ప్రజల సమస్యలు వినడం మరియు పరిష్కార మార్గం చూపడంలో మంత్రి నారా లోకేష్ చొరవ చూపుతున్నారు. తాడేపల్లిలోనే కాదు ఎక్కడ ఉన్నా స్థానిక పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ఆయన పద్ధతిగా మారింది. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో నిన్నంతా లోకేష్ బిజీగానే ఉన్నారు. సదస్సు తొలి రోజున విద్య మరియు ఐటి శాఖల మంత్రి …
Read More »‘వాజపేయి ఉన్నప్పటినుండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు’
ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ కితాబు దక్కింది. “సరైన సమయంలో సరైన నాయకుడు.. ఏపీకి ఉండడం గొప్ప విషయం“ అంటూ.. ఉపరాష్ట్రపతి సీపీరాధాకృష్ణన్ ప్రశంసలతో కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడి దారుల భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజన్నుతాను చాలా దగ్గరగా చూశారని చెప్పారు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఆయన చక్రం తిప్పుతున్నారని అన్నారు. ఉమ్మడి …
Read More »పార్టీ వివాదాలకు చెక్: లోకేష్ తారక మంత్రం.. !
టీడీపీలో నెలకొన్న వివాదాలకు అంతుదరి లేకుండా పోయిందన్నది వాస్తవం. ఎమ్మెల్యేలను కట్టడి చేసే బాధ్యతను మంత్రులకు, ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు అప్పగించారు. అయితే.. ఇది సాధ్యమేనా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. వాస్తవానికి ఇంచార్జ్ మంత్రుల మాటను కూడా ఎమ్మెల్యేలు పెద్దగా లక్ష్యం చేయడం లేదన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఇంచార్జ్ మంత్రులు వస్తున్నారంటేనే ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ నియోజకవర్గంలోనే ఉన్నా.. ఆరోగ్య కారణాలు …
Read More »పీకే.. సఫల స్ట్రాటజిస్టు.. విఫల పాలిటిస్టు!
ప్రశాంత్ కిశోర్.. ఉరఫ్ పీకే.. రాజకీయ వ్యూహకర్తగా ఆయన పలు సందర్భాల్లో సఫలమయ్యారు. కానీ.. రాజకీయ నేతగా మాత్రం ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. రాజకీయ వ్యూహకర్త నుంచి ఆయన రాజకీయ నేతగా ఆవిర్భవించారు. కానీ.. రాజకీయంగా ఆయన శకునం చెప్పే బల్లి సామెతను తలపించారు. తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బోణీ కొట్టలేకపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసంలోకనీసం 10 స్థానాలైనా దక్కించుకుంటానని చివరి నిమిషంలో …
Read More »ఎన్నికల్లో సెంటిమెంటు లెక్కలు మారాయా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫలితం కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చింది. వాస్తవానికి ఇక్కడ పార్టీల కంటే కూడా.. సెంటిమెంటుకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందన్న చర్చ సాగింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి మూడు రకాల సెంటిమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ వైపు నుంచి కూడా రెండు రకాల సెంటిమెంటు రాజకీయాలు సాగాయి. అయితే.. ఈసెంటిమెంటు రాజకీయాలు ఏమయ్యాయి? ప్రధానంగా బీఆర్ ఎస్కు అనుకూలంగా ఉంటుందన్న సెంటిమెంటు …
Read More »పెట్టుబడి దారులకు బాబు బిగ్ హామీ.. ఏంటీ `ఎస్క్రో` ఖాతా?
సీఎం చంద్రబాబు తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి భారీ హామీ ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో తొలిరోజు శుక్రవారం ఆయన పెట్టుబడి దారులను ఉద్దేశించి మాట్లాడారు. 72 దేశాల నుంచి సుమారు 2500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే …
Read More »దేశానికి గేట్ వే గా మారనున్న ఆంధ్రప్రదేశ్!
దేశానికి ఏపీ గేట్ వే(ప్రధాన ద్వారం)గా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వర్గధామంగా మారుతుందని చెప్పారు. విశాఖలో శుక్రవారం ప్రారంభమైన పెట్టుబడుల సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలోను, దేశంలోనూ సమర్థవంతమైన నాయకత్వం ఉందన్న చంద్రబాబు.. పెట్టుబడులను ఆహ్వానించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్నాయని తెలిపారు. కాగా.. ఈ సదస్సుకు 72 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. విశాఖలో అనేక అవకాశాలు ఉన్నాయని …
Read More »జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకున్న దరిమిలా సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని తాను ముందుగానే ఊహించానని చెప్పారు. “నేను ముందేచెప్పా.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్పటికీ గెలవదు. ఏం చేశారని ప్రజలు ఓటేస్తారు.? అందుకే చెప్పా.. మీరు(బీఆర్ ఎస్) ఓడిపోతారు అన్నా.. ఇక, బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోద ని చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. కానీ, నాపైనా.. …
Read More »వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఫుల్ రష్, దేనికో తెలుసా?
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ తో నిండిపోయింది. వైజాగ్ లో సీఐఐ పార్ట్ నర్ సమ్మిట్ ఈ రోజు మొదలైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు తరలి వస్తున్నారు. ఈ సీఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం. సదస్సుకు 45 దేశాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి …
Read More »జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన ట్వీట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ 24 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోక ముందే.. బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు.. పుండుపై కారం చల్లినట్టుగా బీఆర్ ఎస్కు మరింత కాకపుట్టిస్తున్నాయి. బీఆర్ ఎస్ ఓటమిపై కవిత తాజాగా స్పందిస్తూ.. `కర్మ హిట్స్ …
Read More »పెట్టుబడులకోసం లుక్కు మార్చిన లోకేష్
విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్ కొత్త లుక్లో కనిపించనున్నారు. అంటే ఆయన ఆహార్యం, వేషం మారిపోతుందని కాదు.. ప్రపంచ స్థాయి నాయకులను, వివిధ దేశాలకు చెందిన అధికారులను , పారిశ్రామిక వేత్తలను నారా లోకేష్ స్వయంగా ఆహ్వానించనున్నారు. వారికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆయనే పరిశీలించనున్నారు. అత్యంత దగ్గరగా వారితో వ్యవహరించనున్నారు. అంతేకాదు.. విందుల నుంచిభోజనాల వరకు కూడా నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణ …
Read More »జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ స్పందన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాజయం ఎదురైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోలింగ్ ఫలితాలు స్పష్టమయ్యే సరికి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు మరోసారి నిరూపించారంటూ పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నిక బీఆర్ ఎస్కు మరియు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. తాము …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates