Political News

కాంగ్రెస్‌లో ఇంట‌ర్వ్యూలు.. ష‌ర్మిల ఫార్ములా!

ఏపీలో ఎన్నికల సంద‌డి పెరిగింది. దీంతో టికెట్ల కేటాయింపు కూడా దాదాపు కొలిక్కి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలు.. స‌ర్వేలు, అభ్య‌ర్థుల గుణ గ‌ణాలు, ఆర్థిక ప‌రిస్థితి వంటివాటిని బేరీజు వేసుకుని టికెట్లు కేటాయిస్తున్నాయి. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ఈ పార్టీ కూడా..  అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్వూ చేసేందుకు రెడీ అయింది. …

Read More »

కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ?

తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రు. 55 కోట్ల దుర్వినియోగం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపైన రెరా బాలకృష్ణ కేసులో తగులుకున్నారు. రెరా డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన నిర్మాణ సంస్ధల నుండి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను అర్వింద్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ చేయడానికి ఏసీబీ రెడీ …

Read More »

ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంచ‌ల‌న లేఖ సంధించారు. బుధ‌వారం జ‌రిగిన జెండా స‌భ‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఈ లేఖ సంధించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ముద్రగడ పద్మనాభం జ‌న‌సేన‌లో చేరుతార‌ని అనుకున్నారు. కానీ, కార‌ణాలు తెలియ‌క పోయినా.. ఆయ‌న దూరంగానే ఉన్నారు. మ‌రోవైపు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే …

Read More »

100 పార్లమెంట్ స్థానాలు : ఫస్ట్ లిస్ట్ ఖాయమేనా ?

తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈరోజు మొదటి జాబితాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈvమధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఈరోజు తెలంగాణా మొదటిజాబితా ప్రకటనపైన అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. తెలంగాణాలోని 17 స్ధానాల్లో మొదటి జాబితాలో ఎన్నిvసీట్లలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. పార్టీvవర్గాల …

Read More »

నారా లోకేష్‌ బ‌లహీన‌త‌లు కాదు బ‌లం చూడు!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్ర‌జ‌ల ఆశీస్సులు.. ఎన్నిక‌ల మూడ్ వంటివి నాయ‌కుల‌ గెలుపోటములను ప్ర‌భావితం చేస్తాయి. ఎవ‌రూ ఎప్పుడూ విఫ‌లం కావాల‌ని కూడా ఉండ‌దు.  ఇదే ఫార్ములాను.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. అప్ప‌టి అంచ‌నాల మేర‌కు.. ఆయ‌న విజ‌యం `ప‌క్కా` అని టీడీపీ నాయ‌కులు …

Read More »

భారమంతా చంద్రబాబుదేనా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వీటిల్లో నాలుగు స్ధానాల్లో అసమ్మతి అట్టుడికిపోతోంది. అసమ్మతి నేతలతో మాట్లాడటం, బుజ్జగించటం, దారికి తెచ్చుకోవటం అభ్యర్ధుల వల్లే అయ్యేట్లు లేదు. అందుకనే అసమ్మతి నేతలతో మాట్లాడి దారికితెచ్చే బాధ్యతలు నలుగురు అభ్యర్థులు చంద్రబాబుపైనే పెట్టేశారు. విషయం ఏమిటంటే కల్యాణదుర్గం, శింగనమల, మడకశిర, పెనుకొండలో అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యతిరేక వర్గాలు రెచ్చిపోతున్నాయి. దాంతో అభ్యర్థుల్లో …

Read More »

వైసీపీ విముక్తం కోసమే టీడీపీ – జనసేన పొత్తు: చంద్ర‌బాబు

వైసీపీ విముక్తం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపీ దొంగలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. …

Read More »

భీమవరం అభ్యర్ధి ఫైనలైపోయారా ?

పశ్చిమగోదావరి జిల్లాలో ఎంత కీలకమైన భీమవరం నియోజకవర్గంలో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైనల్ అయిపోయారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భీమవరం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి వీరాంజనేయులు పోటీ చేయబోతున్నారు. ఇన్నిరోజులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ మాజీ ఎంఎల్ఏ …

Read More »

‘ఇబ్బందులు ప‌డుతున్నా.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా’

“అవ‌స‌ర‌మైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా. ఇప్ప‌టికే అన్ని విధాలా స‌ర్దుకుని రాజ‌కీయాల్లో ఉన్నా. పైగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు న‌న్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఒంగోలు పేద ప్ర‌జ‌ల కోసం ఇళ్ల ప‌ట్టాలను ఇవ్వాల‌ని అడిగాన‌ని.. ఇది త‌న స్వార్థం కోసం కాద‌ని బాలినేని చెప్పారు. అయితే.. ఇదేదో …

Read More »

నా నాలుగో పెళ్లాం జ‌గ‌నే: ప‌వ‌న్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. సిద్ధం స‌భ‌ల్లో జ‌గ‌న్ త‌నను తాను.. అర్జునుడి ని అని చెప్పుకొంటున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చారు. “జ‌గ‌న్‌.. నువ్వు అర్జునుడివి కాదు. నేను వామ‌నుడిని. నువ్వు బ‌లి చ‌క్ర‌వ‌ర్తివి. 24.. 24… సీట్లు తీసుకున్నాన‌ని ఎగ‌తాళి చేస్తున్నారు.కానీ, ఒక్క సీటు చాలు..నిన్ను తొక్కేయ‌డానికి. నాడు వామ‌నుడు ఒక్క అడుగు కోరి బ‌లిచ‌క్ర‌వ‌ర్తిని అతః పాతాళానికి …

Read More »

వామనుడికి మూడడుగులు..జనసేనకు 24 సీట్లు: పవన్

తాడేపల్లిగూడెంలో జరిగిన ‘జెండా’ బహిరంగ సభలో సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ లో శాంతి, మంచితనం , సహనం మాత్రమే చూశారని, ఇకనుంచి మరో పవన్ కళ్యాణ్ ను చూస్తారని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …

Read More »

2019లో అందుకే నేను ఓడిపోయా: నారా లోకేష్‌

‘చంద్రబాబు సూపర్-6’లో పొందుపరిచిన హామీలను ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. సూపర్-6 అనేది పేద, మధ్యతరగతి ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని పలు మండలాలకు చెందిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం సమస్యలను నేతలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. “2019లో ఎన్నికల సమయంలో కేవలం 20 రోజులు …

Read More »