Political News

మోడీని మెప్పించిన యువ‌తికి అసెంబ్లీ టికెట్‌!

రాజ‌కీయాల్లో పార్టీల అధినేత‌లు, కీల‌క నాయ‌కులు త‌లుచుకుంటే టికెట్ల‌కు కొద‌వ ఏముంటుంది?. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. గ‌త 2023 జ‌న‌వ‌రిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో రామ‌మందిరం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఆ ప్రారంభ స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అత్యంత చేరువ‌గా నిలిచిన బీహార్ యువ‌తి, జాన‌ప‌ద గాయ‌కురాలు.. మిథాలీ ఠాకూర్ ఇప్పుడు రాజ‌కీయ నేత‌గా అవ‌త‌రించారు. ఆనాడు ఆమె రామ‌చ‌రిత మాన‌స్‌లోని కొన్ని పంక్తుల‌ను ఆల‌పించి.. ప్ర‌ధానిని మంత్ర …

Read More »

కులాలు-క‌న్నీళ్లు: ‘జూబ్లీహిల్స్’ ర‌చ్చ ర‌చ్చ‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభ‌మైన 24 గంట‌లు కూడా గ‌డ‌వక ముందే.. పార్టీల మ‌ధ్య ర‌చ్చ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే ఉంద‌న్న చ‌ర్చ నేప‌థ్యంలో ఇరు పార్టీల నాయకులు జోరుగా మాట‌ల మంట‌లు మండిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మంత్రులు.. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు ఇక్క‌డ నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాగంటి …

Read More »

మోడీ వ‌స్తున్నారు.. జాగ్ర‌త్త‌: చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌ను హెచ్చ‌రించారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులో మాట్లాడిన చంద్ర‌బాబు.. ప్ర‌ధాన మంత్రి షెడ్యూల్ ఖ‌రారైంద‌ని.. ఆయ‌న ఢిల్లీ నుంచి ఉద‌యం క‌ర్నూలుకు వ‌స్తున్నార‌ని తెలిపారు. ఎక్క‌డా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా మంత్రులు అంద‌రూ వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల …

Read More »

మైండ్ లేనేళ్లో అలా మాట్లాడ‌తారు!: లోకేష్‌

రాష్ట్రంలో ఒక్క‌చోట‌కే పెట్టుబడులు తీసుకువ‌స్తున్నార‌ని.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల‌న్నీ.. నిర్ల‌క్ష్యానికి గురి అవుతున్నాయంటూ.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు మైండ్ లేనోళ్లే.. అలా మాట్లాడ‌తార‌ని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతానికి మాత్ర‌మే త‌మ అభివృద్ధి ప‌రిమితం కాద‌న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పెట్టుబ‌డులు స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో ఉపాధి, ఉద్యోగాల‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. ఒకే రాజ‌ధానిని అభివృధ్ది చేస్తున్నామ‌న్న నారా లోకేష్‌.. అదేస‌మ‌యంలో …

Read More »

బీజేపీ ఆఫీసులో డిష్యుం-డిష్యుం?

హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో బీసీ సంఘాల నాయ‌కులు, బీజేపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదంతో మొద‌లైన వివాదం చేయి చేయి క‌లిసే వ‌ర‌కు వెళ్లింది. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్నారు. తోసుకున్నారు. నెట్టుకున్నారు. దీంతో తీవ్ర‌స్థాయిలో ర‌చ్చ చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న‌ప్పుడు.. బీసీ సంఘాల జాతీయ అధ్య‌క్షుడు, పార్ల‌మెంటు స‌భ్యుడు ఆర్‌. కృష్ణ‌య్య‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు కూడా అక్క‌డే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ …

Read More »

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: త‌మిళ‌నాట `హిందీ` ర‌ద్దు?

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో స్థానిక సెంటిమెంటుకు మ‌రింత ప‌దును పెంచుతూ.. త‌మిళనాడు ప్ర‌భుత్వంకీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో డీఎంకే అధినేత‌, ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌.. రాష్ట్రంలో కొన్నాళ్లుగా డిమాండ్ రూపంలో ఉన్న హిందీ ర‌ద్దును అధికారికం చేసేందుకు న‌డుం బిగించారు. త‌ద్వారా.. స్థానిక త‌మిళ భాష‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. …

Read More »

రిజ‌ర్వేష‌న్ ఇవ్వాలంటే.. చాయ్ తాగినంత ప‌ని: కేటీఆర్‌

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌న్న చిత్త శుద్ధి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేద‌ని బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్ల ముసుగులో రాజ‌కీయం చేస్తున్నార‌ని, బీసీల‌కు అన్యాయం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజా గా బీసీ జాతీయ సంఘం అధ్య‌క్షుడు ఆర్ .కృష్ణ‌య్య నేతృత్వంలో బీసీ జేఏసీ నాయ‌కులు కేటీఆర్‌ను క‌లిశారు.  ఈ సంద‌ర్భంగా బీసీ జేఏసీ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన బంద్‌, నిర‌స‌న‌ల‌కు బీఆర్ ఎస్ పార్టీ మ‌ద్ద‌తు కోరారు. …

Read More »

టార్గెట్ జూబ్లీహిల్స్: బీజేపీ, కాంగ్రెస్‌లకు.. రాజా సెగ

బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయన తన కోపం అంతా బీజేపీపై కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనేనని చెప్పడం తెలిసిందే. ఆది నుంచి కిషన్ రెడ్డి కేంద్రంగా ఆయన విమర్శలు కూడా గుప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పర్యటనకు ఆయన రెడీ …

Read More »

కవితకు కేసీఆర్ అవసరం లేదు

బీఆర్‌ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజా జాగృతి జనం బాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జాగృతి కార్యకర్తల మధ్య ఈ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో కేవలం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ …

Read More »

గూగుల్ రాక: జనాలకు మేలెంత?

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో భారీ పెట్టుబడి రానుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద గూగుల్ పెట్టుబడిగా చెబుతున్నారు. 88 వేల కోట్ల రూపాయలను తొలిదశలో పెట్టుబడి పెట్టనున్నారు. అనంతరం దీనిని లక్షల కోట్లకు పైగానే విస్తరించనున్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను దశల వారీగా ఇవ్వనున్నారు. ఇక ఈ పెట్టుబడులతో డేటాకు సంబంధించిన అన్ని …

Read More »

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది: నారా లోకేష్

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానున్న నేపథ్యంలో ఢిల్లీలో దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు వచ్చినది అతి పెద్ద భారీ పెట్టుబడి అయినప్పటికీ ఇది ట్రయలరేనని, మున్ముందు విశాఖ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేయబోతున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. గూగుల్ రాకతో ఏపీకి …

Read More »

ఎవ‌రీ దీప‌క్ రెడ్డి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ తర‌ఫున లంక‌ల దీప‌క్ రెడ్డికి టికెట్ ఖ‌రారైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన ఈ సీటు విష‌యంపై ఎట్ట‌కేల‌కు క‌మ‌ల నాథులు నిర్ణ‌యం తీసుకున్నారు. బుధ‌వారం దీప‌క్ రెడ్డి పేరును ఖ‌రారు చేశారు. ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దీప‌క్ రెడ్డి పేరును ఖ‌రారు చేస్తూ పార్టీ అధిష్టానం పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ …

Read More »