వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ అధికారులు విచారణ జరిపారు. అయితే, ఆ లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనని సీబీఐ తాజాగా చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాకుండా కెమికల్స్ తో తయారైన నెయ్యి వాడారని కూడా అదే రిపోర్ట్ లో ఉంది. …
Read More »‘మా బాస్ కేసీఆర్’… ఈటల కామెంట్లు వైరల్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమ నేతగా, సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ కు సేవలందించిన సీనియర్ పొలిటిషియన్ గా తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, గులాబీ పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అయితే, రాజకీయ పరిణామాలు, రకరకాల ఆరోపణల నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరారు. అయితే, బీజేపీ ఎంపీ అయిన ఈటలకు ఆ పార్టీలో తగిన గుర్తింపు …
Read More »వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ. 11,770 పెరిగి రూ. 1,78,850కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా ఊహకందని రీతిలో కిలోకు రూ. 25,000 పెరిగి, ప్రస్తుతం రూ. 4,25,000 మార్కును తాకింది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే సామాన్యుడికి వెండి కూడా …
Read More »జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై నిరసనగా పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించిన షర్మిల తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తరువాత మరోసారి పాదయాత్ర చేయనున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తన స్పందన …
Read More »లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలు
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, …
Read More »ఆ సీన్ చూసిన తర్వాత.. టీడీపీలో పెద్ద చర్చ.. !
టీడీపీలో ఏం జరిగినా వార్తే.. విషయం ఏదైనా కూడా… నాయకుల మధ్య చర్చ జరగాల్సిందే. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతులు కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా పార్టీ నాయకుల మధ్య చర్చకు దారితీశాయి. దీనికి కారణం.. అన్నీ తానై మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహరించడమే. దాదాపు 11 వందల మందికి పైగా నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో …
Read More »జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్
తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. పర్యటనలో ఆయన జూ పార్క్లోని నూతన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్లను సందర్శించి వాటి …
Read More »లోకేష్ సంకల్పం… వాళ్లకు సోషల్ మీడియా బ్యాన్ అయ్యేనా?
సోషల్ మీడియా ప్రభావం వల్ల కలిగే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతిగా సోషల్ మీడియాను వాడటం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి మరియు ఆందోళనకు గురవ్వడమే కాకుండా, ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ అభద్రతాభావానికి లోనవుతున్నారు. శారీరక పరంగా చూస్తే, నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి, కంటి సమస్యలు తలెత్తుతున్నాయి మరియు ఇది వారి చదువుపై ఏకాగ్రతను తగ్గించి విద్యా పనితీరు మందగించేలా చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… కేసీఆర్ పీఏకు నోటీసులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, …
Read More »ఎట్టకేలకు చెవిరెడ్డికి బెయిల్
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో చెవిరెడ్డికి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. 2025 జూన్ 17న బెంగుళూరులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 226 …
Read More »ఇప్పుడు కేసీఆర్ వంతు?
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ లెక్క ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సెటైర్లు కూడా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు …
Read More »సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలపై మంత్రులతో చర్చించారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందాయని, దీనిపై కసరత్తు కూడా పూర్తి కావొచ్చిందని అధికారులు వివరించారు. దీంతో వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుందన్న సీఎం చంద్రబాబు సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates