Political News

తిరుమల త‌ర‌హాలో శ్రీశైలం

అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు.. శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.. ఇప్పుడు ఎన్నివేల మంది భ‌క్తులు వెళ్లినా.. ప్రశాంతంగా స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అభి వృద్ధి చేశారు. నిత్యాన్న‌దానం నుంచి ఉద‌యం పూట టిఫిన్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ అభివృద్ధిలో గ‌త ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వాలు కీల‌క పాత్ర పోషించాయి. ఇది రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఒప్పుకొనే మాట‌. అదేవిధంగా ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ ఆల‌యాన్ని కూడా అభివృద్ధి …

Read More »

కాంగ్రెస్‌కు టికెట్ క‌ష్టం: ‘జూబ్లీహిల్స్‌’కు న‌లుగురితో జాబితా!

హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీ హిల్స్‌కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్‌.. అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో గ‌తంలో ఉన్న తిప్ప‌లే ప‌డుతోంది. ఓ న‌లుగురిని ఎంపిక చేయ‌డం.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి.. ఫైన‌ల్ చేయించ‌డం.. కామ‌న్‌గా మారింది. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే ఫైన‌ల్. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కూడా న‌లుగురు …

Read More »

బాబుకు భారం: మ‌హిళ‌ల కోసం రోజుకు 8 కోట్లు

ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం తేలికే.. కానీ, వాటి అమ‌లుకు వ‌చ్చే స‌రికి మాత్రం త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తోంది. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సును ప్ర‌క‌టించినా.. త‌ర్వాత కాలంలో ప్ర‌భుత్వాలు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నాయి. మొద‌ట్లో బాగానే ఉన్నా.. ఉచితం భారం రాబోయే రోజుల్లో స‌ర్కా రు మెడ‌కు గుదిబండ‌లా మారుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వానికి కూడా షాకే త‌గిలింది. త‌మ‌కు 360 కోట్ల రూపాయ‌లు బ‌కాయి ఉన్నారంటూ.. …

Read More »

‘శీష్’ మ‌హల్‌కు ప‌రిష్కారం.. మ‌రి ‘రుషికొండ’ ప్యాలెస్ సంగ‌తేంటి?

శీష్ మ‌హ‌ల్‌(అద్దాల బంగ‌ళా).. ఈ మాట కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో జోరుగా వినిపించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని ఆరో భ‌వంతి ఇది. అప్ప‌టి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఈ బంగ‌ళాకు.. 200 కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించి.. అత్యంత ఆధునిక వ‌స‌తుల‌తో పున‌ర్నిర్మాణం చేశారు. దీనిపై బీజేపీ నేత‌లు అప్ప‌ట్లో నిప్పులు చెరిగారు. ఢిల్లీ అస‌లే అప్పుల్లో …

Read More »

సీఎం రేవంత్‌ను ఒకేసారి త‌గులుకున్నారుగా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒకేసారి ముగ్గురు కీల‌క నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. కేటీఆర్‌, ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్యే హ‌రీష్‌రావు, బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. ఆ పార్టీకి రాజీనామా చేసిన‌.. క‌విత ముగ్గురూ ఒకేసారి త‌గులుకున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచిన తీరును వారు వేర్వేరుగా దుయ్య‌బట్టారు. సామాన్యుల‌పై భారాలు మోపుతున్నార‌ని …

Read More »

అయ్య‌న్న వ‌ర్సెస్ జ‌గ‌న్‌: కొత్త ర‌గ‌డ‌!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మ‌ధ్య ఇప్ప‌టికే ఒక వివాదం ఉన్న విష‌యం తెలిసిందే. అసెంబ్లీలో త‌న‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా గుర్తించాల‌ని జ‌గ‌న్‌.. అలా కుద‌ర‌ద‌ని అయ్య‌న్న వాదించుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో ఉంది. ఇదిలావుంటే.. వైసీపీ హ‌యాంలో అయ్య‌న్న సొంత నియోజ‌క‌వ‌ర్గం.. న‌ర్సీప‌ట్నంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీని నిర్మించామ‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం …

Read More »

విజయ్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర: ఖుష్బూ

త‌మిళ‌నాడులోని క‌రూర్ జిల్లాలో గ‌త నెల 27న రాత్రి చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 41 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణాలేంటి? ఎలా జ‌రిగింద‌నే విష‌యంపై ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తున్నా.. ఇత‌మిత్థంగా ఇంకా కార‌ణాలు తెలియలేదు. ఇదిలావుంటే.. నాటి ఘ‌ట‌న‌కు పూర్తిగా డీఎంకే ప్ర‌భుత్వానిదే కార‌ణ‌మ‌ని సీనియ‌ర్ న‌టి ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేయలేద‌ని ఆమె …

Read More »

మీరు సీనియ‌ర్‌.. ఇలా చేస్తే మీకేం చెప్పాలి: ప‌వ‌న్‌

జ‌నసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. శ‌నివారం సాయంత్రం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఉద‌యం ప్ర‌భుత్వ కార్యక్ర‌మంలో ఆటోడ్రైవ‌ర్ల సేవ‌లో.. పాల్గొ్న్న అనంత‌రం.. నేరుగా మంగ‌ళ‌గిరికి చేరుకున్నారు. అ నంత‌రం.. ఆయ‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అప్ప‌టికే వారికి రెండు రోజుల కింద‌ట స‌మాచారం చేర‌వేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశం ఉంటుంద‌ని.. నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌తో రావాల‌ని ప‌వ‌న్ సూచించారు. దీంతో కొంద‌రు ఎమ్మెల్యే …

Read More »

యువ ఎమ్మెల్యేకు ఎఫెక్ట్‌: తీరుమార‌క‌పోతే.. ఫ్యూచ‌ర్ కొలాప్సే.. !

శ్రీకాళహస్తి నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని నిలబెడతారా? నిలబెట్టరా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు అన్నది వాస్తవం. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. సుధీర్ రెడ్డి ఇప్పటికే రెండు మూడు విషయాల్లో వివాదాలకు కేరాఫ్ గా మారారు. మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ను ఆయన టార్గెట్ చేయడం తీవ్ర …

Read More »

న‌కిలీ మ‌ద్యం దందా.. సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్!

నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత‌ది. కానీ, ఇక్క‌డ జ‌రుగుతున్న న‌కిలీ మ‌ద్యం దందా మాత్రం టీడీపీ కీల‌క నేత క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌ని అధికారులు తేల్చారు. ఈ వ్య‌వ‌హారం ప‌తాక శీర్షిక‌ల్లో రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. శ‌నివారం సాయంత్రం ఆయ‌న ప్ర‌త్యేకంగా అధికారుల‌తో భేటీ అయ్యారు. ఇంత జ‌రుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవ‌రికి చెప్పారు? ఎక్సైజ్ మంత్రికి చెప్పారా? లేదా? అని నిప్పులు చెరిగారు. అంతేకాదు.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గం …

Read More »

ఫ్యూచ‌ర్ ఫీల్డ్‌: రేవంత్ స‌ర్ ఆశ‌లు నెర‌వేరేనా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం జ‌రిగితే.. నిజంగానే తెలంగాణ‌కు ఒక మ‌ణిహారంగా మారుతుంది అన‌డంలో సందేహం లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని మించి నిర్మించాల‌న్న వ్యూహంతో సీఎం అడుగులు వేస్తున్న‌ట్టు ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. భాగ్య‌న‌గ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు సైబ‌రాబాద్ వంటి మ‌హానగ‌రాన్ని చంద్ర‌బాబు సృష్టించార‌న్న పేరుంది. స‌చివాల‌యాన్ని కేసీఆర్ క‌ట్టించార‌న్న రికార్డు ఉంది. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి త‌ల‌కెత్తుకున్న …

Read More »

బాబు టార్గెట్‌: మిగిలింది 15 ల‌క్ష‌లే.. !

చేయాల‌న్న సంక‌ల్పం.. చిత్త‌శుద్ధి ఉంటే.. ఖ‌చ్చితంగా ఏ ప‌నిలో అయినా విజ‌యం ద‌క్కుతుంది. లేక‌పోతే.. తూతూ మంత్ర‌పు లెక్క‌లే మిగులాయి. గత ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌గా ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు.. యువ‌త‌కు పెద్ద పెట్టున భారీ హామీ ఇచ్చారు. అదే.. ఏటా 5 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ క‌ల్ప‌న‌. వ‌చ్చే ఐదేళ్ల‌లో మొత్తం 20 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌చారం చేశారు. అన్న‌ట్టుగానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. …

Read More »