బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పార్టీలోనూ, బయటా చోటు చేసుకున్న పరిణామాలపై కేసీఆర్ స్పందిస్తారని అందరూ భావించారు. అంతేకాదు, ఈ అంశాలపై పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తారని అంచనా వేశారు. కానీ కేసీఆర్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కీలక …
Read More »మళ్ళీ సీఎం రేవంత్ పేరు ఎత్తని కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ సారథి, సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత.. బీఆర్ ఎస్ భవన్కు వచ్చిన ఆయన ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి ప్రభుత్వ విధానాల వరకు అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. అదేసమయంలో తమ హయాంలో …
Read More »పేరు మారింది.. పంతం నెగ్గింది!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లే ఆమోదం పొందింది. యూపీఏ 1 ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ ఇటీవల మోడీ సర్కారు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. మొదటగా మహాత్మా గాంధీ పేరును తొలగించి పూజ్యబాపూజీ పేరు పెట్టాలని …
Read More »ఇకపై తెలంగాణలో మత విదేశాలు ఉండవు
తెలంగాణలో కొత్త చట్టం తీసుకురానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాలపై ఎవరి నిర్బంధం ఉండదన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నారు. మత విద్వేషాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కర్ణాటకలో కూడా ఇటీవల …
Read More »రెడ్లను వదిలేసి జగన్ రాజకీయం.. ఫలించేనా..!
రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ, ‘వైనాట్ 175’ మంత్రం పఠించినప్పటికీ కూడా ఆయన పుంజుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకోవడమేనన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా కీలక సామాజిక వర్గాల మద్దతు చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా వర్గాల మద్దతు లేకుండా పార్టీలు …
Read More »సచివాలయం అద్దె ఇళ్లు… పార్టీ సొంతిల్లు
అద్దె ఇంటికి, సొంత ఇంటికి చాలా తేడా ఉంటుంది. మనకు నచ్చకపోతే లేదంటే యజమానికి మనం నచ్చకపోతేనో అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. సొంతిల్లు అలా కాదు.. అదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ పార్టీకి అన్వయించి కార్యకర్తలకు, నేతలకు అర్థమయ్యేలా చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాము.. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతం అని నొక్కి చెప్పారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన కేంద్ర కార్యాలయంలో …
Read More »జగన్ బర్త్ డే: నేతగా సఫలం.. విఫలం!
డిసెంబర్ 21 వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు. నేటితో ఆయన 53వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం కామనే. కానీ ఒక నాయకుడిగా జగన్ను చూసినప్పుడు ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో, అంతే ఎత్తు నుంచి కిందికి జారిపోవడం జగన్ జీవితంలో కీలక అధ్యాయమే అని చెప్పాలి. నేతగా సఫలమైన జగన్, అదే నేతగా విఫలం కూడా అయ్యారు. 2011లో కాంగ్రెస్తో విభేదించినప్పుడు …
Read More »‘తెలంగాణ’ గుడికి టీటీడీ భారీ సాయం… ‘ఏపీ’ డీసీఎం చొరవ
ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గోదావరి ప్రాంతం ఈ మధ్య దెబ్బ తినడానికి రాష్ట్ర విభజన పరోక్ష కారణమని.. ఆ ప్రాంతానికి తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఇటీవల మాటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. తెలంగాణ మంత్రులు సహా ఆ ప్రాంత నాయకులు పలువురు పవన్ మీద మండిపడ్డారు. తెలంగాణ ప్రజానీకానికి పవన్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఐతే ఈ …
Read More »పవన్ సీఎం కావాలనేదే వైసీపీ కోరికా?
ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉందని మూడు పార్టీల నేతల అభిప్రాయం. ఒక కట్టుబాటుగా మిగతా పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంకటంగా మారింది. ఏ సందర్భం వచ్చినా కూటమిలో చిచ్చు పెట్టేందుకు, భేదాభిప్రాయాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని కూటమి నేతల ఆరోపణ. వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసేకొద్ది పవన్, లోకేష్ మరియు చంద్రబాబు వ్యక్తిగత, పార్టీ పరమైన …
Read More »కూటమిలో కలివిడి.. గ్రౌండ్ రియాల్టీ ఇదే.. !
నిన్న మొన్నటి వరకు కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎలా ఉన్నప్పటికీ ఇటీవల గత వారం నుంచి పార్టీలలో నాయకుల మధ్య కలివిడి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఎంపీలకు సంబంధించి చేసిన కీలక సూచనల అనంతరం ఈ కలివిడి గ్రౌండ్ లెవెల్లో మరింత ఎక్కువగా కనిపి స్తోంది అన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుపరిపాలన పైరుతో మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి శతజయంతి …
Read More »జగన్ సంగతి ఒకే… ఆ 10 మంది ఏం చేస్తున్నట్టు?
వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్ ఒకరు. మిగిలిన 10 మంది ఇతర నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వంటి సీనియర్లు ఉన్నారు. అయితే.. ఈ పది మంది ఏం చేస్తున్నారు? పార్టీ లైన్లోనే నడుస్తున్నారా? లేక వేర్వేరు పనులు పెట్టుకున్నారా? అనేది వైసీపీలో తరచుగా చర్చకు వస్తోంది. అంతర్గత వ్యవహారాలు ఎలా …
Read More »రెడ్బుక్-2.0: మళ్లీ వైసీపీలో గుబులు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ తాజాగా మరోసారి.. రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఎవరినీ వదిలేది లేదని.. రెడ్ బుక్లో చాలా పేజీలు ఉన్నాయని.. కేవలం మూడు పేజీలు మాత్రమే తెరిచామని చెప్పారు. ఇంకా తెరవాల్సిన పేజీలను తెరిస్తే.. అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయని పార్టీ కార్యకర్తలతో వ్యాఖ్యానించారు. ఇది పార్టీ కార్యకర్తలను కేవలం ఉత్సాహ పరిచేందుకు చెప్పిన మాటగా తీసుకోలేం. వాస్తవానికి ఇప్పటి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates