Political News

అర్దరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు !

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే గురువారం అర్దరాత్రి కాంగ్రెస్‌లోకి తీర్దం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఎమ్మెల్సీలు మీడియా కంట పడకుండా వెనుక గేట్‌ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి …

Read More »

అమిత్ షాకు చెప్పడం వెనక అంతర్యమేంటి ?!

‘ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతున్నాం. ఆరో తేదీన మంచి వాతావరణంలో ఇరువురు ముఖ్యమంత్రులం చర్చించుకుంటున్నాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పాను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంధర్భంగా ‘మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది’ అని అమిత్ …

Read More »

పొలిటికల్ టాక్: పవన్‌తో అంత వీజీ కాదు

పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో అప్పుడప్పుడూ ఆవేశంగా మాట్లాడుతుంటాడు.. సవాళ్లు చేస్తుంటాడు కానీ.. ఆయనకు కక్ష సాధింపు రాజకీయాలు ఇష్టముండదని.. పనిగట్టుకుని ఎవరినీ టార్గెట్ చేయడని అంటారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ వాళ్ల మీద ప్రతీకార దాడులు జరుగుతుంటే.. వాటిని నివారించడానికే పవన్ చూశాడు. ఒకటికి రెండుసార్లు అలాంటి చర్యలకు వెళ్లొద్దని టీడీపీ, జనసేన వాళ్లకు పిలుపునిచ్చాడు. తాజాగా పిఠాపురంలో కూడా ప్రతీకార దాడులు వద్దనే చెప్పాడు. అలా అని పవన్ అన్నింటినీ …

Read More »

జగన్ ఏమీ మారలేదుగా

151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన ఐదేళ్లకు కేవలం 11 సీట్లకు పడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతటి ఘనవిజయం తర్వాత ఇంతటి ఘోర ఓటమికి ఎందుకు ఎదురైంది అని వైసీపీ ఆత్మావలోకనం చేసుకుంటుందని.. పొరబాట్లు దిద్దుకుని ముందుకు సాగుతుందని అనుకుంటాం. ముఖ్యంగా ఈ ఓటమికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే అని.. ముందు ఆయనే మారాలని స్వయంగా వైసీపీ నేతలు, కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. కానీ …

Read More »

జగన్ నోట ‘రెడ్ బుక్’ మాట

Jagan Mohan Reddy

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం యువనేత నారా లోకేష్.. తన యువగళం సభల్లో పరిచయం చేసిన ‘రెడ్ బుక్’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వైసీపీ హయాంలో అక్రమాలు చేస్తూ, హద్దుమీరి ప్రవర్తిస్తున్న నాయకులు, అధికారుల పేర్లన్నీ ఇందులో నోట్ చేశానని.. తాము అధికారంలోకి వచ్చాక వీళ్లందరి పనీ పడతామని లోకేష్ పదే పదే ప్రస్తావించేవాడు. దాని మీద వైసీపీ వాళ్లు ఎన్నో కౌంటర్లు వేశారు. ఎప్పట్లాగే లోకేష్‌ను ఎగతాళి చేసేవాళ్లు. …

Read More »

లైంగిక వేధింపులు..వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

అధికారం చేతిలో ఉంది కాదా అని వైసీపీ నేతలు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భూ కబ్జాలు మొదలు అక్రమ మైనింగ్ వరకు…వైసీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్ట లేదని ఆరోపణలు వచ్చాయి. ఆఖరికి ఇంట్లో పనిచేసే వారిపై లైంగిక వేధింపులకు కూడా వైసీపీ నేతలు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్.తన ఇంట్లో పనిచేసే బాలికపై కొద్ది రోజుల క్రితం అత్యాచారానికి …

Read More »

వంగ‌వీటి రాధా – ప్ర‌జ‌లు తగిన బుద్ధి చెప్పారు

విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు.. వంగ‌వీటి రంగా వార‌సుడు.. రాధా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య లు చేశారు. అయితే.. ఈవ్యాఖ్య‌ల వెనుక రీజ‌నేంటి? మీనింగేంట‌నేది అంతుచిక్క‌డం లేదు. గురువారం రంగా 77వ జ‌యంతి. దీనిని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ బంద‌ర్ రోడ్డులో ఉన్న రంగా విగ్ర‌హానికి ఆయన నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతు.. ప‌ద‌వుల కోసం..ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌లేదన్నారు. ఏ ప‌దవులు, హోదాలు ఆశించ‌లేద‌ని చెప్పారు. త‌న‌వంతుగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశాన‌ని.. …

Read More »

వెళ్లే వాళ్లు వెళ్లండి.. నేను ఆప‌ను: జ‌గ‌న్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాల‌ని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవ‌చ్చ‌ని.. తాను ఎవ‌రినీ బ్ర‌తిమాల‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. “చాలా మంది చెబుతా ఉన్నారు. అన్నా.. వాళ్లు వెళ్లిపోతున్నారు అని. నేనేం చేస్తాను. వెళ్లేవాళ్ల‌ను వెళ్ల‌మ‌నే చెబుతా. నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్క‌డొక కాలు.. అక్క‌డొక కాలు.. ఎందుకు? వెళ్లేవాళ్లు ఎంత‌టి వారైనా నేను ఆప‌ను. నాకు చెప్పాల్సిన అవ‌స‌రం …

Read More »

ఇల్లు పీకి పందిరేయ‌డమంటే.. ఇదే జ‌గ‌న్‌!

చ‌క్క‌గా క‌ట్టుకుంటున్న ఇంటిని చింద‌ర వంద‌ర చేయ‌డం.. పీకేసి పందిరేయ‌డం.. ఈ రెండింటికీ నిలు వెత్తు ఉదాహ‌ర‌ణ ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు, రాజ‌కీయ మైలేజీలను కొలుచుకుని.. నాటి సీఎం జ‌గ‌న్ చేసిన నిర్వాకంతో ఇప్పుడు.. అమ‌రావ‌తి ప‌రిస్థితి అంతు చిక్క‌డం లేదు. ఒక‌ప్పుడు అమ‌రావ‌తి అంటే.. పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ముఖ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. కానీ.. ఇప్పుడు పిలిచినా వ‌స్తార‌నే న‌మ్మ‌కం లేకుండా పోయింది. జ‌గ‌న్ చేసిన …

Read More »

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. పవన్ రియాక్షన్

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఆలస్యం.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ స్టిక్కర్లు, పోస్టర్లు రెడీ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక పవన్ ఎన్నికల్లో గెలిచాక ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. బైకుల మీద, కార్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ హోం మినిస్టర్ గారి …

Read More »

‘జ‌గ‌న్ మ‌న‌స్తత్వం చాలా డిఫ‌రెంట్‌.. అర్థంకాదు’

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌న‌స్థ‌త్వం చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని.. దానిని అర్ధం చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌.. ఆరా అధినేత మ‌స్తాన్ పేర్కొన్నారు. జ‌గ‌న్ ఎవ‌రినీ బ్ర‌తిమాల‌ర‌ని.. ఎవ‌రూ త‌న‌కు అనుకూలంగా ఉండాల‌ని కోరుకునే వ్య‌క్తిత్వం ఆయ‌న‌కు లేద‌న్నారు. ఆయ‌న మ‌న‌స్థ‌త్వం చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుందన్నారు. ఆయ‌న‌ను అర్థం చేసుకోవ‌డం కూడా.. అంతే డిఫ‌రెంట్ అని తెలిపారు. లేక‌పోతే.. ఎన్నిక‌ల‌కు ముందు ఇంత మంది ఎలా వెళ్లిపోతార‌ని …

Read More »

త‌ప్ప‌దు.. మోడీ స‌ర్‌.. బాబు చేతులు క‌ట్టేశారు!

ఏపీకి నిధులు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి మోడీకి ఏర్ప‌డిందా? అమ‌రావ‌తి రాజ‌ధానికి మోడీ ఇప్పుడు క‌నీసం 100 కోట్లయినా.. కేటాయించ‌క త‌ప్ప‌దా? అంటే.. త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్పుడు ఎన్డీయే కూట‌మిలో మోడీకి అత్యంత విశ్వ‌స‌నీయ భాగ‌స్వామ్య పార్టీ కేవ‌లం టీడీపీనే. ఇత‌ర పార్టీల‌ను తీసుకుంటే.. వారి గొంతెమ్మ కోరిక‌లను తీర్చ‌క‌పోతే.. ఏ క్ష‌ణ‌మైనా త‌ప్పుకొనే అవ‌కాశం ఉంది. కానీ, బాబు అలా చేయరు. గ‌తంలో ఇలా చేసే.. …

Read More »