Political News

మోడీ గారు..కుదిరితే మరో కప్పు కాఫీ…: చంద్రబాబు

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన …

Read More »

దేశంలో న్యాయం మారుతోంది!

దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ మారుతోంది. జూలై 1(సోమ‌వారం) నుంచి దేశ‌వ్యాప్తంగా నూత‌న నేర న్యాయ చట్టాలు అమ‌ల్లోకి రానున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నూత‌న నేర న్యాయ చ‌ట్టాల మేర‌కు.. తీర్పులు, కేసుల న‌మోదు, ఫిర్యాదుల న‌మోదు వంటివి అందుబాటులోకి వ‌స్తున్నాయి. 2023లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. మూడు నూత‌న నేర న్యాయ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. వీటికి డెడ్ లైన్ జూన్ …

Read More »

నాయుడి జీవితం పై 3 పుస్తకాలు ఆవిష్కరించిన మోదీ

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేదు. గ్రామ స్థాయి బీజేపీ నేత నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారు వెంకయ్య నాయుడు. హుందాతనంగా రాజకీయాలు చేసిన వెంకయ్యనాయుడు అంతే హుందాగా ఉప రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తన మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు వెంకయ్య నాయుడు …

Read More »

తెలంగాణ‌తో ఏపీ తొలి పేచీ ప్రారంభం..

ఏపీలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌ధానంగా పొరుగున ఉన్న తెలంగాణ నుంచి రావాల్సిన బ‌కాయిల‌ను వ‌సూలు చేసుకోవ‌డంపై క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా విద్యుత్ బ‌కాయిలు వ‌సూలుకు రంగం రెడీ చేసింది. అయితే.. దీనికి తెలంగాణ‌లోని రేవంత్ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏకంగా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. తెలంగాణ నుంచి 5 వేల కోట్ల‌ …

Read More »

జ‌గ‌న్‌ను ఇలా కూడా ‘ఆడేసుకుంటాన్నారుగా’!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. ఆయ‌నపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌, మీమ్స్ వ‌చ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాలు.. మూడు రాజ‌ధానులు, పోల‌వ‌రం, అమ‌రావ‌తి విధ్వంసం వంటి వాటిని నెటిజ‌న్లు గుర్తు చేస్తూ… త‌మ‌దైన శైలిలో ఉతికి ఆరేస్తున్నారు. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇక‌, రాజ‌కీయంగా చంద్ర‌బాబు కూడా.. …

Read More »

జూలై 1… జ‌గ‌న్ షేక్ అయ్యే స్కెచ్ వేసిన చంద్ర‌బ‌బు

Chandrababu

టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. 1వ తేదీన సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేసే పింఛ‌న్ల కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి పించ‌న్ల‌ను అందించాల‌ని.. అధికారుల‌ను, వార్డు, గ్రామ స‌చివాల‌య సిబ్బందిని ఆయ‌న ఆదేశించారు. మ‌రోవైపు.. రాజ‌కీయంగా కూడా దీనిని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. మంత్రులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు. వారి ద్వారా.. ప్ర‌తి ఇంటికీవెళ్లి …

Read More »

వైఎస్ @ 75 : జాడ‌లేని జ‌గ‌న్‌.. ష‌ర్మిల మాత్రం!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల‌కు కావాల్సిన నాయ‌కుడే. తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటోంది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ వైఎస్ కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. 2004, 2009లో వైఎస్ హ‌యాంలోనే వ‌రుస‌గా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. త‌ర్వాత ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం, రాష్ట్ర విభ‌జ‌న సంగ‌తి తెలిసిందే. అయితే.. ప్ర‌తి ఏటా …

Read More »

హైద‌రాబాద్‌తో ఈక్వ‌ల్‌గా వ‌రంగ‌ల్‌..

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు.. రియ‌ల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌ను అభివృద్ది చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌లు రెడీ చేస్తున్నారు. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించిన రేవంత్‌రెడ్డి.. వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని.. హైద‌రాబాద్ న‌గ‌రంతో స‌మానంగా అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించినట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా.. పెట్టుబ‌డులు.. రియ‌ల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయ‌ని ఆయ‌న పేర్కొన‌డం …

Read More »

అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాలు..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం ప‌రుగులు పెట్టిస్తోంది. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబు.. అనంత‌రం.. రెండో ప‌ర్య‌ట‌న‌ను అమ‌రావ‌తిలోనే చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న కీల‌క ఆదేశాలు జారీ చేశారు. అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డ‌మే కాకుండా.. వాటిని గుర్తించాల‌ని ఆదేశించారు. దీంతో ఏపీ సీఆర్‌డీఏ అధికారులు తాజాగా గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల …

Read More »

చంద్ర‌బాబు జ‌గ‌న్‌కు ఇలా ఆన్స‌ర్ ఇస్తున్నారా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే నెల 1న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. అయితే.. ఈ పింఛ‌న్ల‌ను త‌న చేత్తోనే ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. 1వ తారీకున చంద్ర‌బాబు స్వ‌యంగా ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయనున్నారు అని ప్ర‌క‌ట‌న జారీ అయింది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న …

Read More »

కొండగట్టులో తల్వార్ పట్టిన పవన్..వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్నకు పవన్ తన మొక్కులను చెల్లించుకున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ …

Read More »

గ‌జ‌ప‌తిరాజుకు ఇది.. రామ‌కృష్ణుడికి అది

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకుని పార్టీ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డ అశోక్ గ‌జ‌ప‌తిరాజు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి త‌గిన గుర్తింపు ఇచ్చేలా సీఎం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. మంచి ప‌ద‌వుల‌తో వీళ్ల‌ను గౌర‌వించాల‌ని చూస్తున్నారు. దైవ‌భ‌క్తి మెండుగా ఉండి, ఆధ్యాత్మిక భావాల‌తో సాగుతున్న గ‌జ‌ప‌తిరాజుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. టీటీడీకి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు …

Read More »