Political News

‘సంబ‌రాల రాంబాబు గురించే బాబు నేను మాట్లాడుకున్నాం’

శ్రీకాకుళంలో నిర్వ‌హించిన యువ‌శ‌క్తి స‌భ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దుమ్మురేపారు. వైసీపీ నేత‌ల‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను హైద‌రాబాద్‌లో కలిసినప్పుడు వైసీపీ వెధవలు అందరూ ఏం మాట్లాడుకున్నారంటూ.. ప్ర‌శ్నించార‌ని.. ఈ వెధ‌వ‌ల‌కు తెలియ‌దు.. నేను చాలా విష‌యాలే చ‌ర్చించాన‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “అరేయ్ వెధవల్లారా నేను అమ్ముడు పోయే వ్య‌క్తిని కాదురా.. 20 కోట్లు టాక్స్ కట్టే సత్తా ఉన్న వాడిని. …

Read More »

పొత్తుల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటాయ‌నే వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ అంచ‌నాలు సంచ‌ల‌నం సృష్టిస్తున్న నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “దశాబ్దం(ప‌దేళ్లు) పాటు ఒంటరిగానే పోరాడాను. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తా. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా?.. మీరు అండ‌గా ఉంటానంటే.. నేను ఒంట‌రిగానే వెళ్తా” అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. మ‌రోసారి కూడా …

Read More »

ఆమెకు ప్రేమ‌ను పంచా.. ద్వేషం క‌క్కింది: చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవిపై ఇటీవ‌ల కాలంలో వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా.. విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా నాగ‌బాబుకు ఇస్తున్న కౌంట‌ర్ల‌లో రోజా.. ఎక్కువ‌గా చిరును కోట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి తాజాగా రోజాపై కామెంట్లు చేశారు. అయితే.. రోజాలాగా ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. సూటిగా సున్నితంగా మ‌న‌సును త‌ట్టేలా కామెంట్లు చేశారు చిరంజీవి. రోజా చేసిన ప‌రుష‌ వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదని …

Read More »

దేశం ఆఫ్ఘ‌నిస్థాన్ అవుతోంది: కేసీఆర్ కామెంట్స్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల‌న‌లో దేశం ఆఫ్ఘ‌నిస్థాన్ మాదిరిగా త‌యార‌వుతోంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్వేషాలతో జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్టపన్నాగాలు ప‌న్నుతున్నార‌ని.. ఇలాంటి వారి కుటిల తంత్రాల‌ను.. యంత్రాంగాల‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించేయాల‌ని.. ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మతపిచ్చి, విద్వేషాలతో ప్రజలను విడదీస్తే జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి తలెత్తి.. దేశం మరో ఆఫ్ఘ‌నిస్థాన్‌లా …

Read More »

ఛీ… రోజా కూడానా.. : ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్‌

వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్‌బ్రాండ్ మంత్రి రోజాపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాకింగ్ కామెంట్లు చేశారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం కొంద‌రికి ఫ్యాష‌న్‌గా మారింద‌ని.. ఈ జాబితాలో డైమండ్ రాణి రోజా.. కూడా చేరిపోయింది.. అని వ్యాఖ్యానించారు. “డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతోంది. నువ్వు కూడానా.. నువ్వు కూడా నా.. ఛీ! నా బ‌తుకు చెడ‌! మీ కోసం డైమండ్ రాణీల‌తో కూడా తిట్టించుకుంటా” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల …

Read More »

వైసీపీ ప‌త‌నాన్ని క‌ళ్లారా చూస్తారు: నాగ‌బాబు

శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థలంలో జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ‘యువ‌శ‌క్తి’ స‌భ‌లో పార్టీ కీల‌క నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ పతనాన్ని జనం కళ్లారా చూస్తారని అన్నారు. ప్ర‌స్తుతం అతి తక్కువ మంది యువతే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భ‌విష్య‌త్తులో పెద్ద ఎత్తున‌ యువత రాజ‌కీయాల్లోకి రాకపోతే పాలిటిక్స్‌లోకి దుర్మార్గులు వ‌చ్చి రాజ్యమేలుతారని ప‌రోక్షంగా వైసీపీపై విరుచుకుప‌డ్డారు. జనసేన పార్టీ …

Read More »

ప‌వ‌న్‌ను సీఎంగా చూడాల‌ని.. హైప‌ర్ ఆది పంచ్‌లు

శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లంలో జ‌న‌సేన నిర్వ‌హించిన యువ‌శ‌క్తి స‌భ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు జ‌బ‌ర్ద‌స్త్ ఫేం.. హైప‌ర్ ఆది పంచ్‌ల ప్ర‌భంజ‌నం సృష్టించాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజాయితీపరుడైన నాయకుడని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరికీ ఒక గోల్ ఉందని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని తాను భావిస్తున్నానని తెలిపాడు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, చిన్న గాయం ఏ కార్యకర్తకైనా ఆయన తట్టుకోలేరని అన్నారు. ఇక‌.. పంచ్‌ల …

Read More »

జగన్ పై వైరల్ స్లోగన్ : యువత నాడిని టీడీపీ పట్టేసింది.

ఒక్కోసారి అంతే. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. కాలం కలిసి రాదు కూడా. అలాంటిది టైం లెక్క మారితే చాలు.. అలా అన్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున కలిసి వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే సీఎం మీద టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు.. పార్టీకి చెందిన పలువురు తమ ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని వ్యక్తం చేయటం.. విమర్శలతో …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే ఫొటోతో వీర‌సింహారెడ్డి పోస్ట‌ర్లు!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన తాజా మూవీ వీర‌సింహారెడ్డి విడుద‌లై ప్ర‌భంజ‌నం సృష్టిస్తు న్న విష‌యం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లోనూ ఈ మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల‌య్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగ‌తం ప‌లుకుతూ.. బ్యాన‌ర్లు క‌ట్టారు. మ‌రోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద ఎత్తున బ్యాన‌ర్లు క‌ట్టారు. ఇక‌, హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ జోష్ …

Read More »

తెలుగు ప్రజలకు మోడీ పండుగ కానుక

ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర Modi చేతుల మీదుగా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకున్న దాని కంటే ముందుగా అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా అభివర్ణిస్తున్నారు. తొలుత అనుకున్న …

Read More »

బండికి బెర్త్ దొరికిందా? పోస్ట్ ఊడుతుందా?

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి రావడంతో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన అధ్యక్ష పీఠం కదులుతోందని వ్యతిరేకులు ప్రచారం చేస్తుంటే… మోదీ కేబినెట్‌లో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయింది, అందుకే పిలుపు వచ్చిందంటూ ఇంకొందరు చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణకు సంబంధించి బీజేపీలో ఏదో మార్పు అయితే జరగబోతోందన్నది అంతటా వినిపిస్తోంది. అది ఎవరికి అనుకూలం… ఎవరికి ప్రతికూలం అనేది మాత్రమే తెలియాల్సి ఉంది. మరోవైపు …

Read More »

జగనన్న లెక్క అట్లుంటది

ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఉద్యోగులు ర‌గిలిపోతున్నారు. ఒక‌వైపు సంక్రాంతి పండుగ వ‌చ్చే సింది. ఇంటిల్లిపాదీ పండ‌గ సంబ‌రాల‌కు రెడీ అయ్యారు. అయితే.. నెల మొత్తం ప‌నిచేసిన ఉద్యోగులు మాత్రం జీతం కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌చ్చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం 30 శాతం మంది ఉద్యోగుల‌కు మాత్ర‌మే వేత‌నాలు ఇచ్చింది. అది కూడా సీమ ప్రాంతానికే మెజారిటీగా ద‌క్కాయ‌ని తెలుస్తోంది. ఇక‌, …

Read More »