ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇంటీరియం బడ్జెట్ను ప్రవేశ పెడతారని ప్రచారం జరుగుతున్నా.. కేవలం వచ్చే మూడు మాసాలకు(ఆగస్టు-అక్టోబరు) మాత్రమే బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని మరో ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సరే.. మొత్తానికి సోమవారం నుంచి సభ అయితే.. ప్రారంభం కానుంది. మొత్తం ఐదు రోజుల పాటు ఈ సభ జరగనుంది. బడ్జెట్తో పాటు.. …
Read More »జగన్కు మైండ్ పనిచేయట్లా: మంత్రి హాట్ కామెంట్స్
వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు జగన్కు మైండ్ పనిచేయట్లేదని.. అందుకే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో టీడీపీ వారే ఎక్కువగా చనిపోయిన విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు నాలుగు హత్యలు జరిగిన మాట వాస్తవమేనని .. అయితే.. మూడు ఘటనల్లో ముగ్గరు టీడీపీ నాయకులు మృతి చెందారని తెలిపారు. వినుకొండలో జరిగిన …
Read More »టీడీపీ డ్రస్ కోడ్.. అసెంబ్లీకి అలానే రావాలని పిలుపు!
సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూటమి సర్కారు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆ పార్టీ నేతలు కొన్ని కీలక సూచనలు చేశారు. సభకు వచ్చే వారు.. పసుపు రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. అదేవిధంగా సైకిల్ గుర్తు మాత్రమే ఉన్న పసుపు కండువాలు ధరించాలని సూచించారు. సూచనలను తప్పకుండా పాటించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని మాత్రం పార్టీ నాయకులు …
Read More »ఎవరు కలుస్తారు? ఎవరు వస్తారు? జగన్ కు ఎదురీతే!
సుఖాల్లో ఉన్నప్పుడు.. బంధువులు కనిపిస్తే.. కష్టాల్లో వారి సాయం అందుతుంది. సుఖాల్లో ఉన్నప్పుడు.. చేతినిండా సొమ్ములు ఉన్నప్పుడు.. బంధువులను దూరం పెట్టి.. తూలనాడిన తర్వాత..కష్టాల్లో వారిని రమ్మంటే వస్తారా? – అచ్చంగా ఇలానే ఉంది .. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిస్థితి. అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు.. ప్రతిపక్షాలను కనీసం పట్టించుకోలేదు. టీడీపీ, జనసేనల విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా …
Read More »వైసీపీ చేజారిన విశాఖ.. సంచలనమే!
అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి దెబ్బలపై దెబ్బలు తగులుతున్నాయి. ఒకదాని తర్వాత.. ఒకటిగా .. స్థానిక సంస్థల్లోనూ అధికారం పోతోంది. ఇప్పటికే చిత్తూరు పోయింది. బలమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటను కూడా.. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ వారం రోజుల కిందటే.. కూటమి పార్టీలైన.. టీడీపీ, జనసేన పరం అయిపోయింది. ఇక, ఇప్పుడు విశాఖ వంతు వచ్చింది. నిజానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా 2021లో జరిగిన స్థానిక …
Read More »సోమవారం నుంచి పార్లమెంట్.. అస్త్ర శస్త్రాలు రెడీ!
ముచ్చటగా మూడోసారి మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు తొలి పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈ సమావేశాలను బడ్జెట్కే పరిమితం చేయాలని అధికార పక్షం చూస్తున్నా.. ప్రతిపక్షాలు మాత్రం ‘అంతకుమించి’ అన్నట్టుగా దూకుడుగా ఉన్నాయి. గత రెండు టెర్మ్లలో ప్రతిపక్షాలు వీక్గా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకున్న దరిమిలా.. …
Read More »‘ప్రధాన ప్రతిపక్షం’ లేనట్టే.. జగన్ సహనానికి పరీక్ష
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సహనానికి పరీక్ష ఎదురు కానుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఆగస్టు-మార్చి-2025 వరకు ఏడు మాసాల కాలానికి మధ్యంతర(ఇంటీరియం) బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు చంద్రబాబు సర్కారు రెడీ అయింది. అయితే.. ప్రభుత్వం పక్షం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అధికారం కోల్పోయి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా …
Read More »ఏ చిన్న అవకాశాన్నీ వదలొద్దు: ఎంపీలకు బాబు నిర్దేశం
సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి సంబంధించి నిధులు తీసుకువచ్చే విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టవద్దని సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా వస్తారని, వారిని ఆయా శాఖల కేంద్ర మంత్రులకు పరిచయం చేసి.. నిధులు వచ్చేలా ఎంపీలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు ఎంత ఎక్కువగా వస్తే.. అంతగా ఏపీకి …
Read More »కొడుకు అరెస్టుకు రంగం రెడీ… చెవిరెడ్డి సెంటిమెంట్ ప్లే!
కళ్ల ముందు కుమారుడి భవిష్యత్తు కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు.. కుమారుడిని అరెస్టు చేయడం పక్కా అనే సమాచారం అందిపోయింది. దీని నుంచి కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో సెంటిమెంటు అస్త్రాలను ప్లే చేయడం ప్రారంభించారు… వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎన్నికల అనంతరం.. తిరుపతి జిల్లా చంద్రగిరిలో భారీ విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ తరఫున పోటీ …
Read More »రేవంత్.. ఆచితూచి!
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన పంథాలో సాగిపోతున్నారు. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూనే మరికొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సవాళ్ల నడుమ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే రేవంత్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేశారు. కానీ ఈ పరీక్ష నిర్వహణకే రేవంత్ మొగ్గు చూపారు. అందుకే మరో …
Read More »జగన్ ఏమో అక్కడ.. నేతలేమో ఎక్కడో..
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అఖండ విజయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ వాస్తవం ఇంకా బోధపడుతున్నట్లు లేదు. ఇప్పటికీ అధికారం తమదే అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ కష్ట కాలంలో పార్టీని, క్యాడర్ను పట్టించుకోకుండా తనకు …
Read More »25న ఏపీ బడ్జెట్.. 24న జగన్ ధర్నా.. వ్యూహం ఇదే!
ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలి సిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో నడిరోడ్డుపై రెండు రోజుల కిందట జరిగిన దారుణ హత్యలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం.. కొన్ని సంచల న ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే ఈ విషయాన్ని జాతీయ మీడియా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates