బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రుషి సునాక్ కు చాలా సవాళ్ళు ఎదురుకానున్నాయి. అన్నింటిలోను అతిపెద్ద సవాలు ఏమిటంటే దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించటం. ఎందుకంటే ఆర్ధిక సమస్యల నుండి దేశాన్ని గట్టెక్కించటంలో మాజీ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ వేసిన ప్రణాళికలు ఫెయిలైన విషయం తెలిసిందే. తన ప్లాన్లు ఫెయిలైన కారణంగానే ట్రస్ కేవలం 45 రోజుల్లోనే పదవి నుంచి దిగిపోయారు. ఇక్కడ సునాక్ ముందున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే రాబోయే …
Read More »వైసీపీ, టీడీపీల్లో ఇదో పెద్ద కల్లోలం.. అంతా డోలయామానం..!
మరో ఏడాదిన్నరలో ఏపీలో ఎన్నికలు సమీపించనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుపు గుర్రం ఎక్కేందుకు అధికార వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా.. వ్యూహాలను తెరమీదికి తెస్తోంది. అయితే.. అధిష్టానాల పరంగా.. ఈ రెండు పార్టీలు దూకుడుతోనే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం.. ఈ రెండు పార్టీల నాయకులు.. మల్లగుల్లాలు పడుతున్నారు. తమకు టికెట్ వస్తుందో.. రాదో. అనే దిగులుతోనూ ఉన్నారు. …
Read More »ఉప ఎన్నికలా.. జగన్ కు ఇస్టం లేదు
మూడు రాజధానుల విషయాన్ని సీరియస్గా తీసుకున్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఈ పాటే పాడుతున్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై నిప్పులు చెరుగుతున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు.. ఈ వాదననే వినిపిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేల్లో కొందరు ఇదే బాట పట్టారు. ఉద్యమాలుచేసేందుకు రెడీ అంటూ.. పార్టీకి.. అధిష్టానానికి కూడా సంకేతాలు పంపించారు. ఇప్పటికే ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని.. ఉద్యమాలు తీవ్రతరం …
Read More »అంతా ఎంపీ ప్లాన్ ప్రకారమే జరుగుతోందా ?
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీచేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలవాలి. అన్నగా, సీనియర్ కాంగ్రెస్ ఎంపీగా బహిరంగంగా తమ్ముడి గెలుపుకు పనిచేయలేరు. అందుకనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్లాన్ చేసినట్లున్నారు. ఎలాగూ ఈయనకు కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే ఉద్దేశ్యంలేదు. అందుకనే కాంగ్రెస్ గెలవదని, ఓడిపోయేపార్టీ తరపున ప్రచారం దేనికంటు ఆస్ట్రేలియాలో తనను కలిసిన వాళ్ళతో కావాలనే కామెంట్ చేశారు. ఆయన అంచనా వేసినట్లే ఎంపీపై …
Read More »ధర్మాన రాంగ్ స్టెప్ వేసి ఫెయిల్ అయ్యారా…!
ఏ మంత్రికైనా.. ప్రధాన లక్ష్యం.. తను చూస్తున్న శాఖను బలోపేతం చేయడం దాని ద్వారా.. ప్రజలకు మరిన్ని సేవలు అందించడమే. ఈ విషయంలో రెండో మాట ఉండదు. అయితే.. ఇప్పుడు మంత్రులు నేరుగా ప్రజా ఉద్యమాలకు వస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానులకు అనుకూలంగా.. గళం వినిపిస్తున్నారు. ఇది అధిష్టానం సూచనల మేరకు చేస్తున్నారా? లేక.. వారి ఉనికికోసం పాకులాడుతున్న క్రమంలో చేస్తున్న ఉద్యమాలో తెలియదు కానీ.. మంత్రులు నేరుగా రంగంలోకి …
Read More »కాంట్రవర్సీల కేరాఫ్గా ఏపీ మహిళా కమిషన్…!
ఏపీ మహిళా కమిషన్.. వివాదాలకు కేంద్రంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి రాజ్యాంగ బద్ధమైన సంస్థ కేంద్ర మహిళా కమిషన్. దీనిని రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. అయితే.. దీని సూచనలమేరకు.. కేంద్రం ఏర్పాటు చేసిన కొన్నికమిటీల సూచనల మేరకు.. ఆయా రాష్ట్రాల్లోనూ మహిళా కమిషన్లను ఏర్పాటు చేశారు. వీటి ప్రధాన కర్తవ్యం.. మహిళలకు భద్రత కల్పించడం.. వారికి అవగాహన కల్పించడం.. వారిలో స్వయం చాలక శక్తిని ప్రోది చేయడం వంటివి …
Read More »ఒకవైపే చూడకు జగనన్నా..
రాజకీయాల్లో ఇప్పుడు నెటిజన్ల ప్రాధాన్యం కూడా పెరిగిపోయింది. సమకాలీన రాజకీయాలపై నెటిజన్లు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ వాడకం.. డేటా వినియోగం పెరిగిపోయిన దరి మిలా.. నెటిజన్లు.. ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలపైనా.. వారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీకి చివరకు మిగిలేది.. ఇదే.. అంటూ.. కామెంట్లు కుమ్మరిస్తున్నారు. గత అనుభవాలను కూడా వారు వివరిస్తున్నారు. ఎప్పుడూ.. ఒకవైపే చూడకు జగనన్నా.. అని …
Read More »నిమ్మకాయలో టెన్షన్ పెరిగిపోతోందా ?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాజీ హోంశాఖ మంత్రి Nimmakayala Chinarajappa కు ఇంటిపోరు తప్పేట్లులేదు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గానికి నిమ్మకాయల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడినుండి ఈ సీనియర్ నేత 2014, 19 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. మొదటిసారి గెలవగానే హోంశాఖ మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి పార్టీలో బాగా యాక్టివ్ గా చంద్రబాబునాయుడు నమ్మకస్తుల్లో ఒకరికి నిమ్మకాయలకు మంచిపేరుంది. ఈ మధ్యనే సిట్టింగులకే మళ్ళీ …
Read More »విశాఖకు ఎవరూ వెళ్లకూడదా? వైసీపీ ఎందుకు భయపడుతోంది?
ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ నేతలు తప్ప.. విశాఖపట్నం మహానగరంలో ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఎవరు అడుగు పెట్టకూడదనేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న వైనాన్ని మేధావులు సైతం తప్పుపడుతున్నారు. ఇదేం చోద్యం.. ఇదే పద్ధతి? అని వారు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నంలో గత ఏడాది కిందట టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాలని భావించారు. అయితే.. అప్పట్లోనూ ఆయనను విశాఖ విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో …
Read More »కాంగ్రెస్కు మోడీ భారీ షాక్!!
నేషనల్ హెరాల్డ్ కేసుతో ఒకరి తర్వాత..ఒకరుగా విచారణలుఎదుర్కొంటూ.. ఉక్కిరి బిక్కిరికి గురవుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో కాంగ్రెస్ కోలుకోవడం.. కష్టమనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఈ షాక్తో రాహుల్ తన భారత్ జోడో యాత్రను అర్ధంతరంగా విరమించుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిపోయారు. ఏం జరిగింది? కాంగ్రెస్ …
Read More »మళ్లీ ముద్రగడ ఎంట్రీ..?
“మీకేం కావాలో చెప్పండి.. మా సీఎం మీరంటే.. చాలా ఇష్టపడుతున్నారు. మీరు ఏం చేయమన్నా చేస్తారు. ఆ ఒక్కటి తప్ప. రాజకీయంగా కూడా.. మీకు మంచి అవకాశం ఇస్తారు. అవసరమైతే.. రాజ్యసభకు కూడా పంపిస్తారు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి” ఇదీ.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు నాయకుడు.. ముద్రగడ పద్మనాభానికి వైసీపీ సీనియర్ నాయకులు ఒకరిద్దరు చేసిన ప్రతిపాదన. అయితే.. …
Read More »ఏపీ మంత్రులకు ఇంటెలిజెన్స్ వార్నింగ్!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సుమారు 13 మంది మంత్రులకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు అందాయి. “మంత్రులూ జాగ్రత్త” అని అధికారులు వారిని అప్రమత్తంగా ఉండాలని కోరినట్టు.. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి మీడియాకు అనధికారిక సమాచారం అందింది. వాస్తవానికి ఇంటెలిజెన్స్.. చెప్పిందంటే.. దీనిలో నిజం లేకుండా అయితే ఉండదు. మరి ఎందుకు మంత్రులను అంతగా అలెర్ట్ చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. మూడు …
Read More »