వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రస్తావించారు. వీటి వల్ల రాష్ట్రంలో మెరుగైన జీవనం కనిపిస్తోందని ముఖ్యంగా పేదల కుటుంబాలలో ఇది ప్రధానంగా మార్పును తీసుకువస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం పథకంలో …
Read More »తెలుగు హీరోలు నా దగ్గరికొచ్చి బీర్లు తాగేవారు-రేవంత్
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సినీ రంగంలో చాలామందికి సన్నిహిత సంబంధాలుండేవి. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా అవి కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక కేసీఆర్ సినీ ప్రముఖులను దగ్గరికి రానిచ్చేవారు కాదు కానీ.. ఆయన తనయుడు కేటీఆర్తో మాత్రం ఇండస్ట్రీ జనాలు క్లోజ్గా …
Read More »లెక్కలు బాగున్నా… జనాలకు ఎక్కలేదు జగన్!
వైసీపీ అధినేత జగన్.. తన సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వ పనితీరు.. అప్పుల లెక్కలు.. పథకాలకు వెచ్చిస్తున్న సొమ్ములు.. ఇలా అనేక విషయాలను ప్రస్తావించారు. అదేసమయంలో ప్రభుత్వ పనితీరుపై ఇటీవల కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదికలోని అంశాలనుకూడా జగన్ ప్రస్తావించారు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికీ సంబంధం లేదని విమర్శించారు. అదేసమయంలో సొమ్ములు ఏమవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ఇలా.. జగన్ పలు అంశాలపై వివరణతోపాటు.. …
Read More »మూడో బిడ్డకు 30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు
ఏపీలో జనాభా పెరుగుదలకు కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి రథసారధి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు… రాష్ట్రంలో క్రమంగా జనాభా తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ ఆందోళనను తగ్గించేలా జనాభా పెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధిక సంఖ్యలో …
Read More »భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు
బాలికపై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భగీరథ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు .. తెలంగాణ పోలీసులు.. వైమానిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లుకౌట్(కనిపిస్తే.. పట్టేయండి) నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు అయింది. మరోవైపు.. భగీరథ్కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ …
Read More »రాజ్యసభ స్థానాలు అప్పుడే రిజర్వ్ అయిపోయాయా?
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన సానా సతీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. వచ్చే నెల 21తో ఈ నాలుగు స్థానాలకు గడువు తీరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరి నాటికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ బలాలను బట్టి ఈ నాలుగు …
Read More »ఈ దఫా ‘ఆన్ లైన్’ మహానాడు!
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో టీడీపీ వార్షికోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది విపక్షం వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మహానాడును నిర్వహించిన టీడీపీ… ఈ ఏడాది ఈ వేడుకలకు నెల్లూరును ఎంచుకుంది. అయితే పొదుపు చర్యల్లో భాగంగా నెల్లూరు వేదికను రద్దు చేసిన పార్టీ అధినేత, …
Read More »కూటమిది స్పీడు కాదు… జెట్ స్పీడు
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కూటమి సర్కారు మామూలు స్పీడుతో వెళ్లడం లేదు. జెట్ స్పీడుతో వెళుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీ సత్యసాయి జిల్లా. పుట్టపర్తిలో శుక్రవారం శంకుస్థాపన చేసుకున్ని ఏఎంసీఏ పరిశ్రమ. రూ.15,800 కోట్ల వ్యయంలో ఏర్పాటు కానున్న ఈ రక్షణ శాఖ పరిశ్రమను కూటమి సర్కారు కేవలం రోజుల …
Read More »భగీరథ్ కేసుపై రేవంత్ లాజిక్
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై పోక్సో కేసు నమోదవడం సంచలనం రేపింది. ఐతే ఈ కేసు నమోదైన వారానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భగీరథ్ను అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారి తీసింది. రేవంత్కు ఉన్న రాజకీయం స్నేహం దృష్ట్యా భగీరథ్ ను సీఎం …
Read More »ఇంత నొప్పి ఎలా తట్టుకుంటున్నావ్ పవన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి మాత్రమే తీసుకుని తిరిగి పనిలో పడిపోయారు. ఈ సందర్భంగా తనను వేధిస్తున్న అనారోగ్య సమస్యలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కు ఏమైంది అన్న విషయంపై పలువురు పలు రకాలుగా విశ్లేషించుకుంటున్న నేపథ్యంలో తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పవనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. …
Read More »తెలుగు రాష్ట్రాల్లో `సర్`: పార్టీల్లో ఆందోళన!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ.. ఈ ప్రక్రియను చేపడుతోంది. అయితే.. ఆది నుంచి సర్ ప్రక్రియ అనగానే పార్టీలకు భయం నెలకొంది. తమ అనుకూల ఓటు బ్యాంకు ఎక్కడ పోతుందోనన్న బెంగ ఆయా పార్టీలను వేధిస్తోంది. గతంలో …
Read More »‘రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరంతా?’ – పవన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని స్వల్ప వ్యవధి మాత్రమే రెస్ట్ తీసుకున్న పవన్… గురువారమే మంగళగిరి చేరుకున్నారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన శ్రేణుల సమావేశంలో ప్రసంగించిన పవన్… ఈ వారం పది రోజులుగా తన గురించి జరిగిన అన్ని రకాల చర్చలకు సమాధానం ఇచ్చారు. తన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates