Political News

`కాక్రోచ్` దెబ్బ‌కు పెద్ద పార్టీలు విల‌విల… నిజ‌మేనా?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ పేరుతో వెబ్‌సైట్ స‌హా.. సోష‌ల్ మీడియా హ్యాండిళ్ల‌లో జరుగుతున్న ఉద్య‌మం(పార్టీ) పెను ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితిని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించినా.. ఇది వాస్త‌వ‌మేన‌ని చెప్పాలి. ఇన్ స్టాలో కాక్రోచ్ జ‌న‌తాపార్టీని ఫాలోఅవుతున్న వారి సంఖ్య 2 కోట్ల 35 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇక‌, వెబ్ సైట్ వీక్ష‌లు కూడా ల‌క్ష‌ల్లోనే పెరిగారు. ఇక‌, ఎక్స్ ఖాతాను మూసివేసినా.. తిరిగి ప్రారంభించిన‌.. కాక్రోచ్ రిట‌ర్న్ …

Read More »

క‌ళావ‌తిని వదులుకుంటే వైసీపీకే నష్టం?

వైసీపీకి చెందిన మ‌హిళా నాయ‌కురాలు.. సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే.. విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి.. న‌మ్మ‌కానికి పెట్టింది పేరు. ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికిన తొలి మ‌హిళా నాయ‌కురాలిగా ఆమె గురించి పార్టీలో చెబుతారు. వ‌రుస‌గా రెండుసార్లు ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే.. పార్టీ ప‌రంగా ఆమెకు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. నిజానికి పార్టీలోనే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గంలో కూడా విశ్వ‌స‌రాయికి మంచి పేరుంది. ఎంత ఎదిగినా.. …

Read More »

గ‌ల్లా రాజ్య‌స‌భ‌ ఆశ‌లు.. నెర‌వేరేనా ..!

రాజ్యస‌భ స్థానాల‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మాజీ ఎంపీ.. గ‌ల్లా జ‌య‌దేవ్ పేరు టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌నుంచి స్వ‌చ్ఛందంగా త‌ప్పుకొన్న ఆయ‌న‌.. తిరిగి నామినేటెడ్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన గ‌ల్లా.. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వ‌దులుకున్నారు. వాస్త‌వానికి వైసీపీ గాలి జోరుగా వీచిన స‌మ‌యంలో కూడా.. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. మాజీ మంత్రి …

Read More »

అదిరేలా గోదావ‌రి పుష్క‌రం… ఏకంగా వెయ్యి కోట్లు!

వ‌చ్చే ఏడాది జూలైలో ప్రారంభ‌మ‌య్యే గోదావ‌రి పుష్క‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ పుష్క‌రాల‌ను క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. దీనికిగాను.. ఏకంగా 1000 కోట్ల‌ రూపాయ‌ల‌ను కేటాయించాల‌ని తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనికి మంత్రులు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. ఏర్పాట్లు కూడా త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో త‌క్ష‌ణం 300 కోట్ల …

Read More »

పోలవరం ఆ ఇద్దరితో పూర్తి కాదు

ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన రాజకీయ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిందేనని జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చంద్రబాబు గానీ, జగన్ గానీ పూర్తి చేయలేరని కూడా మరింత సంచలన …

Read More »

లోకేశ్ బాటలో రేవంత్ సర్కారు

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్… ఏపీలో విద్యా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో సర్కారీ విద్యా వ్యవస్థ అద్భుతాలను సాధిస్తోంది. ఇందుకు దారి తీసిన పరిణామాలను పరిశీలిస్తే… ఏపీలో అప్పటిదాకా పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. లోకేశ్ మంత్రిగా వచ్చాక… ఈ పథకాన్ని జూనియర్ కాలేజీల దాకా విస్తరించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తాజాగా లోకేశ్ …

Read More »

ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు… వారేనట!

“ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం” అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది కాక్‌రోచ్ జనతా పార్టీ . పేరు వింటేనే వినూత్నంగా ఉన్న ఈ “పార్టీ” ఇప్పటికీ అధికారిక రాజకీయ పార్టీ మాత్రం కాదు. ఎన్నికల కమిషన్ వద్ద నమోదు కాని ఈ సంస్థకు గుర్తు లేదు.. కార్యాలయం లేదు.. అధికారిక సభ్యత్వ వ్యవస్థ లేదు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా …

Read More »

విజయ్ సలహాదారుగా వైఎస్ అనిల్ రెడ్డి వ్యాపార భాగస్వామి?

తమిళనాడులో అవినీతి రహిత పాలన అందిస్తానంటూ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి దిగిపోయిన జోసెఫ్ విజయ్ ఇప్పటికే ఒకటి, అరా విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితంగా తాను తప్పటడుగులు వేశానని ఒప్పుకున్న విజయ్ ఆ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. తాజాగా మరో తప్పటడుగు విజయ్ వేశారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ కు సలహాదారుగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి వ్యాపార భాగస్వామిగా …

Read More »

పవన్ తో అరవ శ్రీధర్ భేటీ… మ్యాటరేంటి?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీలో అరవ శ్రీధర్… జనసేన తరఫున విప్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి రాజీనామా చేసిన శ్రీధర్.. రాజీనామా పత్రాన్ని పవన్ చేతిలో పెట్టారు. …

Read More »

స్టాలిన్ ఎస్ అంటే ఏపీకి నష్టమా?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేకు మద్దతునిస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా మారడాన్ని డీఎంకే అధినేత స్టాలిన్ జీర్ణించుకోలేకపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లుగా.. టీవీకే, కాంగ్రెస్ ఒక్కటైన నేపథ్యంలో ఆ రెండు పార్టీలు వ్యతిరేకించే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమితో చేతులు కలపడానికి స్టాలిన్ రెడీ అయినట్లు …

Read More »

స్కూల్ లో ‘ఎస్ సార్’ బదులు ‘జై శ్రీరామ్’ అనాలి

విద్యాలయాల్లో మత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారాలు దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో నిత్యం వివాదాస్పదమే అవుతున్నాయి. గతంలో పాఠశాలలకు ముస్లిం విద్యార్థినీలు బురఖా ధరించి రావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. తాజాగా పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికే సమయంలో ‘ఎస్ సర్’ కు బదులుగా ‘జై శ్రీరామ్’ అని పలకాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ బీజేపీ …

Read More »

జమ్మలమడుగులో అభివృద్ధి పరుగులు

ఏపీలో అధికార కూటమి సర్కారు… రాష్ట్రాభివృద్ది దిశగా వేస్తున్న అడుగులు ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్త చర్చలకు తెర తీస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను అలా పక్కనబెడితే… కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమలో వరుసబెట్టి పరిశ్రమలు ఏర్పాటవుతున్న తీరు ఈ చర్చల విస్తరణను మరింతగా పెంచిందని చెప్పక తప్పదు. ఇలాంటి క్రమంలోనే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కడప జిల్లా జమ్మలమడుగులో ఓ భారీ సోలార్ ప్రాజెక్టుకు …

Read More »