ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి జనసేన కూటమికి మద్దతు దక్కుతున్న వైనాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవే స్వయంగా పిఠాపురంలో తన తమ్ముడికి ఓటు వేయమని వీడియో మెసేజ్ రూపంలో పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా సంచలనంగా …
Read More »జగన్లో ఓటమి భయానికిది సంకేతమా?
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష టీడీపీ-జనసేనలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓడితే ఇరు వర్గాల భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్.. ఈసారి తీవ్ర వ్యతిరేకత మధ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తనపై …
Read More »పథకాల మాట ఎత్తొద్దు: జగన్కు ఈసీ షాక్!
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల సమయంలో ప్రస్తావించడానికి వీల్లేదని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చేతులు కాళ్లు కట్టేసి నట్టు అయింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించరాదని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వడానికి వీల్లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ …
Read More »మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ ‘ప్రజాగళం’లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో ఉండడంతో ఈ సభకు రాలేదు. అయితే.. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మరి కూటమి పార్టీల కీలక నేత లేకపోతే..ఎలా అనుకున్నారా? ఇక్కడే నారా లోకేష్ ఆ భర్తీ పూర్తి చేశారు. ఈ రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్, నారా లోకేష్ మాత్రమే పాల్గొన్నారు.ఇక, మోడీ …
Read More »ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ అధికారంలోకి వరుసగా మూడోసారి రానుందని తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు. అనకాపల్లి బెల్లం అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. అలాంటి తీయటి ప్రభుత్వమే ఏపీలో ఏర్పడనుందని చెప్పారు. జూన్ 4న వచ్చే ఫలితాలు.. …
Read More »వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు షాక్లు ఇస్తోంది. ఇప్పటికే రెండంకెల సంఖ్యలో అధికారులు బదిలీ అయ్యారు. వారిలో చాలామంది అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వారిలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నది రెండేళ్లుగా డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డినే. ఈయనపై చర్యలు చేపట్టాలని …
Read More »ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట హాట్ టాపిక్గా మారింది. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని.. ఈ చట్టంలోని లొసుగలను ఉపయోగించుకుని వైకాపా నాయకులు భూములు దోచేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. జగన్ సర్కారు ఓటమికి కారణమయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. …
Read More »అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంబటి అంత నీచ నికృష్టుడు ఇంకొకరు ఉండరని.. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరిస్తూ గౌతమ్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సొంత అల్లుడే అంబటి మీద ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అంబటి వ్యక్తిత్వం …
Read More »ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు కనిపించాయి. టీడీపీ ఓటమి, వైసీపీ గెలుపు ఎన్నికలకు ముందే ఖరారైపోయిందన్నది స్పష్టం. కానీ టీడీపీ అంత చిత్తుగా ఓడిపోతుందని.. వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధిస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఐతే అప్పుడు అంతటి విజయం సాధించిన జగన్ సర్కారు.. ఐదేళ్ల పాలనతో టీడీపీని మించి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న …
Read More »ప్రచారంలో దుమ్మురేపుతున్న భర్తలు!
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది కూడా నామమాత్రంగానే. వైఎస్ రాజశేఖరరెడ్డి 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ ఆయన సతీమణి విజయమ్మ బయటకు రాలేదు. కనీసం జెండా కూడా పట్టుకోలేదు. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. ఇక, అన్నగారు ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం కూడా.. ఏనాడూ బయటకు వచ్చి.. పార్టీ కోసం పనిచేయలేదు. …
Read More »తెరపైకి మరోసారి బెట్టింగులు.. ఏపీలో హాట్ సీట్లపైనే!
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ భారీ ఎత్తున పందేలు కూడా సాగుతుంటాయి. అనేక సందర్భాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఇక్కడ బెట్టింగులు ఖాయం . ఎక్కడ క్రికెట్ జరిగినా.. ఇక్కడ కోట్లు కదలడం ఖాయం. సో.. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల విషయంలో కూడా …
Read More »చంద్రబాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు ఎవరూ.. ఆయనను పొగడడం లేదనే చింత ఉంది. ప్రధానంగా ఏపీలో చంద్రబాబు మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఎంత ఉందనేది వారు చెప్పడం లేదు. గతంలో నెల రోజుల కిందట లేదా ఆపైన.. ప్రధాని ఏపీకి వచ్చారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సభలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates