అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో ని న్యూయార్క్ లో కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీతోపాటు ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అదానీ గ్రూపు 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగలిగేలాగా సౌరశక్తి సరఫరాకు సంబంధించిన ఒప్పందాల …
Read More »కుప్పకూలిన అదానీ స్టాక్స్.. ఏం జరిగింది?
గౌతం అదానీ. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రపంచ కుబేరుల్లో తొలి ముగ్గురిలో అదానీ కూడా ఉండడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదానీ వ్యాపార సామ్రాజ్యాల పంట పండుతోందన్న వాదన కూడా ఉంది. అయితే.. తరచుగా అదానీపై ప్రపంచ దేశాల్లో అనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్ల కిందట.. అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హెండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు …
Read More »పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్ష
2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా …
Read More »ఒంటి చేత్తో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాం: బొత్స
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శానస మండలి సమావేశాల సందర్భంగా వైసీపీ. కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గతంలో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ చెప్పారు. ఈ విషయంపై అప్పటి నుంచి …
Read More »అమరావతి..జగన్ ‘కంప’ఇస్తే చంద్రబాబు ‘సంపద’ ఇచ్చారు
వైసీపీ హయాంలో అమరావతిని జగన్ అడవిగా మార్చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టింది. దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదల తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ ముళ్ల కంపలను నుగ్గు చేసేందుకు తెచ్చిన ఓ భారీ యంత్రం …
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు : పవన్
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా చెప్పారు. అయినా సరే, విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో …
Read More »‘వలంటీర్లను జగనే మోసం చేశాడు.. మేం కాదు’
ఏపీలో వలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను తాము కూడా కొనసాగిస్తామని.. వేతనాలు కూడా రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వ్యవస్థకు సంబంధించి సర్కారు అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇంతలోనే అసలు ఈ వ్యవస్థలేదంటూ.. డిప్యూటీ సీఎం పవన్ …
Read More »చంద్రబాబు పల్లె బాట.. ఇప్పుడే ఎందుకు?
ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే పల్లెబాటకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్తున్నానని.. అది కూడా గ్రామీణ ప్రాంతాలను చేరుకుంటానని అక్కడి ప్రజలతో మమేకమవుతానని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి వంటి విషయాలను వివరిస్తానని చంద్రబాబు సభకు వివరించారు. అయితే.. ఎన్నికలు పూర్తయి.. కేవలం ఆరు మాసాలు కూడా కాకుండానే చంద్రబాబు పల్లెబాట పట్టడంపై చర్చ సాగుతోంది. అయితే.. చంద్రబాబు …
Read More »పవన్ డిటర్మినేషన్ పై చంద్రబాబు ప్రశంసలు
శాసనసభ సమావేశాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి విషయంలో, గంజాయిని అరికట్టడం, అరాచక శక్తులను కట్టడి చేయడంలో పవన్ తమకన్నా గట్టిగా ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆ డిటర్మినేషన్ పవన్ కు ఉందని, సంఘ విద్రోహ శక్తులను తామిద్దరం కలిసి అరికడతామని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తే అవే …
Read More »మఠాలను మార్చేశారు.. జగన్ ఐడియా ఏంటి?
వైసీపీ అధినేత జగన్.. గతంలో మఠానికి వెళ్లిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని శారదా పీఠానికి వెళ్లి ప్రత్యేక పూజలు.. హోమాలు చేశారు. చేయించారు కూడా. 2019 ఎన్నికలకు ముందు జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక హోమాలు చేశారు. అదేసమయంలో జగన్ను ఆశీర్వదించారు కూడా. జగన్ కూడా తన పాదయాత్ర సమయంలోనూ.. సీఎం అయ్యాక కూడా పలు మార్లు శారదా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు …
Read More »చంద్రబాబు తల్లి దండ్రులపై జగన్ షాకింగ్ కామెంట్స్..
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంపై సాక్షాత్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నోరు చేసుకున్నారు. ఇంటి పెద్ద కొడుకు అయి ఉండి.. తన తల్లి,తండ్రి చనిపోతే.. చంద్రబాబు కనీసం తల కొరివి కూడా పెట్టలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఏ రోజూ వారిని తన ఇంటికి పట్టెడన్నం కూడా పెట్టలేదని.. ఇలాంటి వ్యక్తి తనను, తన కుటుంబాన్నిరోడ్డుకు లాగుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. సుమారు గంటన్నరపైగా మీడియాతో …
Read More »కాళింగుల అసంతృప్తి కి కారణమేంటి బాబూ
సామాజిక వర్గాల బలం లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకో విధంగా సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వీరంతా టీడీపీవైపే నిలబడ్డారు. దీంతో శ్రీకాకుళం సహా విజయనగరంలోని కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. ఇంత జరిగినా.. తమకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates