Political News

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ రచ్చల్లో తమ నేతల తలరాతలు ఎలా ఉంటాయన్న దిశగా జనం రకరకాల సమరణాలను ప్రస్తావించుకుంటున్నారు. ఈ తరహా చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజిలో సాగుతున్నాయి. ఆయా పార్టీల కీలక నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెబ్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ …

Read More »

మోడీతో ద‌గ్గుబాటి… అవన్నీ పుకార్లేనా?

ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీతో సీనియ‌ర్ నాయ‌కురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, వెంక‌టేశ్వ‌ర‌రావు దంప‌తులు భేటీ అయ్యారు. అయితే.. స‌హ‌జంగానే ఈ భేటీ జ‌రిగి ఉండొచ్చు.. అనే ప్ర‌శ్న వ‌స్తుంది. కానీ, దీని వెనుక కొన్ని వివాదాల‌కు చెక్ పెట్టాల‌న్న ఉద్దేశం కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బుధ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ద‌గ్గుబాటి దంప‌తులు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలపై …

Read More »

నిప్పులు కురిపించిన ‘ఇందిరమ్మ ఇప్ప‌సారా`

తెలంగాణ అసెంబ్లీలో బుధ‌వారం దాదాపు ఒకే అంశంపై అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళంతోపాటు.. బీజేపీ-కాంగ్రెస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాట‌ల మంట‌లు రేగాయి. ఇదంతా.. `ఇప్ప‌సారా` వ్య‌వ‌హారమే కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌పై తాజాగా స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో బీజేపీ స‌భ్యుడు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

‘వైసీపీ నేతలతో పోలిస్తే కుక్కలు బాధపడ్డాయి’

ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకు వివాదం పెరుగుతోంది. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం మంటలు రాజేస్తున్నాయి. అటు షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కుటుంబం వివాదం రచ్చకెక్కుతోంది. తాజాగా ఇదే అంశంపై షర్మిల స్పందించారు. ఆమె కడపలో మాట్లాడుతూ వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే తన జోలికి …

Read More »

టీడీపీ లీడర్లను జనసేన నేతలు మోయలేరట

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి పార్టీలలోని సఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల నుంచి బొలిశెట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల కేడర్ కలుస్తున్నారని, లీడర్లు కలవడం లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కేడర్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, కానీ, టీడీపీ లీడర్లను మోయడం …

Read More »

రిజర్వేషన్లు వైసీపీకే మంచిది – జగన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చేది `జ‌గ‌న్ 2.0` ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పారు. ఈ విష‌యంలో తిరుగు లేద‌న్నారు. పార్టీ నాయ‌కులు రెట్టింపుఉత్సాహంతో ప‌నిచేయాల‌ని సూచించారు. చంద్ర‌బాబును చూసి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు. వ‌చ్చే రోజుల్లో కార్య‌క‌ర్త‌ల సెంట్రిక్‌గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. తాజాగా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం పార్టీ బాధ్యుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ …

Read More »

గతంలో బాబు, కేసీఆర్… ఇప్పుడు రేవంత్ – జీవన్ రెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొంతకాలంగా సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఊహాగానాలకు తగ్గట్లుగానే జీవన్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. జగిత్యాలలో ఈ రోజు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన …

Read More »

పర్సనల్ పంచాయతీలు పవన్ దాకా వద్దు

ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా నిలిచిన పలువురు జనసేన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లని నేరుగా నొప్పించకుండా.. అలాగని పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నట్టుగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. “ఏ నాయకుడైనా ఏ ప్రజా ప్రతినిధి అయినా వ్యక్తిగతంగా వారు చేసే పనుల వల్ల పార్టీకి ఇబ్బందులు రావడానికి వీల్లేదు.“ …

Read More »

క్రిస్టియన్ సెంట్రిక్‌గా బీజేపీ పాలిటిక్స్!

ఆశ్చర్యం లేదు.. అనుమానం కూడా లేదు! హిందూత్వ బ్రాండును పుణికి పుచ్చుకున్న బీజేపీ.. అవకాశం, అవసరం అనే కోణంలో ఇప్పుడు క్రిస్టియన్ సెంట్రిక్‌గా రాజకీయాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో కులం, మతం ఆధారంగా ఎక్కువగా ఓట్లు పడే ఏకైక రాష్ట్రం కేరళ. ఇక్కడ క్రిస్టియానిటీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం కేరళలో క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న వారి సంఖ్య …

Read More »

పెరిగిన సీట్లు… వాళ్ళంతా సేఫేగా?

ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెర‌గ‌నున్నాయ‌ని తాజాగా తెలిసింది. అయితే.. వాస్త‌వ లెక్క ప్ర‌కారం.. అంటే.. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విష‌యం ప్ర‌కారం.. 50 అద‌న‌పు నియోజ‌క‌వ‌ర్గాలు రావాల్సి వుంటుంది. కానీ, దీనికి భిన్నంగా.. 263 స్థానాలు పెర‌గ‌నున్నాయి. అంటే.. ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాల‌కు అద‌నంగా.. 88 స్థానాలు పెర‌గ‌నున్నాయి. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న లెక్కల ప్ర‌కారం.. 50 స్థానాలు పెరిగితే.. పురుష నాయ‌కులు …

Read More »

పార్ల‌మెంటులోనూ వైసీపీని వెంటాడిన ’11’

వైసీపీని `నెంబ‌రు 11` వెంటాడుతోంది. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి కేవ‌లం 11 అసెంబ్లీ స్థానాల్లోనే విజ‌యం ద‌క్కింది. వాస్త‌వానికి వైనాట్ 175 అన్నా కూడా.. ప్ర‌జ‌లు మాత్రం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి `లెవెన్ రెడ్డి` అనే పేరు జ‌గ‌న్‌కు.. `11 మెంబ‌ర్స్‌` అనే పేరు వైసీపీ ఎమ్మెల్యేల‌కు స్థిర‌ప‌డిపోయింది. ఇక‌, త‌ర‌చుగా ఈ విష‌యం రాజకీయంగా కూడా… జ‌గ‌న్‌కు,  ఆ పార్టీ నాయ‌కుల‌కు …

Read More »

కరోనా సమయపు తెగువ మళ్ళీ చూపించాలి

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్‌పై దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాజ్యసభలో మంగళవారం ప్రసంగించిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సరఫరాలో ఆటంకాలు కలగవచ్చని, దీనివల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాల్లో అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు. యుద్ధం …

Read More »