Political News

తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ నిలిచాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలతోపాటు అనూహ్య విజయాలు నమోదయ్యాయి. తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ కొట్టాయి. తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ కొంతకాలంగా బలహీనపడింది. ఈ క్రమంలోనే అక్కడ పూర్వ వైభవం కోసం పోరాడుతున్న టీడీపీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లా మధిరలో తెలుగుదేశం …

Read More »

విజయోత్సాహంలో రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు. ఈ …

Read More »

బీజేపీకి మరింత దగ్గరవుతున్న సాయిరెడ్డి!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న సాయిరెడ్డి…వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం మొదలుబెట్టారు. లిక్కర్ స్కాం వ్యవహారంపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే సాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ దిశగానే సాయిరెడ్డి సందర్భానుసారంగా …

Read More »

జగన్ తల్లిని అవమానించినా వదిలిపెట్టం… లోకేష్ వార్నింగ్!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై మండిపడ్డారు. అయితే, అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడం…రెండు మాటలన్నారు అని వెనకేసుకురావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా …

Read More »

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు 8.9 …

Read More »

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. “2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా

పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ ఒక కార్పొరేషన్ లో లీడ్ లో ఉంది. ఇతరులు ఒక కార్పొరేషన్ లో …

Read More »

బంగ్లాదేశ్‌ కొత్త ప్రధాని.. భారత్‌కు ప్లస్సా? మైనస్సా?

బంగ్లాదేశ్ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా షేక్ హసీనా హవా నడిచింది. ఆమె భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా ఉండేవారు. కానీ ఇటీవలి హింసాత్మక గొడవలతో ఆమె దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రెహమాన్, తన బిఎన్‌పి పార్టీతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మార్పు ఇరు దేశాల …

Read More »

మధిరలో టీడీపీ అభ్యర్థి విజ‌యం!

తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్థులు టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. ముఖ్యంగా ఏపీ స‌రిహ‌ద్దును ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని మ‌ధిర మునిసిపాలిటీలో ముగ్గురు మ‌హిళా అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపైనే పోటీచేశారు. వీరిలో మ‌ధిర 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘనవిజయం ద‌క్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి రిటర్నింగ్ అధికారి రేవతి గెలుపును అధికారికంగా ప్రకటించడంతో ఆమె అనుచరులు, మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి. …

Read More »

పుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసు విచారణలో భాగంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు …

Read More »

మున్సిపల్ పోటీలో ఎవరిది పైచేయి?

అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారంతో ముగిసింది. పార్టీ గుర్తులతో అభ్యర్థులు బరిలోకి దిగిన ఈ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అధికార పార్టీకి ఈ ఎన్నికలు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన …

Read More »

నెలలో 6,433 సుపథం టికెట్లు జారీ… వైవీ పీఏ పనే?

కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న కదురు చిన్నప్పన్న తనకు 2018 వరకు మాత్రమే పీఏగా పనిచేశాడని, ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఉచిత దర్శన టోకెన్లకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. రూ.300 సుపథం టికెట్లు ఆన్లైన్ ద్వారా …

Read More »