రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన నెల రోజుల పాలనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. సమీక్షించారు. పాలనలో అనుసరించాల్సిన పద్ధతులను.. ఇప్పటి వరకు సాగించిన పాలనను కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎక్కువమంది ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తే.. బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. …
Read More »విద్యుత్ కమిషన్ రద్దుకు సుప్రీం నో
విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అవకతవకలపై విచారణ జరిపేందుకు ఓ కమిషన్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విద్యుత్ విచారణ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది. అయితే, ఆ విచారణ పూర్తికాకముందే నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి …
Read More »మీడియాతో తల గోక్కున్న సాయిరెడ్డి
కొన్ని ఆరోపణలు వచ్చినపుడు, వివాదాలు తలెత్తినపుడు రాజకీయ నాయకులకు మౌనమే సరైన పరిష్కారం. లేదంటే తూతూ మంత్రంగా ఖండించి వదిలేయడం కూడా మంచి ఆప్షనే. అలా కాదని.. సై అంటే సై అంటూ మీడియా ముందుకెళ్లి సవాళ్లు విసిరితే మొదటికే మోసం వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషననర్గా పని చేసి సస్పెండైన శాంతి …
Read More »వైఎస్ పై ఉన్న అభిమానంతో ఓర్చుకున్నా
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా బాంబు పేల్చారు. గత రెండు రోజులుగా ఆయన మీడియా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంగళవారం కూడా.. మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తాను అనేక ఇబ్బందులు పడ్డానని చెప్పారు. సొంత పార్టీ నాయకులే.. తనను, తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా …
Read More »ఏపీలో ఫ్రీ బస్ పథకం డేట్ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉచిత పెన్షన్ వంటి కొన్ని హామీలను ఆల్రెడీ సీఎం చంద్రబాబు అమలు చేశారు. తల్లికి వందనం పథకం పై కూడా విధివిధానాలు రూపొందుతున్నాయి. అయితే, ఏపీలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపై మాత్రం ఇంకా ఎటువంటి …
Read More »పవన్.. ఒక నిశ్చలం.. మరో నిర్భయం !
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఒక నిశ్చలం-ఒక నిర్భయం అన్న సూత్రంతో ముందుకు సాగుతున్నారు. తను తీసుకునే నిర్ణయాలను నిర్భయంగా ఆయన వెల్లడిస్తున్నారు. అదేవి ధంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య పోరు జరుగుతున్నప్పటికీ చాలా నిశ్చలంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ పునాదులను బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక పార్టీ …
Read More »ఆ రికార్డు జనసేనకే దక్కింది !
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోనే అధికంగా గాజువాక శాసనసభ స్థానం నుండి 95,235 ఓట్ల అత్యధిక మెజారిటీతో టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు విజయం సాధించాడు. మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష్య పదవిని కట్టబెట్టారు. అయితే పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీ సాధించినా నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు సాధించి జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఏడీఆర్ విశ్లేషణలో …
Read More »ఫైనాన్షియల్ వైట్ పేపర్.. చంద్రబాబు మంచి నిర్ణయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… గత వైసీపీ ప్రభుత్వంపై శ్వేత పత్రాల రూపంలో ప్రత్యేక వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం విషయాల్లో గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లను అక్రమాలను వశదీకరిస్తూ ఆయన శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రాన్ని పక్కనపెట్టిన చంద్రబాబు అనూహ్యంగా …
Read More »జగన్ను బూతులు తిట్టిన విజయసాయిరెడ్డి!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్-2 నాయకుడిగా ఒకప్పుడు ఎంతో వైభవం చూశారు విజయసాయిరెడ్డి. జగన్కు నమ్మిన బంటుగా ఆయనకు పార్టీలో ఎక్కడ లేని ప్రాధాన్యం దక్కేది. కానీ గత రెండు మూడేళ్లలోపరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలో ఉండగా చాలా వరకు సజ్జల రామకృష్ణారెడ్డిదే ఆ పార్టీలో హవా. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్న విజయసాయికి వైసీపీ నుంచి ఏమాత్రం సపోర్ట్ దక్కుతున్న పరిస్థితి కనిపించడం లేదు. …
Read More »రాజ్యసభలో ఎన్డీఏకు చిక్కులే !
ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ అధికారం అందుకోవడం కోసం ఎన్డీఎ పక్షాల మద్దతు అవసరం అయింది. సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమితో కలిపి కూడా బీజేపీకి తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో ఎన్డీఏతర పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. …
Read More »ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్: చంద్రబాబు
వైసీపీ పాలనలో ఖాళీగా ఉన్న భూములు మొదలు భూమి లోపల ఉన్న సహజ వనరుల వరకు వేటినీ వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలు అర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో వైసీపీ పాలలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఏపీ సీఎం …
Read More »జనసేన నాయకులకు పవన్ వార్నింగ్
ఆంధ్రప్రదేవ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడక్కడా కొంచెం హద్దుదాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాగే కొనసాగితే వైసీపీకి.. ఈ రెండు పార్టీలకు తేడా ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుందని.. కాబట్టి ఆ పార్టీల అధినేతలు జోక్యం చేసుకుని, హద్దులు దాటి ప్రవర్తించే వారిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates