ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉన్నది’’ అంటూ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ‘’కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక ఎజెండా అంటూ లేదని, దేశాన్ని …
Read More »ఉండి నుంచే ఆర్ఆర్ఆర్.. మొత్తం ఐదు మార్పులు
మొత్తానికి సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. ఆదివారం నాడు మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చేశారు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రఘురామ కృష్ణంరాజు అభ్యర్థిత్వం విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఆయన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. …
Read More »హిందూపూర్ గ్రౌండ్ రిపోర్ట్.! బాలయ్య హ్యాట్రిక్ పక్కా.!
టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందనున్నారా.? అదీ మంచి మెజార్టీతో.? ఔననే అంటున్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు.! రాష్ట్రంలో హిందూపురం ఓ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గమనే చెప్పాలి. కేవలం నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండడమే కాదు, ఇతరత్రా ఫ్యాక్టర్స్ చాలానే వున్నాయ్. కుల సమీకరణాలు సహా, చాలా ఈక్వేషన్స్ హిందూపూర్ నియోజకవర్గాన్ని చాలా చాలా స్పెషల్గా మార్చేశాయి. అయితే, ఓ ఏడాది …
Read More »బీఫారాలు ఇచ్చేశారు..జెండాలను తగుల బెట్టారు
టీడీపీలో కీలక ఘట్టానికి పార్టీ అధినేత చంద్రబాబు తెరదీశారు. కూటమిలో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు 144 మంది అభ్యర్థులకు పార్టీ తరఫున బీఫారాలు అందించారు. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న 17 స్థానాలకు కూడా.. ఆయన ఆయా అభ్యర్థులకు బీఫారాలు అందించారు. ఉండ వల్లిలోని చంద్రబాబు నివాసంలో …
Read More »ఆ నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుండి బరిలోకి దింపిన నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ నుండి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, భువనగిరి నుండి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణలు ఇప్పటికే నామినేషన్లు …
Read More »కడపలో షర్మిల ఎత్తులు ఫలిస్తాయా ?
కడప జిల్లా మీద వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని ముఖ్యమంత్రి జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య తలెత్తిన విభేధాల మూలంగా ఈ సారి ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల మధ్య పెరిగి పెద్దయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసింది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకోసం పనిచేసింది. ఆ తర్వాత …
Read More »పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటన నేపథ్యంలో అస్వస్థతకు గురయ్యారు పవన్ కళ్యాణ్. అనంతరం, ఆయన కోలుకున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే వున్నారు. జనసేన పార్టీకి సంబంధించినంతవరకు పవన్ కళ్యాణ్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుకే, జనసేనాని ఎన్నికల ప్రచారం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates