ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ రాజకీయ మిత్రులనే విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఇరువురు నాయకులు కూడా ఎవరినీ లెక్క చేయలేదు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించారు. ఫలితంగా అధికారం కోల్పోయారు. ఇక, ఇద్దరిలోనూ కామన్గా ఉన్న ఇష్యూ.. తాము అధికారంలో ఉండి.. తాము ఏం చేసినా.. చెల్లుతుందనే టైపు. అధికారం కోల్పోయాక.. ఏం జరిగినా.. అప్పుడు ప్రజాస్వామ్యం, విలువలు, …
Read More »జగన్ ఒకటంటే.. కూటమి వందంటోంది!
మాటకు మాట.. అన్నట్టుగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గుం టూరు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ను హత్య చేసిన జిలానీకి.. స్థానిక వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారి కుటుంబంలో జరిగిన వేడుకలకు జిలానీ హాజరయ్యారని.. ఎమ్మెల్యే సతీమణికి ఆయన కేక్ తినిపించిన సందర్భం ఉందన్నారు. ఇదే …
Read More »నిన్న నీట్-నేడు సివిల్స్.. మోడీ జమానాలో పరీక్షలకు పరీక్షలు!
“ఏ విద్యార్థి అయినా.. ఒక్క ఏడాది కోల్పోతే జీవితంలో అనేక సంవత్సరాలు వెనుకబడి పోతాడు. ఉద్యోగా ల్లో కావొచ్చు.. ప్రమోషన్లలో కావొచ్చు.. చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కావొచ్చు.. కాబట్టి విద్యార్థి దశలో ప్రతి ఏడూ.. కీలకమే“- గత ఏడాది నవంబరులో బిహార్లో వెలుగు చూసిన.. పరీక్షల కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ.. పాలకులకు మాత్రం ఈ వ్యాఖ్యలు వినిపించడం లేదు. విద్యార్థుల …
Read More »సైలెంట్గా వచ్చి.. సైలెంట్గా నే వెళ్లిపోయారు
రాజకీయ విద్వేషాలకు.. వ్యక్తిగత కక్షలకు కూడా నిలయంగా విలసిల్లిన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని అనుకున్నా.. తాజాగా శనివారం ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా.. ప్రశాంతంగా పరిస్థితి సాగిపోయింది. పెద్దారెడ్డి ఎలా అడుగు పెడతాడో చూస్తా అంటూ.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ చేయడంతో శనివారం పెద్దారెడ్డి రాక నేపథ్యంలో ఏం జరుగు తుందో అని అందరూ టెన్షన్కు గురయ్యారు. అయితే.. ఎక్కడా ఎలాంటి అల్లరికి …
Read More »గతాన్ని జగన్ మరిచిపోయినా.. జనాలు మరిచిపోలేదు
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు.. ప్రజలకు అనేక హామీలు గుప్పించిన విషయం తెలిసిందే. అమ్మకు వందనం, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి.. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.20 వేలు, మహిళలకు రూ.1500 చొప్పున నెలనెలా ఇచ్చే పథకాలను సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రకటించారు. అయితే.. కూటమి సర్కారు ఏర్పడి.. నెల రోజులు దాటిపోయినా.. వాటిని ఏం చేశారని.. ప్రజలకు …
Read More »కమ్మవారి పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కమ్మవారు…అనగానే టీడీపీకి చెందిన వాళ్లు అనే ముద్ర ఏపీ, తెలంగాణలో ఉంది. పార్టీపరంగా ఆ సామాజిక వర్గానికి ఓ ముద్ర వేసి వారిని విమర్శించడం వైసీపీ నేతలకు అలవాటు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, వారికి చెందిన భూములు ఎక్కువగా ఉన్నాయని అమరావతి రాజధాని మొత్తానికి కుల ముద్ర వేశారు మాజీ సీఎం జగన్. ఆ …
Read More »విజయసాయిరెడ్డి.. ఎట్టకేలకు క్లారిటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన విజయసాయిరెడ్డి ఇటీవల ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పని చేసిన శాంతి అనే మహిళతో ఆయన బంధం గురించి రకరకాల ఆరోపణలు వచ్చాయి. శాంతి భర్త అయిన మదన్ మోహన్.. తన బిడ్డకు తాను తండ్రిని కాదని.. విజయసాయిరెడ్డి లేదా సుభాష్ రెడ్డి …
Read More »అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే ఢిల్లీ ప్లానా? !
2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అరాచక పాలనతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యారనే టాక్ ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కనిపించింది. దీంతో 11 సీట్లకు పడిపోయారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్లాలంటే జగన్కు ధైర్యం చాలడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి వెళ్తే టీడీపీకి టార్గెట్గా మారడం ఖాయమని భావించి అసెంబ్లీ డుమ్మా కొట్టేందుకే జగన్ ప్లాన్ …
Read More »జగన్ బయటికొస్తే చాలు.. ట్రోల్సే ట్రోల్స్
అధికారంలో ఉండగా ఎక్కడ లేని దర్పం చూపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారం పోగానే ఆయన గాలి తీసిన బెలూన్ లాగా తయారయ్యారు. పార్టీ పరిస్థితి రోజు రోజుకూ ఇబ్బందికరంగా తయారవుతోంది. అంత అధికారం అనుభవించాక జగన్ ఈ వైఫల్యాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేనట్లే కనిపిస్తున్నారు. ఇంత ఘోరమైన ఫలితాల తర్వాత తీరు మార్చుకోకుండా పాత శైలినే కొనసాగిస్తూ ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది …
Read More »జగ్గారెడ్డికి పనిలేనట్టుందే.. చిరంజీవిని లాగేశాడు!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పనిలేదా? ఏంటి? ఇదీ.. ఇప్పుడు పార్టీ నాయకుల మాట. దీనికి కారణం.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని ఆయన రాజకీయాల్లోకి లాగేశారు. ఆయనపై విమర్శలు కూడా గుప్పించారు. ఆశ్చర్యం కాదు. నిజమే. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చిరు చాలా రోజుల కిందటే చెప్పారు. తనను రాజకీయాల్లోకి పిలవద్దని కూడా చెప్పారు. తన సొంత …
Read More »బొత్స ఢీలా.. అల్లుడి జోరు
బొత్స సత్యనారాయణ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ఇది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఏపీలో తనదైన పొలిటికల్ ప్రయాణాన్ని ఆయన కొనసాగించారు. మొదట కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో కీలక పాత్ర పోషించారు. వివిధ శాఖలకు మంత్రిగా కీలక బాధ్యతలూ చేపట్టారు. కానీ ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీనియర్ నాయకుడు ఢీలా పడ్డారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ …
Read More »నిండా మునిగినా కేసీఆర్ అదే మొండిపట్టు!
తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) విజయం సాధించింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ గతేడాది సీన్ రివర్సయింది. బీఆర్ఎస్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ అహంకారభావమే అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అలాగే ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం మరో కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికైనా మేలుకుని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates