Political News

ఇక్కడ కూడా ‘దొంగ ఓట్లు’ వసేసారట?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి గురువారం జ‌రిగిన ఉప ఎన్నిక‌… అనేక చిత్ర విచిత్రాల‌కు నిల యంగా మారింది. ఓవైపు.. సింప‌తీ ఓట్ల‌ను త‌న వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నాలు చే స్తున్నా.. ఎక్క‌డో బెడిసికొట్టిన నేప‌థ్యంలో దొంగ ఓట్ల ప‌ర్వానికి తెర‌దీసింద‌ని.. బీజేపీ నాయ‌కులు విమ‌ర్శిస్తు న్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. బీజేపీ అభ్యర్థి …

Read More »

మాజీ సీఎం న‌ల్లారి రీఎంట్రీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఏపీలో అడుగు పెట్ట‌నున్నారా? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ నుంచే పోటీ చేయ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆయ‌న స‌హ‌చ‌రులు.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు.. తాజాగా ఆయ‌న చిత్తూరు జిల్లా కలికిరిలో ప‌ర్య‌టించారు. కలికిరి లో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పారు. ఈ …

Read More »

సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు. ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసింది. ఏ అధికారంతో మీరు మీ పార్టీకి భూములు కేటాయించారు? మీరు ప్ర‌భుత్వ పాల‌కుడా? లేక‌.. పార్టీ పాల‌కుడిగా అధికారం చేప‌ట్టారా? ప్ర‌జ‌లు మీకు.. అధికారం ఎందుకు ఇచ్చారు. మీ పార్టీకి భూములు కేటాయించుకునే హ‌క్కు మీకు ఎక్క‌డిది? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. విష‌యం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి …

Read More »

బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లేనా ?

మిత్రపక్షం బీజేపీకి జనసేన హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది. ఏ విషయంలో హ్యాండిచ్చిందంటే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో. ఆత్మకూరులో పోటీ చేస్తున్నట్లు అప్పట్లో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించారు. జనసేనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినా కనీసం వాళ్ళతో బీజేపీ సంపద్రించనుకూడా లేదు. ఎలాగూ తమకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదు కాబట్టే సోము వీర్రాజు ప్రకటనను జనసేన నేతలు కూడా పట్టించుకోలేదు. సరే అభ్యర్థి ప్రకటన …

Read More »

వీళ్ళకన్నా కేఏ పాలే బెటరా ?

తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. …

Read More »

‘అమ్మ ఒడి’ ల‌క్ష‌ల మందికి కోత‌.. 27న డ‌బ్బుల విడుద‌ల‌

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం అందుకుంటున్న వారిలో.. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది..! దీంతో ల‌క్ష మంది అమ్మ‌ల‌కు ‘అమ్మ ఒడి’ ప‌థ‌కం దూరం అయిపోయింది. నవరత్నాల్లో ప్రతిష్టాత్మక పథకమైన “అమ్మఒడి” పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. …

Read More »

మోడీ-షాల ప‌ద‌వీ దాహం.. ప్ర‌జాస్వామ్యానికి తూట్లు!

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనం అంచున నిలిచింది. న‌రేంద్ర మోడీ ప్రధానిగా, అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మ‌హారాష్ట్ర కూడా చేరిపోతోంద‌నే వాద‌న బ‌లంగా …

Read More »

గోడ క‌ట్టుకోండి.. అయ్య‌న్న కుటుంబానికి హైకోర్టు ఆదేశం

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమంగా గోడ కూల్చి వేయడంతో పిటీషన్‌ వేయాలని హైకోర్టు అయ్యన్న తరపు న్యాయవాదులను ఆదేశించింది. దీనిపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అధికారుల చ‌ర్య‌లు దారుణంగా ఉన్నాయ‌ని.. కోర్టు తెలిపింది. దీనిపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సంబంధిత శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ …

Read More »

విశాఖ‌కు ఇన్ఫోసిస్‌… ఆరోజు బాబు మీటింగ్ ఫలించినట్టేగా

కార్పొరేట్లకు విశ్వాసం కల్పించడం చంద్రబాబుది పై చేయి అనే మాట…చివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా బయటకు ఒప్పుకోకపోయినా దీనిని అంగీకరిస్తారు. ఒక సమయంలో కేటీఆర్ కూడా దీనిని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతెందుకు ఇటీవల 20 ఏళ్ల స్నాతకోత్సవం జరుపుకున్న ఐఎస్బీ అధికారికంగా చంద్రబాబు వల్లే ఇక్కడకు వచ్చాం అని చెప్పిన విషయం కూడా తెలిసిందే. చంద్రబాబుకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య అనుబంధమే 2003లో ఆయన ఓడిపోవడానికి, 2014లో ఆయన …

Read More »

ఈ గ‌ట్టునుందామా? ఆ గ‌ట్టుకెళ్దామా? కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. బీజేపీయేత‌ర కూట‌మి పార్టీలు.. ఏకంగా 17 పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హాను రంగంలోకి దింపాయి. ఇక బీజేపీ కూట‌మి పార్టీలు.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ద్రౌప‌దీ ముర్మును ఎంపిక చేశాయి. ప్ర‌స్తుతం బీజేపీకి 48.6 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇక‌, బీజేపీ అభ్య‌ర్థి గెలిచేందుకు కేవ‌లం 2 శాతం ఓట్లు ఉంటే స‌రిపోతుంది. అయినప్ప‌టికీ.. …

Read More »

ఆనంను దూరం పెట్టేసినట్లేనా ?

మాజీ మంత్రి సినియర్ నేత, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టేసినట్లేనా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆనం ఎక్కడా కనబడలేదు. మంగళవారం ప్రచారం కూడా ముగిసిపోయింది. అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కానీ లేదా విడిగా కూడా ఆనం ప్రచారం చేసినట్లు కనబడలేదు. ఉప ఎన్నికలో ప్రచారం కోసం కొందరు మంత్రులు, …

Read More »

‘మహా’ సంక్షోభం బీజేపీ పనేనా ?

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం హఠాత్తుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కూటమిలోని కీలక భాగస్వామి శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ శిందే నాయకత్వంపై తిరుగుబాటు లేవదీయటంతో సంక్షోభం తప్పలేదు. తన మద్దతుదారులతో కలిసి శిందే సూరత్ లోని ఒక హోటల్లో క్యాంపు పెట్టారు. దాంతో శివసేనలో ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ? ఎప్పుడు కూలిపోతుందో ? అనే టెన్షన్ మొదలైపోయింది. నిజానికి ఇంత హఠాత్తుగా ప్రభుత్వంలో …

Read More »