సాయిరెడ్డి వ‌ర్సెస్ టీడీపీ.. ఓ రేంజ్‌లో !

ఏపీలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి వ‌ర్సెస్ .. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క పార్టీ టీడీపీ మ‌ధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలో గ‌త వారం రోజులుగా జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే.. రాష్ట్రం మ‌హిళ‌ల‌కు 24 గంటల్లో న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. దిశ అంటూ.. ద‌శ దిశ‌లా చాటారు క‌దా.. ముందు అదేమైందో చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌పై దారుణాలు జ‌రిగిన‌ప్పుడు.. మీరేం చేశారో.. చెప్పాలి అంటూ.. టీడీపీ నాయ‌కులు నిల‌దీస్తున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం ఓ స్తాయిలో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

సాయి రెడ్డి ఏమ‌న్నారు?

కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అన్యాయానికి గుర‌య్యే మ‌హిళ‌ల‌కు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడేమైంది? అంటూ మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్ష‌తో వైసీపీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా టీడీపీ దిశ చ‌ట్టాన్ని ప్ర‌స్తావించింది. లేని చ‌ట్టాన్ని ఉంద‌ని భ్ర‌మించేలా చేస్తూ.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఎంత మంది గొంతులు కోసిందో కూడా వివ‌రించు సాయిరెడ్డీ! అంటూ ఎదురు ప్ర‌శ్నించింది.