Political News

చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా?

తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండాలంటే పార్టీలో యువతకు పెద్ద పీట వేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకనే పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించటంలో భాగంగానే టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడినా పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా లోకేష్ మాట్లాడుతూ రెండు సార్లకన్నా పదవుల్లో ఉండేందుకు లేదన్నారు. తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి …

Read More »

TDP: అన్నకు పోటీగా తమ్ముడు

ఇపుడిదే విషయం పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. పనిలోపనిగా మహానాడులో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోటీగా సొంత తమ్ముడు కేశినేని చిన్ని పార్టీలో హైలైట్ అవుతున్నారు. ఈయన కొంతకాలంగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు తన ఫొటోలను మాత్రమే చిన్ని పెట్టారు. స్వయానా సోదరుడైనా …

Read More »

ఏపీలో రాజ‌కీయ యాత్ర‌లు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్‌

ఏపీలో ఎన్నిక‌ల ర‌చ్చ మామూలుగా లేదుగా.. అనే మాట వినిపిస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించిన అన్ని ప్ర‌ధాన పార్టీలు.. అప్పుడే వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను తెర‌మీదికి తెచ్చాయి. నిజానికి ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం అంటే.. పెద్ద‌గా ఎలాంటి ఊపు క‌నిపించ‌దు. కానీ, ఏపీలో మాత్రం ప‌రిస్తితి దీనికి భిన్నంగా ఉంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. మ‌రోవైపు.. అధికార పార్టీ వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌పకు అంటూ.. ప్ర‌జల్లోకి అడుగులు వేస్తోంది. ఇది …

Read More »

ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై వైసీపీలో ఆందోళ‌న

ఏమాట‌కు ఆ మాటే చెప్పుకోవాలి. వైసీపీ నాయ‌కులు.. ప్ర‌తిప‌క్షాలు. మేధావులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ఆయా నేత‌లు.. పార్టీలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై అంతో ఇంతో దృష్టి పెట్టేవారు కూడా ఉన్నారు. చాలా మంది పైకి మాత్రం .. దురుద్దేశ పూర్వ‌కంగానే త‌మ ప్ర‌భుత్వంపై రాళ్లు వేస్తున్నారని.. బుర‌ద జ‌ల్లుతున్నార‌ని.. చెబుతున్నారు. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం. కానీ, మ‌రికొంద‌రు సీనియర్లు.. పార్టీకి నిజంగా మేలు చేయాల‌ని భావించేవారు …

Read More »

కుంభ‌కోణాలు బ‌య‌ట పెడ‌తా: నారా లోకేశ్

పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని లోకేశ్ చెప్పారు. మహానాడు తరువాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నట్లు వెల్లడించారు. మహానాడు సందర్భంగా లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడినవారికి ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు  నారా …

Read More »

ముంద‌స్తుకు కేసీఆర్‌… కానీ ఒక‌టే స‌మ‌స్య‌!?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  మ‌దిలో ముంద‌స్తు ఎన్నిక‌లు మెదులుతున్నాయా?  గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో ఉంచిన కేవ‌లం రాజ‌కీయ వ‌ర్గాలు మాత్ర‌మే చ‌ర్చ‌ల్లో ఉంచిన అంశాన్ని ఇప్పుడు ఏకంగా త‌న పార్టీ ముఖ్యుల‌తో క‌లిసి ఎందుకు ప్ర‌చారంలో ఉండేలా చేస్తున్నారు?  వ్యూహాత్మ‌కంగానే త‌న ఎన్నిక‌ల అజెండాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారా? ఈ చ‌ర్చ తాజాగా బీజేపీపై ఎదురుదాడి చేసే క్ర‌మంలో తెర‌మీద‌కు వ‌స్తోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ పర్య‌ట‌న సంద‌ర్భంగా …

Read More »

మ‌హాన‌డు తీర్మానాలు.. ఏపీ తెలంగాణ‌ల‌పై కీల‌క చ‌ర్చ‌!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలులో నేటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్ర‌ధానంగా.. ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు.. ప్ర‌భుత్వ భారాలు.. చెత్త‌పై ప‌న్ను.. రైతుల‌కు విద్యుత్ మీట‌ర్లు.. ఉద్యోగాలు లేక‌పోవ‌డం.. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులు.. చిన్నారుల‌పై జ‌రుగుతున్న అకృత్యాలు వంటి అనేక అంశాల‌ను …

Read More »

హిందూపురంలో బాల‌య్య‌కు నో ఎంట్రీ

శ్రీస‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, న‌టుడు.. నంద‌మూరి బాల‌య్య‌ను ఇక్క‌డ ప‌ర్య‌టించేందుకు పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆయ‌న వెళ్లేందుకు వీలు లేదంటూ.. పోలీసులు.. నిలిపివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఏం జ‌రిగింది? శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం మాజీ సర్పంచ్ బాలాజీ ఇంటిపైకి …

Read More »

మ‌హానాడు.. తెలుగు జాతి పండ‌గ‌: చంద్ర‌బాబు

మహానాడు కేవ‌లం టీడీపీ పండుగ మాత్ర‌మే కాద‌ని.. తెలుగుజాతికి పండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. టీడీపీ ఉన్నంత వ‌ర‌కు మ‌హానాడు ఉంటుంద‌న్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు. చేతకాని దద్దమ్మ జగన్  వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది …

Read More »

పవన్ చూస్తు ఉండాల్సిందేనా ?

మిత్రపక్షం బీజేపీ నేతలు ఒంటెత్తు పోకడలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తూ ఊరుకోవటం మినహా చేయగలిగిందేమీ లేదని అర్థమైపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మీడియా సమావేశంలో ప్రకటించేశారు. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనకు చాలాకాలం ముందే వీర్రాజు ఇలాంటి ఓ ప్రకటన చేశారు. అయితే అప్పట్లోనే జనసేన నుంచి అభ్యంతరాలు …

Read More »

కేసీయార్ సక్సెస్ అవుతారా?

నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ మార్గంలోని ఉజ్వల్ భారత్ సాధించాలన్న కోరిక కేసీయార్ లో బలంగా ఉంది. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే కీలకమైన పాయింట్. కారణం ఏమిటంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటేనే జరిగే పని కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను దూరంగా పెట్టి జాతీయ స్ధాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయటం సాధ్యమయ్యే పని కాదు. …

Read More »

NTR 100: ఎన్టీఆర్ లో మ‌రో కోణం.. ఇదే!

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు ..పుట్టిన రోజు (మే 28) సంద‌ర్భంగా ప్ర‌త్యేక వ్యాసం ఇది. వందేళ్ల ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అన్న ప్ర‌శ్న నుంచి ఆయ‌న జాతిని  న‌డిపిన వైనం వ‌ర‌కూ అన్నీ చ‌రిత్ర‌కు తూగే విష‌యాలే. చ‌రిత్ర‌కూ చ‌ర్చ‌కూ తూగే విష‌యాలే. ఎన్టీఆర్ బాగా చ‌దువుకున్న వారే కాదు.. బాగా చ‌దువుకున్న వారిని ప్రోత్స‌హించిన వారు కూడా!యువ‌కులు చ‌దువుకుంటేనే రాణింపు.. చ‌దువుతోనే ఏ …

Read More »