వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏకమవుతాయా ? ఈ విషయంపై క్లారిటీ రావటానికి ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడే ఏకమవ్వటం ఏమిటి ? ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారంలో మాత్రం ఏకమయ్యాయనే చెప్పాలి. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై రెండు పార్టీలు ఏకకాలంలో నిరసన కార్యక్రమాలు, వ్యతిరేక ప్రచారం చేయాలని అనుకోవటమే విచిత్రంగా ఉంది. రెండు పార్టీలు ఒకేసారి ఒకే అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు …
Read More »ఏపీ రాజకీయాల్లో అందరూ మోడీ దాసులేగా…!
ఎందుకో.. ఏమిటో.. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే మాట వినిపిస్తోంది. ‘ఏపీలో అందరూ దామోదర దాసులే బ్రో అనే మాట జోరుగా వినిపిస్తోంది. దీంతో ఇది ఆసక్తికర చర్చకు కూడా దారితీస్తోంది. ఇంతకీ దామోదర దాస్ ఎవరు? అంటే.. మన ప్రధాన నరేంద్ర మోడీ. ఆయన అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మోడీ ఆయన ఇంటి పేరు, దామోదర్ దాస్ ఆయన తండ్రిపేరు. అసలు పేరు …
Read More »వెంకయ్య సాటి ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఉన్నారా..?
ముప్పవరపు వెంకయ్య నాయుడు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి. త్వరలోనే(ఆగస్టు 11న) రిటైర్ కానున్నారు. అయితే.. ఆయన దీనికి ముందు.. సుదీర్ఘకాలంగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఇలా అనేక రూపాల్లో ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారనడంలో సందేహం లేదు. సరే.. రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. అనుకుంటే.. ఇలాంటి నాయకుడు మళ్లీ ఎవరున్నారు? అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతిగా …
Read More »షర్మిలకు అంత సీనుందా ?
క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ గ్రహణం పడుతుందనే చర్చ పెరిగిపోతోంది. కాంగ్రెస్ కు షర్మిల పార్టీ గ్రహణం పట్టడం ఏమిటి ? ఏమిటంటే షర్మిల పార్టీ సొంతంగా ఎక్కువ నియోజకవర్గాల్లో గెలవలేకపోవచ్చు. కానీ దాని ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపై తప్పకుండా పడుతుందనే చర్చ పెరిగిపోతోంది. దీనికి హేతువు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా …
Read More »జగన్ ను మరోసారి ఇరిటేట్ చేయనున్న పవన్
విషయం పాతదే అయినా చెప్పటమే కొత్తగా చెప్పాలని జనసేన ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని రోడ్ల పరిస్దితిపై జనసేన ఈనెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ డిజిటల్ ప్రచారానికి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల దుస్ధితిని ఫొటోలు, …
Read More »రాజపక్స పరిస్దితి ఇలాగైపోయిందే
ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనే సామెతకు శ్రీలంకలో తాజా పరిస్ధితులే నిదర్శనం. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల వరకు అత్యంత విలాసంగా గడిపిన అధ్యక్షుడు గొటబాయ కుటుంటం ఇపుడు దేశాన్ని వదిలిపారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను ఉన్నతాధికారులు, ప్రజలు కలిసి అడ్డుకోవటంతో మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. శ్రీలంకలో ప్రస్తుత అరాచకానికి గొటబాయ కుటుంబమే ప్రధాన కారణం. ఎలాగంటే గొటబాయ రాజపక్స …
Read More »మూడు సింహాలపై తీవ్ర దుమారం
భారత జాతీయ చిహ్నం.. మూడు సింహాలపై ముప్పేట దుమారం రేగింది. దేశవ్యాప్తంగా అన్ని బీజేపీయేతర పార్టీలు.. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోడీ నిర్వాకంతో భారత్ పరువు మంటగలుస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం.. రాజకీయ దుమారానికి కారణమైంది. కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో …
Read More »ఒక వేదికపై బీజేపీ, టీడీపీ
నిన్న మొన్నటి వరకు దూర దూరంగా ఉన్న బీజేపీ-టీడీపీలు ఒకే వేదికను పంచుకున్నాయి. మనసులు కలిసినా.. కలవకపోయినా..ప్రస్తుతానికి చేతులు కలిసాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న దరిమిలా.. ఇరు పార్టీల మధ్య రాజకీయం మారిపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ నేతలతో భేటీ కోసం .. కిషన్ …
Read More »ఉచిత పథకాలపై ఆధారపడితే షార్ట్ సర్కూట్ తప్పదు: మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. విషయం ఏదైనా.. ఆయన చాలా ఆచితూచి వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలకు.. చురకలు అంటించాలన్నా.. విపక్షాలపై దూకుడు ప్రదర్శించాలన్నా.. ఆయన టూవే లైన్లో వస్తున్నారు. ఇప్పుడు ఇలానే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సంక్షేమ పథకాలు.. ఉచిత పథకాల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు అప్పులు చేసి మరీ డబ్బులు పంచుతున్న విషయం తెలిసిందే …
Read More »మోడీకి భయపడ్డ శివసేన? ఉద్ధవ్ యూటర్న్.. ముర్ముకు మద్దతు!
మహారాష్ట్ర రాజకీయం మరోసారి సంచలనంగా మారింది. ఇక్కడి ఉద్దవ్ ఠాక్రేను బీజేపీ పడగొట్టిన విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల సూచనలతోనే తాము రెబల్గా మారామంటూ.. ఏక్నాథ్ షిండే ప్రకటించిన విషయం సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అదే ఉద్దవ్ ఠాక్రే.. ఇప్పుడు అదే బీజేపీకి సన్నిహితుడు కావడమే ఇప్పుడు మరో ట్విస్ట్. నిన్నగాక మొన్న తన నిండు ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీతో …
Read More »నవరత్నాల ను మించిన పథకాలు లేనేలేవట
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందే వచ్చింది. ముప్పేట చుట్టుముట్టిన రాజకీయ విమర్శలు ఒకవైపు.. ప్రజల్లోకి వెళ్లి గెలుపు గుర్రం ఎక్కాల్సిన అవసరం ఇంకో వైపు.. నాయకులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. పథకాలనే తాను నమ్ముతున్నానని.. నవరత్నాల ను మించిన పథకాలు లేనేలేవని.. చెబుతున్నారు. నవరత్నాలతోనే గెలిచాం.. మళ్లీ వాటితోనే గెలుస్తున్నాం.. అని ఆయన స్పష్టం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయి …
Read More »కృష్ణాజిల్లా వైసీపీలో ఆ నలుగురి ఓటమి రాసిపెట్టుకోవచ్చా!
కృష్ణాజిల్లా వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేల విషయం ఆసక్తిగా మారింది. ఆ నలుగురి ఓటమిని రాసిపెట్టుకోవచ్చని.. పార్టీలో సీనియర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గాలు ఇవేనా.. అంటూ.. ఆసక్తికర చర్చ సాగుతోంది. పామర్రు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ వరుస ఎన్నికల్లో వైసీపీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తున్న పరిస్థితి ఉంది. 2014, 2019లో వైసీపీ అభ్యర్థులే విజయం దక్కించుకున్నారు. కైలే అనిల్కుమార్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, …
Read More »