ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి బలం ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. వైసీపీ నాలుగు స్థానాలు …
Read More »కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను …
Read More »భద్రాచల ఆలయానికి 1000 కోట్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత భద్రాచలం ఆలయాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ పనులకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా భూమి పూజ చేశారు. మొత్తంగా 3 దశల్లో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. తాజాగా 351 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తొలి దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎందుకు? భద్రాచలం ఆలయాన్ని విస్తరించాలన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న …
Read More »రఘురామపై రాళ్ల దాడి… ఏం జరిగింది?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ.. ఆయన అనుచరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వాహనాలపై రాళ్లు పడడంతో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఏం జరిగింది? శ్రీరామనవమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరిజిల్లాలోని ఆకివీడులో ఉన్న పెద్దరామాలయానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ వచ్చారు. అయితే.. …
Read More »లాక్ డౌన్ భయాలకు కారణమెవరు?
కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. తాజాగా అలాంటి పరిస్థితులు లేకున్నా కూడా దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదంటూ గడచిన రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అయితే ఓ రేంజిలో చర్చ సాగుతోంది. వెరసి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా అన్న …
Read More »ఆళ్లగడ్డలో మళ్లీ లొల్లి… ఈ సారి ‘కేబుల్’ వార్
రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి సాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు ఆళ్లగడ్డకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే గంగుల కుటుంబంలోని ఓ వర్గం పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం, భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత అక్కడ ఫ్యాక్షన్ కు తెర పడిపోయింది. అయితే ఇప్పుడు అధికార టీడీపీలోనే ఇద్దరు కీలక నేతల మధ్య నిత్యం వివాదాలు రేగుతున్నాయి. …
Read More »జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగ్గారెడ్డిని జైలు పాలు చేసిన ఓ కీలక కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం నమోదు అయిన …
Read More »‘సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా?’
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి సీతక్కలు అసలు చర్చను పక్కనపెట్టేసి ఏకంగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని వాదులాడుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క సంధించిన విమర్శలను ప్రస్తావించిన సబిత… సీతక్క ఏమైనా కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకే సీతక్క తనపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని కూడా ఆమె …
Read More »అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీజన్ ఉంది. అంతర్గత కుమ్ములాటలతో ఉత్తరాంధ్రలో నష్టం జరగ్గా.. కుల సమీకరణల విషయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నష్టపోయింది. ఇక, రెడ్డి సామాజిక వర్గాన్ని చులకన చేస్తున్నారన్న వాదనతో పాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖరితో సీమలో వైసీపీకి గండి పడింది. ఇలా.. ప్రాంతానికి ఒక రకంగా పార్టీ …
Read More »దేశంలో ఫస్ట్.. గుడ్డుతోపాటు చేపలు కూడా!
చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో ఇక నుంచి చేపల కూర కూడా వచ్చించనున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీధర్ చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న గుడ్డుతోపాటు.. వారానికి ఒకసారి లేదా వీలునుబట్టి రెండు సార్లు చేపల కూర కూడా వడ్డించేందుకు.. ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న కోడిగుడ్డు ఫలితంగా విద్యార్థుల్లో భౌతిక సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయన్నారు. ముఖ్యంగా పౌష్ఠికాహార లోపం తగ్గుతోందని తెలిపారు. ప్రస్తుతం కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం …
Read More »కుప్పంలో భువనేశ్వరి సైలెంట్ `టూర్స్`
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఆమె అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత జనవరిలోనే కుప్పంలో పర్యటించిన ఆమె.. తాజాగా గత మూడు రోజులుగా ఇదే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇలా పర్యటించడం తప్పుకాకపోయినా.. గతానికి భిన్నంగా ఆమె ఇంత ప్రాధాన్యం ఇవ్వడమే చర్చనీయాంశం అయింది. అందరినీ కలుపుకొని.. కుప్పం నియోజకవర్గానికి …
Read More »ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు. ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates