Political News

తిరుప‌తిలో షాక్ త‌గ‌ల‌బోతోందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంకో మూడు రోజుల్లో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌లు మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. గెలుపు కోసం ఆయా పార్టీల వాళ్లు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి పోరాడుతున్నారు. స‌ర్వేల్లో చాలా వ‌ర‌కు ఎన్డీయే కూట‌మి వైపే మొగ్గు క‌నిపిస్తుండ‌గా.. వైసీపీని అంత త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేద‌ని… పోటీ గ‌ట్టిగానే ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల …

Read More »

జ‌గ‌న్ పిలిచి ప‌ద‌వులిస్తే.. ప‌ట్టించుకోకుండా ఉంటున్నారే!

త‌మ రాష్ట్రం కాదు త‌మ పార్టీ కూడా కాదు.. కానీ త‌న అవ‌స‌రాల కోసం జ‌గ‌న్ పిలిచి మ‌రీ వాళ్ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. తీరా ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వాళ్లు క‌నీసం జ‌గ‌న్ ముఖం కూడా చూడ‌టం లేదు. ప్ర‌చారం సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌నీసం జ‌గ‌న్ను కూడా వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. జ‌గ‌న్ ఏరికోరి ప‌ద‌వులు ఇచ్చిన వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఇప్పుడు ప‌త్తాలేకుండా …

Read More »

వాలంటీర్ల‌కు ఫోన్లు, బైక్‌లు.. ఓట్ల కోసం వైసీపీ వ్యూహం!

ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌నే అధికార దాహంతో ఉన్న వైసీపీ దేనికైనా తెగించేందుకు వెనుకాడ‌టం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఓట్లు పొందేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు, నాయ‌కుల‌పై దాడులతో పాటు జ‌నాల‌ను మ‌భ్య పెడుతూ వైసీపీ సాగుతోంద‌నే టాక్ ఉంది. ఇక వాలంటీర్ల‌నే ప్ర‌ధానంగా న‌మ్ముకున్న వైసీపీ వాళ్ల‌తో ఓట్లు పొందేందుకు వ్యూహాలు అమ‌లు చేస్తుంద‌ని తెలిసింది. వాలంటీర్ల‌తో ప్ర‌చారం చేయించొద్ద‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించినా …

Read More »

గంటాకు సినీ గ్లామ‌ర్‌.. ప్ర‌చారాన్ని హోరెత్తించిన న‌మిత‌

ఎన్నిక‌ల వేళ నాయ‌కుల‌కు సినీ గ్లామ‌ర్ కూడా క‌లిసి వ‌స్తోంది. అయితే.. గ‌తంలో మాదిరిగా పెద్ద‌గా సినీ తారలు ఇప్పుడు ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు. ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మాత్రం పిఠాపురంలో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. నారా లోకేష్‌కు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు.. ఈ కుటుంబంలోని ఒక‌రిద్ద‌రు న‌టులు ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కు మించి పెద్ద‌గా సినీ గ్లామ‌ర్ ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు. కానీ, టీడీపీ నాయ‌కుడు, …

Read More »

ఖమ్మం టీడీపీ ఆఫీసుకు పెరిగిన డిమాండ్ !

తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని నేరుగా కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీ కార్యాలయానికి అందరూ క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయం చుట్టూ ఖమ్మం లోక్ సభ …

Read More »

కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ రెండు పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేజీ కూడా తోడవడంతో కూటమి బలం ఇంకా పెరిగింది. ఇది వైసీపీలో గుబులు పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వల్ల ఓట్ల పరంగా జరిగే లాభం కంటే.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు చేయకుండా అడ్డుకోవడం ద్వారా జరిగే మేలు ఎక్కువని …

Read More »

ఆ మూడూ గెలవకుంటే .. మూడు ముక్కలాటే !

మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ కు తప్పనిసరి అవసరంగా మారింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో, రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లి నాగర్ కర్నూలు పరిధిలో ఉండగా సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు మల్కాజ్ గిరి నుండి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అందరి …

Read More »

20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి-జగన్

ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని పదే పదే జగన్ చెప్పుకుంటుంటే.. జగన్ విస్మరించిన హామీలంటూ ఆయన ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలనే షేర్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. జగన్ మాట తప్పిన హామీల్లో ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ …

Read More »

గోనె వారి స‌ర్వే… కూట‌మి వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. లెక్క తేల్చేశారు!

గోనె ప్ర‌కాశరావు. త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయ‌కుడు.. ఒక‌ప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి మిత్రుడు. తాజాగా ఈయ‌న ఏపీ పాలిటిక్స్‌పై సంచ‌ల‌న స‌ర్వే అంటూ ఒక‌టి విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈయ‌న తెలంగాణ‌లో ఉంటున్నారు. మ‌రి ఆయ‌న‌కు ఏపీలో ఎక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో తెలియ‌దు కానీ.. తాను మాత్రం తెలుసుకున్న‌ట్టు వివ‌రించారు. స‌రే.. ఎన్నిక‌ల వేళ ఏదైనా హాట్ టాపిక్కే క‌దా! సో.. …

Read More »

జగన్ ఎందుకు పవన్ పెళ్లిళ్లపై మాట్లాడతాడంటే..

పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో తెలిసిందే. పవన్‌ను పేరు పెట్టి పిలవకుండా ‘దత్తపుత్రుడు’ అనడం.. తానుఎక్కడ మాట్లాడుతున్నది కూడా చూసుకోకుండా స్కూల్ పిల్లలున్న సభల్లోనూ ఆయన పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడ్డం.. కార్లను మార్చినట్లు ప్రతి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడని కామెంట్లు చేయడం మామూలే. తాజాగా జగన్ ఒక టీవీ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన …

Read More »

జ‌గ‌న్ ఫారిన్ టూర్‌కు అనుమ‌తి ఇవ్వొద్దు: సీబీఐ

ఏపీ సీఎం జ‌గ‌న్ ఈ నెల 17 నుంచి విదేశాల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉండ‌డంతో దీనికి కోర్టు నుంచి అనుమ‌తి రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఈ నెల 6వ తేదీనే.. హైద‌రాబాద్ లోని సీబీఐ కోర్టులో విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై గురువారం సీబీఐ …

Read More »

జ‌గ‌న్ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు..వెయిట్ చేయాల‌న్న ఈసీ

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ స‌హా ఆస‌రా, చేయూత‌, విద్యా దీవెన ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల‌కు ఇవ్వాల్సిన న‌గ‌దును పోలింగ్‌కు ముం దు ఇచ్చేందుకు వీలు కాద‌ని తేల్చి చెప్పింది. పోలింగ్ మ‌రో నాలుగు రోజుల్లో జ‌ర‌గ‌నుంద‌ని.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు ఆయా ప‌థ‌కాల నిధుల‌ను జ‌మ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. …

Read More »