కర్ణాటకలో జరుగుతున్న సామాజిక, విద్యా సర్వే ( జనాలు దీన్నే ‘కులం సర్వే’ అంటున్నారు) లో పాల్గొనడానికి రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ దాత సుధా మూర్తి కుటుంబం నిరాకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆమె భర్త నారాయణ మూర్తి కూడా ఈ సర్వేకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తాము ఏ వెనుకబడిన వర్గానికి చెందనందున, ఈ సర్వేలో పాల్గొనడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ దంపతులు స్పష్టం …
Read More »సెక్యూరిటీ గార్డ్ రూ.400 కోట్ల బిజినెస్.. ఇప్పుడు ఎన్నికల బరిలో..
బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి జీవిత కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతను మరేవరో కాదు, నీరజ్ సింగ్. ఒకప్పుడు ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేసిన ఈ 38 ఏళ్ల యువకుడు, ఇప్పుడు రూ. 400 కోట్ల టర్నోవర్తో కంపెనీని నడుపుతున్నాడు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తరఫున శేవహార్ స్థానం నుంచి నీరజ్ సింగ్ బరిలోకి దిగడం, …
Read More »మంత్రి సురేఖ వర్సెస్ సర్కారు పెరుగుతున్న ‘గ్యాప్’!
తెలంగాణ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగు తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్లోని సురేఖ ఇంటి ముందు బుధవారం అర్ధరాత్రి తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. మఫ్టీలో ఉన్న పోలీసులు నలుగురు ఒక్కసారిగా ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. వారు పోలీసులు అని తెలియక.. అసలు మీరెవరు..? ఎందుకు వచ్చారంటూ.. నిలదీశారు. …
Read More »ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఇంత కీలకం అవుతోందా…?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందుగా నంద్యాల జిల్లాలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వర్ల దేవాలయంలో పూజా, దర్శనం చేసిన తర్వాత, కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ₹13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాథమిక శిలాన్యాసం చేసి, ప్రారంభిస్తారు – …
Read More »జగన్ ఫ్యాన్స్.. ఏదో ఒక్కటి ఫిక్సవ్వండయ్యా
ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసేటపుడు.. ఆ విమర్శల్లో లాజిక్ ఎంతమేర ఉంది అని చూసుకోవడం కీలకం. ఒక స్టాండ్కు కట్టుబడి విమర్శలు చేస్తే.. అవి సహేతుకంగా అనిపిస్తేనే జనం నుంచి మద్దతు లభిస్తుంది. ఆ ఇష్యూలో ప్రతిపక్షానికి మైలేజీ వస్తుంది. కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దామని, ప్రభుత్వం మీద బురదజల్లుదామని చేసే ప్రయత్నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు బొక్క బోర్లా పడుతోంది. విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక …
Read More »మోడీని మెప్పించిన యువతికి అసెంబ్లీ టికెట్!
రాజకీయాల్లో పార్టీల అధినేతలు, కీలక నాయకులు తలుచుకుంటే టికెట్లకు కొదవ ఏముంటుంది?. ఇప్పుడు కూడా అదే జరిగింది. గత 2023 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత చేరువగా నిలిచిన బీహార్ యువతి, జానపద గాయకురాలు.. మిథాలీ ఠాకూర్ ఇప్పుడు రాజకీయ నేతగా అవతరించారు. ఆనాడు ఆమె రామచరిత మానస్లోని కొన్ని పంక్తులను ఆలపించి.. ప్రధానిని మంత్ర …
Read More »కులాలు-కన్నీళ్లు: ‘జూబ్లీహిల్స్’ రచ్చ రచ్చ!
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన 24 గంటలు కూడా గడవక ముందే.. పార్టీల మధ్య రచ్చ రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉందన్న చర్చ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు జోరుగా మాటల మంటలు మండిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రులు.. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి …
Read More »మోడీ వస్తున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు హెచ్చరికలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాన మంత్రి షెడ్యూల్ ఖరారైందని.. ఆయన ఢిల్లీ నుంచి ఉదయం కర్నూలుకు వస్తున్నారని తెలిపారు. ఎక్కడా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా మంత్రులు అందరూ వారి వారి నియోజకవర్గాల …
Read More »మైండ్ లేనేళ్లో అలా మాట్లాడతారు!: లోకేష్
రాష్ట్రంలో ఒక్కచోటకే పెట్టుబడులు తీసుకువస్తున్నారని.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ.. నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయంటూ.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు మైండ్ లేనోళ్లే.. అలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతానికి మాత్రమే తమ అభివృద్ధి పరిమితం కాదన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పెట్టుబడులు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఉపాధి, ఉద్యోగాలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఒకే రాజధానిని అభివృధ్ది చేస్తున్నామన్న నారా లోకేష్.. అదేసమయంలో …
Read More »బీజేపీ ఆఫీసులో డిష్యుం-డిష్యుం?
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదంతో మొదలైన వివాదం చేయి చేయి కలిసే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తోసుకున్నారు. నెట్టుకున్నారు. దీంతో తీవ్రస్థాయిలో రచ్చ చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు.. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ …
Read More »ఎన్నికల ఎఫెక్ట్: తమిళనాట `హిందీ` రద్దు?
అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో స్థానిక సెంటిమెంటుకు మరింత పదును పెంచుతూ.. తమిళనాడు ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రాష్ట్రంలో కొన్నాళ్లుగా డిమాండ్ రూపంలో ఉన్న హిందీ రద్దును అధికారికం చేసేందుకు నడుం బిగించారు. తద్వారా.. స్థానిక తమిళ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పకనే చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. …
Read More »రిజర్వేషన్ ఇవ్వాలంటే.. చాయ్ తాగినంత పని: కేటీఆర్
బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్త శుద్ధి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల ముసుగులో రాజకీయం చేస్తున్నారని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజా గా బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జేఏసీ నాయకులు కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నిర్వహించతలపెట్టిన బంద్, నిరసనలకు బీఆర్ ఎస్ పార్టీ మద్దతు కోరారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates