తమ పెట్టుబడులను, కంపెనీలను ఏపీ ఎగరేసుకుపోతోందని కర్ణాటక ప్రభుత్వం వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా.. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే పెట్టుబడులకు, పెట్టుబడి దారులకు అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక పేరుఎత్తకుండానే.. ఆ రాష్ట్రంపై వ్యాఖ్యలు చేశారు. కీచులాడుకుంటేనో.. సౌకర్యాలు మెరుగు పరచకుంటేనో.. పెట్టుబడులు …
Read More »పెట్టుబడుల వేట: తండ్రి లండన్ – కొడుకు ఆస్ట్రేలియా.. !
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 మాసాల్లోనే కీలకమైన 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఆ తర్వాత.. 15 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టే గూగుల్ డేటా కేంద్రాన్ని కూడా తీసుకువచ్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని పలు సంస్థలు.. అక్కడి పరిస్థితులు బాగోక వెళ్లిపోయేందుకు రెడీ అయితే.. వాటిని …
Read More »`సంస్థాగత సైన్యం`.. పవన్ కీలక నిర్ణయం.. !
ఏపార్టీకైనా.. నాయకులతోపాటు సంస్థాగతంగా ఉండే నేతలే కీలకం. పార్టీ జెండా పట్టాలన్నా.. పార్టీ తరఫున బలోపేతం చేయాలన్నా.. సంస్థాగతంగా ఉన్న బలం.. కీలకం. ఈ విషయంలో ఇతర పార్టీలకు భిన్నంగా టీడీపీకి బలమైన సంస్థాగత సైన్యం ఉంది. పార్టీ అనేక సందర్భాల్లో ఎత్తుపల్లాలు చవి చూసింది. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ ధాటికి.. ఆ తర్వాత.. రాష్ట్ర విభజన సమయంలోనూ పార్టీకి పెద్ద ఎత్తున పరీక్షలు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో …
Read More »బాబు మరో రికార్డ్: పండగ పూట అందరూ హ్యాపీస్..!
ఏపీ సీఎం చంద్రబాబు మరో రికార్డు సాధించారు. గత కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆయన పండగ పూట సంతోష పరిచారు. ఇది నిజంగానే రికార్డని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు.. నిప్పులు చెరిగాయి. తమకు వెంటనే డీఏ బకాయిలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాయి. అదేసమయంలో పీఆర్సీ వంటివాటిని కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. నిజానికి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘానికి అప్పగించేశారు. …
Read More »సీబీఐకి లక్ష్మణ రేఖ: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి లక్ష్మణ రేఖను విధిస్తూ.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తును ఎలా పడితే అలా వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేవలం అత్యంతకీలకమైన కేసులు.. రాష్ట్రాల పరిధిలో ఉన్న పోలీసులపై విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. సీబీఐకి ఇవ్వాల్సిన కేసులను సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించింది. ఆయా కేసుల్లో రాజకీయ పరిణామాలు.. కీలక …
Read More »సీఎం రేవంత్కు ఆగ్రహం వచ్చిన వేళ.. ఏం జరిగింది?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షాలపై మాత్రమే ఆయన సమయం, సందర్భం చూసుకుని విమర్శలు గుప్పిస్తారు. అలాంటిది ఆయన తొలిసారి ఉద్యోగులు, ఉన్నతాధికారులు, శాఖల అధిపతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగుల వరకు కూడా ఉలిక్కిపడ్డారు. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. తాను చెప్పిన పనులను కూడా అధికారులు చేయకపోవడమే. ఆశ్చర్యంగా ఉన్నా ..నిజం. …
Read More »ఏపీపై పొరుగు రాష్ట్రాల్లో జెలసీ.. ఏం జరుగుతోంది?
1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – కర్ణాటక సర్కారును ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చేసిన విమర్శలు. 2) “మన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నా.. సిద్దరామయ్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టుకోలేక పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు వెళ్లిపోతున్నారు.“ కర్ణాటక విపక్షాల మాట. 3) “త్వరలోనే బెంగళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్యవహరించండి.. …
Read More »`జాగృతి`కి జోష్: సరికొత్త సంఘం ఆవిర్భావం!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. రాజకీయంగా ఒంటరి పోరుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఒకప్పటి `తెలంగాణ జాగృతి` సంస్థనే దాదాపు ఆమె రాజకీయ వేదికగా మార్చుకున్నారు. తాజాగా జరిగిన బీసీ జేఏసీ బంద్లోనూ ఇదే పేరుతో నిరసన తెలిపారు. ఇక, త్వరలోనే ఆమె ప్రజల మధ్యకు యాత్ర రూపంలో వెళ్లనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఉపాధ్యాయ వర్గాలతో కూడిన …
Read More »అదే జరిగితే.. నాకు అసలైన దీపావళి: లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కూడా తాను ప్రయాణంలోనే(ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నారు) దీపావళిని జరుపుకొంటున్నట్టు చెప్పారు. అయితే.. తన ప్రయాణం వెనుక ఏపీ ప్రయోజనాలు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల వేట ఉందన్నారు. దీనిని సాధించగలిగితే.. తెలుగు వారికే కాకుండా తనకు కూడా అదే అసలైన దీపావళి పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు చేశారు. నారా లోకేష్.. ఈ …
Read More »పవన్ తేల్చేశారు: కూటమి నేతలే తేల్చుకోవాలి.. !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగుతామని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పొత్తు కొనసాగుతుందన్నారు. దీనిని …
Read More »డిబేట్: మోడీని ఎవరు మెప్పించారు.. జగనా.. బాబా ..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జాతీయ రాజకీయాల్లో తిరుగులేదు. గత మూడు సార్లుగా ఆయన విజయం దక్కించుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే.. తటస్థంగా ఉండే రాజకీయ పార్టీల నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనూ మోడీని మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎలానూ ఎన్డీయే సర్కారే ఉంది. సో.. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. …
Read More »లోకేష్ గ్రాఫ్.. అంచనాలకు అందట్లేదా.. !
టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్.. ఈ నియోజకవర్గంలో మంచి మార్కులు వేయించుకున్నారు. కొత్తగా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు చేరువగా ఉంటున్నారు. ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నియోకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం.. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రజలకు-తనకు మధ్య గ్యాప్లేకుండా, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates