అధికారం ఉందని అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, వేధింపులకు గురిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తెలుగుదేశం ప్రభుత్వం గురిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు కేసులను తిరగదోడేందుకు విచారణకు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగింది. కానీ ఇప్పటివరకు నిందితులు ఎవరో తేల్చలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు అప్పటి …
Read More »ఇలాంటి రోజు ఒకటి వస్తుందని.. ఊహించలేదా.. ద్వారంపూడీ!
ఎంత అధికారం ఉన్నా.. ఎంత అంగబలం, అర్థబలం ఉన్నా.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు.. నోరు జారేందుకు.. కాలు విసిరేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి. లేకపోతే.. ఇలాంటి పరిస్థితే వస్తుంది. వైసీపీ కీలక నాయకుడు, జగన్ వ్యాపార భాగస్వామి.. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్రెడ్డి వ్యవహారం.. తూర్పుగోదావరిలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు.. తనకంటూ ఎదురులేదన్నట్టుగా ఆయన …
Read More »ఢిల్లీ ట్రిప్: బాబు ఫోకస్ మొత్తం నిధుల మీదే!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన దేశ రాజధానికి వెళుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కలిసే కేంద్ర మంత్రులందరితోనూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకురావటమే లక్ష్యమని చెబుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఏఏ ప్రాజెక్టు.. స్కీంల కింద కేంద్రం నుంచి …
Read More »ఇరికించబోయి ఇరుక్కున్న వైసీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ అనే అభిప్రాయం ఉంది సోషల్ మీడియాలో. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ ప్రచారాలే ఉపయోగపడ్డాయని అంటారు. సోషల్ మీడియాలో వేలమందిని రిక్రూట్ చేసుకుని పేటీఎం ద్వారా పేమెంట్స్ ఇవ్వడం ద్వారా అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించి.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని బద్నాం చేయడంలో ఆ పార్టీ విజయవంతమైంది. ఐతే నిజం అనేది నిలకడ మీద …
Read More »పవన్ కల్యాణ్ ను కెలికి పెద్ద తప్పు చేశాం: కేతిరెడ్డి
సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లతో 2019లో ఎవరూ ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్.. 2024కు వచ్చే సరికి కేవలం 11 స్థానాలకు సరిపుచ్చుకుని.. ఇప్పుడు కూడా.. ఎవరూ ఊహించని విధంగా నేల మట్టమయ్యారు. దీనికి కారణం ఎవరు? ఎలా ? అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద దీనిని తోసేయాలన్నా.. కుదరడం …
Read More »పవన్ దిగాడు.. కేసు పరిష్కారం
ప్రభుత్వంలో ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే.. ఎలాంటి కేసు అయినా ఎలా పరిష్కారం అవుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువయ్యాక అనేక విషయాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండటం ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి కావడం.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు పడడం లాంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. డిప్యూటీ …
Read More »జగన్ కు ఇది భారీ షాకే.. బాబు మామూలోడుకాదు!
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్కు.. ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. దీని నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. మనశ్శాంతి కోసం సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. అక్కడ కాంట్రాక్టర్లు బిల్లుల కోసం.. తిప్పలు పెట్టారు. ఇక, తర్వాత.. బెంగళూరు వెళ్లారు. అక్కడ కూడా.. మనసు స్థిరంగా లేదు. అయినా.. అక్కడే ఉండి తాజాగా 1వ తారీకు.. తాడేపల్లికి వచ్చారు. గతంలో మాదిరిగా ఆయనకు ఘన స్వాగతాలు దక్కలేదు. నాయకులు …
Read More »జగన్ ఇప్పుడు కూడా బయటకు రాకపోతే.. ఇక కష్టమే..!
గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్.. బయటకు వచ్చింది లేదు. ఎప్పుడో మూడు నాలుగు నెలలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల సమయంలో ఆయన బయటకు వచ్చారు. అది కూడా … పరదాలు కట్టుకుని.. చెట్లు కొట్టేయించుకుని ప్రజల మధ్యకు భయం భయం గా వచ్చారనే విమర్శలు ప్రతిపక్షం నుంచి జోరుగా వినిపించాయి. ఆ తర్వాత.. మళ్లీ ఆయన ప్రజల మధ్యకు …
Read More »ఏకంగా చంద్రబాబు స్థలానికి లంచం తీసుకున్నాడు !
అది వైసీపీ ప్రభుత్వ కాలం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. అది స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేశారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం …
Read More »పరదాల సీఎం టు ప్రజా సీఎం
ఏపీ మాజీ సీఎం జగన్ కు పరదాల ముఖ్యమంత్రి అన్న పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టడం, ఆ దారిలో చెట్లు కొట్టడం వంటి కార్యక్రమాలతో ఇటు అధికారులు, అటు పోలీసులు, ఇటు ప్రజలకు విసిగి పోయారు. కట్ చేస్తే, ఏపీ సీఎంగా చంద్రబాబు రాగానే పరదాలు తీసేసి ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా ముఖ్యమంత్రిగా మారారు. ఆ క్రమంలోనే తాను మాట …
Read More »రాహుల్ గాంధీ హీరో అయిపోయాడుగా..
లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చాలాసార్లు అవమానాలే ఎదుర్కొన్నాడు. ఆయన ప్రసంగాల వీడియోలు గతంలో చాలా వరకు ట్రోలింగ్కే ఉపయోగపడ్డాయి. సరిగా మాట్లాడలేడని.. సబ్జెక్ట్ ఉండదని భాజపా వాళ్లు ఆయన్ని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటారు. ఐతే ఏ నాయకుడైనా కొన్నేళ్ల పాటు కష్టపడితే ఎదుగుదల ఉంటుందని.. సబ్జెక్ట్ పెంచుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం కష్టపడితే ఫలితం ఉంటుందని.. జనాల్లో తిరిగితే ఆదరణ దానికంతట అదే వస్తుందని రాహుల్ గాంధీ …
Read More »ఏపీలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా..
2014-19 మధ్య అధికారంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్లో పేదలకు చౌకగా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఒకటి. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో రూ.5కే ఎంతో నాణ్యమైన భోజనం పెట్టి పేదల కడుపు నింపింది అప్పటి ప్రభుత్వం. తెలంగాణలో కూడా రూ.5కే భోజనం పెట్టే క్యాంటీన్లు ఉన్నప్పటికీ.. ఏపీలో మెయింటైన్ చేసిన క్వాలిటీ వేరు అని అక్కడ భోజనం చేస్తే తెలంగాణ వాళ్లు కూడా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates