తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు శుక్ర వారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వేగం పెంచారు. అప్పటి వరకు ఎలాంటి చూచాయ కూడా లేకుండానే.. కవిత ఇంటికి వచ్చిన 12 మంది ఈడీ అధికారులు(వీరిలో ఢిల్లీ నుంచి …
Read More »కమ్మ ఓట్లు గుండుగుత్తగా కాంగ్రెస్కే.. ఇదీ ఎఫెక్ట్!
పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా కమ్మ ఓటు బ్యాంకు పనిచేస్తోంది. అందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్టు …
Read More »జగనన్నా.. ఒకసారి అద్దం ముందు నిల్చో..
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ముఖ్యమంత్రి, అధికార వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మాటల దాడి తీవ్రమవుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులు జగన్ అండ్ కో మీదే వేళ్లెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా తనయురాలు సునీత.. తన తండ్రి హత్యలో జగన్, అవినాష్ రెడ్డి తదితరుల మీద తీవ్ర ఆరోపణలే చేశారు. తాజాగా వివేకా భార్య …
Read More »అందరి చూపులు గంటాపైనేనా?
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇపుడందరి చూపులు మాజీమంత్రి, ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావుపైనే నిలిచింది. కారణం ఏమిటంటే టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవటమే కారణం. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చేసే అలవాటే ఇపుడు గంటాకు పెద్ద మైనస్ అయిపోయింది. స్ధిరమైన నియోజకవర్గం అంటు ఒకటి లేకపోవటంతోనే చంద్రబాబునాయుడు మాజీమంత్రిని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పోటీచేయమన్నారు. అక్కడినుండి పోటీ చేయడం గంటాకు ఇష్టంలేదు. చీపురుపల్లికి వెళ్ళలేరు, విశాఖ జిల్లాలో …
Read More »పిఠాపురం పీటముడి.. ఎవరీ వర్మ.. ఎందుకీ రగడ!
పిఠాపురం.. ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రెండు రకాలుగా ఈ నియోజకవర్గంపై చర్చ సాగుతోంది. ఒకటి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు పిఠాపురం సమాధానం చెప్పింది. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై జనసైనికులు.. పవన్ అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇక, రెండోది.. …
Read More »వీర్రాజు పోటీ ఇక్కడేనా ?
బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేసే అసెంబ్లీ సీటు ఖాయమైనట్లేనా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసిన విషయం తెలిసిందే. మూడుపార్టీల కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. టీడీపీ ఇప్పటికి 128 స్ధానాలను ప్రకటించింది. జనసేన అధినేత ఏడు నియోజకవర్గాలను ప్రకటించారు. బీజేపీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఒక్క సీటును కూడా ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాల …
Read More »ఒక్క వీడియోతో దుమ్ము రేపిన ‘జనసేన’
ఎన్నికల వేళ.. నాయకులు చెప్పే ఒక్క మాటకైనా వాల్యూ ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఒక్క వీడి యో విడుదల చేసినా.. దాని పవర్ వేరేగా ఉంటుంది. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా విడుదల చేసిన వీడియో దుమ్ము రేపుతోంది. షార్ట్ ఫిలిమే అయినా.. మాటలు.. మంత్రాలు, హామీలు లేకపోయినా.. ఈ వీడియో దుమ్ము రేపుతుండడం గమనార్హం. జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి విడుదల చేసి ఈ వీడియో …
Read More »బీజేపీలో గందరగోళం పెరిగిపోతోందా?
బీజేపీ నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఈ గందరగోళం ఎందుకంటే టీడీపీ అధినేత ప్రకటించిన రెండోజాబితా విషయంలోనట. ఎందుకంటే తాము పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారట. అందుకనే చంద్రబాబు పొత్తుధర్మాన్ని పాటించటంలేదంటు గోలపెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము పోటీచేయాలని అనుకోవటం వేరు, తమకు కేటాయించిన నియోజకవర్గాలు వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోతున్నారు. పొత్తులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలి, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏమిటనే విషయంలో …
Read More »వివేకా భార్య సంచలన వీడియో
“మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. అయితే, ఈ విషయం మేం గ్రహించలేక పోయాం” అని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించారు. వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించారని.. తర్వాత పక్కకు పెట్టేశారని ఆమె తెలిపారు. అయితే.. ఇలా జరుగుతుందని కానీ, ఇలా చేస్తారని కానీ.. తాము ఊహించలేక పోయామని సౌభాగ్యమ్మ వ్యాఖ్యానించారు. “ఎవరెవరి మనసులో …
Read More »కూటమి బలమా? వ్యక్తుల బలమా? వైసీపీ అంచనా ఇదే!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో ఇంకా ప్రచారం ప్రారంభించ లేదు..కానీ, 17వ తేదీ నిర్వహించే బొప్పూడి సభ తర్వాత.. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నా రు. అయితే.. ఈ కూటమి బలాబలాలపై ఇప్పటికేకొన్ని సర్వేలు వచ్చాయి. ఏబీపీ-సీ ఓటరు సర్వే తాజాగా ఎన్డీయే బలంగా దూసుకుపోతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో 20 …
Read More »తెలంగాణలో కాంగ్రెస్దే హవా: సర్వే
తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోతుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఎఫెక్ట్ జోరుగా పనిచేయనుందా? అంటే.. సర్వే ఔననే అంటోంది. తాజాగా వెల్లడైన ఏపీబీ- సీ ఓటరు సర్వే.. సంచలన విషయాలను వెల్లడించింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో గుండుగుత్తగా 10 స్థానాలను కాంగ్రెస్ బుట్టలో వేసుకుంటుందని సర్వే తేల్చి చెప్పడం గమనార్హం. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ …
Read More »కోడళ్లకు పెద్దపీట.. బాబు మార్క్ జాబితా!
తాజాగా టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో వారసులకు, కోడళ్లకు, కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి వచ్చే ఎన్నికలు కీలకంగా మారడం.. బలమైన వైసీపీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న వ్యూహంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు కోడళ్లకు పెద్దపీట వేసి.. కుటుంబాల నేతలకు వీరతాళ్లు వేసినట్టుగా కనిపిస్తోంది. ఉదాహరణకు హిందూపురం పార్లమెంటు పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి పుట్టపర్తి. ఇక్కడ నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు.. పల్లె …
Read More »