Political News

మునుగోడులో కాంగ్రెస్ పరిస్ధితే నయం లాగుందే

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు బాగా కష్టపడుతున్నాయి. మూడు పార్టీలోను మైనస్సులు, ప్లస్సులున్నాయి. అయితే టీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితే కాస్త నయమన్నట్లుగా ఉంది. ఇప్పటి వాతావరణాన్ని బట్టి కచ్చితంగా ఎవరు గెలిచేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కప్పల తక్కెడ లాగ నేతలు ఒక పార్టీలో నుండి మరోపార్టీలోకి దూకేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా వ్యవహారం ఇలాగే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన …

Read More »

కేంద్రాన్ని కేసీయార్ ఇరుకున పెట్టారా ?

కేంద్ర ప్రభుత్వం-కేసీఆర్ మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీయార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేసీయార్ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయిలో జరుగుతోంది. నిజానికి ఈ మాటల యుద్ధం విదానపరమైన అంశాల మీద జరిగితే బాగానే ఉంటుంది. కానీ జరుగుతున్న దాంట్లో అత్యధికం వెర్బల్ పొల్యూషన్ అనటంలో …

Read More »

రాజ‌కీయాల్లోకి వివేకా కుమార్తె.. ఇంకా క్వ‌శ్చ‌న్ మార్కేనా?

మాజీ మంత్రి, అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. సునీత రెడ్డి.. గురించి ఎప్పుడూ.. వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారని.. పోటీకి రెడీ అవుతున్నార‌ని.. వార్తలు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. గ‌తంలో ఒక‌సంద‌ర్భంలో వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల చేసిన కామెంట్లే. “ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. ఆమెను.. రాజ‌కీయాల్లోకి తెచ్చేలా ఉన్నారు” అంటూ.. టీడీపీపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎందుకంటే.. అప్ప‌ట్లో టీడీపీ ఈ …

Read More »

అదేంటి.. జ‌గ‌న్ ‘సంక్షేమం’ ఇన్ని చేతులు మారుతోంది?

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. నేరుగా ప్ర‌జ‌ల‌కే చేరుతున్నాయి. అంటే.. సీఎం జ‌గ‌న్‌..ఏం చేయాల‌ని అనుకున్నా.. వెంట‌నే.. ఆయ‌న స్వ‌యంగా బ‌ట‌న్ నొక్కుతాడు.. నేరుగా.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోకే చేరుతోంది. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పారు కూడా. “రాష్ట్రంలో ఎక్క‌డా అవినీతి లేదు.. అక్ర‌మం లేదు.. బ‌ట‌న్ నొక్క‌గానే.. అక్క‌చెల్లెమ్మ‌ల ఖాతాల్లోకిడ‌బ్బులు నేరుగా పోతున్నాయి” అని పేర్కొంటున్నారు. ఇలా.. గ‌త‌ మూడేళ్లు …

Read More »

టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ నేత

కొద్ది రోజుల క్రితం టీడీపీతో పొత్తుల వ్యవహారంపై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రధాని మోడీ రహస్య భేటీ జరిపారని టాక్ వచ్చింది. దాంతోపాటు, హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పొత్తులపై చర్చించారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, సమయం, సందర్భాన్ని బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో …

Read More »

వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన బీజేపీ

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. వ‌చ్చేస్తామ‌ని.. చెబుతున్న బీజేపీ కి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. వాస్త‌వానికి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో ఉన్న సంబంధాలు కావొ చ్చు.. లేదా.. స్థానికంగా బీజేపీకి ఏమీ లేదు.. అనుకుని అయినా.. ఉండొచ్చు.. దీంతో వైసీపీ నాయ‌కులు పెద్ద‌గా బీజేపీ విష‌యంలో స్పందించ‌డం లేదు. అయినా..కూడా.. అప్పుడ‌ప్పుడు.. బీజేపీ నేత‌ల‌కు.. వైసీపీ నాయ‌కులకు మ‌ధ్య మాట‌ల యుద్ధం అయితే.. …

Read More »

3 రాజ‌ధానుల‌పై వైసీపీలో కొత్త టెన్ష‌న్‌…!

ఇదో పెద్ద సంక‌ట ప‌రిస్థితి. ఏపీ అధికార పార్టీ.. వైసీపీలో తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం. ఇటీ వల వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ ఒక‌టి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని చ‌ర్చ‌కు పెట్టింది. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు కోరింది. మరీముఖ్యంగా.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్న విశాఖ‌, క‌ర్నూలు వాసుల్లో అభిప్రాయం ఎలా ఉంద‌నేది .. ఈ ఛాన‌ల్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. క‌ర్నూలు …

Read More »

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసుపై రోజు వారీ విచార‌ణ‌..మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి?

ఎక్కడో తీగ లాగితే.. ఇక్క‌డ ఏపీలో డొంక క‌దులుతోంది. గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు వ్యవహారంలో విచారణ రోజువారి జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. తనకు ఇచ్చిన బెయిల్‌ షరతులు సడలించి బళ్లారి వెళ్ళేందుకు అనుమతించాలని గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అయితే.. ఇప్పుడు.. ఇలాంటి అనేక …

Read More »

రంగంలోకి దిగనున్న జ‌న‌సైన్యం.. మూహూర్తం ఫిక్స్‌

ప్ర‌శ్నిస్తానంటూ..పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దూకుడు పెంచ‌నున్నారు. రేప‌టి నుంచి ఆయ‌న త‌న సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. శ‌నివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబర్ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన దృష్టి పెట్టారు. తాజాగా హైద‌రాబాద్‌లో పార్టీ నేత‌ల‌తో ఆయ‌న చర్చించారు. త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్లతో ప్రారంభించనున్నామన్నారు. …

Read More »

కేసీయార్ సొంత విమానం కొంటున్నారా ?

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అనేది పాత సామెత. ఇపుడు రాజు తలచుకుంటే సొంత విమానానికి కొదవా అని చెప్పుకోవాలేమో. కేసీయార్ తొందరలోనే సొంత విమానం కొనుగోలు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అవసరాల కోసం సొంత విమానం ఉండాలని సీఎం డిసైడ్ అయ్యారట. తొందరలోనే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తొందరలోనే జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత …

Read More »

ఈ ఎంపీ రూటు మారుస్తున్నారా ?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశానేని నాని తన రూటు మారుస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నాని ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసే అభ్యర్ధిని వెతుక్కోమని గతంలోనే చంద్రబాబునాయుడుకు ఎంపీ చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేయటం లేదని నానియే స్వయంగా చంద్రబాబుకు చెప్పేశారట. ఎంపీగా పోటీచేయనని చెప్పారే …

Read More »

కోమటిరెడ్డికి డ్యామేజీ తప్పదా ?

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి బాగా డ్యామేజి అవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెద్ద కాంట్రాక్టు సంస్ధలున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరారనే ఆరోపణలకు కొదవేలేదు. సరే రాజకీయాలన్నాక ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే అనుకున్నా ఇపుడు సొంత సంస్థ కార్మికులే ఆయన ఇజ్జత్ తీసేశారు. సంస్ధలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు …

Read More »