Political News

తెలంగాణ అసెంబ్లీలో ఏమిటీ ‘రాఘవ’ రచ్చ?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య పెను వివాదమే రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై చర్చ జరగగా… మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ నగరం నడిబొడ్డునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందన్న ఆరోపణ వినిపించినంతనే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్ స్ట్రక్షన్ పేరును బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి …

Read More »

వైసీపీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేసిన వైసీపీ తిరిగి అధికారంలోకి రాదన్న ఆయన… ఒకవేళ ఆ పార్టీ అధికారం చేపట్టినా… తన ఇష్టారాజ్యంగా ముందుకు సాగే అవకాశం ఉండదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమీ చేలేదని పవన్ చెప్పారు. చట్టసభల్లో కూర్చుని దాడులు చేస్తామంటే తాము చూస్తూ ఊరికే కూర్చునే పరిస్థితి లేదని కూడా …

Read More »

‘వైసీపీ లంకలో ఉన్నవారంతా రాక్షసులు కారు’

ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట. అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన …

Read More »

పవన్ సినిమాలో బ్రహ్మి… నల్లమలలో జగన్?

ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్ తో పోలుస్తూ బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబ్ధత కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించేందుకు శనివారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో అమరావతి తీర్మానాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు …

Read More »

‘సీఎంగా చంద్ర‌బాబు’ ప్ర‌వేశ పెట్టిన తొలితీర్మానం!

ఔను! అసెంబ్లీలో ఏ తీర్మానం అయినా ప్ర‌వేశ పెట్టేందుకు.. సంబంధిత శాఖ‌కు మంత్రులుగా ఉన్న‌వారు వాటిని ప్ర‌వేశ పెడ‌తారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక భేటీలో అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే తీర్మానాన్ని మాత్రం ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టారు. ఇలా.. ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టడం.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో కూడా ఆయ‌న ఏ తీర్మానాన్నీ ప్ర‌వేశపెట్ట‌లేదు. వాస్త‌వానికి …

Read More »

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు. చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర …

Read More »

అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో… రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… ఈ ఘటన వెనుక రాజధానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ మంటలకు కారణం కావచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే సదరు పైపులకు కాపలా …

Read More »

మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల

మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారని అన్నారు. ఈ తీర్మానం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే అని కూడా వ్యాఖ్యానించారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం …

Read More »

గుంటూరు రాజకీయం వేడెక్కుతుంది

గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువ‌గా టాక్ న‌డుస్తోంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైఖ‌రి. 2) వైసీపీలో ఏర్ప‌డుతున్న గ్యాప్‌. ఈ రెండు అంశాలు కూడా రాజ‌కీయంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయి. కూట‌మి పార్టీల త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో న‌జీర్ అహ్మ‌ద్ పోటీ చేసి విజ‌యం ద‌క్కించు కున్నారు. ఈయ‌న‌కు …

Read More »

ద‌క్షిణాదిపై కేంద్రం ప‌ట్టు.. ప్ర‌మోద‌మా? ప్ర‌మాద‌మా?

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం (కూట‌మి) ప‌ట్టు పెంచుకుంటోందా? రాజ‌కీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉత్త‌రాదిపై ఇప్ప‌టికే బీజేపీ ప‌ట్టు బిగించింది. ఢిల్లీ నుంచి యూపీ వ‌ర‌కు.. ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిశాల దాకా కూడా విస్త‌రించింది. నిజానికి ఒడిశాలో 30 ఏళ్ల బీజేడీ పాల‌న‌కు తెర‌దించి.. క‌మ‌లం విక‌సించింది. ఇక‌, ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు …

Read More »

టీడీపీ స్కూల్‌.. ఏడాదికి 300 రోజులు క్లాసులే

టీడీపీ అంటేనే రాజ‌కీయ విశ్వ‌విద్యాల‌యం అని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా చెబుతుంటారు. త‌ర‌చుగా మంత్రి, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కూడా.. ఇదే విష‌యాన్ని చెబుతుంటారు. ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌గా టీడీపీ స్కూల్‌ను బ‌లోపేతం చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాయకుల‌ను త‌యారు చేసేందుకు ఏడాదికి కేవ‌లం 50-70 రోజులు మాత్ర‌మే కేటాయించారు. నాయ‌కుల‌కు శిక్ష‌ణ‌, భ‌విష్య‌త్తు వ్యూహాల‌పై దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, ఇక నుంచి …

Read More »

క‌విత క‌ల్లోలం… ఏ పార్టీకి?!

ఒకరు పార్టీ పెట్టారంటే.. కొత్త‌గా వ‌చ్చే ఓట్లు అంటూఏమీ ఉండ‌వు. ఏదో ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్ల‌ను.. లేదా త‌ట‌స్థులుగా ఉన్న వారి ఓట్ల‌ను మాత్ర‌మే సొంతం చేసుకుని ఆ పార్టీ ముందుకు సాగాలి. ఉమ్మ‌డి ఏపీలో 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో స్థాపించిన ఈ కొత్త కుంప‌టిలో నాడు చేరింది.. …

Read More »