Political News

మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల‌పై వెంట‌నే కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా జోక్యం చేసుకున్న‌ట్టు రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. దీనిపై త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని కేంద్ర వ‌ర్గాలు డీజీపీని కోరిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వ్య‌వ‌హారంలో అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది …

Read More »

బీఆర్ఎస్ ఓట్ చోరీ పిటిష‌న్‌.. 2 గంట‌ల్లో తేల్చేసిన‌ హైకోర్టు!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన ఓట్ చోరీ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఓట్ చోరీ అనేది ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ని.. ఎన్నిక‌ల సంఘం పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఎన్నిక‌ల సంఘం స‌ద‌రు ఫిర్యాదుల‌పై స‌రిచూస్తున్నామ‌ని చెప్పిన త‌ర్వాత‌.. తాము జోక్యం చేసుకునేది లేద‌ని తేల్చి చెప్పింది. అనంత‌రం పిటిష‌న్‌ను ప‌రిష్క‌రించిన పేర్కొంటూ విచార‌ణ‌ను ముగించింది. …

Read More »

రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్

​గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని ఏకంగా 16 మంది మంత్రులు ఒకే రోజు రాజీనామా చేశారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ భారీ ప్రక్షాళన జరిగింది. హైకమాండ్ నుంచి వచ్చిన సూచనతోనే, సీఎం భూపేంద్ర పటేల్ మొత్తం మంత్రివర్గాన్ని మార్చేందుకు స్వేచ్ఛ పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ​రాజీనామా చేసిన 16 …

Read More »

పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఒకే వేదిక‌పై ప‌లు మార్లు క‌లుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్నారు. వారి మ‌ధ్య‌లో ఇత‌ర నాయ‌కులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో శ్రీశైలం దేవ‌స్థానానికి విచ్చేసిన ప్ర‌ధాన మంత్రి-సీఎం-ఉప‌ముఖ్య‌మంత్రులు.. దాదాపు ఒక‌రి ప‌క్క‌న ఒక‌రు కూర్చుని చ‌ర్చించుకుంటున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనికి …

Read More »

లోకేష్ వ‌ర్సెస్ క‌ర్ణాట‌క‌: వెరీ ఇంట్ర‌స్టింగ్‌!

మంత్రి నారా లోకేష్ కు కర్ణాటకలోని పలువురు మంత్రులకు మధ్య ఆసక్తికర చర్చ, వ్యాఖ్యలు తెర‌ మీదకు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తమ పెట్టుబ‌డుల‌ను లాగేసుకుంటోంద‌న్నది కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే చెబుతున్న మాట. దీనికి తాజాగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తోందని, అందుకే తమ పరిశ్రమలు పోతున్నా యని అంటున్నారు. వాస్తవానికి గత ఏడాది జరిగిన …

Read More »

15 ఏళ్లు ఈ ప్ర‌భుత్వ‌మే ఉంటుంది: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రాష్ట్రంలో మ‌రో 15 సంవ‌త్స‌రాల పాటు కూట‌మి ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని జ‌నసేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు, అవ‌మానాలు త‌ట్టుకుని నిల‌బ‌డ్డామ ని.. ఇక‌ముందు కూడా అదే శ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. క‌ష్టాలు వ‌చ్చి నా.. 15 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. క‌ర్నూలు జిల్లాలో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

క‌ర్నూలు క‌ష్టాలు తీరుతాయి: మోడీ

క‌ర్నూలులో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. అవి త్వ‌ర‌లోనే తీరుతాయ‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ‘డ్రోన్స్ హ‌బ్‌’ ద్వారా.. ఇక్క‌డి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో క‌ర్నూలు, రాయ‌లసీమల పాత్ర కూడా ఉంటుంద‌న్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌లో డ్రోన్ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో డ్రోన్ త‌యారీ కేంద్రంగా మార‌నున్న క‌ర్నూలు.. దేశానికి.. ప్ర‌పంచానికి కూడా సేవ‌లు అందించే …

Read More »

సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే..ఇంకా ఉన్నాయి: చంద్రబాబు

ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతమైన ప్రధానులల ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు…భారత దేశంలోని రాష్ట్రాలలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు…ఇటువంటి డెడ్లీ కాంబినేషన్ ఉంటే ఇటు రాష్ట్రం..అటు కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయం. డేరింగ్ అండ్ డ్యాషింగ్ పీఎం మోదీ, విజనరీ సీఎం చంద్రబాబుల కాంబోలో నవ్యాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో ఏర్పాటు …

Read More »

దేశాభివృద్ధికి ఏపీ కీలకం: మోదీ

దేశవ్యాప్తంగా 28 శాతం జీఎస్టీ ఉన్న చాలా వస్తువులు, సేవలను ఇప్పుడు 18 శాతం జీఎస్టీ లేదా 5 శాతం జీఎస్టీకే ప్రజలంతా పొందుతున్న సంగతి తెలిసిందే. ఇకపై, కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉండేలా, ముఖ్యమంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే జీఎస్టీ తగ్గింపుతో దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభించాయి. ఈ …

Read More »

బీఆర్ఎస్ నోట ఓట్ చోరీ మాట‌: హైకోర్టుకు నేత‌లు!

చిత్రంగా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఇప్ప‌టి వ‌ర‌కు బీహార్‌లో మాత్ర‌మే వినిపించిన ఓట్ చోరీ మాట‌.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నోట కూడా వినిపించింది. అనూహ్యంగా ఆ పార్టీ ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ విష‌యంపై విచార‌ణను చేప‌ట్టాల‌ని.. త‌క్ష‌ణ‌మే విచారించాల‌ని కోరుతూ.. గురువారం లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిలో ప‌లు విష‌యాల‌ను పేర్కొంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌.. జూబ్లీహిల్స్ ఉప …

Read More »

ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: లోకేష్‌

క‌ర్నూలులో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత మాట్లాడిన మంత్రి నారా లోకేష్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆద్యంత ప్ర‌ధాని మోడీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన నారా లోకేష్‌.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, దాయాది దేశం పాకిస్థాన్ వ్య‌వ‌హార శైలిన ప్ర‌స్తావించారు. ఆ రెండు దేశాల‌కు ప్ర‌ధాని మోడీ …

Read More »

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఈ రిజన్వేషన్లు అమలు చేయాలని రేవంత్ సర్కార్ రెడీ అయింది. అయితే, ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి షాకిస్తూ తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన …

Read More »