Political News

టార్గెట్ జూబ్లీహిల్స్: బీజేపీ, కాంగ్రెస్‌లకు.. రాజా సెగ

బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయన తన కోపం అంతా బీజేపీపై కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనేనని చెప్పడం తెలిసిందే. ఆది నుంచి కిషన్ రెడ్డి కేంద్రంగా ఆయన విమర్శలు కూడా గుప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పర్యటనకు ఆయన రెడీ …

Read More »

కవితకు కేసీఆర్ అవసరం లేదు

బీఆర్‌ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజా జాగృతి జనం బాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జాగృతి కార్యకర్తల మధ్య ఈ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో కేవలం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ …

Read More »

గూగుల్ రాక: జనాలకు మేలెంత?

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో భారీ పెట్టుబడి రానుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద గూగుల్ పెట్టుబడిగా చెబుతున్నారు. 88 వేల కోట్ల రూపాయలను తొలిదశలో పెట్టుబడి పెట్టనున్నారు. అనంతరం దీనిని లక్షల కోట్లకు పైగానే విస్తరించనున్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను దశల వారీగా ఇవ్వనున్నారు. ఇక ఈ పెట్టుబడులతో డేటాకు సంబంధించిన అన్ని …

Read More »

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది: నారా లోకేష్

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానున్న నేపథ్యంలో ఢిల్లీలో దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు వచ్చినది అతి పెద్ద భారీ పెట్టుబడి అయినప్పటికీ ఇది ట్రయలరేనని, మున్ముందు విశాఖ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేయబోతున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. గూగుల్ రాకతో ఏపీకి …

Read More »

ఎవ‌రీ దీప‌క్ రెడ్డి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ తర‌ఫున లంక‌ల దీప‌క్ రెడ్డికి టికెట్ ఖ‌రారైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన ఈ సీటు విష‌యంపై ఎట్ట‌కేల‌కు క‌మ‌ల నాథులు నిర్ణ‌యం తీసుకున్నారు. బుధ‌వారం దీప‌క్ రెడ్డి పేరును ఖ‌రారు చేశారు. ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దీప‌క్ రెడ్డి పేరును ఖ‌రారు చేస్తూ పార్టీ అధిష్టానం పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ …

Read More »

గూగుల్‌తో ఒప్పందం: లోకేష్ క‌ష్టం మ‌ర‌వ‌రాదు సుమీ!

ఏపీ ప్ర‌భుత్వం తాజాగా గూగుల్‌, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద‌.. వ‌చ్చే రెండేళ్ల‌లో విశాఖ‌లో 1 గిగావాట్ హైప‌ర్ స్కేల్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. అంతేకాదు.. దీనివ‌ల్ల రాష్ట్రానికి ఆదాయంతోపాటు.. సుమారు రెండు ల‌క్ష‌ల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయి. ఇది ఏపీ స‌ర్కారుతోపాటు..రాష్ట్రానికి కూడా గేమ్ చేంజ‌ర్‌గా మార‌నుంది. కీల‌క‌మైన ఈ ప్రాజెక్టుకు మంగ‌ళ‌వారం ముహూర్తం కుదిరింది. అయితే.. …

Read More »

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ షాక్

భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ. సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత అయిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, మంగళవారం (అక్టోబర్ 14) మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది కేడర్‌తో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన నిరంతర ఆపరేషన్ల వలన మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. …

Read More »

మిథున్‌రెడ్డి నివాసంలో సోదాలు?

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు సోదాలు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సిట్ అధికారులు ఇక్క‌డి ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఉన్న మిథున్ రెడ్డి నివాసానికి వెళ్లి.. స్థానిక పోలీసుల స‌హ‌కారంతో సిబ్బందిని తొలుత త‌మ అధీనంలోకి తీసుకున్నారు. అనంత‌రం.. ఇంటి మొత్తాన్నీ త‌నిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి …

Read More »

బాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాం: కేంద్రం

ఏపీ సీఎం చంద్ర‌బాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాం.. అని కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, అశ్వినీ వైష్ణ‌వ్‌లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు భిన్నంగా ఆలోచ‌న‌లు చేస్తార‌ని ప్ర‌శంస‌లు గుప్పించారు. ‘భార‌త్ ఏఐ శ‌క్తి’ పేరుతో ఢిల్లీలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో గూగుల్‌, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఏపీ స‌ర్కారు కీల‌క ఒప్పందం చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

ఏపీలో గూగుల్ AI హబ్: ఊహించని పెట్టుబడి

భారతదేశంలో టెక్నాలజీ రంగానికి ఊపునిచ్చే అతిపెద్ద ప్రకటన ఇది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఏకంగా $15 బిలియన్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపిన గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (వైజాగ్‌లో) తమ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఇంత పెద్ద AI హబ్‌ను ఏర్పాటు చేయడం …

Read More »

ఎవ‌రీ కోట వినుత‌.. రాయుడి హ‌త్య వెనుక ఏం జ‌రిగింది..?

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన జ‌న‌సేన మాజీ నాయ‌కురాలు కోట వినుత సెల్ఫీ వీడియో-ఆమె ఒక‌ప్ప‌టి కారు డ్రైవ‌ర్ రాయుడి దారుణ హ‌త్య.. తాజాగా వెలుగు చూసిన రాయుడి సెల్ఫీ వీడియో ఉదంతాలపై తీవ్ర చర్చ సాగుతోంది. త‌నను హ‌త్య చేసే అవ‌కాశం ఉందంటూ… కోట వినుత‌, ఆమె భ‌ర్త చంద్ర‌బాబుపై రాయుడు తీవ్ర ఆరోప‌ణ‌లు వ్య‌క్తం చేస్తూ.. చేసిన సెల్ఫీ వీడియో విడుద‌లైన 24 గంట‌ల్లోనే వినుత కూడా సెల్ఫీ …

Read More »

క‌ర‌ణం.. కుటుంబ రాజ‌కీయం హిట్టా-ఫ‌ట్టా.. !

కరణం బలరామకృష్ణమూర్తి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న సీనియర్ నాయకుడు. తొలుత ఆయన ప్రస్థానం కాంగ్రెస్ తో ప్రారంభమైంది. ఇందిరా గాంధీకి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న కరణం బలరాం.. ఈ క్రమంలోని అద్దంకి నియోజకవర్గం నుంచి 1978లోనే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అనూహ్య‌ పరిణామాల నేపథ్యంలో టిడిపిలోకి వచ్చిన ఆయన ఆ పార్టీలోనూ పలుమార్లు …

Read More »