Political News

ఏమిటా కఠిన నిర్ణయాలు పవన్

“ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా?”.. “ఇంక‌, ఆయ‌న సినిమాల్లో న‌టించరా?”- ఇదీ.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఉవ్వెత్తున సాగుతున్న పెద్ద చ‌ర్చ‌. అనేక మంది ఇన్ స్టా గ్రామ్‌ల‌లో కూడా ఇదే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అయితే.. ఇంత పెద్ద చ‌ర్చ రావ‌డానికి కార‌ణం.. ఏంటి? ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు ప‌వ‌న్ చుట్టూ.. సినిమాలు చేయ‌రు అని కామెంట్లు వినిపించ‌డానికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా …

Read More »

ప‌రామ‌ర్శ‌ల చోట…. జ‌గ‌న్‌ ప‌రిహార రాజ‌కీయం!

ప‌రామ‌ర్శ‌లు వేరు.. ప‌రిహారం వేరు. ఈ రెండింటికి మ‌ధ్య సున్నిత‌మైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌. తాజాగా ఆయ‌న అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి విశాఖ‌లోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి భ‌రోసా ఇవ్వాల్సిన జ‌గ‌న్‌.. దానిని త‌గ్గించి.. మీకు ప‌రిహారం అందిందా అని ప్ర‌శ్నించారు. …

Read More »

మంత్ర‌దండం లేదు.. అద్భుతాలు చేయ‌లేం: ప‌వ‌న్

అప్పుల్లో ఉన్న ఏపీకి చంద్ర‌బాబు వంటి దార్శ‌నిక‌త ఉన్న ముఖ్య‌మంత్రి చాలా అవ‌స‌ర‌మ‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కత్వంలో ప‌నిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. అంతేకాదు.. తాను ఎంతో నేర్చుకోవాల్సింది కూడా ఉంద‌ని.. చంద్ర‌బాబు నుంచి నేర్చుకునేందుకు అనుక్ష‌ణం త‌పిస్తున్నాన‌ని చెప్పారు. తాజాగా శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌స‌భ‌లు నిర్వ‌హించారు. మొత్తం 13326 గ్రామాల్లో స‌భ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌మ‌య్య …

Read More »

నా ఇంటిని మీరే కూల్చండి : పొంగులేటి

ponguleti srinivas reddy

హైదరాబాద్ హిమయత్‌సాగర్ పరిధిలో ఉన్న తన ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ ఉన్నట్లు తేలితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులే కూల్చివేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. తన ఫాంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉందని బీఆర్ఎస్ పార్టీ బురదజల్లుతుందని ఆరోపించాడు. నిజంగా తన ఇల్లు అక్రమంగా ఉంటే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ ను ఆదేశిస్తున్నానని, నేను …

Read More »

ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌.. హైడ్రా దూకుడు!

సినీ న‌టుడు అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్‌లో నిర్మించిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను శ‌నివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత ప‌నులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో ప‌హారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజ‌ర్‌ల‌తో ప‌నిని చేప‌ట్టారు. దీంతో ఒక్క‌సారిగా.. ఈ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నం సృష్టించింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువును ఆక్ర‌మించి.. ఈ నిర్మాణం చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. తుమ్ముడి చెరువుకు …

Read More »

వామ్మో చంద్రబాబు.. నీకో దండం సామీ!

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే తీరు చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన తీరు ఇప్పటికి మారలేదన్న విషయం తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్న పరిస్థితి. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితుల్ని చూసినట్లుగా.. వాటిని ఎదుర్కొన్నట్లుగా చంద్రబాబు తన సన్నిహితులతో చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. తన కెరీర్ …

Read More »

  ప్ర‌జ‌ల కోసం కూలీన‌వుతా:  ప‌వ‌న్

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లాలోని మైసూరువారిపాలెం గ్రామంలో నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. గ్రామ‌స్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ప‌వ‌న్ స్పందించారు. తాను ప‌నిచేసేందుకు, ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. “ప్ర‌జ‌ల‌కు ఏదైనా …

Read More »

వైసీపీకి బిగ్ రిలీఫ్‌.. ఒకేరోజు ఇద్ద‌రికి బెయిల్

ప్ర‌తిప‌క్ష వైసీపీకి ఒకే రోజు రెండు విష‌యాల్లో భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేత‌లు ఒకింత ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్ర‌ధానంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో మే 13న ఈవీఎం స‌హా వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ …

Read More »

ఇది పిన్నెల్లికి పరువు సమస్య

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇటీవ‌ల కాలంలో రాష్ట్రాల స‌రిహ‌ద్దులు కూడా దాటిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. త‌ర్వాత పోలీసుల‌పై దాడులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల కేసుల‌తో మాచ‌ర్ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆయా కేసుల నేప‌థ్యంలో పిన్నెల్లి …

Read More »

త‌మ్ముళ్ల‌కు కిక్కు.. చంద్ర‌బాబు మ‌రో పాల‌సీ..!

అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. 2014-2019 మధ్య అమలైన మద్యం పాలసీనే కొద్ది మార్పులతో అమలు చేయాలని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం పై అనేక విమర్శలు వచ్చాయి. మద్య‌ నిషేధం చేస్తానని చెబుతూనే మద్యం ధరలను పెంచడం అదేవిధంగా నాణ్యమైన బ్రాండెడ్ లిక్కర్ స్థానంలో చీపులిక్కర్‌ను …

Read More »

చంద్రబాబు @ టాప్ 5

ఇండియా టుడే – సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దేశంలోని అత్యంత జనాదరణ కలిగిన సీఎంల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ …

Read More »

అలాగైతే.. అసెంబ్లీలెందుకు బొత్స‌గారూ.. !

వైసిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ పరిణామాలతో ఆవేదన చెందిన వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం దాదాపు మానేశారు. అసెంబ్లీ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా తొలిరోజు వచ్చిన ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. అదేవిధంగా …

Read More »