Political News

మంగళగిరి మాట నెరవేర్చిన లోకేష్

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరిలోని ప్ర‌తి వీధిలోనూ ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. అక్క‌డి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌లోనే ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. అదే.. మురుగునీటి స‌మ‌స్య‌. చిన్న చినుకుప‌డ్డా.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు స‌హా.. అన్ని ప్రాంతాలు.. కాలువ‌ల‌ను త‌ల‌పిస్తాయి. ఇక‌, ముర‌గునీరుతో ప్రాంతాలుదుర్గంధం వెద‌జ‌ల్లు తుంటాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ప‌డ‌డమే కాకుండా.. అనారోగ్యాల పాల‌వుతున్నారు. రెండుసార్లు.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామ‌కృష్నారెడ్డి …

Read More »

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు చేరుకున్న ఆయ‌న‌.. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో వ‌రంగ‌ల్ జిల్లాలోని హ‌నుమ‌కొండ‌కు వ‌చ్చారు. త‌న‌ను ఎన్నోళ్ల నుంచో చూడాల‌ని క‌ల‌వ‌రిస్తున్న 17 ఏళ్ల బాలుడిని ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. హ‌నుమ‌కొండ‌లోని హ‌నుమాన్‌న‌గ‌ర్‌కు చెందిన నిరంజన్‌(15) కొన్నాళ్లుగా న‌రాల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటూ.. మంచానికే ప‌రిమితం అయ్యాడు. అత‌నికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే.. …

Read More »

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ పట్టణానికి వెళ్లిన పవన్… ఆ పట్టణానికి చెందిన తన వీరాభిమాని అయిన ఓ చిన్నారిని పరామర్శించారు. కేవలం తనను చూడాలని ఉందన్న తన అబిమాని చివరి కోరికను తీర్చేందుకే పవన్ హన్మకొండ వెళ్లారు. ఈ సందర్భంగా తాను కనిపించి తన అభిమానికి ఆయన మరపురాని అనుభూతిని కలిగించారు. అంతేకాకుండా …

Read More »

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇద్దరిదీ ఒకే బాట. బాండింగ్ లో అయినా.. బ్రాండింగ్ లో అయినా కూడా వీరిద్దరి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు తాము ఎంచుకున్న అంశానికి ఏ మేర ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు. అంతేకాదండోయ్… ఆ అంశానికి ఎనలేని …

Read More »

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… తాజాగా రాష్ట్రానికి ఆరు పులుల‌ను పంపాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో పులుల సంత‌తి త‌గ్గిపోతోంద‌ని.. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఆరు ఆడ‌పులుల‌ను పంపిస్తే.. రాష్ట్రంలో పెరిగే పులుల సంత‌తిని.. దేశ‌వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలోని న‌ల్ల‌మ‌ల‌లో పులుల సంచారం …

Read More »

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతునిచ్చింది. దీంతో, డీఎంకే, కాంగ్రెస్ ల మధ్య బంధం తెగిపోయింది. ఇండీ కూటమి నుంచి కూడా డీఎంకే బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి కాంగ్రెస్, డీఎంకేల మధ్య మాటల …

Read More »

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఏదో జరిగిందని, కానీ, ఆధారాలు లేవని, ఓట్ల చోరీ, ఈవీఎంల వల్ల కూటమి గెలిచిందని పరోక్షంగా జగన్ చేసిన కామెంట్లు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శలు వచ్చాయి. ఆ కామెంట్లు చేసి రెండేళ్లు గడిచినా…జగన్ మారలేదు. తాజాగా ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ …

Read More »

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ నిలిస్తే…మధ్యలో అధికార కాంగ్రెస్ నిలిచి ఓ రేంజిలో కొట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే… రేవంత్ చేస్తున్న ఆరోపణలను ఖండించేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి,కిషన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఇక తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఈ బరిలోకి …

Read More »

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇట్టే గుర్తుకు వస్తారు. కూటమి సర్కారు చెబుతున్న దాని ప్రకారం ఈ నిర్మాణం కోసం నాటి జగన్ సర్కారు ఏకంగా రూ.500 కోట్లను వెచ్చింది. తాను రెండో టెర్మ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడితే.. విశాఖ నుంచే …

Read More »

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీలతో్ కూడిన కూటమి నాటి అధికార పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో షాక్ తిన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలం పాటు బయటకే రాలేదు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాం అన్న రీతిలో సాగిన జగన్… …

Read More »

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. రూపొందించిన సీబీఎన్ @ 361 డిగ్రీస్‌ పుస్త‌కాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీబీఎన్ @ 361 డిగ్రీస్.. పుస్తకాన్ని ఆవిష్క‌రించి తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత …

Read More »

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేనను గెలిపించిన పవన్ కల్యాణ్…ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ తన మార్క్ చూపించారు. అదే సమయంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జనసేనను సంస్థాగతంగా …

Read More »