వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు, ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ సదస్సుకు అత్యథిక ప్రాధాన్యమిస్తూ క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తున్నాయి. అందులో భాగంగా భారత్ కూడా ఈ సదస్సుకు వెళుతోంది. కేంద్రం తరఫున సీఐఐ హాజరవుతుండగా… దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాలను పంపుతున్నాయి. …
Read More »ఢిల్లీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న స్థితి నుంచి సొంతంగా పగ్గాలు చేపట్టే వరకు చేరిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఒకింత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కుంటోందా? సీఎం రేవంత్ కు ఢిల్లీ పెద్దలకు గ్యాప్ విషయంలో రాష్ట్ర మంత్రులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. …
Read More »చంద్రబాబు ‘అలా’ చెప్పారు.. అధికారులు ‘ఇలా’ చేశారు!!
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది అధికారుల పరిశీలన, అనేక శాఖలతో ముడిపడిన వ్యవహారాలకు అనుమ తులు.. వంటివి ప్రధానంగా సమయాన్నిమింగేస్తాయి. అందుకే ఒక్కొక్క సారి సాక్షత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు చెప్పినా.. ఆయా పనులు ఏళ్ల తరబడి ఆలస్యమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ సమయాభావాన్ని తగ్గించేస్తున్నారు. …
Read More »‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త ప్లాంట్ ను ఏక్కడ ఏర్పాటు చేస్తుందన్నది ఈ చర్చల సారాంశం. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్… హెచ్125 హెలికాఫ్టర్ల తయారీ కోసం భారత్ లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ కు భారత్ ను అయితే ఎంచుకున్న ఎయిర్ బస్… భారత్ లో ఎక్కడ పెట్టాలన్న దానిపై …
Read More »సింగపూర్ లో షికారు కొడుతున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే ముందు.. సింగపూర్ కు వెళ్లిన సీఎం పెట్టుబడులను సాధించే పనిని అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. ఇప్పటికే రెండు సింగపూర్ కంపెనీలను తెలంగాణకు రప్పించే దిశగా ఒప్పందాలు సాధించిన రేవంత్… ఆదివారం ఒకింత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సింగపూర్ సిటీ మధ్యలో …
Read More »ఏపీకి ‘ట్రిపుల్’ భరోసా దక్కింది!
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ లేమితో పాటుగా అప్పుల కుప్ప నెత్తిన పెట్టుకుని ఏపీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ… ఏపీలో ఆదాయ వనరులను పెంచుకుంటూ సాగగా… ఆ తర్వాత వచ్చిన వైసీపీ సంక్షేమ పాలనకే ప్రాధాన్యం ఇచ్చింది. పలితంగా ఏపీ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి …
Read More »అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు నెలవల విజయ శ్రీ, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ , జేసి శుభం బన్సల్, మున్సిపల్ చైర్మన్ శ్రీ మంత్ రెడ్డి లతో కలసి రాష్ట్ర సంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, స్థానిక సూళ్ళూరుపేట హోలీ క్రాస్ …
Read More »అమిత్ షాను చూస్తే నాకు అసూయ: చంద్రబాబు
ఏమిటేమిటీ….? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి ఇంత మాట వినిపించిందా? బీజేపీలో అగ్ర నేతగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా, ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ నేతగా కొనసాగుతున్న అమిత్ షాను చంద్రబాబు అంత మాట అన్నారా? అది కూడా అమిత్ షా సమక్షంలోనే చంద్రబాబు ఆ మాట అన్నారంటే…కాస్తంత సీరియస్ మేటరేనని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే… …
Read More »లోకేశ్ కు డిప్యూటీ ఇచ్చి తీరాల్సిందేనా..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఇటీవలి కాలంలో టీడీపీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లు, వాటిని వినిపిస్తున్న నేతలను చూస్తుంటే… లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తీరక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ కేబినెట్ లో మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే లోకేశ్ కు …
Read More »బాబు అసహనంతో దిగొచ్చిన కేంద్రం…?
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుకు నవ జీవనం ప్రసాదిస్తూ కేంద్రం ఓ భారీ రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే… షా ఏపికి రావడంతో ఆయనకు ఏపీలోని కూటమి సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికింది. సాంతం సంబరాల్లో జరగాల్సిన ఈ పర్యటనలో శనివారం రాత్రి ఓ అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఏపీ సమస్యలు …
Read More »టీడీపీలో సీనియర్ల రాజకీయం.. బాబు అప్రమత్తం కావాలా?
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం లేదని.. పార్టీకి ఎలాంటి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం లేదని అధిష్టానం బాహాటంగానే కామెంట్లు చేయడం.. దీనిపై సీనియర్లు మౌనంగా ఉండడం వంటి పరిణామాలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి గత 2014-19 మధ్య టీడీపీ పాలనతో పోలిస్తే.. ఇప్పుడు కూటమి సర్కారులో సీనియర్ల పాత్రను చంద్రబాబు తగ్గించారు. …
Read More »రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్ మహానగర అభివ్రద్ధి సంస్థ) పరిధిని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఓఆర్ఆర్ దాటి.. ట్రిపుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) పరిధిలోపు మాత్రమే ఉన్న హెచ్ఎండీఏ పరిధి.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పరిధిని కూడా దాటేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని త్వరలో మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates