ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సొంతంగా టీడీపీ 16 ఎంపీ స్థానాలు, జనసేన 2 స్థానాలతో కలిసి 18 ఎంపీ స్థానాలు గెలుచుకుని టీడీపీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఆపగలిగింది అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఈరోజు ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగింది. …
Read More »అసెంబ్లీకి వెళ్లినా మైక్ ఇవ్వరు.. పైగా హేళన చేస్తారు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ విషయంపై తేల్చి చెప్పారు. తన పార్టీ నాయకులు, ఓడిన, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా అనే అంశంపై సుదీర్ఘంగా వారితో చర్చించారు. కొందరు వెళ్దామని.. కొందరు వద్దని ఇలా తమకు నచ్చిన విధంగా నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారు. చివరకు జగన్కే నిర్ణయం వదిలేశారు. కాగా.. ప్రస్తుతం వైసీపీకి 11 …
Read More »కొడాలి నాని ఏమీ మారలేదు
మాజీ మంత్రి, వైసీపీఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. తాను గెలిచి తీరుతానని శపథం చేసిన ఆయనను గుడివాడ ప్రజలు చిత్తుగా 47 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అయినప్పటికీ.. ఆయనలో మార్పు కనిపించలేదు. తాజాగా ఆయన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి నోరు చేసుకున్నారు. వైసీపీ తరఫున …
Read More »చివరి వరుసలో జగన్ కూర్చోవాల్సి వస్తే..?
ఓడలు బళ్లు-బళ్లు ఓడలు కావడం.. రాజకీయాల్లో కామనే. కానీ, ఇంతకుమించిన విధంగా వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. 151 స్థానాలతో ఠీవీగా కాలర్ ఎగరేసుకున్న పార్టీ..ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమై.. నేల చూపులు చూస్తోంది. పుంజుకుంటుందా? లేదా? అనేది ఆ పార్టీ అనుసరించే వ్యూహాలను బట్టి ఉంటుంది. కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తోంది. దీనిలో ప్రధానంగా అసెంబ్లీ వ్యవహారం. నిన్నటి వరకు తొలి వరుసలో …
Read More »ఓదార్పు యాత్రకు జగన్ రెడీ!
వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్రకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన మనసులో మాటను పార్టీ కీలక నాయకులకు వివరించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, గెలిచిన నాయకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిరాశలో కూరుకుపొయిన నాయకుల్లో ఆయన ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఎవరూ అధైర్య …
Read More »అమరావతిలో చంద్రబాబు.. ఏం చేశారంటే!
రాజధాని అమరావతిలో నూతన సీఎం చంద్రబాబు పర్యటించారు. తొలుత ఆయన.. గతంలో జగన్ అధి కారంలోకి వస్తూ వస్తూనే కూల్చేసిన ప్రజావేదిక ప్రాంగణం నుంచి చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఆసాంతం కూల్చేసిన శిధిలాలను పరిశీలించారు. వాటిని తాము అలానే ఉంచుతామని.. ఇక్కడ చుట్టూ.. కంచెను ఏర్పాటు చేసి.. ప్రదర్శనకు కూడా ఉంచుతామని చెప్పారు. ఒక విధ్వంస పాలనకు ఇది నిదర్శనంగా తరతరాలు చెప్పుకొనేలా చేస్తామన్నారు. అనంతరం.. రాజధానిలోకి వెళ్లారు. …
Read More »మంత్రులకు పని పెంచేసిన నారా లోకేష్..!
ఇదేంటి? అనుకుంటున్నారా? ఔను .. నిజమే. టీడీపీ యువ నాయకుడు.. మంత్రి నారా లోకేష్ తన పార్టీకి చెందిన వారినే కాదు.. కూటమి పార్టీల నాయకుల పనిని కూడా పెంచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్.. ఆ వెంటనే ప్రజాదర్బార్ పేరుతో నిత్యంతన నివాసంలోనే ప్రజలను కలుస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు ప్రజలతోబేటీ అవుతున్నారు. ఉదయం7 గంటల నుంచి 10 గంటల వరకు మంగళగిరి నియోజకవర్గం …
Read More »‘రుషికొండ’పై 4 ఆప్షన్లు.. ఏం చేస్తారు.. ?
విశాఖలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై వైసీపీ హయాంలో జరిగిన నిర్మాణం.. ఇప్పుడు కాక రేపుతోంది. రూ.500 కోట్లతో మహారాజా ప్యాలెస్ను తలపించేలా చేపట్టిన ఈ నిర్మాణాలను మూడేళ్ల పాటు సాగించారు. దీనిలోకి పురుగును కూడా రానివ్వకుండా.. కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ.. కూడా.. విశాఖ రుషికొండపై ఏం జరుగుతోందన్నది ప్రధాన ప్రశ్నగానే మారిపోయింది. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇక, తాజా ఎన్నికల్లో వైసీపీ …
Read More »జగన్కో మంచి మాట: ఈ మౌనం మంచిది కాదు సర్!
మౌనం మంచిది కాదు. కొన్ని కొన్ని సార్లు.. పాలకులు పాటించే మౌనం.. ప్రమాదాలను తరుముకొస్తుంది. గతంలో బాబ్రీ మసీదును కూల్చేసినప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు.. మౌనం దాల్చారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2జీ సహా.. బొగ్గుగనుల కుంభకోణాలు వెలుగు చూసినప్పుడు.. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ మితి మీరిన మౌనాన్ని ప్రదర్శించారు. ఫలితంగా కాంగ్రెస్ పదేళ్ల నుంచి మరో ఐదేళ్ల …
Read More »ఖజానాను ఊడ్చేసిన జగన్.. 10 వేల కోట్ల కోసం తంటాలు!
మరో పది రోజుల్లో రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యో గులకు వేతనాలు ఇవ్వాలి. వీటితోపాటు.. రిటైరైన ఉద్యోగులకు కూడా.. పింఛన్లు ఇవ్వాలి. వీటి పద్దు కోసం రమారమి.. 10 వేల కోట్ల రూపాయలు తక్షణ అవసరం కింద చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఖజానాలో 2 వేల కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్యలోనే నిధులు ఉన్నాయి. దీంతో 1వ …
Read More »డీజీపీగా ద్వారకా తిరుమల రావు.. ఈ మార్పు ఎందుకు?
ఏపీలోని చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చీ రావడంతోనే.. ఐఏఎస్ అధికారులను మార్చేసిన చంద్రబాబు.. తాజాగా రాష్ట్ర పోలీసు బాస్.. డీజీపీ విషయంలోనూ సంచలన అడుగులు వేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్కుమార్ గుప్తాను పక్కన పెడుతూ.. నూతన డీజీపీగా ద్వారకాతిరుమల రావును ఎంపిక చేసింది. వాస్తవానికి హరీష్కుమార్ గుప్తాను మార్చబోరన్న సంకేతాలు ఆదిలో వెలువడ్డాయి. ఎందుకంటే.. ఈయనను కేంద్ర ఎన్నికల సంఘమే ఎంపిక చేసింది. దీంతో ఆయనే …
Read More »కేరళ ఐఏఎస్పై పవన్ కన్ను !
ఏపీ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేప ట్టిన పవన్ కల్యాణ్.. తనకు అత్యంత నమ్మకస్తుడైన.. కీలక అధికారిని ఎంపిక చేసుకునే పడ్డారు. ప్రస్తుతం పవన్కు లభించిన శాఖలు.. ఆయనకు మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు కూడా.. చాలా పెద్దవి. వీటి విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పనిచేసేందు కు ఎంతో స్కోప్ ఉన్న శాఖలురావడం.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates